పేజీలు

13.3.23

క్రీస్తు పునరుత్థాన మహోత్సవం

 

 క్రీస్తు పునరుత్థాన మహోత్సవం 


ప్రియమైన మిత్రులారా!అందరికి క్రీస్తు పునరుత్థాన మహోత్సవ శుభాకాంక్షలు. మానవ రక్షణ చరిత్రలో అంత్యంత ముఖ్యమైన పండుగ ఇది. ఇది మరణం మీద యేసు ప్రభువు యొక్క విజయం. సృష్టి ఆరంభం నుండి ఒకే ఒక సమాధి తెరువబడి ఖాళీగా ఉండి,  అక్కడ సమాధి చేయబడిన వ్యక్తిని ఆ సమాధి  బందించి అక్కడ ఉంచలేక పోయింది అని తెలుపుతుంది . ఆ సమాధి ఆయనను భందించలేక పోయింది. అందుకే పునీత పౌలు గారు మరణాన్ని అడుగుతున్నారు, మరణమా నీ విజయం ఎక్కడ ? భాదించగల నీ ముల్లు ఎక్కడ ? 1 కోరింథీ15 :55  అందరు నీకు దాసులే అని విర్ర వీగినా నీ గర్వం ఎక్కడ? అని అడుగుతున్నారు. 

ఈ రోజు మనందరికీ ఆనందించే రోజు? ఎందుకంటే యేసు ప్రభువు మరణాన్ని జయించాడు. మరణానికి ఆయన మీద ఎటువంటి అధికారం లేదు, అని నిరూపించాడు. అంతే కాదు ఆయన వలె మనం కూడా, ఒక రోజు మరణం నుండి లేవవచ్చు అని నిరూపించాడు. తన శ్రమలు, మరియు మరణం యొక్క  ఫలితం ఈ రోజు మనకు చూపించాడు. 

ఈ పునరుత్థానం ఆయన కొరకు కాదు మన కొరకు ఆయన దేవుడై ఇన్ని బాధలు , కష్టలు ఎందుకు అనుభవిస్తున్నారు? దాని ఉపయోగం ఏమిటి ? అని మనం ప్రశ్నిస్తే ? మనకు వచ్చే జవాబు యేసు ప్రభువుని పునరుత్థానం. యేసు ప్రభువు మాత్రమే మరణాన్ని జయించినవాడు, మనకు కూడా అటువంటి స్థితిని తీసుకురాగలడు , అందుకే యేసు ప్రభువు నా ప్రాణమును ధారపోయగలను మరియు మరల  నేను దానిని తీసుకోగలను అని అంటున్నాడు. యోహను 10: 18 . మరణానికి ఆయన మీద ఎటువంటి శక్తి లేదు. ఆయనను అది బందించలేక పోయింది. మరణానికి తలవంచి కాదు ఆయన మరణించినది, అది తనని ఏమి చేయలేదు అని నిరూపించడానికి. 

గొప్ప గొప్ప వారు పుట్టారు, కొన్ని మత స్థాపకులు కూడా పుట్టారు, దేవునిగా కోనియాడబడ్డారు. కానీ సమాధిని గెలవలేక పోయారు, మరణాన్ని గెలవలేక పోయారు, అందరు మరణానకి దాసులుగా మిగిలిపోయారు.  యేసు క్రీస్తు మాత్రమే మరణాన్ని గెలిచాడు నిజానికి క్రైస్తవులకు మిగలినవారికి ప్రధానమైన వ్యత్యాసం ఇక్కడే వుంది. మరణంతో జీవితం ముగుస్తుంది ,ఇతరుల తత్వాలలో, కానీ మనకు యేసు క్రీస్తు మరణాన్ని జయించి మనం అమరులం కావచ్చు అని  చూపించారు. ఆయన తన శిష్యులకు ఎప్పుడు చెబుతూనే ఉన్నాడు, నేను శ్రమలుపొంది, మరణించి అటుతరువాత పునరుత్థానం అవుతాను అని, కానీ వారికి అంతగా అర్ధం కాలేదు. శిష్యులు ఆ మాటలకు అంత ప్రాముఖ్యత ఇవ్వలేదు , కానీ క్రీస్తు పునరుత్థానం లేకపోతే అంతా వ్యర్ధమే, ఆయన భోద , ఆయన మాటలు, ఆయన స్వస్థతలు ఇవి అన్నీ తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఇచ్చేవిగా మిగిలిపోయేవి, అందుకే క్రీస్తు పునరుత్థానం క్రైస్తవ విశ్వాసానికి మూలం. పునీత పౌలు గారు యేసు ప్రభువు యొక్క పునరుత్థానం గురించి అంతరూఢిగా ఉన్నారు కాబట్టి అంటున్నారు, యేసు క్రీస్తు మరణాన్ని జయించకపోయి ఉన్నట్లయితే మన విశ్వాసం వ్యర్ధం అంటున్నారు. 1 కోరింథీ 15:17  . ఆయనను శిష్యులు మాత్రమే కాదు పౌలు గారు కూడ ఆయన అనుభూతిని పొందారు. 

క్రీస్తు పునరుత్థానము శిష్యులకు ఆనందాన్ని ఇస్తుంది. ధైర్యాన్ని ఇస్తుంది. ఎవరు ఈ శిష్యులు? చాల పిరికివారు, ఒక చిన్న పిల్లకు కూడా భయపడి అబద్దం చెప్పే ఆంతటి పిరికివారు, అంతేకాదు, ప్రతి విషయానికి భయ పడేవారు ,ఆయన సముద్ర అలలు చూసి భయ పడేవారు పకృతిని చూసి బయ పడేవారు, మనుషులను చూసి భయ పడే వారు అటువంటి వారు , హఠాత్తుగా ధైర్య వంతులు అవుతున్నారు. ఈ ధైర్యం క్రీస్తు విజయం ఇస్తుంది. అందుకే పేతురు గారు అంటున్నారు, చిన్న పిల్లలకు కూడా భయ పడే పేతురు గారు యూదయ పెద్దల ముందు యేసు ప్రభువు కోసం మేము మరణించడానికి కూడా సిద్ధం అని అంటున్నారు. కారణం ఒక్కటే నేను నమ్మే క్రీస్తు మృత్యుంజయుడు, మరణం ఆయనను ఏమి చేయలేదు, నాకు వీరు ఇవ్వగలిగే అతి పెద్ద శిక్ష మరణం, కానీ దాని మీద నేను కూడా విజయం పొందుతాను, ఎందుకంటే యేసు ప్రభువు నాకు దానికి సాదించి పెట్టాడు. 

ఈ లోకంలో  ఎవరు చనిపోవాలని కోరుకోరు. ప్రతి ఒక్కరు జీవించాలనే కోరుకుంటారు. కానీ అందరు చనిపోవాలి. ఎవరు మరల జీవంతో రాలేదు. ఎల్లప్పుడు జీవించాలనే ఈ కోరిక నేరవేరదు. కానీ ఈ రోజు  క్రీస్తు పునరుత్థానం  మనకు నిత్య జీవం మీద నమ్మకం కలుగ జేస్తుంది. యేసు ప్రభువు యోహను సువిశేషంలో అనేక సార్లు దీని గురించే భోదించారు. యోహను సువిశేషం ముఖ్య సారంశం ఎవరైతే  యేసు ప్రభువును విశ్వసిస్తారో వారికి ఆయన ఇచ్చే భాగ్యం నిత్య జీవితం. కనుక ఆయనను నమ్మే మనం మరణాన్ని జయించగలం. 

ఈరోజు యేసు ప్రభువు కేవలం మరణం మీద మాత్రమే విజయం సాధించలేదు, పాపం మీద కూడా విజయం సాధించారు. ఎందుకంటే దేవుని వాక్యంచెబుతుంది.  పాప ఫలితం మరణం అని చెబుతుంది. పాపాన్ని ఆయన మరణంతో తీసివేశాడు. 

ఇది సాతాను మీద కూడా విజయము. సాతాను మనలను ఎప్పుడు కూడా నరకంలోనే ఉండాలను కుంటుంది. అటువంటి సాతానుకు ఈ రోజు అపజయం. ఆవిధేయత వలన వచ్చిన పాపాన్ని యేసు ప్రభువు విధేయత వలన సాతానును ఓడించాడు. 

మృతులనుండి యేసు ప్రభువు లేవడం మనము కూడా ఒక రోజు మరణం నుండి  లేస్తామనే  ఒక నమ్మకం ఇస్తుంది. దీనిని ప్రతి సారి మనం విశ్వాస ప్రమాణంలో చెబుతూనే ఉన్నాం. కనుక ఆయనను విశ్వసిద్దాం నిత్య జీవితానికి సిద్ధ పడుదాం. ఆమెన్ 

Fr. Amruth 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

సమూయేలు చరిత్ర

 సమూయేలు చరిత్ర  సమూవేలు  పవిత్ర గ్రంధంలో ఉన్న న్యాయాధిపతులలో చివరి  న్యాయాధిపతి మరియు న్యాయాధిపతులో ఎక్కువ కాలం జీవించినవాడు. యిస్రాయేలు చర...