పేజీలు

28.1.24

యొహ్ోషువా

యెహోషువ చరిత్ర  
 
మోషే తరువాత ప్రజలను నడిపిన నాయకుడుయెహోషువ. మోషేకు అనేక విధాలుగా ఉపయోగపడుతూ ఈ భాధ్యతను తీసుకున్నాడు. మోషే మరణించిన తరువాత యావే   నూను కుమారుడైన యెహోషువ మరియు  ప్రజలతో యొర్దాను నది దాటి వారికి  ఇస్తాను అని చెప్పిన దేశమునుకు వెళ్ళమని చెప్పాడు. నీ జీవితకాలంలో నిన్ను ఎవరు ఎదురింపలేరు అని చెప్పాడు. మోషే వలే నీకు తోడుగా ఉంటాను అని చెప్పాడు. 

దేవుని సహాయం పొందుటకు ధర్మశాస్త్రము అనుసరించాలి 

 దేవుడు యెహోషువతో ధైర్యముగా  ఉండమని, నేను ఈ ప్రజల పితరులకు ఇస్తానని చెప్పిన భూమిని నీవు పంచి ఇస్తావని, ధైర్యస్తైర్యము కోల్పోకుండా ఉండమని చెప్పాడు. మోషే ఇచ్చిన ధర్మ శాస్త్రము తప్పక పాటించిన మీరు కృతార్థుడవగుదురని  అంటున్నాడు. ధర్మ శాస్త్రమును నిత్యము పఠించి, దానిని అహోరాత్రులు మననం చేయాలి,  దానిలో చెప్పిన అన్ని న్యాయములను పాటించినప్పుడు, అతని కార్యములు పూర్తిగా నెరవేరుతాయి.  అప్పుడు నీకు నేను ఎప్పుడు  తోడుగా ఉంటానని  అభయమిచ్చాడు. 

యెహోషువ వాగ్దత్తభూమిని పొందుటకు ప్రజలను సిద్ధం చేయుట 

యెహోషువ నాయకులను పిలిచి ఆహారపదార్థములు సిద్దముచేసుకోనండి,  యావే  ఇస్తాననిన  దేశమును స్వాధీనంచేసుకొనుటకు  యోర్ధాను  దాటలని చెప్పాడు.  రూబెను, గాదు , మనష్హె  సంతతిలో సగం మందిని పీలిచివారికీ చెప్పగా  వారు నీవు చెప్పినట్లు చేయుదుము మీకు ఎదురుతిరిగిన వారికి మరణ శిక్ష విధించుము అని చెప్పారు. అప్పుడు యొహోషువ ఇద్దరు వేగులను పిలిచి షిత్తిము నుండి వారిని రహస్యముగా యెరికో పట్టణమును పంపాడు. వారు అక్కడ రాహబు అనే ఒక వేశ్య ఇంటిలో బసచేశారు. ఈవిషయం  తెలిసిన రాజు  రాహాబు ఇంటికి సైనికులను  పంపాడు. రాహాబు వారిని  దాచి,  వారు వచ్చిన మాట నిజమే కాని నగరద్వారం మూయువేళకు  వెళ్లిపోయారు, ఎక్కడకి వెళ్లారో  తెలియదు,  వారిని వెంబడించినచో మీరు  పట్టుకొనవచ్చని చెప్పి ఆ భటులను పంపి, వేగులను  దాచిపెట్టిన చోటుకు వెళ్ళి వారితో యావే చేసిన అధ్బుత కార్యములను జ్ఞప్తికి తెస్తూ మీరన్న మాకు భయం. నేను  దయచూపిన విధముగా  నా తండ్రి ఇంటి వారిపై కనికరము చూపిస్తామని యావేపై ప్రమాణము చేయమనగా వారు యావే ఈ దేశమును మాకి చ్చినప్పుడు ఖచ్ఛితముగా మీమ్ము ఆదరించుదుమని చెప్పి, మాకు గురుతుగా  ఆ ఇంటినుండి దింపిన కిటికీకి ఎర్రటి తాడును కట్టమని  మీ కుటుంబ సభ్యులం దరిని దానిలోనే ఉండమని చెప్పారు. తరువాత వేగులు కొండలు, నదిని దాటి యెహోషువకు , జరిగినదంత చెప్పి, యావే మనకు ఆ దేశమును ఇవ్వబోతున్నాడని ఆ  ప్రజలు భయపడుతున్నారని చెప్పారు. 

యొర్దాను నదిని దాటుట 

యొహోషువ ఉదయాన్నేలేచి  యిస్రాయేలియులతో షిత్తిము నుండి బయలుదేరి యొర్ధాను చేరి  నది ఒడ్డున  మూడు రోజులబస చేసి తరువాత  లెవీయులు దేవుని మందసమును తీసుకొని పోవుట చూసినప్పుడు మీరు మందసము వెనుక వెళ్ళమని, మందసముకు రెండువేల మూరల దూరంలో నడవాలని, యావే మీ మధ్య అద్భుతకార్యములు చేయును కనుక మిమ్మును పవిత్రపరచుకొనమని చెప్పాడు.  యాజకులతో నిబంధనమందసమును తీసుకొని ప్రజల ముందు నడవమని చెప్పాడు. 

యావే యొహోషువతో నెను మోషే వలె నీకును తోడుగా ఉన్నానని ప్రజలు తెలుసుకుంటారు నేను నిన్ను ప్రజల ముందు గొప్పవాన్నిగా చేస్తానని, నీవు యాజకులతో నిబంధనమందసమును యొర్దాను గట్టును సమీపించి నిలబడమని చెప్పమన్నారు. యొహోషువ ప్రజలతో దేవుడు మీతో వున్నాడని తెలుసుకొమ్మని చెప్పాడు. అప్పుడు మందసమును ఎత్తుకొనిన వారి పాదాలు నీటిలో పెట్టగానే పైనుండి వచ్చు నీరు దిగువ నుండి వచ్చే నీరు వేరుపడి ఒకచోటనిలుచును అని వారికి చెప్పాడు. ఆవిధముగానే యొర్ధాను నదిని దాటుటకు వారి పాదాలు తాకగానే పై నుండి పారు  నీరు ఆగిపోయి  ఒక రాశిగా పొగయాయి. యిస్రాయేలు ప్రజలు యెరికో నగరమునకు ఎదురుగా నదిని దాటారు. వారు అందరు నదిని దాటెవరకు  నిబంధనమందసమును మోయు యాజకులు నడిమద్యలో ఆరిన నేలపై నిలబడ్డారు. తరువాత యాజకులు నిలబడిన చోటనుండి  యావే అజ్ఞ ప్రకారం పన్నెండు రాళ్ళను తీసుకొని వచ్చి  బస చేయుచోట పెట్టారు . వారి  పిల్లలు ఈ రాళ్ళు ఏమిటని అడిగినప్పుడు ఈ నదీప్రవాహము ఎలా ఆగిపోయింది వారు చెప్పాలని వారికి చెప్పాడు.
 
 రూబెనియులు, గాదీయులు మనస్షే తెగలలోని వారు ఆయుధములు ధరించి యుద్దమునకు సిద్దమై నదిని దాటారు. నిబంధనపు మందసమును మోయుయాజకులు బయటకు రాగానే నది పూర్వ స్థితికి వెళ్ళింది.  యొర్ధాను నుండి బయటకు వచ్చి యెరికోకు తూర్పున ఉన్న గిల్గాలులో దిగారు. యొహోషువ యొర్ధాను నది నుండి తెచ్చిన రాళ్ళను అక్కడ నిలిపి రాబోవు కాలములో వారి పిల్లలకు దిని గురించి మరియు యావే రేళ్లు సముద్రమును కూడా ఎండు నట్లు చేసినది తెలియపరచాలని అప్పుడు యావే బాహూబలమును అన్ని జాతులు గుర్తిస్తారు అని చెప్పాడు. 

వాగ్దత్తభూమిని భాగాలుగా స్వాదినపరుచుకొనుట 

యొర్ధానుకు పడమటన ఉన్న అమోరియ రాజులు, సముద్ర తీరాన ఉన్న కనానీయ రాజులు యొర్ధానులో జరిగిన విషయాలు తెలుసుకొని భయపడ్డారు. గిల్గాలు వద్ద యొహోషువతో యావే రాతి కత్తులు చేయించి  యిస్రాయేలు ప్రజలకు మరల సున్నతి చేయింపమని చెప్పగా యొహోషువ గిబియెత్ హారలోత్ కొండ వద్ద సున్నతి చేయించాడు. ఐగుప్తు దాటి వచ్చే సమయంలో పుట్టిన వారు ఎవ్వరూ సున్నతి పొందలేదు. అందరు సున్నతి చేసుకొని ఆరోగ్యం కుదుటపడువరకు అక్కడే  విశ్రాంతి తీసుకున్నారు. ఆ నెల 14 వ రోజు సాయం కాలం యెరికో మైదానంలో పాస్కపండుగ చేసుకున్నారు. ఆ తరువాతి రోజున ఆ దేశపు పంటను  రుచి చూశారు. అప్పటినుండి మన్నా ఆగిపోయింది. 

యొహోషువ యెరికోలో ఉన్నప్పుడు ఒక మనిషి కత్తి దూసి నిలబడియున్నాడు. అతన్ని యొహోషువ, నీవు మాకు చెందినవాడవా లేక శత్రువు చెందినవాడవా అని అడుగగా అతను నేను యావే సైన్యమునకు నాయకుడుగా  వచ్చాను అని చెప్పగా యొహోషువ అతని ముందు సాగిలపడి దేవుని వర్తమానం ఏమిటని అడుగగా నీవు నిలబడిన ఈ ప్రదేశం పవిత్రమైనది పాదరక్షలను తీసివేయమనగానే యొహోషువ అలానే చేశాడు. 

యెరికో ప్రజలు యిస్రాయేలియులను చూసి భయపడి నగరాన్ని మూసివేశారు. అప్పుడు యావే యొహోషువతో మీ యోధులు పట్టణమును ఒకసారి చుట్టిరావాలని అలా ఆరు రోజులు చేయాలని, ఏడుగురు యాజకులు పొట్టేలు కొమ్ము బాకాలను ఊదుతు మందసము ముందు పోవాలని, అప్పుడు మీ ప్రజలందరు యుద్దనాదం చేయగా ఆ కోటగోడ దానికి అదే కులీ పోవును అప్పుడు మీరు వెళ్ళి ఆ నగరమును మీ వశం చేసుకోవాలని చెప్పాడు. యొహోషువ యావే చెప్పినట్లే చేశాడు. ఆ విధంగా వారు ఆరురోజులు చేసిన తరువాత 7 వ రోజు కోట చుట్టు ఏడుసార్లు తిరిగారు.ఆ పట్టణమును స్వాధీనపరచుకున్నారు.   

 ఆ పట్టణములోనికి వెళ్ళి అక్కడ శాపమునకు గురైన దేనిని ముట్టవద్దని చెప్పాడు.  పట్టణములోనికి వెళ్ళి దానిని ఆక్రమించుకొని శ్వాసించు దానిని సంహరించి శాపము పాలుచేశారు. రాహాబును ఆమె కుటుంబమును, ఆమె బంధువులను మాత్రము కాపాడారు. యావే అజ్ఞాపించినట్లు ఉండక ఆకాను కొన్ని వస్తువులను తీసుకున్నాడు. దాని పర్యవసానంగా హాయి నగరమును ఆక్రమించుకొనుటకు వెళ్ళినవారు అక్కడ సంహరించబడ్డారు. అప్పుడు యొహోషువ తన వస్త్రములను చించుకొని, యిస్రాయేలు పెద్దలతో కలసి తలపై దుమ్ము పోసుకొని చీకటి పడువరకు మందసము ముందు సాష్టాంగపడి ఉన్నారు. . అప్పుడు యావే లెమ్ము ,  యిస్రాయెలియులు పాపము చేశారు, శపింపబడిన వస్తువులను తీసుకొని, వారి సరకులలో కలుపుకున్నారు అందుకే మీరు ఓడిపోయారు, శాపగ్రస్తులైనవారు మీ మద్య ఉండగ నేను మీకు తోడుగా ఉండను అని ప్రభువు చెప్పాడు. 

చేసిన తప్పును ఒప్పుకొనుట శిక్షకు గురియగుట 

 యొహోషువా మరుసటి రోజు ప్రొద్దునే అన్ని తెగలవారిని వరుసగా రప్పించినప్పుడు యూద తెగవారు పట్టుపడ్డారు.  యూదా తెగలోని సెరా కుటుంబంలోని సబ్ది మనుమడు కర్మి కుమారుడు ఆకాను పట్టుపడగా,  ఆయన దొంగిలించిన వెండి బంగారము, మరియు ఉత్తరియములను ఎలా పాతి పెట్టిన విషయము చెప్పాడు. వారు వాటిని తీసుకొనివచ్చి ఆకాను కుమారులను, కుమార్తెలను ఆకోరు లోయలోనికి తీసుకొనిపోయి అతనిని రాళ్ళతో కొట్టి అగ్నితో కాల్చి వేశారు. అప్పుడు యావే యొహోషువతో భయపడవద్దు హాయిని మీ వశము చేస్తాను అని చెప్పారు. 

హాయిని వశపరచుకొనుట 

యొహోషువ 30 వేలమంది వీరులను రాత్రివేళ పంపి పట్టణ పడమర ఉండమని,  కొంతమందితో పట్టణము సమీపమునకు వెళ్ళి వారి ఎదుట నిలువలేక పొరిపోయినట్లుగా చేసి వారిని తరుముతున్నామనే బావనలో పట్టణమును వీడుతుండగా పడమర ఉన్న వారు పట్టణమును ఆక్రమించుకొనేలా చేసుకొని దానిని వెంటనే తగులపెట్టమని ప్రణాళిక వేసుకొని మరుసటి రోజు అదేవిధంగా చేయగా హాయి , బేతేలు ప్రజలు యిస్రాయెలును తరుముతూ వారు అందరు ఆ పట్టణమును విడిచి వెళ్లిపోయారు.  యావే చెప్పినట్లు యొహోషువ ఈటెను  పట్టణము వైపు చూపగా అక్కడ పొంచివున్న వారు ఆ పట్టణమును ఆక్రమించుకొని దానిని తగులపెట్టారు. హాయి ప్రజలు వెనుకకు చూడగా వారి పట్టణము తగులపడుతుండగా యిస్రాయెలియులు వారిమీద తిరగబడ్డారు వారికి ఎక్కడకి వెళ్లాలో తెలియలేకుండిరి.  రాజును మాత్రము ప్రాణముతో యొహోషువవద్దకు తీసుకొని వచ్చి మిగిలినవారిని  సంహరించారు. యొహోషువా హాయి రాజును చెట్టుకు వ్రేలాడదియించాడు. హాయి శాపము పాలైనది. అక్కడి పశువులను, కొల్లగొట్టిన సొమ్మును యావే ఆజ్ఞ ప్రకారం యిస్రాయేలు తీసుకున్నది. యొహోషువ ఏబాలు కొండమీద యావేకు ఇనుము తాకని, చెక్కని ముడి రాళ్ళతో బలి పీఠము కట్టించి యవేకు దహనబలులు, సమాధాన బలులు సమర్పించారు. మోషే ఇచ్చిన ధర్మ  శాస్త్రమును యొహోషువ రాళ్లపై చెక్కించి దానిని చదివించాడు. 

గిబ్యోనీయులు భయపడి సంధిచేసుకొనుట-  ఇతర దేశాల రాజులు ఏకమగుట - 

జరుగుతున్న విషయాలను తెలుసుకున్న హిత్తియులు, అమోరియులు, కనానియులు, పెరిస్సీయులు, హివ్వీయులు, యొబూసీయులు  యొహోషువాతో యుద్దము చేయడానికి ఒకటయ్యారు. ఈ సంగతలును విన్న గిబ్యోనీయులు కపటోపాయంతో యోహోషువ వద్దకు వచ్చి మేము దూరం నుంచి వచ్చాము మీ దేవుని గురించి, ఆయన ఎలా మీ శత్రువులమీద విజయం చేకూర్చినది విన్నాము కనుక మీరు మాతో శాంతి పాటించుతమని మాతో ఒడంబడిక చేసుకోమని అడుగగా యిస్రాయెలు పెద్దలు మీరు ఈ ప్రాంతము వారేనేమో అని అనుమానాన్ని వెల్లడిచేయగా  వారు మేము దూరము నుండే వచ్చామని చెప్పగా పెద్దలు వారు ఇచ్చిన ఆహరమును యావేను సంప్రదింపకుండానే తిన్నారు, యొహోషువ వారితో ఒడంబడిక చేసుకొనిన మూడురోజులకు గిబ్యోనీయుల పట్టణములు చెరుకొనిరి, ఆ పట్టణములను ముట్టడింపలేదు కాని ప్రజలు వారి నాయకుల మీద గొణుగుకొన్నారు. యొహోషువా వారిని శపించి వారికు నీటిని వంటచెరకు తెచ్చుటకు నియమించేను.

పాలస్తీనా దక్షిణ భాగమును జయించుట 

యెరుషలెము రాజైన అదోనిసెదెకు యెరికో, హాయిలకు పట్టినగతి తెలుసుకొని, గిబ్యోను వంటి నగరమే వారితో సంధిచేసుకున్న విషయం తెలిసి, హెబ్రోను రాజు, యార్మూతురాజు, లాకిషురాజు ఏగ్లోను రాజులను తీసుకొని గిబ్యోను మీదకు యుద్దమునకు పోయాడు. అప్పుడు  యొహోషువ రాత్రి మొత్తం తన వీరులతో ప్రయాణం చేసి యావే అనుగ్రహంతో వారిని ఎదుర్కొన్నాడు. బెత్హహోరోను పల్లము వారిని తరిమివేశారు. యావే వారికి తోడ్పడిన విధం ఎంత గొప్పది అంటే శత్రువుల మీద వడగండ్ల వాన కురిపించాడు. ఈ వాన వలననే ఎక్కువ మంది చనిపోవడం జరిగినది.  యొహోషువ ఆ రోజు   సూర్యుడా నీవు గిబ్యోను పట్టణముపై నిలువుము, చంద్రుడా, నీవు అయ్యాలోను లోయమీద ఆగుము అని ప్రార్ధించిన విధముగా సూర్యుడు, చంద్రుడు వారు గెలుచు వరకు ఆగిపోయారు. సూర్యుడు ఒక రోజువరకు అస్తమించలేదు.  శత్రురాజులు మక్కేడా గుహలో దాగుకొనియున్నారని ఆ గుహకు అడ్డుగా పెద్ద రాళ్ళను దొర్లించి భటులను కాపలాగా పెట్టారు. ఆ రాజులను తీసుకొని వచ్చి  నాయకులతో ఆ రాజుల మెడలపై పాదములను మోపించి మీరు యుద్దము చేయువారిని ఈ రీతిగానే నాశనం చేయునని చెప్పి ఆ రాజులను వధించి చెట్లకు వ్రేలాడదియించాడు. ఆ సాయంత్రం వారిని దించి ఆ గుహలో పడవేశారు. 

కనాను దేశం దక్షణ భాగం చేయించుట

అదే రోజు మక్కెడను యొహోషువ జయించాడు. మక్కెడ రాజుకు కూడా యెరికోకు పట్టిన గతే పట్టింది. యొహోషువ అతని అనుచరులు మక్కెడ నుండి లిబ్న వచ్చి ఆ పట్టణమును ముట్టడించారు.  యావే ఆ పట్టణమును యిస్రాయేలుకు అప్పగించాడు. అక్కడనుండి యొహోషువ లాకిషును రెండురోజులలో  వశము చేసుకున్నారు. గేసేరు రాజు, వారికి తోడుగా వచ్చిన వారు యిస్రాయేలును ఏమి చేయలేకపోయారు. తరువాత వారు లాకిషు నుండి 
ఏగ్లోనుకు వెళ్ళి ఆ పట్టణమును తరువాత హెబ్రోను స్వాధీనం చేసుకున్నారు.  అక్కడ నుండి  దెబీరుకు వచ్చి దాన్ని  ఆక్రమించుకున్నారు. ఆ విధంగా కాదేషుబార్నెయా  నుండి గాసావరకు గిబ్యోను వరకు ఉన్న గోషే  వరకు స్వాధీనం చేసుకున్నారు. 

ఉత్తర దేశమును జయించుట

హసోరురాజు  యాబీను యొహోషువ గురించి విని మాడోను రాజు యోబాబు, షిమ్రోను రాజు, అక్షాపు రాజు, ఉత్తరదేశపు పీఠభూములయందు రాజులకు, కిన్నెరోత్తుకు దక్షిణమున లోయలలోని రాజులకు డోరుసీమకు   ప్రక్క పల్లములో రాజులకు, కనానీయులకు, పెరిస్సీయులకు, ఆమోరియులకు, హివ్వీయులకు, యొబూసియులకు, మిస్ఫలోని హర్మోనులో ఉన్నవారికి  కబురు పంపి అందరు యిస్రాయేలు మీద యుద్దమునకు వచ్చారు. వారు అందరు మేరోము వద్ద దిగి యిస్రాయేలుతో యుద్దమునకు సిద్దంకాగా, యావే యొహోషువతో భయపడకు వారిని నీకు అప్పగిస్తానని చెప్పి, అలాగే చేశాడు. యొహోషువ అతని అనుచరులు అకస్మాత్తుగా వారి మీద పడి వారిని ఓడించారు. హసోరు, ఉత్తర దేశ పట్టణములు యిస్రాయేలు వశం అయ్యాయి. హసోరులోని మెట్ట పట్టణములనుండి వచ్చిన సొమ్మును, పశువులను యిస్రాయేలుతీసుకొని మిగిలన ప్రాంతములలో మొత్తాన్ని నాశనం చేసినది. యొహోషువ మోషే ఆజ్ఞలను మీరకుండ  పాటించాడు. తరువాత పీఠభూముల మీద ఉన్న అనాకీయులను నాశనం చేశారు. యొహోషువ యొర్ధానుకు తూర్పున ఉన్న రాజులను, పడమర ఉన్న రాజులను  జయించారు. 

పన్నెండు తెగలు కనాను పంచుకొనుట 

యొహోషువ ముసలి వాడు అయ్యాక, యావే అతనితో నీవు ముసలివాడవు అయ్యావు. ఇంకా జయించవలసిన దేశములు ఉన్నవి. ఆ దేశములలో ఉన్న వారినందరిని యిస్రాయేలు కన్నుల ముందునుండి తరిమివేస్తానని చెప్పి, నేను అజ్ఞాపించినట్లే ఈ నేలను వారసత్వభూమిగా యిస్రాయేలుకు పంచిఇవ్వమని, తొమ్మిది తెగలకు, మనస్షే అర్ధ తెగకు పంచిఇవ్వమని చెప్పాడు.రూబెను, గాదు తెగల వారికి తూర్పున యొర్ధానుకు అవ్వతల నేల వారికి ఇచ్చాడు. లెవీ తెగకు మాత్రము వారసత్వభూమి ఏమి లభింపలేదు. దేవునికి బలులు అర్పించుటయే వారి వారసత్వం. గాదు తెగకు  వారి వారి కుటుంబములను అనుసరించి మోషేచెప్పినట్లుగా   భూములు పంచి ఇచ్చాడు. తరువాత మనస్సే అర్ధతెగ వారికి వారివారి కుటుంబములను అనుసరించి  వారసత్వ భూమిని పంచి ఇచ్చాడు. యోర్ధానుకు తూర్పున ఉన్న రెండున్నర తెగలకు ముందుగానే భూమిని పంచి ఇచ్చాడు. లెవీ తెగకు మాత్రము ఇవ్వలేదు.కానీ వారు వసించుటకు కొన్ని పట్టణాలు, మందలు మేపుటకు కొన్ని బయళ్ళు ఇచ్చారు.  యేసేపు కూమరులు మనస్సే , ఏఫ్రాయిము అను రెండు తెగలగా ఏర్పడిరి. 

కాలెబు భాగము 

యూదీయులు గిల్గాలులో ఉన్న యోహోషువను చూచుటకు వచ్చారు, అపుడు యెపున్నే కుమారుడు కెనిస్సీయుడగు  కాలెబు యోహోషువతో మోషే వారికి చెప్పిన మాటలను గుర్తు చేసి, మోషే వాగ్ధానం చేసినట్లు ఆ కొండ సీమలను తనకు ఇవ్వమని అడిగాడు. యోహోషువ హెబ్రోను సీమను వారసత్వ భూమిని కాలెబుకు ఇవ్వడం జరిగింది. 

యూదాకు వారి కుటుంబాల ప్రకారం వారికి ఇచ్చిన భూమి ఏదోము సరిహద్దున ఉంది. అది శీను ఎడారి నుండి కాదేషు వరకు వ్యాపించి ఉంది. కాలెబుకు కూడా యూదా తెగవారు ఆక్రమించిన నేలలో భాగం ఇచ్చారు. కాలెబు తన కుమార్తె అక్సా కు వివాహం చేయగా ఆమె తన తండ్రిని నన్ను నెగెబు ఎడారి సీమకు ఇచ్చితివి కదా నాకు నీటి బుగ్గలు గల నేలను ఇప్పింపుము అని అడుగగా అతను ఆమెకు ఎగువ నీటి బుగ్గలు దిగువ నీటి బుగ్గలు ఇచ్చాడు. అది యూదా తెగల వారికి వచ్చిన వారసత్వ భూమి. 

ఎఫ్రాయీము తెగ :  యోసేపు తెగవారికి  యోర్ధాను నుండి ఏరికో వరకు తూర్పు వైపున ఉన్న నేల వచ్చింది. వారి   సరిహహద్దులు ఏరికో నుండి బేతేలు వరకు, బేతేలు లూసు నుండి ఆటారోతున వున్న ఆర్కి వరకు అక్కడనుండి పడమట బెత్ హొరోను వరకు గేసెరునుండి సముద్రం వరకు ఉన్నది. ఎఫ్రాయీము జనులు గేసెరున నివసించు కనానీయులను వెడలకొట్టక పోవడంతో వారు అక్కడే జీవించారు మరియు వారిచేత చాకిరి చేయించుకున్నారు. 

మనష్హె తెగ : యోసేపు పెద్దకుమారుడు మనష్హె. మనష్హె పెద్దకుమారుడు మాకీరు పోరాట వీరుడు. అతనికి గిలాదు, బాషాను మండలాలు ఇవ్వబడ్డాయి.  మనష్హె ఇతర కుమారులకు వారివారి కుటుంబములను అనుసరించి భూమినిచ్చారు. వారు అబిఏజెరు, హేలేకు, ఆస్రియెలు, షేకెము, హేఫెరు, షెమిదా. గిలాదు మాకీరు కుమారుడు గిలాదుకు హేఫెరు కుమారుడు, హేఫెరుకు కుమార్తెలు మాత్రమే ఉన్నారు. వారు మహ్ల, నోవా, హొగ్లా, మిల్కా, తీర్సా.  వీరు యోహోషువ, ఎలియాజరు , మరియు పెద్దల  వద్దకు వచ్చి  యావే ఆజ్ఞను అనుసరించి మాకును ఇవ్వమని అడుగగా అటులనే వారికి భాగము ఇచ్చారు. కనుక మనష్హెకు గిలాదు , బాషాను మండలలే కాక పది వంతులు ఎక్కువ భూమి వచ్చినది. దక్షిణమున ఎఫ్రాయీము ఉత్తరమున మనష్హె ఉన్నారు. వారికి ఉత్తరమున ఆషేరు తూర్పున యిస్సాఖారు ఉన్నారు. ఈ మండలలలో మనష్హెకు పట్టణాలలు ఉన్నవి. 

యోసేపు సంతతి వారు యోహోషువతో మేము యావే దీవెనల వలన చాలమందిమి అయ్యాము అని చెప్పగా యోహోషువ వారితో మీకు ఎఫ్రాయీము ప్రాంతము చాలనిచో అరణ్య ప్రాంతమునకు వెళ్ళి పెరిస్సీయులు  రేఫీయులు నివసించు దేశంలో అడవులను నరికి అక్కడ నేలను ఆక్రమించుకొనమని చెప్పారు. అక్కడ కనానీయులు బలవంతులైయన మీరు వారిని వెడలగొట్టగలరు అని చెప్పాడు. 

యిస్రాయేలీయులు షీలో  వద్ద చేరి సమావేశపు గుడారము ఏర్పాటు చేశారు. వారు ఆ ప్రాంతమును స్వాదినము చేసుకున్నప్పటికి ఏడుతెగలవారికి  వారసత్వ భూమి లభింపలేదు. యోహోషువ వారితో ఇంకా ఎంత కాలం యావే మీకు ఇచ్చిన భూమిని స్వాదినం చేసుకోకుండా  జాగుచేస్తారు, ఒక్కో తెగ నుండి ముగ్గురిని ఎన్నుకొండి వారు ఈ నేల మొత్తం తిరిగి దానిని ఎట్లు విభజింపాలో నిశ్చయించి, నా దగ్గరకు వచ్చేదరు అని చెప్పాడు. వారు ఈ భూమిని ఏడు భాగాలుగా విభజించాలని యూదా తెగవారికి దక్షిణ భాగమున, యోసేపు ఉత్తర భాగమున ఉంటారని చెప్పారు. లెవీయులకు మీతో భాగము లేదు.  యావే యాజకులుగా పనిచేయుటయే వారి వారసత్వం. గాదు, రూబెను, మనష్హె అర్ధ తెగవారు యొర్ధాను ఆవలిదరిని తూర్పు వైపున  తమ వారసత్వ భూమిని తీసుకున్నారు. 

మిగిలిన తెగలవారు వారసత్వ భూమి పొందుట 

అక్కడకు వచ్చిన తరువాత చీటి వెయ్యగా మొదటి వంతు బెన్యామీను కుటుంబమునకు వచ్చెను అది యూదా యోసేపుల భాగముల మద్య ఉన్నది. షిమ్యోను తెగ: తరువాత చిట్లు వెయ్యగా రెండవ వంతు షిమ్యోను వారికి వచ్చినది. అది యుదీయుల వారసత్వ భూమి మద్యలో ఉన్నది. యూదాకు వచ్చిన భాగము చాలా పెద్దది. కనుక షిమ్యోను వారసభూమి యూదా నుండి పంపిణిచేయబడెను. సెబూలూను తెగ : తరువాత చిట్లు వెయ్యగా వచ్చిన మూడవ చీటి సెబూలూనుకు వచ్చినది. వారినేల సరీదు వరకు వున్నది. యిస్సాఖారు: నాలుగవ సారి చీట్లు వేయగా   యిస్సాఖారుకు వచ్చినది. ఆషేరు తెగ:ఐదవ వంతు ఆషేరు తెగకు వచ్చింది. 
నప్తాలి తెగ: ఆరవ వంతు నఫ్తాలి తెగవారికి వచ్చినది. దాను తెగ: ఏడవ వంతు చీటి దాను తెగ వారు పొందారు. దానీయులు వారి భూభాగం కోల్పోవడంచే వారు లెషెము మీద యుద్దము చేసి దానిని స్వాధీనపరుచుకొని దాను పేరును ఆ నగరమునకు పెట్టారు. 

యోహోషువకు కూడా వారు వారసత్వ భూమి ఇచ్చారు . యోహోషువ అడిగినట్లు ఎఫ్రాయీము పీఠభూములలోని తిమ్నాత్ సెరా  పట్టణమును ఇచ్చారు. ఆయన దానిలొనే నివసించాడు. ఆవిధముగా యిస్రాయేలు ప్రజలు వారసత్వ భూమిని పంచుకున్నారు. 

ఆశ్రయ పట్టణాలు 

ముఖ్య నరగరాలు : యావే యోహోషువతో యిస్రాయేలీయులను ఆశ్రయపట్టణములను ఎన్నుకొనమని చెప్పాడు. తెలియక ఎవరినైన చంపినవారు ఈ పట్టణములలో తలదాచుకోవచ్చు. పగ తీర్చుకొనగోరే వారి నుండి ఈ నగరాలు రక్షణ కల్పిస్తాయి. ఇతరులను చంపినవాడు ఇక్కడ శరణు పొందవచ్చు, అతడు మొదట నగరద్వారం వద్ద నుండి అతడు పెద్దలకు ఆ విషయం చెప్పాలి. వారు అతనికి ఆశ్రయం ఇవ్వాలి.  పగ తీర్చకొనేవారు ఎవరైన అతనిని వెదకి వచ్చినట్లయితే మీరు అతనిని పట్టి ఇవ్వరాదు అని చెప్పాడు. అతడు పగతోటి కాక తెలియకనే చంపాడు. ఆ వ్యక్తి  తాను వచ్చినప్పుడు ఉన్న ప్రధాన యాజకుడు మరణించువరకు ఆ నగరమునే ఉండవచ్చు.  తరువాత అతను తన సొంత నగరమునకు కాక నప్తాళి  లోని  కొన్ని నగరాలలో కేదెషు, ఎఫ్రాయీము మున్నేములోని షెకెము, యూదా లోని హెబ్రోను, ఏరికో తూర్పున ఉన్న బేసెరును , రామోత్ గిలాదును, గోలానును    ఆశ్రయపట్టణములుగా నిర్ణయించారు. 

తరువాత లెవీయ పెద్దలు  యోహోషువ, ఎలియెజరు యిస్రాయెలు పెద్దల వద్దకు వచ్చి మేము నివసించుటకు పట్టణములు, మా  గొడ్లు మేపుకొనుటకు గడ్డి బీళ్లను ఇవ్వాలని యావే అజ్ఞాపించిన విధంగా ఇవ్వమని అడగడం జరిగినది. వారికి యిస్రాయెలు ప్రజలు వారి వారి వారసత్వ భూములనుండి లేవీయులకు ఇవ్వడం జరిగినది. 

యొర్దాను అవతలి తెగల వారు వెళ్లిపోవుట - వారికి యెహోషువ సందేశం 
 
యోహోషువ రూబెనియులను గాదియులను , మనశ్శె అర్ధ తెగవారిని యావే సేవకుడు మోషే మీకు ఇచ్చిన ఆజ్ఞలను పాటించారు మీరు ఇన్ని రోజులు ఈ సోదరులను వీడి పోలేదు. మీ సోదరులకు ఇప్పుడు విశ్రాంతి లభించినది. కనుక మీరు మీ నివాసముల ఉన్న యొర్దాను అవతల ఉన్న మీ నివాసములకు వెళ్ళమని, యావే ఇచ్చిన ఆజ్ఞలను పాటింపమని వారికి చెప్పాడు.  అలా తూర్పు తెగలవారిని యెహోషువ పంపించాడు. రూబేనీయులు గాదీయులు, మనస్సే తెగవారు గిలాదు మండలమునకు వెళ్లిపోయారు. 

వారు యొర్దాను నందలి రాళ్ళ గుట్ట వద్ద యిస్రాయేలీయుల వైపున బలిపీఠము ఏర్పాటు చేశారు అది  తెలిసి యిస్రాయేలీయులు షిలో వద్ద నుండి వారి మీద దండెత్తుటకు సిద్ధపడ్డారు. ఎలీయెజెరు కుమారుడైన ఫీనెహాసును పది తెగల నుండి   పదిమందిని పంపగా వారు మీరు యావేమీద తిరుగుబాటు చేయనేలా , పెయోరు వద్ద మనం చేసిన పాపములకు ప్రభువు మనలను అంటురోగములతో పీడింపలేదా, మరల ప్రభువు మనమీద మండి పడడా అని చెప్పడం జరిగినది. యావే బలి పీఠమునకు వ్యతిరేకముగా మరియొక  దానిని ఏర్పాటు చేసి మీ తిరుగుబాటులో మమ్మును భాగస్వాములను చేయవద్దు అని చెప్పడం జరిగింది. అప్పుడు వారు మేము చేసినది  దేవాధిదేవుడైన యావేకు తెలుసు. రేపు మీ సంతతి వారు యిస్రాయేలు దేవుడైన యావేతో మీకు ఏమి సంబంధం అని వాధించవచ్చును, మేము యొర్దాను అవతల ఉంటాము. అప్పుడు ఇది మీ సంతతికి మా సంతతికి సాక్షముగా నిలువగలదు అందుకే దీనిని నిర్మించితిమి కాని ఇక్కడ బలులు, దహన బలులు సమర్పించుటకు కాదు అని చెప్పారు.  ఆ మాటలకు ఫీనెహాసు మరియు యిస్రాయేలీయుల పెద్దలు సంతృప్తి చెందారు. వారు వెళ్లి జరిగినదంతటిని తమ వారికి చెప్పారు. ఆ పీఠము యావే దేవుడు అనుటకు సాక్షముగా ఉండునని దానికి సాక్షము అని పేరు పెట్టారు. 

యెహోషువ ఎడ్లు గడచి వృద్ధుడై యిస్రాయేలీయులలో పెద్దలను నాయకులను న్యాయాధిపతులను, ముఖ్యులను పిలిచి యావే ఎలా వారి శత్రువులను అణగద్రొక్కినది , వారు చూచిన దానిని వారికి జ్ఞప్తికి తెచ్చి, వారి తరుపున యుద్ధము చేసిన యావే గురించి తెలిపి ధర్మశాస్త్రమున వ్రాయబడిన అన్ని నియమాలను ఏ మాత్రము మార్చకుండ పాటించమని చెప్పాడు. ఇతర దేవతలను ఆశ్రయించవద్దని, ఆ జాతులతో కలసిపోవద్దని, వారి దేవతల పేరుమీద ప్రమాణములు చేయడం, పేరు ఉచ్చరించడం, సేవించడం, పూజించడం చేయక యావేనే అంటిపెట్టుకొని  ఉండండి. ఆయనను అంటిపెట్టుకొని ఉండుటవలనే మహాబలముగల గొప్ప జాతులను మీ ఎదుటినుండి వెడల గొట్టాడు. కనుక ప్రభువును పూర్ణ హృదయముతో సేవింపుము అని వారికి చెప్పాడు. అట్లుకాక మీరు వారితో కలసిపోవుదురేని, ప్రభువు వారిని వెడలగొట్టక వారు మీరు చిక్కుకొని గోతులుగా, వలలాగా పరిణమిత్తురు అని చెప్పాడు. యావే మీకు చేసిన వాగ్దానములు అన్ని నెరవేరినవి. ప్రభువు మీతో చేసుకొన్న నిబంధనను మీరుదురేని మీకిచ్చిన నేలమీదనుండి మీరు అడపొడ  కానరాకుండా పోవుదురు అని అతని కోపం మీమీద వస్తుంది అని చెప్పాడు.  

యావే  చేసిన మేలును గుర్తుచేస్తూ  వారిని యావేను ఆజ్ఞలను అనుసరించమని కోరుట 

యెహోషువ యిస్రాయేలు తెగలన్నింటినీ షెకెము వద్ద సమావేశపరచి యావే పలుకులను వారికి వినిపించాడు. పూర్వం అబ్రాహాము,నాహోరు వారి తండ్రి తేరా అన్యదైవములను కొలిచారు, యావే అబ్రాహామును పిలిచి కనాను మొత్తము సంచరించునట్లు చేసి, అతని సంతానాన్ని వృధ్ది చేయుటకు ఇస్సాకును ఇచ్చినది, ఇస్సాకుకు ఏసావు , యాకోబులను ఇచ్చినది, సేయిరు పర్వతమును ఏసావు సంతతికి వారసత్వ భూమిగా ఇచ్చినది. యాకోబు అతని కుమారులు ఐగుప్తుకు వలస పొగ మోషే అహరోనును పిలిచి వారిని ఇక్కడకు తీసుకొని వచ్చిన విషయం చెప్పడం జరిగింది. 

యావే చేసిన అన్ని అద్భుతకార్యములను వివరిస్తూ ప్రభువు చేసిన కార్యములకు వారు  చూచిన విషయం తెలియజేశాడు. ఎలా ప్రభువు వారికి తోడుగా ఉంటూ అన్ని సమకూర్చినది తెలియజేశాడు. ఇవన్నీ తెలియజేసిన తరువాత యెహోషువ వారితో యావేకు భయపడి చిత్తశుద్ధితో ఆయన్ను కొలవండి. అన్యదైవములను విడనాడి యావేను కొలవండి. మీరు యావేను కొలవనిచో ఎవరిని కొలుస్తారో ఇప్పుడే తేల్చుకోండి. నేను నాకుటుంబం మాత్రము యావేను మాత్రమే ఆరాధిస్తాము  అని చెప్పాడు. అప్పుడు వారు ఎంతమాట మాకు ఇంత మేలుచేసిన యావేను విడనాడి వేరు దైవములను ఎలా కొలుస్తామా? మేము కూడా యావేను మాత్రమే సేవింతుము అని చెప్పారు. అప్పుడు యెహోషువ వారితో మీరు యావేను సేవింపజాలరేమో! ఎందుకంటే ఆయన పరమ పవిత్రుడు, అసూయపరుడు. ఆయన  మీ తిరుగుబాటులను సహించడు, మీరు అన్యదైవములకోసం ఆయన్ను పరిత్యజింతురేని మిమ్ములను నాశనం చేయును అని హెచ్చరించగా వారు మేము యావేను మాత్రమే సేవింతుము అని యావేను ఎన్నుకొని, ఆయన ఆజ్ఞలను పాటింతుము అని చెప్పారు. 

యెహోషువ చివరి మాటలు మరియు మరణం 

యెహోషువ అప్పుడు ప్రజలతో నిబంధనచేసి వారికి ఒక శాసనం చేసాడు. యెహోషువ తన అను శాసనములను ధర్మ శాస్త్రంలో రాయించి, పెద్దరాతిని తెప్పించి సింధూర వృక్షం క్రింద దానిని పెట్టి ఈ శిల మనకు సాక్ష్యముగా ఉండును, యావే మనతో చెప్పిన మాటలు అన్ని విన్నది. మీరు యావేను విస్మరిస్తే ఈ శిల మీకు వ్యతిరేఖంగా సాక్ష్యము ఇస్తుంది అని చెప్పిన తరువాత  యెహోషువ మరియు ప్రజలు వెళ్లిపోయారు. తరువాత యెహోషువ నూటపది సంవత్సరాల ప్రాయంలో కన్నుమూయగా అతన్ని తిమ్నాత్ సెరా వద్ద ఖననం చేశారు.  


మోషే జీవిత చరిత్ర

మోషే జీవిత చరిత్ర 

మోషే అంటే నీటి నుండి తీసుకొనబడిన వాడు. మోషే అమ్రాము యోకెబెదుల చిన్న కుమారుడు. హెబ్రీయుల గొప్ప నాయకుడు  మరియు ధర్మ శాస్త్రమును ప్రజలకు ఇచ్చినవాడు. యిస్రాయేలీయుల నాశనమును  ఐగుప్తు రాజు నిర్ణయించిన సమయంలో పుట్టిన వాడు,  యిస్రాయేలీయుల కుటుంబాలలో పుట్టిన మగ బిడ్డలను సంహరించాలని రాజు  నిర్ణయించిన కాలంలో పుట్టి దేవుని కృపతో ఆ విపత్తు నుండి తప్పించుకున్నవాడు. మోషేను కూడా చంపుతారు అని అతని తల్లిదండ్రులు భయపడ్డారు. ఒక బుట్ట తీసుకువచ్చి అతనిని  దానిలో పెట్టి నీటిలో వదిలారు. ఫరో కూతురు మోషేను నీటి నుండి కాపాడి అతనికి మోషే అనే పేరు పెట్టి ఆయనను దత్తత తీసుకుంది. ఫరో కూతురు  కుమారుడిగా, యువరాజుగా ఆయన అన్ని విద్యలలో నేర్పరి అయ్యాడు.  

మోషే గొప్పతనం గురించి ఎంత చెప్పిన అది తక్కువే అవుతుంది. ఆయన చరిత్రకారుడిగా , నాయకునిగా, రాయబారిగా, శాసనకారుడిగా, దేవునికి మానవునికి మద్యవర్తిగా, సంప్రదాయ దేశభక్తునిగా నిర్వహించిన భాధ్యతలు ఆయన గొప్ప వ్యక్తిత్వాన్ని తెలుపుతాయి. దేవుని యొక్క స్నేహితునిగా ఆయన పిలువబడ్డాడు. ఈయన 120 సంవత్సరాలు జీవించాడు. మొదటి 40 సంవత్సరాలు ఐగుప్తులో గడిపాడు. తరువాత అక్కడ నుండి పారిపోయి మిదియాలో అనామకునిగా జీవించాడు. అక్కడ నుండి 40 సంవత్సరాలు దేవుని రాయబారిగా ప్రజలను నడిపాడు. 

మోషే ఒక లెవీయ కుటుంబంలో జన్మించాడు. అప్పటి సామాజిక పరిస్తితులు ఐగుప్తులో  యిస్రాయేలియుల పట్ల కఠినంగా ఉండేటువంటి రోజులు. మోషే జన్మించిన తరువాత మూడు నెలలు, తన తల్లి అతనిని ఎవరికి కనపడకుండా దాచినది. మోషేను  ఐగుప్తియుల కంటపడకుండా చేయడం కష్టం అవుతుంది. అటువంటి పరిస్తితులలో ఒక బుట్టను కొని దానిలో మోషేను పడుకోబెట్టి నైలునది ఒడ్డున వదలి పెట్టారు. ఆ పెట్టెను మోషే అక్క అక్కడే ఉండి అది ఎక్కడకు వెళుతుందో చూస్తూఉండిపోయింది.  అప్పుడు ఫరో కూతురు స్నానం చేయుటకు అక్కడకు వచ్చి ఆ బుట్టను చూసి తన దాసీలతో ఆ బుట్టను తెప్పించి దానిలో ఉన్న పిల్లాడిని చూచి జాలిపడి తీసుకున్నది.  అది మొత్తం అక్కడ ఉండి  చూస్తున్న మోషే అక్క ఆమె దగ్గరకు వచ్చి ఆ పిల్లవాడి అలనా పాలనా చూసుకోవడానికి హెబ్రీయ స్త్రీ కావాలా? అని అడిగింది. అందుకు ఆమె ఒక స్త్రీని తీసుకురమ్మని  చెప్పింది. అప్పుడు ఆ బాలిక వెళ్ళి మోషే తల్లిని తీసుకొని  వచ్చింది. అప్పుడు ఆమె మోషే తల్లితో, ఆ పిల్లవాడిని తనఇంటికి తీసుకొని వెళ్ళింది. ఆ బాలుడికి కావలసినవన్నీ  ఫరో కూతురు సమకూర్చింది. 

కొన్నాళ్ళ తరువాత ఆ పిల్లవాన్ని ఫరోకూతురు దగ్గరకు తీసుకు వెళ్ళి ఆమెకు అప్పగించింది. అప్పటినుండి ఆమె పెంపుడు కొడుకుగా జీవించాడు. అతనికి ఆమె మోషే అని పేరు పెట్టింది, మోషే అంటే నీటి నుండి తీయబడినవాడు అని అర్ధం. మోషే పెరిగి పెద్దవాడయిన తరువాత హెబ్రీయులు పడుతున్న కష్టాలు స్వయంగా చూశాడు. హెబ్రీయులు అంటే అతనికి సానుభూతి  ఏర్పాడింది. ఒక రోజు ఐగుప్తుకు చెందిన ఒక వ్యక్తి హెబ్రీయున్ని అకారణంగా కొట్టుతుండగా చూచి, కోపంతో వాడిని కొట్టగా వాడు చనిపోయాడు. తరువాత కొన్ని రోజుల తరువాత ఇద్దరు హెబ్రీయులు కొట్టుకొనుచుండగా చూసి, ఒకరి తప్పు తెలుసుకొని వానితో ఎందుకు నీ తోటి వాడిని అకారణంగా కొడుతున్నావని వాడిని వారించాడు. అందుకు వాడు ఐగుప్తియుడిని చంపినట్లు నన్ను చంపచూచుచున్నవా అని అడిగాడు. తాను చేసిన పని అందరికీ తెలిసింది అని గ్రహించాడు. 

అప్పటికే ఈ విషయం ఫరోకు తెలిసింది అని తనను చంపుతారెెమో అని మోషే, మిద్యాను దేశము పారిపోయి అక్కడ బావి వద్ద కూర్చొని ఉన్నాడు. మిద్యాను దేశపు యాజకునికి  ఏడుగురు కుమార్తెలు ఉన్నారు. వారు ఆ బావి వద్దకు నీరు తొడుకొనుటకు వచ్చారు. వారిని కొంత మంది యువకులు వారిని తరిమివేశారు. కాని మోషే వారి తరుపున ఉండి వారి మందలకు నీళ్ళు పెట్టారు. అపుడు వారు తమ తండ్రి రవూవేలు వద్దకు వెళ్ళగా ఆయన వారిని అంత పెందలకడన ఎలా వచ్చారు అని  అడగగా, వారు ఐగుప్తుదేశీయుడు వారిని గొర్రెల కాపరుల  నుండి కాపాడాడని  మరియు అతనే నీళ్ళుతోడి మందలకు పోశాడు అని చెప్పగానే అందుకు వారి తండ్రి ఆయన ఎక్కడ ఉన్నాడు? ఎలా ఆయనను అక్కడే వదలి వచ్చారు మనతో భుజించుటకు తీసుకురమ్మని కుమార్తెలతో చెప్పాడు. అలా మోషే రవూవేలు వద్ద ఉండి ఆయన కుమార్తె సిప్పోరాను పెండ్లి చేసుకున్నాడు. ఆమెకు బిడ్డ పుట్టగా ఆ బిడ్డకు గెర్షొము అని పేరుపెట్టారు. దాని అర్ధం పరదేశి. 

మోషేకు పిలుపు 

ఐగుప్తులో యిస్రాయేలు ప్రజలు బానిసలుగా మ్రగ్గుతు, సహయం కొరకు ఆక్రందన చేయగా అది దేవుని చెవినపడింది. దేవుడు అబ్రహాము, ఈసాకు యాకోబులతో చేసుకొనిన ఒడంబడిక గుర్తుకు తెచ్చుకొని వారిని కరుణించాడు.  మోషేకు తన మామ మిధ్యాను యాజకుడు యిత్రో మందలను మేపేవాడు అప్పుడు ఒకసారి మందను తొలుకొని హోరెబు కొండమీదకు వచ్చాడు. అక్కడ ఒక పొందనుండి వచ్చు నిప్పుమంట రూపములో యావేదూత ఆయనకు సాక్షాత్కరించినది. మోషే కన్నులేత్తి చూడగా అక్కడ ఒక పొద  మండుచున్నది కాని పొదమాత్రము కాలిపోవడం లేదు. అది చూసిన మోషే, నేను దగ్గరకు వెళ్ళి అది ఏమిటో చూడాలి అని అనుకున్నాడు. ఆ పొద దగ్గరకు వెళ్ళగా పొద నుండి ఒక స్వరము మోషే మోషే అని పిలవగా చిత్తము ప్రభూ అని  చెప్పాడు.   అప్పుడు దేవుడు దగ్గరకు రాకుము. చెప్పులు విడవుము. నీవు నిలుచున్న ఈ తావు పవిత్ర భూమి, నేను మీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను, ఈసాకు దేవుడను యాకోబు దేవుడను అని చెప్పాడు.  మోషే దేవున్ని చూచుటకు భయపడి ముఖము కప్పుకున్నాడు. దేవుడు ఐగుప్తులో ఉన్న తన ప్రజలు అనుభవించే బాధలు చూశానని, వారి దాస్యం నుండి వారిని భయటకు తీసుకురావాలని నేను అందుకే క్రిందికి దిగివచ్చను అని చెప్పాడు. ఐగుప్తు నుండి నా ప్రజలను తీసుకొని రావడానికి నిన్ను ఫరో రాజు వద్దకు  పంపుదును అని చెప్పాడు. అందుకు మోషే ఫరో రాజు వద్దకు వెళ్ళుటకు నేను ఎవ్వడను అని అన్నాడు. దేవుడు మోషేతో నేను నీకు తోడై ఉందును అని చెప్పాడు. 

"ఉన్నవాడు"

మోషేకు దేవుడు యిస్రాయేలీయులతో వారి పూర్వీకుల దేవుడనని చెప్పమని చెబుతున్నాడు. యావే వారి పితరుల దేవుడనిఆయన అబ్రహాముఈసాకు మరియు  యాకోబుల దేవుడని  ప్రకటిస్తున్నాడు. అపుడు మోషే దేవునితో ఆ ప్రజలు  నన్ను ఆ దేవుని పేరు ఏమి అని అడిగినచో నేను ఏమి చెప్పవలయును అని అడిగాడు. దానికి దేవుడు సమాధానం ఇస్తూ "నేను ఉన్నవాడను" ఉన్నవాడు నన్ను మీ వద్దకు పంపించాడు అని చెప్పుము అని అన్నాడు. మోషే, దేవుడు వారిని విమోచించి,వాగ్ధత్త భూమికి తీసుకొనిరావడం జరుతుందని ప్రకటించాలి.ఇంకా మోషేతో దేవుడు  వెళ్ళి ఫరోను కలవమని చెప్పాడు. ముందుగా మోషే వెళ్ళి ప్రజలనుకలిసి  దేవుడు చెప్పిన మాటలును  తెలియజేసి వారిని ఐగుప్తు నుండి  దేవున్ని ఆరాధించుటకుబయటకు బయటకు తెచ్చి వారిని విమోచించాలి. మోషేతో  దేవుడు, ఫరో అతని మాటను వినివెంటనే ప్రజలను ఐగుప్తు నుండి పంపివేయాడు అని తెలియజేశాడు. ఐగుప్తులో ఉన్న యిస్రాయేలు ప్రజలను పంపించకపోతే దేవుడు హస్తము చాచి ఐగుప్తుకు  అనేక అరిష్టములతో చేయబోయే నష్టమును తెలియజేయాలి. దాని తరువాతనే యిస్రాయేలు ప్రజలను ఫరో అక్కడ నుండి పంపుతాడు అని తెలియజేశాడు. 

దేవుని నుండి ఇవి మొత్తం విన్న తరువాత కూడా మోషే దేవునీతో  వీటి గురించి మరలా  ప్రశ్నిస్తాడు. ఒక వేళ వారు నా మాటను నమ్మకపోతేలేక నా మాటను వినక దేవుడు నీకు దర్శనము ఇవ్వలేదంటే  అని దేవుడిని ప్రశ్నించాడు. అప్పుడు దేవుడు ఒక అద్భుతంతో మోషేకు  సమాధానం చెప్పాడు. మోషేతో దేవుడు, చేతి కర్రను తీసుకొని నేల మీద కొట్టమని చెప్పగా  అతడు అలానే చేస్తాడు. అప్పుడు  కర్ర పాముగా మారుతుంది. అప్పుడు దేవుడు  పామునుతోకపట్టుకోమని చెబుతున్నాడు. మోషే అలా చేయగానే అది మరలా కర్రలా మారిపోయింది. నీవు ఇక ఇట్లే చేయుము. దానిని చూసిన తరువాత వారు నమ్ముతారు అని చెప్పాడు. తరువాత మోషేను దేవుడు తన వక్షస్థానమునచేయి  పెట్టి వెనుకకు తీసుకోమని  చెప్పగా ఆయన అలానే చేశాడు. అపుడు  చేయి వెంటనే  కుష్టు రోగముతో మంచు వలే తెల్లగా   మారింది. దానిని బయటకు తీయగానే మరలా అది మామూలు చేయిగా మారుతుంది. ఈ విధముగా మోషేకు అధ్బుతాలు చేసే శక్తిని ఇచ్చాడు. ఇవన్నీ చేసిన తరువాత వారు విశ్వసించకపోతే దేవుడు మోషేతో నైలు నది నుండి నీటిని తీసుకొనిపొడినేల మీద పోయుము. అప్పుడు ఆ నీరు రక్తము ఎర్రగా మారుతుంది అని చెబుతున్నారు. 

దేవుడు మోషేతో ఇవన్నీ చెప్పిన తరువాత కూడా మోషే దేవునితో ఇంత గొప్ప పనికి తగిన వ్యక్తిని  కార్యమునకు ఎన్నుకున్నారాఅని అడుగుతు నేను సరిగా మాటలడలేను అనినత్తి వాడిని చెబుతున్నాడు. అప్పుడు దేవుడు ఆయనకు సమాధానం చెబుతూ మానవుని నోరు చేసినదిదానిని మూగగా చేసేదిలేక చెవిటిగా చేసేదిచూపునించేదితీసివేసేది నేనుకదా  అని అడుగుతున్నారు. దేవుడు  మాటను చెప్పిన తరువాత కూడా మోషే దేవా వేరే ఎవరినైన పంపండి నన్నుకాదు అని చెబుతున్నాడు. దేవునికి కోపం వచ్చినప్పటికీ మోషే ఆత్మస్థైర్యం  లేదని అతనికి తోడుగా తన సోదరుడు ఆహారోనును తీసుకొని వెళ్ళమనిఅహరోను మోషే  తరపున మాటలాడుతాడు అని చెప్పాడు.

ఆహారోనుకు మోషే దేవుని సందేశమును తెలియజేయాలి అని చెప్పాడు.  విధంగా దేవుడు వారితో ఉండి వారు ఏమి చేయాలో వారికి నేర్పుతానని వారికి చెప్పడం జరిగినది. ఆహారోను ప్రజలకు ప్రతినిదిగా , ఉండాలి అని చెప్పాడు. దాని తరువాత మోషే తన మామ యిత్రో వద్దకు వచ్చి నేను నా చుట్టూ పక్కాలు ఎలా ఉన్నారో తెలుసుకొనవలయును నాకు సెలవిమ్ము అని అడిగిన వెంటనే యిత్రో వెళ్ళి రమ్మనీ చెప్పాడు. మోషే తన భార్యను పిల్లలను తీసుకొని ఐగుప్తు  బయలుదేరాడు. దేవుడు మోషేతో నీకు ఇచ్చిన శక్తులన్నింటిని ఫరో రాజు ఎదుట చూపమని చెప్పాడు. ఆహారోను మోషేను దేవుని కొండ వద్ద కలుసుకోగా ఇద్దరు కలసిపోయారు. 

 

మోషే ఐగుప్తుకు వెళ్ళుట మరియు పది రకాల అరిష్టములు 

మోషే ఆహారోనులు ఫరో వద్దకు వెళ్ళి యిస్రాయేలు దేవుడైన  యావే తన ప్రజలను అరణ్యములో ఉత్సవము జరుపుకొనుటకు పంపమని చెప్పారు కాని ఫరో ఎవరు ఆ యావే? అతడు నాకు ఎవరో తెలియదు నేను ఎందుకు ఆయన చెప్పినట్లు నేను ఎందుకు చేయాలి అని చెప్పారు. మోషే ఆహారోను వారిని పంపించకపోతే జరిగే అరిష్టముల గురించి చెప్పారు. కాని ఫరో వారి మాటను పెడ చెవిన పెట్టి మోషే ఆహారోను ను పంపివేశాడు. 

మోషే ఐగుప్తు వెళ్ళు సమయంలో ఆయన వయసు 80 సంవత్సరాలు మరియు ఆహారోను వయసు 83 సంవత్సరాలు. మోషే ఆహారోను మొదట వెళ్ళి ఫరోను కలసి తమ ప్రజలను ఏడారిలోనికి వెళ్ళి దేవుని పండుగ చేసుకొనుటకు అనుమతించాలని వారికి చెప్పాలని జరగడం జరిగినది. ఫరో అందుకు ఒప్పుకోలేదు. కనుక దేవుడు ఫరో ఎదుట మొదటి అద్భుతం చేశాడు. ఆహారోను మోషే చేతి కర్రను తీసుకొని నేల మీద వేయగానే అది పాముగా మారినది. ఫరో తన దగ్గర వున్న ఇంద్రజాలీకులు తమ వద్ద వున్న కర్రలను కింద వేయగానే అవి కూడా పాములుగా మారినవి. అపుడు దేవుడు ఎవరి శక్తి గొప్పది అని చూపించుటకు పూనుటకు ఆహారోను వేసిన కర్ర పాముగా మారి వారు చేసిన అన్నీ పాములను మింగివేసినది. దేవుని శక్తిని చూసిన తరువాత ఫరో మనస్సు రాయిలా మారిపోయి ఆయన యిస్రాయేలు ప్రజలను వెళ్లనివ్వలేదు. దీని తరువాత దేవుడు పది తీర్పులను ఐగుప్తు మీద చేయడం జరిగినది. ఏడు సంవత్సరాల వ్యవదిలో ఇది మొత్తము కూడా జరిగినది.

నీరు రక్తముగా మారుట

మోషీ తన వద్ద వున్న కర్రను తీసుకొని నీటిని కొట్టగా ఐగుప్తులోని నీరు మొత్తం రక్తం వలె మారిపోయింది. దానిలో చేపలు మొత్తం చనిపోయాడు. ఐగుప్తుయులు నీటిని తాగలేక పోయారు.  అక్కడి చెరువులు, కుంటలు, నదులు అన్నీ కూడా రక్తం వలె మారిపోయాయి. ఫరో యాజకులు కూడా అలానే చేయగలిగారు. కనుక ఫరో ప్రజలను పంపుటకు ఇష్ట పడలేదు.

కప్పలు

ఫరో ప్రజలను పోనివ్వకపోవడంవలన దేవుడు రెండవ ఉపద్రవాన్ని వారిమీదకు తీసుకురావడం జరిగినది. దేవుడు ప్రదేశాన్ని కప్పలతో నింపి వారికి ఇబ్బందిని కలుగచేశాడు. కప్పలు కుప్పలు కుప్పలుగా నదులలో నుండి బయటకు వచ్చేలా చేసి వారి ఇళ్ళల్లోనికి , పడక గదులలోనికి వెళ్ళి మనుషుల మీద పడేలా చేశాడు. ఇది చూసిన ఫరో, మోషే ఆహారోనులను పిలిచి దీనిని ఆపమని తరువాత వారిని పంపుతాను చెప్పడం  వలన కప్పలు మొత్తం చనిపోయేలా చేశాడు దేవుడు. కప్పలను అన్నింటినీ తీసుకురాగా అవి పెద్ద కుప్ప అయినవి. అది చూసిన ఫరో మరలా తన మనస్సును మార్చుకున్నాడు. కనుక దేవుడు మూడవ ఉపద్రవాన్ని తీసుకురావాలసి వచ్చినది.

దోమాపోటు 

దేవుడు అప్పుడు మోషేతో ఆహారోనును కర్రను చాచి దుమ్మును కొట్టమని కొడితే అది  ప్రదేశం మొత్తం దోమలు ఆవుతాయి అని చెప్పడం జరిగినది.అప్పుడు అవి మనుషులు జంతువుల మీదకు వస్తాయి అని చెప్పడం జరిగినది. అప్పుడు ఫరో ఇంద్రజాలీకులు కూడా అలానే చేయ ప్రయత్నించారు కానీ అలా చేయలేకపోయారు. అప్పుడు వారు ఇది దేవుని వ్రేలుతో చేయబడింది మేము చేయలేకపోయాము అని చెప్పడం జరిగినది. అయినప్పటికీ ఫరో వారు పోవడానికి ఒప్పుకోలేదు.

ఈగలు

ఇప్పుడు దేవుడు మరల వారి మీద ఒక ఉపద్రవం తీసుకు వచ్చేలా ఫరో ప్రవర్తించాడు. ఒక గుంపు ఈగలు ఐగుప్తు ప్రజల మీద మరియు వారి ఇళ్లలోనికి వెళ్ళి వారిని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టినవి. ఈగలు ఫరో అన్నీ ఇళ్లలోనికి అతని సేవకుల ఇళ్ళల్లోనికీ  నేల మొత్తం మీదకు వెళ్ళాయి. ఫరో మరల మోషేతో ఈగలను వెళ్లిపోయేవిధముగా చేయమని చెప్పగా మోషే అలానే చేస్తాడు కానీ ఫరోమాట మీద నిలబడకుండా యిస్రాయేలు ప్రజలను అక్కడ నుండి పోనియలేదు 

ఐగుప్తు పశువులకు రోగాలు

తీర్పులో ఐగుప్తు ప్రజల జంతువుల మీద ముఖ్యముగా ఆవులు గుర్రాలు గాడిదలు ఒంటెలు ఎద్దులు మరియు గొర్రెలు రోగంతో మరణించడం జరిగినది. అయినకాని ఫరో ప్రజలను పోనివ్వలేదు.

బొబ్బలు

తీర్పులో దేవుడు మోషేతో ఆహారోనుతో చెప్పమని ఆరోను తన పిడికిలి నిండా బూడిద తీసుకొని దానిని ఐగుప్తియుల వైపు చిమ్మమని చెప్పాడు. దానిద్వార వారికిబొబ్బలు వాపులు బొబ్బలు పగిలి గాయాలు వారికి వారి జంతువులకు కలుగుతున్నాయి. బొబ్బలు ఫరో ఇంద్రజాలకులకు కూడా వచ్చాయి. అయినప్పటికీ ఫరో వారిని ఐగుప్తు వదలి వెళ్లిపోనివలేదు.

వడగండ్లు

తీర్పులోదేవుడు ఐగుప్తులో భారీ వడగండ్ల వాన కురిసేలా చేశాడు.  బయట ఉన్న మనుషుల మీద మరియు జంతువుల మీద అవి పడ్డాయి. వాటితో పాటు దేవుడు అగ్నిని కూడ వచ్చేలా చేశాడు. దీనితోటి పంటలు, మొక్కలు బయట ఉన్న మనుషులు మరియు జంతువులు కూడా నాశనం అయాయి. ఇది చూసిన ఫరో అరిష్టమును మోషేతో దీన్ని ఆపివేయమని యిస్రాయేలు ప్రజలను పంపిస్తాను అని చెబుతారు. మోషే దేవునితో చెప్పి దానిని ఆపివేయిస్తాడు. కానీ ఫరో మనసు మార్చుకొని యిస్రాయేలు ప్రజలను పోనివ్వడు.

మిడుతలు

అరిష్టములో దేవుడు ఐగుప్తు నేల  మొత్తం మిడుతలు నిండేలా చేశాడు. ప్రజలు నేలను చూడలేనంతగా ప్రదేశం మొత్తం మిడుతలతో  నిండిపోయింది.   అరిష్టమును కూడా దేవుడు ఫరో యిస్రాయేలు ప్రజలను పంపివేస్తాను అనగానే ఆపివేస్తాడు కానీ ఫరో మరలా మనసు మార్చుకొని యిస్రాయేలు ప్రజలను పంపివేయడు.

చీకటి

తరువాత తీర్పులో దేవుడు మోషేతో తన చేతిని పైకెత్తమని చెప్పాడు. మోషే అలా  చేయగానే దేవుడు ఐగుప్తు మొత్తం చీకట్లు కమ్ముకొనునట్లు చేశాడు. చీకటి మూడు రోజులు ఉన్నది. ప్రజలు ఏమి చూడలేక పోయారు. ఎవరు వారి ప్రదేశం నుండి లేవలేకపోయారు.వారు ఉన్న ప్రదేశం నుండి ఒక అంగులము కూడా వారికీ కనపడనంత చీకటి వారు అనుభవించారు.  వారి ముందు ఏముందో ఎవరు తెలుసుకోలేకపోయారు.

తొలి చూలు బిడ్డల మరణం

అరిష్టములో మృత్యు దూత ఐగుప్తులో పుట్టిన ప్రతి తొలిచూలు బిడ్డను చనిపోయేలా చేశాడు. కానీ యిస్రాయేలు ప్రజల మాత్రం దీనినుండి తప్పించుకునేందుకుగాను ఐగుప్తులో ఉన్న యిస్రాయేలియుల తలుపుల మీద గొర్రె పిల్ల రక్తమును పూయమనీ చెప్తాడు. అపుడు అది చూసిన మృత్యు దూత ఇంటిలో ఉన్నవారిని వదలిపెట్టి మిగిలిన ఇళ్ళలో ఉన్నవారు చనిపోయేలా చేసింది. కేవలం మనుషుల మాత్రమే కాక జంతువులు తొలిచూలు పుట్టిన వాటిని కూడా చంపుతుంది. ఇది యిస్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి తీసుకొని పోవుటకు ఐగుప్తులో చేసిన చివరి అరిష్టం. దీని తరువాత ఫరో యిస్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి వెళ్లిపోవుటకు అంగీకరిస్తాడు. యిస్రాయేలు ప్రజలు ఐగుప్తులో 430 సంవత్సరాలు బానిసత్వం తరువాత ఐగుప్తు నుండి విముక్తి పొందారు.

ఎర్ర సముద్రమును చీల్చుట

తరువాత అద్భుతం చాల  నాటకీయంగా ఉంటుంది. యిస్రాయేలు ప్రజలు ఐగుప్తును వదలివెళ్లారు. ఫరో వారు వెళ్ళుటకు ఒప్పుకున్న తరువాత ఆయన మరలా తన మనసు మార్చుకున్నాడు. వారిని వెంటపడి మరలా వెనక్కు తీసుకురావాలి అనుకున్నాడు. అది చూసిన ప్రజలు మోషేతో చెప్పారు. వారు ఎర్ర సముద్రం ముందుకు రాగానే ఆగిపోయారు. అప్పుడు ఎక్కడకు వెళ్లాలో తెలియదు. ముందు చూస్తే సముద్రము ఉన్నది. అంత అగోచరముగా ఉన్నది. ముందుకు వెళితే సముద్రంలో మునిగిపోతారు. అక్కడే ఉంటే ఫరో సైనికులు వచ్చి మరల బానిసలుగా తీసుకుపోతారు. వారిని కాపాడుటకు ఇప్పుడు దేవుడే ఏమైనా చేయాలి. అప్పుడు మోషే వారితో వారికి ధైర్యం చెబుతూ భయపడవద్దు, ధైర్యముగ ఉండండి దేవుడు చూపబోయే రక్షణను చూడండి మీరు ఇప్పుడు చూసే ఐగుప్తుయులును మరలా మీరు చూడరు. దేవుడు మీకోసం యుద్దం చేస్తారు అని వారికి ధైర్యం చెప్పాడు. మోషే దేవునికి మొరపెట్టగా దేవుడు మోషేతో, నీవు నాకు మొరపెట్టుట ఎందుకు  నీ కర్రను తీసుకొని నీ చేతిని సముద్రము మీద చాచి దానిని పాయలుగా చీల్చుము యిస్రాయేలు ప్రజలు ఎండిన నేల మీద నుండి సముద్రం మధ్య గుండా వెళ్లిపోతారు అని చెప్పాడు. దేవుడు చెప్పినట్లు చేయగా సముద్రము రెండుగా చిలిపోయింది.  అప్పుడు  యిశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రము రెండుగా చీలిపోవడం చూసి దానిగుండా  పోవుట మొదలుపెట్టారు. సముద్రపు నీరు రెండు ప్రక్కల కూడా గోడవలే వారిని కాపాడినది. యిశ్రాయేలు ప్రజలు అందరు సురక్షితము చేరిన తరువాత దేవుడు మోషేతో నీ చేతిని సముద్రముపై చాపు రెండు బాగాలుగా ఉన్న సముద్రము కలసిపోతుంది,  ఐగుప్తు సైనికులు  రధములు అన్నీ సముద్రములో కలసిపోయారు.అప్పుడు మోషే మరియు ఇశ్రాయేలీయులు దేవుని పేరిట విజయ గీతము పాడి దేవుని స్తుతించారు. 

ఎడారిలో యిస్రాయేలు ప్రజలు 

రెల్లు సముద్రము దాటి షూరు అరణ్యమునకు వెళ్లారు. అక్కడ వారికి త్రాగుటకు నీరు దొరకలేదు. అక్కడ నుండి మారా వెళ్లారు. అక్కడ నీరు చేదుగా ఉండుట వలన ఆ నీటిని  త్రాగలేక పోయారు. మోషే దేవునికి మొర పెట్టగా దేవుడు అతనికి ఒక చెట్టును చూపించగా మోషే ఆ చెట్టును నీటిలో వెయ్యగా అవి తియ్యగా అయ్యాయి. అక్కడ నుండి ప్రజలు ఏలీము వెళ్లారు అక్కడ పండేడు నీటి బుగ్గలు ఉన్నాయి. ఎలిము సినాయి మద్యనున్న  సీను ప్రాంతము చేరిన తరువాత ప్రజలు మోషే ఆహారోనులను నిందించడం మొదలెట్టారు. మేము ఐగుప్తులో  ఉన్నప్పుడు  మేము మాంసం కడుపార తిన్నామని, ఇక్కడ ఆకలితో మాడి చనిపోతున్నామని ఇక్కడ మమ్ములను చంపుటకు ఇక్కడకు తీసుకొని వచ్చారా? అని అడిగారు. అప్పుడు దేవుడు వారి మాటలను విని యావే తేజస్సు మేఘము నందు కనపడి  మోషేతో వారు ప్రొద్దుగ్రూంకునప్పుడు మాంసమును తెల్లవారు రొట్టెను కడుపార తినుదురు అని వారికి చెప్పాడు. అప్పటి నుండి ఉదయమున ఎడారి నేలమీద నూగు వంటి సన్నని పొడిగా మోషే మీరు తినుటకు దేవుడు ఇచ్చిన ఆహారము అని చెప్పాడు. దానికి మన్నా అని పేరు పెట్టారు. అలానే సాయం కాలము పూరెడు పిట్టలు వచ్చి వారి విడుదలను కప్పి వేసేవి. మన్నాతో   ఒమెరు పట్టు పాత్రను నింపి మోషె  ఆజ్ఞ ప్రకారం భద్రపరిచారు. ఆ పాత్రను నిబంధన మందసము ఎదుట ఉంచారు. యిస్రాయేలు ప్రజలకు నీరు దొరకక మోషేతో మాకు నీరు చూపించమని జగదమాడారు అప్పుడు మోషేతో దేవుడు నీవు కర్రను తీసుకొనినేను హోరెబు కొండల రాతిమీద నిలబడి ఉంటాను నీవు రాతిని కొట్టుము వెంటనే ఆ రాతి నుండి త్రాగుటకు నీరు వస్తాయి అని చెప్పాడు. మోషే దేవుడు చెప్పినట్లుగా చేసెను. 

మోషే  పది ఆజ్ఞలు పొందుట

ఎడారిలో యిస్రాయేలును పరీక్షిస్తున్నప్పుడు దేవుడు మొదటిగా చూడాలను కున్నది దైవ ప్రజలు దేవుని ఆజ్ఞాలు పాటించగలరో లేదో తెలుసుకోవాలనుకున్నారు. కనుక తన ఆజ్ఞలు మొత్తం యిస్రాయేలు ప్రజలు ఎలా పాటిస్తారో పరీక్షించారు.

ఐగుప్తునుండి బయటకు వచ్చిన మూడు నెలలకు దేవుడు మోషేతో నేను నీతో సీనాయి పర్వతం మీద తన ప్రజల సమక్షంలో కలుస్తాను అని చెబుతాడుదేవుడు వచ్చినప్పడు సినాయి పర్వతం మొత్తం పొగతో కప్పబడింది. అప్పుడు మెరుపులు, ఉరుములు దట్టమైన పొగ పర్వతం మొత్తం దగదగ మెరిసింది.

దేవుడు సినాయి పర్వతం మీదకు అగ్నిలో వచ్చాడు. అప్పుడు దట్టమైన పొగ పర్వతం మీద నుండి పైకి వెళుతుంది. దేవుడు మోషేను మాత్రమే పర్వతం మీదకు రమ్మని చెప్పాడు. అప్పుడు దేవుడు మోషేకు పది ఆజ్ఞలు ఇవ్వడం జరిగినది. ఇవి యిస్రాయేలు ప్రజలు పాటించాలని, వాటికి కట్టుబడి ఉండాలని  దేవుడు కోరాడు. దాని తరువాత మోషే వీటిని ప్రజలకు తెలియపరచడానికి కిందకు వచ్చాడు. మరల వెంటనే దేవుడు మోషేను పిలువగా పర్వతం మీద మోషే 40  రోజులు పర్వతం మీదనే ఉన్నాడు. దేవుడు పర్వతం మీద దహించివేసే విధంగా ఉన్నది.

రెండవ సారి దేవున్ని మోషే కలసినప్పుడు దేవుడు మోషేకు ఎలా దివ్య మందసాన్ని ఎలా కట్టాలి అని చెప్పాడు. ఇక్కడ దేవుని సాన్నిధ్యం ఎలా దేవుడు యిస్రాయేలు ప్రజలతో 40 సంవత్సరాలు వీరితో ఉండుటకు సిద్దపడటం జరిగినది. దేవుడు రెండవ సారి మోషేను కలిసినప్పుడు పది ఆజ్ఞలు ఇచ్చాడు.

మోషేకు రెండు రాతి పలకలమీద రెండు ప్రక్కల రాయబడ్డాయి. పలకల మీద దేవుని  చేతితో రాయబడినవి.  మోషే మాత్రమే దేవునితో మాటలాడటానికి, ఉండటానికి 40 రోజులు, పగల్లు ఉన్నారు. ఇంత గొప్ప విషయం ఇక్కడ జరుగుతుంటే పర్వతం క్రింద మాత్రం  ఘోరమైన పని జరుగుతుంది. యిస్రాయేలు ప్రజలు పర్వతం క్రింద అసహనంతో మోషే క్రిందకు రాలేదని గొణుగుకుంటూ ఆయనకు ఏమి అయ్యిందో అసహనంతో ఊగిపోయారు.

వారు ఒక  బంగారపు దూడను చేసి దానిని ఆరాధించడం ప్రారంభించారు. దేవుడు పర్వతంపై నుండి కోపబడ్డాడు. దేవుడు ప్రజలను మొండివారని వారిని సంహరిస్తానని చెప్పాడు. దేవుడు మోషేతో నేను నీ నుండి గొప్ప జాతిని ఏర్పాటు చేస్తాను అని చెప్పాడు. కాని మిగిలిన యిస్రాయేలు ప్రజలను బంగారపు దూడను ఆరాధించిన సంహరించబోతున్నాను అని చెప్పాడు.

సమయంలో మోషే దేవునితో ప్రజలను చంపవద్దని వాదించగ దానికి దేవుడు ఒప్పుకున్నాడు. మోషే క్రిందకు దిగిరాగా అక్కడ ప్రజలు పాటలతో మరియు నృత్యంతో బంగారు దూడ చుట్టు ఉండుట చూచి మోషే కోపోదృగ్తుడయ్యాడు. అప్పుడు తన చేతిలో ఉన్న దేవుని అజ్ఞాలను రాసి ఉన్న రెండుపలకలను విసిరివేయగా అవి ముక్కలుగా పగిలిపోయాయి. మోషే వారు చేసిన దూడను తీసుకొని దానిని కాల్చి పిండి చేసి నీటిలో పోసి యిస్రాయేలు ప్రజలు దానిని తాగేలా చేశాడు. బంగారు దూడను పాడు చేసిన తరువాత మోషే ప్రజల ముందుకు వచ్చి వారిని దేవుని వైపు లేక వారి ప్రక్కనే ఉంటారో నిర్ణయించుకోమన్నాడు. అప్పుడు అందరు ఎవరి వైపు ఉండాలో నిర్ణయించుకున్న తరువాత మోషే దేవుని వైపు కాని వారిని అక్కడే అప్పుడే చంపబడాలని ఆదేశించాడు. ఆరోజు 3000 మంది వారు దేవుని మీద చేసిన తిరుగుబాటుకుగాను మరణించాడు.

అప్పుడు మరల మోషే సినాయి పర్వతం మీదకు వెళ్ళగా దేవుడు మరల రెండు రాతి పలకలను పగిలిపోయిన వాటికి బదులుగా ఇచ్చాడు. మోషే దేవుని సాన్నిధ్యాన్ని చూచుటకు అనుమతించబడ్డాడు. తరువాత దేవుడు తనను చూచుటకు అనుమతి ఇచ్చాడు.  మోషేతో దేవుడు నీవు నా ముఖమును చూడవచ్చు అని చెప్పాడు.

ఇక్కడ ఒక స్థలం మీద రాయి ఉన్నాది దానిమీద నీవు ఉండుము నా మహిమ పోవుచున్నప్పుడు నిన్ను నేను రాతి చివరన ఉంచుతాను అని చెప్పాడు. నేను నిన్ను నా చేతితో కప్పుతాను. నేను నా చేతిని తీసినప్పుడు నీవు నా వెనుక భాగం చూడవచ్చును  కానీ నా ముఖము కనబడదు అని చెప్పాడు. ఇది మోషేకు దేవుని గురించి ఉన్న అనుభవం. దేవుడు మోషేను తన మహిమను చూచుటకు అనుమతించాడు. మానవుడు పాపం చేసిన తరువాత దేవుడు మానవునికి ఇచ్చిన  అతి గొప్ప బహుమానం మోషే పొందాడు. దేవుని చూడగలిగాడుమోషే దేవున్ని ప్రత్యక్షంగా చూసిన తరువాత అతను కొండ దిగి క్రిందకు రాగానే అతని ముఖ శరీరము మెరిసిపోయింది. ప్రజలు ఆయన దగ్గరకు రావడానికి కాంతికి  భయపడ్డారు. మోషే తన ముఖమునకు ఒక గుడ్డను అడ్డుపెట్టుకోవలసివచ్చింది.

దివ్య మందసము

యిస్రాయేలు ప్రజల నాలబై సంవత్సరాల ఎడారి ప్రయాణంలో ఒక గొప్ప కట్టడం ఏమిటి అంటే దివ్యమందసం. దివ్య మందసము దేవుని సాన్నిధ్యమును తెలియజేస్తుంది. దేవుడు మోషేకు దివ్యమందసమును ఎలా కట్టాలో తెలియజేశాడు. దివ్యమందసము కట్టిన తరువాత ఒక మేఘము మందసమును పగలు కమ్మివెయ్యగా, అగ్ని దర్శనము రాత్రి మందసమును కమ్మివేసేది. అలా దేవుడు యిస్రాయేలును  దేవుడు 40 సంవత్సరాలు  పగలు మేఘమువలె రాత్రి ద్వీపస్తంభం వలె నడిపించాడుమేఘము దివ్య మందసము పైనుండి వెళుతుందో అప్పుడు యిస్రాయేలు దానీవెంట ఎక్కడకు వెళుతుందో అక్కడకు వెళ్ళి వుండేవారు. మేఘం మందసము మీద ఉన్నంత వరకు వారు అక్కడే ఉండేవారు.

గూడాచారులు తిరిగి వచ్చుట

40 సంవత్సరంప్రయాణం మొదటిలో దేవుడు ప్రజలను వాగ్ధాత్త భూమికి దగ్గరకు తీసుకురావడం జరిగినది. యిస్రాయెలియులు 12 మందిని భూమిని పరీక్షించడానికి పంపిందిపన్నెండు మంది గూడచరులలో పదిమంది కనానును వశపరచుకోవడం సాధ్యం కాదు అని చెప్పగా  కాలేబ్ వారితో అక్కడకి వెళ్ళి దానిని వశపరుచుకుందాము అని చెప్పాడు. దేవుడు గూడాచారులు ఇచ్చిన సమాచారంతో దేవుడు సంతృప్తి చెందలేదు. వారు దేవుడు చేసిన అనేక గొప్ప కార్యములు చూసిన కానీ వారు దేవున్ని విశ్వాసించలేదు. కనుక దేవుడు వీరు అందరు వాగ్ధాత్త భూమిని చేరరు కానీ కాలేబు మరియు ఆయన సంతతి వారు వాగ్ధాత్త భూమిలో ప్రవేశిస్తారు అని చెప్పాడు.  ఆదేవిధముగా 20 సంవత్సరాల వయసు దాటిన వారు ఎవరు భూమిలోనికి ప్రవేశించారు ఎందుకంటే వారు నన్ను అనుసరించలేదు అని దేవుడు చెప్పాడు.

కనుక యోహొషువా మరియు కాలేబు 20 సంవత్సరాల లోపు యువతరాన్ని నడిపించవలసినవారు. వారు విజయవంతముగా వారి పెద్దవారు చూసిన భారీకాయులను జయించుకుంటూ వచ్చారు. ఇరవైసంవత్సరాలు మరియు పైన కలిగిన వయసుకలవారు అందరు ఎడారిలో దేవుని యందు విశ్వాసం ఉంచక నలబై సంవత్సరాల కాలంలో మరణించారు. పది ఉప ద్రవాల ద్వారా వీరిని ఐగుప్తు నుండి తీసుకువచ్చి  , సముద్రమును రెండుగా చీల్చిన దేవుని మహిమను చూసిన కానీ వారు దేవుడు వారికి భూమిని ఇస్తాడు అని నమ్మలేదువీటన్నింటిలో ఆశ్చర్యమైన విషయం ఏమిటి అంటే ఒక్కరు కూడా 20 సంవత్సరాలు ధాటినవారు పరీక్ష ఉత్తీర్ణులైనవారు లేరు.

మోషే మరణం

మోషే జీవితంలో చాలా విషాదాకారమైన విషయం ఏమిటి అంటే మోషే వాగ్ధాన భూమిలోనికి అడుగు పెట్టలేదు. మోషే 120 సంవత్సరాల వయసులో నేబో కొండ వద్ద మరణించాడు. ఆయన వాగ్ధాన భూమికి వెళ్లకపోవడానికి కారణం మెరిబా కాదేశ్  నీటి వద్ద దేవుని మాటను యిస్రాయేలు ప్రజల   ముందు మీరాడు. ఇక్కడా మోషేతో దేవుడు  రాతితో  ప్రజల సమక్షంలో మాటలాడి దాని  నుండి ప్రజలకు మరియు జంతువులకు నీటిని ఇస్తుంది అని చెప్పాడు. కానీ మోషే రాతిని కోపంతో బాదాడు. 


సమూయేలు చరిత్ర

 సమూయేలు చరిత్ర  సమూవేలు  పవిత్ర గ్రంధంలో ఉన్న న్యాయాధిపతులలో చివరి  న్యాయాధిపతి మరియు న్యాయాధిపతులో ఎక్కువ కాలం జీవించినవాడు. యిస్రాయేలు చర...