పేజీలు

31.12.22

మరియమాత దివ్య మాతృత్వ మహోత్సవం

 మరియమాత దివ్య మాతృత్వ మహోత్సవం 

ఈ రోజు మనం మూడు ముఖ్యమైన పండుగలు చేసుకుంటున్నాము. మొదటిది మరియ మాత దివ్య మాతృత్వ పండగ. ఏమిటి మరియమాత మాతృత్వం, ఆ మాతృత్వ గొప్పతనం ఏమిటి అంటే ఇది సాధారణ మాతృత్వం కాదు. దేవునికి తల్లి అవ్వడం. దేవునికి తల్లి అవ్వడం అంటే  ఏమిటి ? రెండవది యేసు ప్రభువుకు సున్నతి చేసి పేరు పుట్టిన రోజు. మూడవదిగా ఈరోజు మనము నూతన సంవత్సరములోనికి అడుగుపెడుతున్నాము. 

ఈ యొక్క పదాన్ని 431వ సంవత్సరంలో ఎఫెసుస్ కౌన్సిల్ లో మొదటిగా మరియమాత దేవుని తల్లి అని అనడం జరిగింది. దానిమీద అనేక వాదనలు జరిగాయి.  వీటన్నింటి సారాంశం ముఖ్యముగా  దేవుని గురించే. అది యేసు ప్రభువు ఈలోకమునకు మానవునిగా రావడం వలన ఈ మానవ రూపంలో దైవత్వాన్ని పూర్తిగా చూపించడం ప్రధాన అంశం యేసు ప్రభునియొక్క మానవత్వాన్ని మరియు దైవత్వాన్ని పూర్తిగా మనము పూర్తిగా అంగీకరించినప్పుడు మరియమాత యొక్క దైవత్వాన్ని అంగీకరిస్తాము. మరియమాతకు ఉన్న పేరులలో చాలా ముఖ్యమైనది దేవుని తల్లి. ఆమె దేవునికి మానవునిగా జన్మనిచ్చిన తల్లి. ఈ పేరుకి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి అంటే ఇది యేసు ప్రభువు పూర్తిగా మానవుడు మరియు దేవుడు అని చెప్పే సందర్భంలో ఈ పేరుతో మరియమాతను సంబోధించడం జరిగినది. ఇది  ఇప్పటినుండే కాదు అంతియోకియకు చెందిన ఇగ్నేషియస్ అనే పునీతుడు నూట ఏడవ సంవత్సరంలో మన ప్రభువును  మరియమాత తన గర్భంలో దేవుని రక్షణ మార్గానికి సహకరించింది అని చెప్పేవారు. ఆమె దేవుని తల్లి అని ఆరిజిన్ గారు రెండవ శతాబ్దంలోనే చెప్పారు. కాపాడొసియాన్ పితరులు అయిన పునీత  గ్రెగరీ గారు మరియమాతను దేవుని తల్లిగా అంగీకరించకపోతే అయన ఇచ్చే దైవత్వం నుండి మనం వైదొలుగుతున్నాం అని అంటారు. ఎందుకు అంటే  యేసు ప్రభువు మీరు దేవుని వాక్కును పాటించినట్లయితే మీరు నా సహోదరి సహోదరులు అవుతారు, నా తల్లి అవుతారు అని చెబుతారు. అటువంటి అప్పుడు తన గర్భం నందు మోసి , దేవుడు చెప్పినట్లుగా మీ మాట చొప్పున నాకు జరుగునుగాక, నేను నీ దాసురాలును అని చెప్పేరు, ఇంకా అంతకన్నా దేవుని వాక్కును పాటించిన వారు ఎవరు  ఉన్నారు. 

 అయితే నాలుగవ శతాబ్దంలో మరియమాత దేవుని తల్లి అని ఒప్పుకోవడానికి అంగీకరించలేదు నెస్టోరియాన్ అనే బిషప్ గారు. ఆయన చెప్పిన కారణం ఆమె కేవలం మానవ యేసుకి మాత్రమే జన్మనిచ్చినది అని చెప్పారు. కానీ ఆయన తన మానవ స్వభావం మరియు దైవ స్వభావం రెండు కూడా మిళితమైఉన్నవి. 

యేసు ప్రభువు మనకు దివ్య సత్ప్రసాదం స్థాపించి మనకు ఒక బహుమతిని ప్రసాదించాడు. యేసు ప్రభువు మనకు మరియొక బహుమతి ఇచ్చాడు అది యేసు ప్రభువు తన ప్రాణమును విడిచే ముందు ఈ బహుమానం మనకు ప్రకటించాడు. అది ఏమిటి అంటే మరియమాతను తన ప్రియమైన శిష్యుడుకు ఇచ్చాడు. ఇన్నాళ్ళూ యేసు ప్రభువుకు మాత్రమే ఆమె  తల్లి కాని ఇప్పటి నుండి ఆమె తన శిష్యుడుకు మాత్రమే తల్లి కాకుండా మన అందరికి కూడా తల్లి అవుతుంది. 

ఇప్పటి నుండి మరియ మాత అందరికి ప్రతి ఒక్కరికీ కూడా ఆమె తల్లి అవుతుంది. ఎప్పుడైతే దేవదూత నీవు కుమారున్నీ ప్రసవించబోతున్నావు అని అప్పటినుండి ఆమె యేసు ప్రభువు తల్లిగానే మనము చూస్తాము. ఎందుకంటే  ఎలిజబెతమ్మ మరియతల్లి తన వద్దకు రాగానే నా ప్రభువుని తల్లి నావద్దకు రావడం నాకు ఎలాగు ప్రాప్తించేను అని అంటున్నది, ఆమె పవిత్రాత్మ ప్రభావం చేత ఈ మాటలు అంటున్నది కనుక మనం ఆమెను పవిత్రాత్మే దేవుని తల్లి అని చెబుతున్నది అని అర్ధం అవుతుంది. 

ఈమె దేవుని తల్లి అయితే మనకు ఏమిటి అని మనం అనుకోవచ్చు, ఈమె దేవునికి మాత్రమే కాదు మనకు కూడా తల్లి ఎందుకంటే యేసు ప్రభువు మానవునికి ఇచ్చిన చివరి రెండు బహుమతులు ఏమిటి అంటే మొదటిది తాను ఎల్లప్పుడు మనతో ఉండటానికి దివ్య సత్ప్రసాదం ఒసగడం మరియొకటి మరియమాతను తన ప్రియ శిష్యునిగా ఇవ్వడం వలన మన అందరికి ఆమెను తల్లిగా ఇస్తున్నాడు. ఆమెను తల్లిగా యోహను తన ఇంటికి తీసుకొని వెళుతున్నాడు. మనం ఆమెను మన తల్లిగా తీసుకొని వెళ్ళాలి. 

మరియమాతకు  దెవదూత మంగళ వార్తను ప్రకటించినప్పుడు నీవు దేవుని కుమారునికి జన్మ ఇస్తావు అని అన్నపుడు  మరియమాత  విశ్వాసంతో తన విధేయతను చూపించింది. నేను దేవుని దాసురాలను అని మరియమాత చెప్పింది. మరియమాత  యేసు ప్రభువుకు తల్లి అవుతుంది.  

ఈనాటి సువిశేషంలో మారియమతను యేసు ప్రభువుతో చూస్తాము, ఇక్కడ చాలా గొప్ప మాటలు మనకు వినపడుతున్నాయి. ఆమె ఈ విషయాలను అన్నింటినీ తన మనసున పదిలం చేసుకొని మననం చేసుకొని జీవిస్తుంది అని చెబుతుంది. ఇది మనకు అత్యున్నత మార్గాన్ని మనకు చూపిస్తుంది. మనం మన జీవితంలో ఎలా ఎల్లప్పుడు మంచి ఆలోచనలతో ఉండాలో చెబుతుంది. మరియమాత జీవితంలో అనేక దుర్ఘటనలు ఉన్నాయి,  యేసు ప్రభువు తనకు దూరం అవుతారు, యేసు ప్రభువు తనతో ఉండటంలేదు. కాని ఈ బాల యేసుకు సంబంధించిన అన్నీ విషయాలను తన మదిలో నిపుకొని తన జీవితంలో ఎటువంటి చెడు భావాలకు లోనుకాకుండా ఆమె జీవిస్తుంది. మనకు కూడా ఇది ఒక మంచి మార్గమును చూపిస్తుంది. 

 మరియమాత నేను మీ దాసురాలను అని చెప్పినప్పుడు ఆమె అవ్వ చేసిన పని అయిన అవిధేయతను  తన తన విధేయత ద్వారా దేవునికి ఇష్ట పుత్రికగా అయ్యింది. 

మనలను రక్షించడానికి వచ్చిన దేవుడు మన మధ్యనే ఉన్నాడు. తన ఆహ్వానాన్ని తీసుకొని మరియమాత వలె తమ జీవితాలను దేవుని ప్రణాళికకు అనుకూలముగా మారితే మనం ఎప్పుడు ఆమె వాలే ఉంటాం. 

 మానవుని స్వేచ్ఛను ఎప్పుడు కూడా దేవుడు గౌరవిస్తాడు. మరియమాతకు దేవుడు ఇచ్చిన ఈ అవకాశం మరియమాత వినియోగించుకున్నది. ఇది మనందరికీ కూడా వ్యక్తిగతముగా,   ఆహ్వానముగా వుంది, ఆ కుటుంబంలో భాగం అవుదాం.

23.12.22

యేసు క్రీస్తు జనన మహోత్సవం


యేసు క్రీస్తు జనన మహోత్సవం

లూకా 2:1-14 

తన సామ్రాజ్యమునందు జనాభా లెక్కలు సేకరింపవలెనని అగుస్తు చక్రవర్తి అధికారులకు ఆజ్ఞ ఇచ్చెను. ఈ మొదటి జనాభా లెక్కల సేకరణ కురేనియా సిరియా మండలాధిపతిగా ఉన్న కాలమున జరిగెను. అందులో పేర్లు వ్రాయించు కొనుటకు ప్రజలందరు తమ తమ పట్టణములకు వెళ్లిరి. యోసేపు , దావీదు వంశస్తుడైనందున గలిలీయ సీమలోని నజరేతు నుండి యూదయ సీమలో ఉన్న దావీదు పట్టణమగు బేత్లెహేమునకు జనాభా లెక్కలలో తమ పేర్లు చేర్పించుకొనుటకై తనకు నిశ్చితార్ధము చేయబడిన , గర్భవతియునైన మరియమ్మను కూడా వెంటపెట్టుకొని వెళ్లెను. వారచట ఉన్నప్పుడు మరియమ్మకు ప్రసవ కాలము సమీపించెను. మరియమ్మ తన తొలిచూలు కుమారుని కని, పొత్తిగుడ్డలలో చుట్టి పశువుల తొట్టిలో పరుండ బెట్టెను. ఏలయన వారికి సత్రములో చోటు లేకుండెను. ఆ ప్రాంతమున గొర్రెల కాపరులు రాత్రి వేళ పొలములో గొర్రెల మందలను కాయుచుండిరి. దేవదూత వారి ఎదుట ప్రతక్షమాయెను. ప్రభు మహిమ వారిపై ప్రకాశింపగా వారు మిక్కిలి భయ భ్రాంతులైరి. దేవదూత వారితో ఇట్లనెను: "మీరు భయపడవలదు. సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారమును మీకు వినిపించెదను. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను. ఆయన క్రీస్తు, ప్రభువు. శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టబడి ఉండుటమీరు చూచెదరు. ఇదే మీకు ఆనవాలు" అనెను. 

దేవదూతల సందేశం : శాంతి సమాధానం మరియు ఆనందం 

 ఒక తార వెలసింది- భువి అంత వెలుగునింపింది. దేవుని మానవున్ని మధ్య సంబందం చిగురింపచేసింది. మానవుడు ఎల్లప్పుడూ  ఆనందంగా ఉండాలని కోరి, మానవ వికాసాన్ని పెంపొందేలా చేసిన పండుగ క్రీస్తు జననం.   నిజమైన సంతోషము సమాధానంకు చిరునామా క్రీస్తు జననం. ఒకరిని హింసించడం లేక మరణానికి గురిచేయడం కాకుండా కాపాడటానికి నాంది పలికేది ఈ పండుగ. దేవుడు మానవునితో ఉండాలని, మానవ స్వభావాన్ని పావనం చేయాడానికి దేవుడు చేసిన గొప్ప కార్యం ఈ క్రీస్తు   జన్మ దినము.  దేవుడే మానవునితో కలిసి జీవించడానికి రావడమే ఈ పండుగ. ప్రతి ఒక్కరు చిన్న, పెద్ద, పేదవాడు, ధనికుడు,  అనే తారతమ్యం లేకుండా కలిసి జీవించేందుకు నాంది ఈ పండుగ.  మానవున్నీ దేవుని కుమారునిగా చేసేది, దానికి మార్గం సుగమం చేయడమే క్రీస్తు జనన ఉద్దేశం. యేసు ప్రభువుని జననం, ప్రతి ఒక్కరికి శాంతి సమాధానము అనే సందేశమును మొదటిగా తెలుపుతుంది. దేవదూతలు ఈ వార్తను గొర్రెల కాపరులకు వినిపిస్తున్నారు. గొర్రెల కాపరులకు  ఆనాటి సమాజంలో ఎటువంటి శుభకార్యానికి ఆహ్వానము వీరికి ఉండదు. వీరిని దొంగలుగా చూసేవారు, అటువంటి వారికి శుభ వచనము, దేవుని రాక గురించి చెప్పడం ద్వార యేసు ప్రభువు జననము సమాజంలో అసమానతలను అనుభవించేవారికి, వారికి సమానత్వమును,  ఆనందం ఇచ్చే పండుగ అని తెలుస్తుంది.  

దేవుడు మానవుడు అగుట 

 యోహాను సువిశేషము మొదటి అధ్యాయం 12,  వచనంలో  దేవుడు ఎలా మనతో ఉండుటటకు ఇష్ట పడుతున్నాడు అని చదువుతాం. "అయన  ఈ లోకమున ఉండెను అయన మూలమున  ఈ లోకము సృజింపబడెను. అయినను లోకము ఆయనను తెలిసికొన లేదు. అయన తన వారి వద్దకు వచ్చెను తన వారే ఆయనను అంగీకరింపలేదు. "  యేసు ప్రభువు ఈ తన తండ్రి వద్దనుండి పరలోకం నుండి భూలోకమునకు వచ్చినది మనతో ఉండటానికి.  మానవునిలా జీవించడం, మానవుని కష్టాలు భరించడం దేవునికి ఏమి తెలుసు అనుకుంటూ ఉండేవారిని చూస్తూనే ఉంటాము. కాని యేసు ప్రభువు పరలోకం వదలి భూమి మీదకు ఒక సాధారణ వ్యక్తి వలె వచ్చి, మన మధ్య జీవించారు. మానవుడు పొందే అన్ని బాధలు కష్టాలు అనుభవిస్తున్నారు. దీనిద్వారా ఈ మానవ జీవితాన్ని పావనం చేస్తున్నారు. మానవున్ని దైవ పుత్రత్వం కలిగి ఉండేలా చేసుంది. 

దేవుని ఉదారత 

"ఆయనను అంగీకరించి, విశ్వసించిన వారందరికి అయన దేవుని బిడ్డలగు భాగ్యమును ప్రసాదించెను. ఈ దైవ పుత్రత్వము వారికి దేవుని వలన కలిగినదే కానీ , రక్తము వలన కాని శరీరేచ్ఛవలన కాని మానవ సంకల్పము వలన గాని కలిగినది కాదు." క్రీస్తు జననం మనకు ఏమి ఇస్తుంది. యేసు ప్రభువు లేక దేవుడు మానవునిగా మానవు రూపంలో ఈలోకంలో పుట్టుట ద్వారా మన మానవ జీవితాన్ని పవిత్ర మొనర్చడామె కాకుండా దాన్ని దైవీకం చేస్తున్నాడు. దీనిద్వారా దేవుడు తనను తాను మనకు అర్పించుకుంటున్నాడు. దేవుడు మన మధ్యకు వచ్చి నివసించి మనకు దైవ ఔన్నత్యన్నీ చూపిస్తున్నాడు. మనము ఎంత గొప్పగా జీవించ వచ్చు అనేది నేర్పుతున్నారు.   దీనినే మనం యోహాను సువిశేషం మొదటి అధ్యాయం 12 వ వచనములో చూస్తున్నాము. దేవుడు తనని తాను, మనకు ఒక బహుమానంగా ఇస్తున్నాడు. ఆయనను స్వీకరించే వారు దానికి సిద్ధముగా ఉండాలి. ఇది దేవుడు మననుండి ఏమి ఆశించకుండా మనకు ఒక బహుమానంగా ఇస్తున్నాడు. దీనిని మనము నేర్చుకోవాలి. 

మానవ స్వభావం - దైవ స్వభావంగా మారుటకు నాంది 

ఏ విధంగా యేసు ప్రభువు ఈ మానవ జీవితాన్ని దైవికం చేస్తున్నాడు అంటే మొదటిగా తాను ఈ లోకంలో మానవునిగా పుట్టుట ద్వారా ఆయన మానవ స్వభావాన్ని పంచుకోవాడమే కాకుండా దానికి మరియొక లక్షణాన్ని ఇస్తున్నాడు. అది ఏమిటి అంటే దైవత్వం కలిగిఉండేలా చేయడం.  ఇది చేయడం వలన ప్రతి వ్యక్తి కేవలం మానవునిగా మాత్రమే కాక ఈ మానవ స్వభావాన్ని దైవికంగా మార్చుకోవడానికి నాంది పలకడం జరిగింది. ప్రతి మానవ భావాన్ని , లక్షణాన్ని దైవికం చేసే అవకాశం మనకు కూడా ఇస్తున్నాడు. 

పరలోక వాణి 

క్రీస్తు జననం - ప్రతి ఘడియ పరలోక వాణి  అని తెలియజేస్తుంది. ఏమిటి పరలోక వాణి  అంటే యిస్రాయేలు ప్రజలు పరలోకానికి భూమికి మద్య ఒక ఎడబాటు ఉంది అని విశ్వసించేవారు. ఈ ఎడబాటు ఎప్పుడు అయితే పరలోక వాణి వినపడుతున్నదో అప్పుడు తీసివేయబడుతుంది అని వారు నమ్మేవారు. ఈ ఎడబాటు తీసివేయడం అంటే పరలోకం మరియు భూమి ఏకమవుతున్నవి అని అర్ధం, అంటే దేవుడు మానవుని దగ్గరకు వచ్చాడు అని అర్ధం. యేసు ప్రభువుని జననంతో ఈ పరలోక వాణి ప్రతి నిత్యం, మానవుడు పొందే భాగ్యం పొందాడు అని అర్ధం. మొదటి మానవునితో కలిసి నడిచిన దేవుడు మరల ఇప్పుడు ప్రతి మానవునికి దేవునితో  కలిసి జీవించడానికి అవకాశం ఇస్తున్నాడు.

దేవుని యొక్క సంపూర్ణత తెలుసుకొనే అవకాశం 

 దేవుడు మనుష్య రూపేణా అంటే అది  కేవలం యేసు ప్రభువు మాత్రమే అవుతారు,  ఎందుకంటే మనం ఆయన జీవితంలో ఎటువంటి అపరిపక్వత లేక అసంపూర్ణం అనేది చూడం.  ఈలోకములోని  ఎంతటి గొప్ప వ్యక్తి అయిన కాని అతనిలో  ఏదో ఒక అసంపూర్ణత మనం చూస్తూనే ఉంటాము. యేసు ప్రభువు జననము దేవుని సంపూర్ణతను తెలుసుకొనేలా చేస్తుంది. అంతే కాక ఆయన పరిపూర్ణతలో మనము భాగము ఎలా పొందలో తెలుసుకొని మార్గమునకు అంకురార్పణ జరిగినది ఈ రోజు. కనుక మనకు దేవుని సంపూర్ణతను తెలుసుకోవటమే కాక దేవుని కలుసుకొనే అవకాశం పొందటం జరుగుతుంది. దేవున్ని అనుభవించడం, కలుసుకోవడం అనేక విధాలుగా మనం బైబుల్లో చూస్తాము. మోషే మండుతున్న పొదలో దేవున్ని కలుసుకోవడం, దివ్య మందసంలో దేవున్ని కలుసుకోవడం ఇవన్నీ ఒక భాగం కాని క్రీస్తు పుట్టుక వీటన్నింటికన్నా  పరిపూర్ణత సంతరించుకున్నది. కనుక మానవుడు దేవుని పరిపూర్ణతను యేసు క్రీస్తు ద్వారా తెలుసుకుంటున్నాడు. 

యేసు జననం దేవుని ప్రణాళికా ప్రకటన 

మానవునికి సంభందించి దేవుడు ఎలా ఉంటాడు, ఆయన ప్రణాళికా ఏమిటి? మానవునితో కలసి ఉండుటకు దేవుడు సిద్ధంగా ఉంటాడా? మానవునికి దేవునికి మధ్య తెగిపోయిన సంబంధమును దేవుడు బాగుచేయుటకు సిద్ధంగా ఉన్నాడని తెలియచేస్తుంది, యేసు ప్రభువు జననం. అంతే కాదు, తెగిపోయిన  దైవ-మానవ సంబంధం సరిచేయడం మరియు మానవుని రక్షణకు పరిపూర్ణ అంకురార్పణ జరిగింది అని తెలియజేస్తుంది. దేవుడు మనతో ఉండటానికి సిద్ధంగా ఉన్నాడు అని చెబుతున్నాడు. 

 దేవుడు ఇచ్చే పాప క్షమాపణ -  చూపే పరి పూర్ణ ప్రేమను సంపూర్తిగా అర్ధం చేసుకునే మార్గం సుగమమం 

దేవుని ప్రేమ మానవుడు పరిపూర్ణంగా తెలుసుకునే మార్గం మనకు తెలిసేది కేవలం యేసు ప్రభువు ద్వారానే. ఎందుకంటే ఆయనే దేవుని ప్రేమను సంపూర్ణముగా మనకు తెలియజేయడం జరిగినది. ఎంతో మంది దేవుని ప్రేమ గురించి దేవుడు క్షమించే విధం గురించి చెప్పిన యేసు ప్రభువు వలె ఎవరు అంత పరిపూర్ణంగా ఆ ప్రేమను కాని, దేవుని క్షమాపణ గురించి ఎవరు యేసు ప్రభువులా చెప్పలేదు. అందుకే ఈ రోజు దేవుని ప్రేమ క్షమాపణ పూర్తిగా తెలుసుకోవడానికి అంకురార్పణ జరిగిన రోజు ఇది. కనుక ఈ మానవ స్వభావాన్ని దేవుని అనుగ్రహంతో పావనము చేయుటకు ప్రయత్నించుదాం.  ఆమెన్ 


సమూయేలు చరిత్ర

 సమూయేలు చరిత్ర  సమూవేలు  పవిత్ర గ్రంధంలో ఉన్న న్యాయాధిపతులలో చివరి  న్యాయాధిపతి మరియు న్యాయాధిపతులో ఎక్కువ కాలం జీవించినవాడు. యిస్రాయేలు చర...