పేజీలు

29.11.23

అనుదిన దైవ వాక్య ధ్యాన ప్రార్ధన, మత్తయి 4:18-22

మత్తయి 4:18-22

గలిలీయసరస్సు తీరమున యేసు నడచుచు, వలవేసి చేపలనుపట్టు పేతురు అను పేరుగల సీమోనును, అతని సోదరుడగు అంద్రెయను చూచెను. వారు జాలరులు. "మీరు నన్ను అనుసరింపుడు. మిమ్ము మనుష్యులను పట్టువారినిగా చేసెదను"అని యేసు వారితో పలికెను. వెంటనే వారు తమ వలలను అచట విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అచటినుండి పోవుచు యేసు జెబదాయి కుమారులైన యాకోబు, యోహాను అను మరి ఇద్దరు సోదరులను చూచెను. వారు తమ తండ్రితోపాటు పడవలో తమ వలలను చక్కబెట్టుకొనుచుండిరి. యేసు వారిని పిలువగా, వెంటనే వారు పడవను, తమ తండ్రిని వదలి పెట్టి ఆయనను వెంబడించిరి. 

ధ్యానము :  సీమోను, అంద్రెయ అను సోదరులు మరియు యాకోబు ,యోహాను అను మరి ఇద్దరు సోదరుల దైవ పిలుపును ఈ సువిశేష భాగంలో చూస్తున్నాము. యేసు ప్రభువు వారిని తనను అనుసరించమని అడిగిన వెంటనే వారు యేసు ప్రభువును అనుసరిస్తున్నారు. వలలను, తండ్రిని కూడా వీరు అక్కడే వదలి పెట్టారు. ఎందుకు వారు ఇలా చేస్తున్నారు? వారు యేసు ప్రభువులో ఏమి చూసారు? ఎందుకు మారుమాట్లాడకుండా ఆయనను  అనుసరిస్తున్నారు? యేసు ప్రభువు ఒక వ్యక్తిని తనను అనుసరించమని అడిగినపుడు ఎవరుకూడా వెనుకకు పోలేదు, యేసు ప్రభువు మాటలు, ఆయన మాటలు చూపులు , వ్యక్తిత్వము మనలను ఆయనను అనుసరించేలా చేస్తాయి. యేసు ప్రభువు నన్ను అనుసరించమని అడిగిన ఆ మోహోన్నత వ్యక్తి మమ్ములును తనను అనుసరించమని అడిగారని వారు తమ జీవనోఫాది అయిన వృత్తిని, వలలను, బంధువులను కూడా వదలి ప్రభువును అనుసరిస్తున్నారు. పూర్తిగా వారు యేసు ప్రభువు శిష్యులుగా   మారిపోతున్నారు. 

యేసు ప్రభువు శిష్యులుగా మారిపోయిన తరువాత వారి  జీవితం ఎలా సాగుతుంది, ఎలా  బ్రతకాలి అనే  విషయాలను వారు ఆలోచించుట లేదు. అంటే ప్రభువు మీద వారికి పూర్తి నమ్మకం ఉంది. ఆయన ఎవరో వారికి తెలుస్తుంది. అయన మాటలు వినగానే వారు ఆయనను ఎందుకు అనుసరిస్తున్నారంటే ఆయన   మాటలలో జీవం ఉన్నదిఅని వారికి తెలుసు . అయన చూపులో వారికి వారి జీవితము మొత్తం కనపడుతుంది. ఆయన  స్పర్శ యొక్క శక్తి వారికి తెలుసు, ఎన్నో సంవత్సరాలుగా నయం కాని రోగం కూడా ఆయన స్పర్శతో తొలగిపోతుంది. ఆ మోహోన్నతిని వ్యకిత్వం వారికి తెలుసు పాపంలో పట్టుబడిన స్త్రీని క్షమిస్తున్న గొప్ప మనసు ఆయనకే సొంతం. ఇంతటి శ్రేష్టమైన గురువు వారిని అనుసరించమని అడిగిన తరువాత వారిలో ఎటువంటి సందేహం లేదు, మరో ఆలోచన లేదు వారికి ఇది సుదినం. ప్రభువును అనుసరించడానికి సిద్ధపడుతున్నారు.  సాదారణ వ్యక్తులు మనుషులను పెట్టె వారిగా మారుతున్నారు. 

యేసు ప్రభువు సీమోను , అంద్రెయను తనను అనుసరించమని అంటున్నారు. వారు జాలరులు. సీమోను అంటే రెళ్ళుకాడ అని అర్ధం.   గాలికి అటు ఇటు వీచే ఒక రెల్లును యేసు ప్రభువు గాలికి గాని తుపానుకు గాని తొణకని ఒక రాయిగా మారుస్తున్నారు. అంద్రెయ జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. అంద్రెయ అంటే పౌరుషము అని అర్ధం. ఈయన మొట్టమొదట యేసు ప్రభువును పేతురుకు తెలియ పరుస్తున్నారు. యేసు ప్రభువును అనుసరిస్తూ మరణించడానికి సిద్ధపడ్డాడు కాని పాపంతో సఖ్యత పడుటకు ఇష్టపడలేదు ఫలితముగా ఇతనిని X రూపంలో సిలువ వేశారు.  ఈ రోజు పునీత అంద్రెయ పండుగను జరుపుకుంటున్న మనము ఆయన మాధ్యస్త ప్రార్ధనను కోరుదాం. ఈ నలుగురు శిష్యులు జాలరులుగా వీరు బ్రతుకుతున్నారు. జాలరులుగా అనేక సంవత్సరాలు బ్రతికారు. యేసు ప్రభువు వారిని అనుసరించమని అడిగిన వెంటనే వారు వలలను అక్కడే వదలి యేసు ప్రభువును అనుసరిస్తున్నారు. వారిని యేసు ప్రభువు మనుషులను పట్టేవానిగా చేస్తాను అని చెబుతున్నాడు. వీరు మనుషులను పట్టె అంతటి గొప్పవారా?  వారు ఎన్నో సంవత్సరాలు జాలరులుగా పని చేసిన గాని వారికి ఎక్కడ చేపలు పడతాయో పూర్తిగా  వారికి తెలియదు. అందుకే వారికి యేసు ప్రభువు ఎక్కడ వల వేయాలో చెబుతున్నాడు. అటువంటి ఈ జాలరులను  మనుషులను పెట్టె వారినిగా యేసు ప్రభువుగా ఎలా చేస్తాడు, వీరు మనుషులను పట్టేంత గొప్పవారు ఎలా అయ్యారు మనము పరిశీలిస్తే,  తిరుసభ ఇంతగా లోకమంతట  వ్యాపించింది అంటే  ఈ జాలరులు కారణం. అన్ని సంవత్సరాలు జాలరులుగా ఉన్న ఎక్కడ చేపలు ఉంటాయో తెలియని ఈ జాలరులు ప్రపంచ నలుమూలల దైవ రాజ్యాన్ని వ్యాపించడానికి వారు చేసిన కృషి ఎంతో గొప్పది.  యేసు ప్రభువు ఆ శిష్యులను  ప్రపంచ నలుమూలల తన వాక్కును ప్రకటించగల వ్యక్తులుగా మారుస్తున్నారు. యేసు ప్రభువు ఈ సాధారణ వ్యక్తులను ఇంత గొప్ప వ్యక్తులుగా మారుస్తున్నారు. యేసు ప్రభువు మాటలు మనము వున్నట్లయితే మనలో అన్ని గొప్ప లక్షణాలు లేకున్నా ప్రభువు మనలను గొప్పవారిగా చేస్తాడు అనుటకు ఈ శిష్యుల జీవితం ఒక ఉదాహరణ. 

ప్రభువుతో సంభషణ మరియు ప్రార్ధన  : ప్రభువా మీరు ఎంత గొప్పవారు, చాలా సాధారణ వ్యక్తులను , ఉన్నత వ్యక్తులుగా లోకాన్ని జయించే వారీగా చేస్తున్నారు. ఈ నలుగురు వ్యక్తులను పిలిచినట్లు నన్ను కూడా పిలవండి. వారు ఎలాగైతే మీ మాటకు మారుమాట్లాడకుండా, సర్వమును వదలి మిమ్ములను అనుసరిస్తున్నారో, నన్ను కూడా అలానే మిమ్ములను అనుసరించేలా చేయండి. ప్రభువా ! ఈ శిష్యులు మీములను అనుసరించడానికి తమ వారిని , వారికు ఉన్నదానిని, మొత్తాన్ని వదులు కోవడానికి సిద్ధపడ్డారు. కాని మిమ్ములను అనుసరించడానికి నేను ఈ శిష్యుల వలె ఏమి వదులుకోలేదు. నాకు ఉన్న ఈ లోక ఆశలు, కోరికలు, సంపదలు ఇవి అన్ని కూడా ఆటంకంగా ఉన్నవి. వీటిని వదులు కోవడానికి చాలా పర్యాయాలు నేను ప్రయత్నించినప్పటికీ సఫలీకృతం కాలేక పోయాను. ప్రభువా ! నాకు పూర్తిగా మిమ్ములను అనుసరించాలి అనే కోరిక  ఉన్నది, కాని నాలో ఉన్న ఇతర కోరికలు నన్ను మిమ్ములను అనుసరించుటకు సన్నద్ధం కానివ్వటం లేదు. వీటి మీద నేను విజయం సాధించేలా నాకు మీ అనుగ్రహాలు మీ పునీతులకు ఇచ్చినట్లు ఇవ్వండి తద్వారాఅప్పుడైన  నేను మిమ్ము పూర్తిగా అనుసరించగలేనేమో. ప్రభువా మీరు ఈ శిష్యులను పిలిచినట్లు నన్ను కూడా ఒకసారి పిలవండి. నన్నును మీ సేవకునిగా, అనుచరునిగా చేయండి. ప్రభువా! మీ శిష్యులు వారికి జీవనోఫాది పోయిన , బంధువర్గాలు పోయిన మీరు మాత్రమే చాలు అనుకున్నారు. నేను కూడా ఆలా జీవించేలా చేయండి. ఆమెన్ 

అనుదిన దైవ వాక్య ధ్యాన ప్రార్ధన, లూకా 21:12-19

 లూకా 21:12-19 

ఇవి అన్నియు సంభవింపక పూర్వము వారు మిమ్ము పట్టి, ప్రార్ధనామందిరములకును, చెరసాలలకును అప్పగించి, హింసింతురు. నా నామము నిమిత్తము రాజులయొద్దకు, అధిపతులయొద్దకు మిమ్ములను తీసుకొనిపోవుదురు. ఇది మీరు సాక్షులుగఉండవలసిన సమయము. మీరు అచట చెప్పవలసినదానిని గూర్చి కలవరపడకుడు. విరోధి మీకు ఎదురాడుటకును, మిమ్ములను ఖండించుటకును వీలుకాని వాక్కును , వివేకమును ప్రసాదింతును. తల్లిదండ్రులు, సోదరులు ,  బంధువులు, మిత్రులుకూడ మిమ్మును పట్టిఇచ్చెదరు. మీలో  కొంతమందిని చంపించెదరు. నా నామము నిమిత్తము మిమ్ములను అందరు ద్వేషింతురు. కాని మీ తల వెంట్రుకకుడా రాలిపోదు. మీ సహనమువలన మీరు మీ ప్రాణములను దక్కించుకొందురు. 

ధ్యానము: యేసుప్రభువును అనుసరించేవారిని యేసు ప్రభువును వ్యతిరేకించేవారు  ఎలా వేధించేది తెలియచేస్తున్నారు. యేసు ప్రభువు శిష్యులను అనేక విధాలుగా హింసిస్తారు. శిష్యులను బంధిస్తారు, ప్రార్ధన మందిరాలకు చెరసాలలకు అప్పగిస్తారు. ప్రార్ధన మందిరాలకు ఎందుకు వారిని అప్పగిస్తారు? ప్రార్ధన మందిరాలు కేవలం ప్రార్ధన మాత్రమే ఇతరులను తీర్పు తీర్చే న్యాయస్థానాలులాగ కూడా పని చేస్తాయి. యేసు ప్రభువు అనుచరులను శిక్షించడానికి కూడా అవి వాడబడతాయి అని ప్రభువు చెబుతున్నారు. చెరసాలలకు యేసు ప్రభువు శిష్యులను ఎలా శిక్షించారో మనకు తెలుసు. వారిని ఎంతో క్రూరంగా హింసించారు అప్పుడు మాత్రమే కాదు, ఇప్పటికి కూడా నిజమైన అనుచరులను ఇప్పటికి కూడా అలానే శిక్షిస్తారు. 

యేసు ప్రభువు శిష్యులు లేక ఆయన అనుచరులు అనే ఒకే ఒక కారణం వలన ప్రజలు వీరిని శిక్షిస్తారు. యేసు ప్రభువునువారు ఒక శత్రువులాగ చూస్తున్నారు. అయన అనుచరులను కూడా అలానే చూస్తున్నారు. యేసు ప్రభువు శిష్యులకు హింసలు  తమ గురువుకు సాక్షులుగా ఉండుటకు ఒక మంచి అవకాశం దీనిని యేసు ప్రభువు అనుచరులు సద్వినియోగం చేసుకోవాలి. ఈ సమయంలో అనుచరులు సాక్షులుగా ఉండాలి. వీరిని బందించినప్పుడు లేక వారికి కష్టాలు ఉన్నప్పుడు వీరు వాటికి కలవరపడనవసరం లేదు. ప్రార్ధనాలయాలలో, చెరసాలలో , పెద్దల ముందు ఏమి మాట్లాడాలో అని  వీరు ఏమి ముందుగానే తయారుకానవసరం లేదు. వారు ఏమి మాట్లాడాలో కూడా ప్రభువే వారికి తెలియజేస్తారు. ఎవరుకూడా వీరికి నేర్పించనవసరం లేదు. 

విరోధి మాటాలడలేని  విధంగా మాట్లాడే విధంగా , వీరి మాటలను ఖండించలేని జ్ఞానాన్ని వీరికి దేవుడు ప్రసాదిస్తారు. ఈ మాటలు ఎంత నిజమో మనకు స్తెఫాను జీవితం చూసినప్పుడు తెలుస్తుంది. స్తెఫాను మాటలను విన్న పెద్దలు ఆయన వివేకమును వారు ఖండించలేకపోయారు. అందుకే ఆయనను రాళ్లతో కొట్టి చెంపుతున్నారు. మాటలద్వారా లేక జ్ఞానము ద్వారా ఎవరు యేసు ప్రభువు శిష్యులను ఎదుర్కోలేని జ్ఞానము వారికి ఇవ్వడము జరుగుతుంది. అంతమాత్రమున వీరికి అన్ని సమకూర్చబడవు. వీరు ఎన్నో కష్టాలు అనుభవిస్తూనే ఉంటారు. అందరు వీరిని ద్వేషిస్తారు. అంతేకాదు సొంత తల్లిదండ్రులు, సోదరులు వీరిని శత్రువులను పట్టిస్తారు. మరల వీరిని చంపిస్తారు. విటువంటి పరిస్థితులలో కూడా నిజమైన క్రీస్తు అనుచరులు సాక్షులుగాజీవిస్తారు. అందరు ద్వేషించిన వీరు ఎప్పటికి ఆ ద్వేషాన్ని చూపించకుండా ప్రేమనే చూపిస్తూ ఉంటారు. 

యేసు ప్రభువు తన శిష్యులకు ఒక మాట చెబుతున్నారు. అది అన్నిటికంటే ముఖ్యమైనది అది ఏమిటి అంటే ఇవన్నీ జరిగిన కానీ మీ తల వెంట్రుక కూడా రాలిపోదు. ఈ వచనము  యేసు ప్రభువు తన శిష్యులను ఎంతగా ప్రేమిస్తున్నారో తెలియజేస్తున్నాడు. ఈ లోకంలోని ఏమి కూడా యేసు ప్రభువు శిష్యులను ఏమి చేయలేదు. వారిని చంపినా కుడా వారికి ఏమి జరుగదు.  ఎందుకంటే వారికి మరల ప్రాణం ఇచ్చేటువంటి ప్రభువు వారికి తోడుగా ఉన్నాడు. శిష్యుల సహనం వలన వారి ప్రాణం నిలబడుతుంది. ఇక్కడ శిష్యుల సహనము ఏమిటి అంటే  వారు సహనముతో ఎటువంటి ఇబ్బంది అయిన సహిస్తారు.    

ప్రార్ధన : ప్రభువా! ఈ లోకంలో ఎందరో  మిమ్ములను అనుసరించాలని కోరుకుంటున్నారు. కాని మిమ్ములను అనుసరించుట వలన వచ్చే ప్రతికూల విషయాలను తెలుసుకొని మిమ్ములను అనుసరించకుండానే ఉంటున్నాం. తల్లిదండ్రులు , సోదరి సోదరులు , బంధుమిత్రులు వీరు అందరు ఎక్కడ మాకు వ్యతిరేకంగా మారుతారో అని నిన్ను అనుసరించలేక  పోతున్నాము. ప్రభువా!చెరసాలలో బంధించిన ,ప్రార్ధనాలయానికి రానివ్వకపోయినా అందరు నన్ను దూరంగా పెట్టిన, పెద్దల వద్దకు , అధికారుల వద్దకు అధిపతులవద్దకు తీసుకుపోయిన నిన్ను మాత్రమే ప్రేమించే విధంగా నన్ను మార్చండి. ప్రభువా ! మీకు నిజమైన సాక్షిగా జీవించడానికి , సాక్షిగా నిలువడానికి కావలసిన శక్తిని దయచేయండి. ప్రభువా ! నేను  మీకు సాక్షిగా జీవించడానికి ఎన్ని కష్టాలు పడటానికి అయినా సిద్ధముగా ఉన్నాను. కాని నాకు వచ్చే కష్టాలు , హింసలు తట్టుకోవడానికి కావలసిన శక్తిని దయచేయండి. ఆమెన్ 



28.11.23

అనుదిన దైవ వాక్య ధ్యాన ప్రార్ధన, లూకా 21:5-11

 లూకా 21:5-11

కొందరు ప్రజలు ఆలయమును గురించి  ప్రస్తావించుచు "చక్కని రాళ్లతోను , దేవునికి అర్పింపబడిన వస్తువులతోను ఎంత అందముగా శోభిల్లుచున్నదో చూడుడు"అని చెప్పుకొనుచుండిరి. అంతట యేసు వారితో "ఈ కట్టడమును మీరు చూచుచున్నారుగదా! ఇచ్చట రాతిపై రాయి నిలువని కాలము వచ్చును. అంతయు నాశనము చేయబడును"అనెను. అపుడు వారు "బోధకుడా! ఇవన్నియు ఎప్పుడు సంభవించును? దానికి సూచనయేమి?" అని అడిగిరి. అందుకు, అయన "మిమ్ము ఎవ్వరును మోసగింపకుండునట్లు మెలుకువగా ఉండుడు. మోసపోకుడు. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనను అనియు, కాలము సమీపించినది అనియు చెప్పెదరు. కాని, మీరు వారివెంట వెళ్ళవలదు. యుద్ధములను, విప్లవములను గూర్చి వినినప్పుడు మీరు భయపడవలదు. మొదట ఇవి అన్నియు జరిగితీరును. కాని, అంతలోనే అంతము రాదు." ఇంకను అయన వారితో ఇట్లనెను:"ఒక జాతి మరియొక జాతిపై, ఒక రాజ్యము మరియొక రాజ్యముపై దాడి చేయును. భయంకర భూకంపములు, పలుచోట్ల కరువులు, తెగుళ్లు వ్యాపించును. ఆకాశమున భయంకరమైన దృశ్యములు, గొప్ప సూచనలు కనిపించును. 

ధ్యానం: యెరూషలేము దేవాలయం ఒక అద్భుత కట్టడం. ఆ దేవాలయం యిస్రాయేలు ప్రజల కీర్తిని చాటుచున్నది. అంతేకాక దేవాలయం మీద ఆ ప్రజలు ప్రేమను పెంచుకొని ఉన్నారు.  ఆ ప్రేమ ఎంతగా అంటే వారి జీవితంలో ప్రతి విషయం ఈ దేవాలయంతో ముడిపడి ఉండేది. యిస్రాయేలు ప్రజలు దేవాలయ అందం గురించి చెప్పుకుంటు గర్వించేవారు. ఇంతటి గొప్ప కట్టడం ఎక్కడ ఉండదు అనే భావం వారిలో ఉండేది. కేవలం కట్టడం గొప్ప తనమునే కాదు వారు ఈ దేవాలయం దేవుని సాన్నిధ్యానికి గుర్తు అని, ఇక్కడ దేవుడు ఉన్నాడు అని , వారికి మరియు దేవాలయమును ఎప్పటికి ముప్పు వాటిల్లదు అనే భావనలో జీవించేవారు. దేవాలయం  పడగొట్టబడుతుంది అనే ఆలోచన వారి మనసులలో ఎప్పుడు వచ్చేది కాదు. అటువంటి ఆలోచన వారి ఊహకు అతీతము. కాని యేసు ప్రభువు వారి యెదుట వారి ఊహకందని విషయం చెబుతున్నారు. వారి దృష్టిలో యెరూషలేము ఎప్పటికి నిలిచిపోయే కట్టడం. 

యేసు ప్రభువు ఇక్కడ రాతిమీద రాయి నిలువని కాలము వచ్చును అని, అంతయు నాశనము చేయబడును అని అంటున్నారు. ఎందుకు ఈ ప్రజలు ఇంత ప్రేమగా చూసుకునే దేవాలయమును దేవుడు కాపాడలేదు? ఈ ప్రజలు కేవలం దేవాలయం బయట అందాన్ని మాత్రమే చూస్తున్నారు.  వారు ఎప్పుడు నిజమైన ఆరాధన, దేవునికి ఇష్టమైన జీవితం ఎలా ఉండాలి అనే విషయాలను వారు పట్టించుకోలేదు. దేవునికి ఇష్టం లేని పనులను వారు చేస్తున్నారు. యిర్మీయా ప్రవక్త చెబుతున్న విధముగా దేవుడు వారి నుండి తన సాన్నిధ్యాన్ని తీసివేయుటకు వెనుకాడడు. దేవుడు తన సాన్నిధ్యాన్ని మొదట షిలోలో ఎరుక పరిచినప్పుడు వారు అనేక విధాలుగా వృద్ధి చెందారు. కాని  వారు ఆయనకు ఇష్టం లేని జీవితం జీవించినప్పుడు తన సాన్నిధ్యాన్ని అక్కడ నుండి తీసివేస్తున్నారు.  ఇక్కడజరుగుతున్నది ఇదే  యెరూషలేము ప్రజలు దేవునికి వ్యతిరేకముగా జీవించినప్పుడు దేవుడు ఇక్కడ నుండి తన సాన్నిధ్యం తొలగిస్తారు.  కాని తన కుమారుని ఇక్కడకు పంపడం ద్వారా తన సాన్నిధ్యం పొందే అవకాశాన్ని మరల కలిగిస్తున్నారు. దేవాలయం ద్వారా కాకుండా యేసు ప్రభువు ద్వారా ప్రతి వ్యక్తి దేవుని సాన్నిధ్యాన్ని పొందుట జరుగుతుంది.  కనుక యెరూషలేము దేవాలయం పడగొట్టబడిన ప్రజలు దేవుని సాన్నిధ్యం పొందుట  యేసు ప్రభువులో జరుగుతుంది. 

యేసు ప్రభువు 'దేవాలయం ధ్వంసం చేయబడుతుంది' అని చెప్పగానే వారిలో కొంత భయం , బాధ కలిగి యేసు ప్రభువును ఇవి అన్ని ఎప్పుడు జరుగుతాయి అని అడుగుతున్నారు. వారు యేసు ప్రభువును సూచనలు అడుగుతున్నారు. దేవాలయం ద్వారా కాకుండా దేవుని కుమారుడు అయిన యేసు ప్రభువు ద్వారా మనము దేవుని సాన్నిధ్యం పొందవచ్చు కాని అయన పేరు చెప్పుకొని , అయన వలే ఉన్నామని, అనేక మంది దైవ సాన్నిధ్యం తమ ద్వారా పొందవచ్చు అని  చెబుతూవుంటారు. వారిని చూసి మోసపోవద్దు అని ప్రభువు చెబుతున్నారు. అనేక మంది యేసు ప్రభువు వలె వచ్చి మోసం చేయడానికి ప్రయత్నిస్తారు. యేసు ప్రభువు వలె జీవించడం ఎవరికీ కుదరదు. నిజమైన క్రీస్తు అనుచరులు ఎవరు తామే క్రీస్తు అని చెప్పుకోరు. ఎందుకంటే వారి జీవితం మొత్తం ఆయనను అనుసరించడానికి వినయంతో వారు ప్రయత్నిస్తూనే ఉంటారు. అబద్ధికుడు మాత్రమే అయన డాంభికము కోసం అయన వలె నటిస్తూ ఆ వినయమును చూపించలేక తమ కపటత్వాన్ని కొంతకాలానికి బయలుపరుస్తారు. మనము   యేసు ప్రభువు వలె సంపూర్ణంగా మారడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి. 

ప్రార్ధన: సర్వ సృష్టికి కారకుడవైన ప్రభువా , మీరు ఇచ్చిన తెలివి , జ్ఞానము  చేత మేము ఈ ప్రకృతిని, లోకమును సుందరముగా తీర్చి దిద్దుతున్నాము. వాటిని మా గొప్పతమునుగా భావిస్తూ, మీ అవసరం మాకు లేదు అన్నట్లు జీవిస్తున్నాము. అటువంటి పనులు చేస్తున్నందుకు మమ్ము క్షమించమని వేడుకుంటున్నాము. ప్రభువా మేము మీమమ్ములను కాదని ఈ లోకమును ఈ లోక వస్తువులను ప్రేమిస్తూ అవే ముఖ్యం అని జీవిస్తున్నందుకు మమ్ములను మన్నించండి. ప్రభువా మాకు ఏది సత్యమో , ఏది అసత్యమో తెలియక మేము అనేక మంది చేత చెడు మార్గాలలో నడిపించబడుతున్నాము.  అటువంటి సందర్భంలో మాకు సత్యాన్ని తెలియచేసి మిమ్ములను అనుసరించేలా చేయండి. ప్రభువా దేవాలయం లేకపోయినా మీ ద్వారా ప్రజలు దేవుని కనుగొన్నారు, మీద్వారా తండ్రిని చేరుకున్నారు. మీరు ఎలా దేవాలయం చేసే పనిని మీరు మీ జీవితం ద్వారా చేస్తున్నారో, మేము కూడా ముందు మిమ్ములను అనుసరిస్తూ , తండ్రిసాన్నిధ్యాన్ని పొందే అనుగ్రహం దయచేయండి. 

27.11.23

అనుదిన దైవ వాక్య ధ్యాన ప్రార్ధన, లూకా 21: 1-4

 లూకా 21: 1-4 

దేవాలయము కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనికులను యేసు చూచెను. ఒక పేద వితంతువు అందు రెండు కాసులను వేయుట యేసు గమనించి, "ఈ పేద వితంతువు అందరికంటెను ఎక్కువగా  ఇచ్చినదని మీతో చెప్పుచున్నాను. వారలు తమ సమృద్ధి నుండి కానుకలిచ్చిరి. కాని ఈమె తన  పేదరికంలో తన సమస్త జీవనమును సమర్పించినది" అని పలికెను. 

ధ్యానము: యేసు ప్రభువు దేవాలయంలో కానుకలను వేయుచున్న ధనికులను చూస్తున్నారు. అందరు వారి వారి సమృద్ధి నుండి అక్కడ కానుకలను వేయుచున్నారు. ఆ ధనము వారు దానం చేయడం వలన వారి జీవితంలో ఏమి లోటు ఉండదు. కానీ అక్కడ ఒక పేద వితంతువు ఉన్నది. ఆమె కూడా ఆ కానుకల పెట్టెలో రెండు కాసులను వేస్తుంది. యేసు ప్రభువు ఆ పేద వితంతువు వేసిన రెండు కాసులను గురించి  అందరి కంటే ఎక్కువ ఆమె ఇచ్చినది  అని చెబుతున్నారు.  ఈ రెండు కాసులు ఎందుకు ఎక్కువ అంటే, ఈ పేద విధవురాలు ఎన్నో అవరోదాలను అధిగమించింది అయినా తన భక్తిని కోల్పోలేదు. ఈమెకు స్త్రీగా ఆనాటి కాలం అనేక విధాలుగా అసమాజం ఆమెను బాధించింది. మరియు ఆమెకు ఆదరువు ఎవరు లేరు కారణం ఏమిటి అంటే ఆమె ఒక వితంతువు. అంతే కాక ఆమె పేదరాలు ఇన్ని అవరోధాలు ఆమెకు ఉన్నకాని ఆమె కానుకను ఇవ్వడానికి సిద్దపడింది. ధనికులు వేయుచున్న కానుకలు వారి జీవితంలో ఎటువంటి మార్పు తీసుకురాదు. కానీ ఈ స్త్రీ వేసిన కానుక ఆమె జీవితంలో మార్పు తీసుకువస్తుంది. ఎందుకు అంటే ఆ రెండు కాసులను వేయడం వలన మరుసటి రోజు ఆమెకు ఏమి లేదు. 

యేసు ప్రభువు ఆమె గురించి తన సమస్త జీవనమును సమర్పించినది అని చెప్పారు. ఈ రెండు కాసులు ఆమె యొక్క సమస్త జీవనము. ఈ రెండు కాసులు మాత్రమే ఆమెకు ఉన్నటువంటి ఆస్తి ,  అయినట్లయితే , వాటిని ఆమె ఎందుకు సమర్పించినది? ఆమెకు జీవితము మీద ఆశ లేదా? లేక ఆమె తనకు ఉన్నటువంటిది మొత్తం దేవునికి సమర్పించి చనిపోవాలనువుకున్నదా? ఆమె దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నది అనే విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎలాగంటే ఆమె పేదరాలు , పేదరాలిగా ఆమె దేవుని మీద ఆధారపడి జీవిస్తుంది. ఆమె ఒక స్త్రీగా ఆనాటి సమాజం తనను ఒక బలహీనురాలుగా ఉన్నది , బలహీనురాలిగా ఒక పురుషుని మీద ఆధారపడి జీవించవలసి ఉన్నది. ఆమె ఒక వితంతువు అవుట  వలన తన ఆధారపడుటకు ఎవరు లేరు. కనుక తన సమస్తం దేవుడే అవుతున్నాడు. అందుకే ఆ రెండు కాసుల మీద ఆధారపడకుండా వాటిని కూడా ఆ దేవాలయంలో కానుకల పెట్టెలో వేసి దేవుడే తన సమస్తము అని చాటుచున్నది. ఆమెకు దేవుని మీద ఉన్న నమ్మకం ఇక్కడ మనము చూడవచ్చు. ఈ రెండు కాసులను దేవునికి సమర్పిస్తే మరుసటి రోజు ఎలా గడుస్తున్నది అనే చింత లేదు. దేవుడు తనను ఆదుకుంటాడు అనే దానికంటే అయన ఇప్పుడు ఎలా ఆదుకుంటున్నాడు అనే విషయంలో నిమగ్నమయ్యింది. అంతేకాకుండా ఆమె దేవునికీ పూర్తిగా అంకితమైనది. దేవున్ని తన ఆస్తిగా చేసుకున్నది. 

సమృద్ధి నుండి అనేక మంది ధనికులు కూడా అక్కడ అర్పణ ఇచ్చారు, అవి ఇవ్వడం వలన వారికి ఎటువంటి లోటు ఏర్పడలేదు. ఆ ధనము వారి దగ్గర లేక పోవడం వలన వారికి ఎటువంటి ఇబ్బంది కలుగుటలేదు. మనం అర్పించే అర్పణ కేవలం మన దగ్గర ఉన్న మిగులు మాత్రమే అయితే అది నిజమైన అర్పణ కాదు. మనము అర్పించే ప్రతి అర్పణ అది మన జీవితంలో భాగం అయిఉన్నట్లయితే అది గొప్ప అర్పణ అవుతుంది. ధనికులు తమ జీవితంలో ఉన్నటువంటి మిగులును అర్పించారు. పేద విధవరాలు తన సమస్తము అయిన రెండు కాసులను అర్పించింది. ధనికులు ఎక్కువ అర్పించిన అది వారికున్న సమస్తము కాదు, కానీ పేద విధవరాలు రెండు కాసులే అర్పించిన అది తన సమస్తము. అందుకే యేసు ప్రభువు ఆమె అందరికంటే ఎక్కువ ఇచ్చినది అని చెబుతున్నారు.  ఆమె తన సమస్తము సమర్పించి దేవున్ని తన సమస్తం చేసుకున్నది. 

ఈ సువిశేషభాగం  మనము మనకు ఉన్న మిగులును మాత్రమే దేవునికి సమర్పిస్తూ , ఆ మిగులు ఇవ్వడం వలన మనకు ఎటువంటి లోటు లేదులే అని ఆనందపడుతున్నామా? లేక కొంత బాధకు గురి అయినా మనకు ఉన్న మిగులుకాకుండా, ఉన్నదాని దేవునికి సమర్పించి దేవుని మీద నమ్మకం ఉంచుతున్నామా ? అని మనలను మనం పరిశీలించుకోవాలి అని తెలియజేస్తుంది. పేద వితంతువు వలే పూర్తిగా దేవుని మీద నమ్మకం ఉంచి జీవించే గొప్ప జీవితం మనకు కావాలి. దేవుడే మన సమస్తము కావలి. 

ప్రార్ధన  : ప్రభువా మీరు , మీ వాక్కుద్వారా మీ సంకల్పాన్ని మాకు తెలియజేస్తున్నారు. మాలో ఉన్న లోపాలను తెలియజేస్తున్నారు. మేము ఎలా జీవించాలో తెలియజేస్తున్నారు, మాలో ఉన్న లోపాలను ఎలా అధికమించాలో , మీ వలె ఎలా జీవించాలో తెలియజేస్తున్నారు.ఈ జీవితమునకును , మీరు ఇచ్చిన ప్రతి అనుగ్రహమునకును మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.  పేదరాలి దిన కానుకను చూచిన ప్రభువా! నేను నా జీవితంలో ధనికుల వలె , నాకు ఉన్న మిగులును ఇతరులతో పంచుకొని గొప్ప ఉదార స్వభావం కలిగిన వాడి వలే చెప్పుకొనుచున్నాను, నాకు మీరు ఇచ్చిన అని వరాలను అనుభవిస్తూ కూడా ఇతరులకు సహాయపడుటకు లేక మీకొరకు వినియోగించుటకు చిన్న ఇబ్బంది కూడా సహించలేకుండా ఉన్నాను.నాకు ఉన్నటువంటి ఆస్తి పస్తులు , నా సర్వస్వం అనే భావనలో ఉన్నాను.  ఇటువంటి ఆలోచనలతో చేసిన అనేక తప్పులకుగాను  నన్ను క్షమించండి. నాలో ఉన్న ఈ లోపాలను తీసివేయుటకు నాకు సహాయం చేయండి. పేద విధవరాలి వలె నేను కూడా నాకు ఉన్న సమస్తాన్ని మీకు అర్పించి, మీరే  నా సమస్తము అని తెలుసుకొని మిమ్ము  నా సమస్తముగా పొందే అనుగ్రహము దయచేయండి. ప్రభువా ! నిన్ను తెలుసుకొనుటకు మరియు అర్ధం చేసుకొనుటకు , మీ వలె మారుటకు సహాయం చేయండి. ఆమెన్ 

25.11.23

క్రీస్తు రాజు మహోత్సవం

 మత్తయి 25:31-46 

 "మనుష్య కుమారుడు సమస్త దూతల సమేతముగా తన మహిమతో వచ్చునప్పుడు తన మహిమాన్విత సింహాసనంపై  ఆసీనుడగును. అపుడు సకలజాతులవారు అయన సముఖమునకు చేర్చబడుదురు. గొర్రెలకాపరి మేకలను, గొర్రెలను వేరు పరుచునట్లు అయన వారిని వేరుపరచును. అయన గొర్రెలను తన కుడి ప్రక్కన, మేకలను తన ఎడమ ప్రక్కన నిలుపును. అపుడు సింహాసనాసీనుడైన రాజు తన కుడిప్రక్కన ఉన్న వారితో 'నా తండ్రిచే దీవింప బడిన  వారలారా! రండు. ప్రపంచ ప్రారంభమునుండి మీకై సిద్దపరుపబడిన రాజ్యమును చేకొనుడు. ఏలయన నేను ఆకలిగొనినప్పుడు మీరు ఆహారము నొసగితిరి, దప్పికగొనినపుడు దాహము తీర్చితిరి, పరదేశినై యున్నప్పుడు నన్ను ఆదరించితిరి, నేను వస్త్రహీనుడనైయున్నపుడు వస్త్రములను ఇచ్చితిరి, రోగినై ఉన్నపుడు నన్ను దర్శింపవచ్చితిరి' అని పలుకును. అపుడు ఆ నీతిమంతులు 'ప్రభూ!నీవు  ఎపుడు ఆకలిగొనియుండుట చూచి, భోజనము పెట్టితిమి? దప్పికగొని యుండుట చూచి దాహము తీర్చితిమి?ఎప్పుడు పరదేశిగా ఉండుట చూచి ఆదరించితిమి ?వస్త్ర హీనుడవై యుండుట చూచి వస్త్రములను ఇచ్చితిమి?ఎప్పుడు రోగివైయుండుట చూచి, పరామర్శించితిమి? చెరసాలలో ఉండగా దర్శింప వచ్చితిమి?' అని అడుగుదురు. అందుకు రాజు 'ఈ నా సోదరులలో అత్యఅల్పుడైన ఏ ఒక్కనికి మీరు ఇవి చేసినపుడు అవి నాకు చేసితిరి. అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను' అని వారితో చెప్పును. అపుడు అయన తన ఎడమ ప్రక్కనున్న వారితో శాపగ్రస్తులారా!నా నుండి  తొలగి, పిశాచమునకు, దాని దూతలకు ఏర్పాటు చేయబడిన నిత్యనరకాగ్నిలోనికి పొండు. ఏలయన నేను ఆకలిగొనియుంటిని, మీరు అన్నము పెట్టలేదు. దప్పికగొని యుంటిని, దాహము తీర్చలేదు. పరదేశినై యుంటిని, నన్ను ఆదరింపలేదు. వస్త్రహీనుడనై యుంటిని, నాకు వస్త్రములను ఈయలేదు. రోగినై యుంటిని నన్ను పరామశింపలేదు. చెరసాలలో  ఉంటిని, నన్ను దర్శింప రాలేదు' అనును. అపుడు వారు కూడ'ప్రభూ! నీవు ఆకలి గొనియుండుట, దప్పికగొనియుండుట, పరదేశివై యుండుట, వస్త్రహీనుడవై యుండుట, రోగివై యుండుట, చెరసాలలో నుండుట,, మేము ఏనాడు చూచి పరిచర్యచేయకపోతిమి ?'అని ప్రశ్నింతురు. అందుకు అయన, ఈ అత్యల్పులలో ఒకనికైనను మీరివి చేయనప్పుడు నాకును చేయనట్లే' అని నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పును. వీరు నిత్య శిక్షకులు వెడలిపోవుదురు. నీతిమంతులు నిత్య జీవములో ప్రవేశింతురు" అని పలుకెను. 

ఈ రోజు మనం యేసు క్రీస్తు రాజు  పండుగ జరుపుకుంటున్నాం. ఈ పండుగను 1925 సంవత్సరంలో 11 వ భక్తినాధ పాపు గారు  స్థాపించారు. ఇది నిజమైన శాంతిని పొందడానికి ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభువును అన్వేశించాలి మరియు ఆయన మాత్రమే శాంతి సమాధానం ఇవ్వగలరు అని తెలియజేసే ఒక పండుగ ఇది.   1918 వ సంవత్సరంలో లో మొదటి ప్రపంచ యుద్దం ముగిసిన తరువాత 1920 లో ఎవరు నిజమైన శాంతిని ఇవ్వగలరు అని ఆలోచిస్తూ నిజముగా క్రీస్తు మాత్రమే నిజమైన శాంతి ఇస్తాడు అని చెపుతూ స్థాపించిన పండుగ ఇది. 

ఇదే సమయంలో ఐరోపా మరియు ఇతర ప్రాంతాలలో ప్రజలు లౌకిక వాదం వైపు మొగ్గుచూపుతూ దేవుని యొక్క అవసరం మాకు లేదు అనే  ఆలోచన విధానం పెరిగిపోతున్న సమయం. దేవుని యొక్క అవసరం మాకు లేదు కాని మాకు మేము జీవించగలం, ఆనందంగా ఉండగలం అని మనం అనుకోవచ్చు కాని అది సాధ్యపడదు. యిస్రాయేలు ప్రజలు మనకన్నా ముందుగా ఇలా ఆలోచించి ఇది సాధ్య పడదు అని తెలుసుకున్నారు. 

 యిస్రాయేలీయుల రాజు 

మొదటిగా యిస్రాయేలు ప్రజలకు రాజు లేడు. దేవుడు  వారికి ఒక రాజు ఉండాలి అనిఅనుకోలేదు. ఎందుకు అంటే యిస్రాయేలు ప్రజలకు దేవుడే రాజుగా ఉండేవాడు. రాజు చేసేటువంటి పనులు మొత్తం దేవుడు వారికి చేస్తూనే ఉన్నాడు. వారిని అన్ని విధాలుగా ముందుండి నడిపిస్తున్నాడు. ప్రభువైన దేవుడు ఆయన అన్నీ జాతులకు రాజు.  యిర్మియా 10,7. యిస్రాయేలును పవిత్ర ప్రజగా ఆయన ఎన్నుకున్నారు. వారి మధ్యలో నివసించారు. కీర్తన 134,3. యోషయా 52:7. నీ ప్రభువు నీ మధ్య నున్నాడు. నీవు సంతసింపుము అని జేపన్యా గ్రంధంలో మనం వింటాం. జఫన్యా 3:14-15.

ఇతర దేశాల రాజులు మరియు రాచరికం 

 పూర్వ కాలంలో రాచరికం, రాజ్యాధికారం దేవునికి సంభందించినవి అని అనుకునేవారు. ఈ ఆలోచన అప్పటి ప్రజల సంస్కృతి , సంప్రదాయాలలో కూడా కనిపించేది.  ఐగుప్తు దేశంలో  ఫరో రాజును హ్ోరోస్ అవతారంలా భావించేవారు.  ఆయన చేసే పనులన్నీ కూడా దేవునికి సంబంధించినవిగా అనుకునేవారు. బాబిలోనియా ప్రజలు తమ రాజును మదురుక్ ప్రతినిధిగా భావించేవారు. రాజును దేవుడు  భూమి, ప్రజలు, సైన్యం, దైవబలి మొదలగు వాటికి  అధిపతిగా చేశాడు అని భావించేవారు. బాబిలోనియా, ఐగుప్తు దేశాల రాజులు, వారి రాచరికం గురించి మనం తెలుసుకున్నప్పుడు, రాజు దేవుని ప్రతినిధి అనే భావన కలుగుతుంది. ఇదే ఆలోచనను తరువాత గ్రీకు మరియు రోమా రాజ్యాలలోనూ ఉంది. ఇది ఇంకా కొంచెం పరిధి దాటి రాజును దేవునిగా చూడటం వారు మొదలు పెట్టారు. 

యిస్రాయేలు ప్రజలు రాచరికం 

యిస్రాయేలు ప్రజలకు మానవ రాజు అనే ఆలోచన అసలు లేదు. కాని వారు ఎప్పుడైతే ఐగుప్తు , బాబిలోనియా దేశాలలో బానిసలుగా ఉన్నారో అప్పుడు వారికి ఈ ఆలోచన కలిగింది. మనకు ఒక రాజు కావాలి అనుకున్నారు. వారు అక్కడ నుండి వచ్చిన తరువాత మిధ్యానియుల నుండి కాపాడిన తరువాత వారు గిద్యొనును తమ మీద రాజుగా వుండమని కోరారు. కాని ఆయన ఒక విషయం స్పష్టం చేశాడు. నేను కాని నా కుమారుడు కాని మిమ్ము పరిపాలింపము. ప్రభువే మిమ్ము పాలించును. దేవుడే మిమ్ములను పాలించును అని వారికి తెలియజేశాడు.  న్యాయాధిపతులు 8:23.  దేవుడు ఒడంబడిక ద్వారా వారిని ఎన్నుకొని వారిని పాలించాడు. కాని తరువాత  అబిమలేకు రాజును కావాలనే ఆశతో  షెకెము వద్ద  కానా తరహా రాచరికాన్ని  స్థాపించాలని  చుసాడు. కాని అది నాశనం అయ్యింది. తరువాత సమూవేలు ప్రవక్త  కూడా మానవ రాచరికానికి వ్యతిరేకముగా ఉన్నాడు. ప్రజలు పదే పదే అడుగుట వలన సమూవేలు ప్రవక్త  వారికి దేవుని ఆజ్ఞ ప్రకారం  సౌలును రాజుగా అభిషేకించారు. సౌలును దేవుడు తన ఆత్మతో నడిపించాడు. కాని సౌలు తరువాత తనకు ఇష్టమైన విధముగా జీవించడం వలన దేవుడు అతన్ని తిరస్కరిస్తున్నాడు. దాని తరువాత దేవుడు దావీదును రాజుగా ఎన్నుకుంటున్నాడు. నాతాను ప్రవక్త ద్వారా దేవుడు దావీదుకు నీ కుటుంబము, రాజ్యము కలకాలము  నా కనుసన్నులలో మన్నును , నీ సింహాసనం నిత్యం, నెలకొని యుండును, అని  వాగ్ధానం చేసాడు. కాని యిస్రాయేలులో చెడు రాజులు ఎక్కువయ్యారు. వారు పొరుగు దేశాలను చూసి వారి వలె విగ్రహారాధన చేశారు. ప్రవక్తలను వ్యతిరేకించారు. హొషేయా ప్రవక్త రాజరికాన్ని ఖండించాడు. కాని  యేషయా ప్రవక్త  భవిష్యరాజు పుట్టుక గురించి చెప్పాడు. దేవుడు వారికి రాజుగా ఉండటం మరియు దావీదు వంశం నుండి రాజు రావడం సాధ్య అవుతుంది యేసు ప్రభువుతోటి. 

దేవుడు ఎందుకు వారికి రాజును ఇవ్వాలనుకోలేదు. 

దేవుడు యిస్రాయేలు ప్రజలకు ఒక రాజును ఇవ్వాలని అనుకోలేదు. ఎందుకు అంటే సమూవేలు ప్రవక్త చెప్పిన ప్రకారం ఈ లోక  రాజులు ఈ ప్రజలను బానిసలుగా వాడుకుంటున్నారు, దేవుడు వారిని స్వతంత్రులుగా ఉంచాలి అని అనుకున్నారు, రాజుగా ప్రజల బాగోగులను దేవుడు ఎప్పుడు చూసుకుంటూనే ఉన్నాడు. వారిని ఇతర రాజ్యాలనుండి  కాపాడాడు, వారికి కావలసిన అన్నీ వారికి సమకుర్చాడు.  అన్నీ విధాలుగా వారి మధ్యనే దేవుడు ఉన్నాడు. అందుకే వారిలో ఒక ఆలోచన ఉండేది. మెలెక్  యాహ్వె అని . మెలెక్ అంటే రాజు అని, యాహ్వె అంటే ఉన్నవాడు అని అర్ధం. మెలెక్ యాహ్వె అంటే నిత్యం ఉండువాడు మనకు రాజు  అని, లేక దేవుడు మనకు రాజు అని అర్ధం. అప్పటి నుండి ప్రజలలో దేవుడు మాకు రాజు అనే భావన ఉండేది.  

 యిస్రాయేలు ప్రజలలో  దేవుడు వారి రాజు అనె  భావనలో పూర్తిగా వ్యక్తం కాకపోయినా  ప్రవక్తలు దీని గురించి చాలా నిశ్చితమైన అభిప్రాయంతో ఉండేవారు. వారు దేవున్ని తమ రాజు అని ప్రకటించుకున్నారు. దేవుడు తమ రాజు అని గర్వంగా చెప్పుకునేవారు. మిగిలిన రాజులు కేవలం మానవ మాత్రులు అని ఎగతాళి కూడా చేసేవారు. 

తరువాత కాలంలో యిస్రాయేలు ప్రజలు  మెస్సీయా వారి రాజుగా ఉండాలి అని వారు కోరుకున్నారు. యేసు ప్రభువు యెరుషలేములోనికి ప్రవేశిస్తున్నప్పుడు ప్రజలు ఈ కోరికను వ్యక్త పరిచారు. ఇక్కడ యేసు ప్రభువు విజయోత్సవ రాజు వలె యెరుషలేముకు వస్తున్నాడు. వారు ఆయనను తమ మెస్సీయాగా వారు ఒప్పుకుంటున్నారు. యోహను 6 వ అధ్యాయంలో మనం ప్రజలు ఆయనను బలవంతంగా రాజును చేయబోతున్నారు అని తెలిసి అక్కడ నుండి వెళ్లిపోతున్నారు. మనం  యేసు ప్రభువు సిలువ వేయబడిన సిలువ మీద ఈసూస్ నజారెనుస్  రెక్స్ ఇదయరేయుమ్. నజరతు నివాసి అయిన యేసు యూదుల రాజు అని చదువుతాం.ఇది పూర్తిగా వారి కావాలని కోరుకున్న లేకున్నా దేవుడు వారి రాజుగా ఆయననను అంగీకరిస్తున్నారు. 

 యేసు ప్రభువు ఎటువంటి రాజు ? యేసు ప్రభువును వారు ఏమి కోరుకుంటున్నారు, యేసు ప్రభువునుగురించి  సువిశేషంలో మనం ఏమి తెలుసుకుంటున్నాము?  అంటే వారు యేసు ప్రభువు నందు వారి అవసరాలను తీర్చే రాజును, వారిని పీడించే వారి నుండి  విడిపించేలా చేసే రాజును వారు చూస్తున్నారు. వారి అనారోగ్యాలను తొలగించే వైద్యుడిని వారు చూస్తున్నారు. వారికి స్వేచ్ఛను ఇచ్చే రాజును వారు చూస్తున్నారు. విటన్నింటికంటే వారు స్వతంత్రులుగా ఉండాలి అని అనుకున్నారు.

ఇవి అన్నీ కూడా కేవలం యేసు ప్రభువు ద్వారా మాత్రమే సాధ్యం అవుతాయి అంతే కాదు మనకు నిజమైన శాంతిని ఇచ్చేది  కూడా ప్రభువు మాత్రమే. జీవాన్ని మరియు స్వాతంత్రంను ఇచ్చి మనలను బానిసత్వం నుండి నడిపించే రాజు కనుక ఎల్లప్పుడు ఆ ప్రభువు పాలనలో ఉండాలి అని కోరుకుందాం.

సమూయేలు చరిత్ర

 సమూయేలు చరిత్ర  సమూవేలు  పవిత్ర గ్రంధంలో ఉన్న న్యాయాధిపతులలో చివరి  న్యాయాధిపతి మరియు న్యాయాధిపతులో ఎక్కువ కాలం జీవించినవాడు. యిస్రాయేలు చర...