పేజీలు

28.1.24

మోషే జీవిత చరిత్ర

మోషే జీవిత చరిత్ర 

మోషే అంటే నీటి నుండి తీసుకొనబడిన వాడు. మోషే అమ్రాము యోకెబెదుల చిన్న కుమారుడు. హెబ్రీయుల గొప్ప నాయకుడు  మరియు ధర్మ శాస్త్రమును ప్రజలకు ఇచ్చినవాడు. యిస్రాయేలీయుల నాశనమును  ఐగుప్తు రాజు నిర్ణయించిన సమయంలో పుట్టిన వాడు,  యిస్రాయేలీయుల కుటుంబాలలో పుట్టిన మగ బిడ్డలను సంహరించాలని రాజు  నిర్ణయించిన కాలంలో పుట్టి దేవుని కృపతో ఆ విపత్తు నుండి తప్పించుకున్నవాడు. మోషేను కూడా చంపుతారు అని అతని తల్లిదండ్రులు భయపడ్డారు. ఒక బుట్ట తీసుకువచ్చి అతనిని  దానిలో పెట్టి నీటిలో వదిలారు. ఫరో కూతురు మోషేను నీటి నుండి కాపాడి అతనికి మోషే అనే పేరు పెట్టి ఆయనను దత్తత తీసుకుంది. ఫరో కూతురు  కుమారుడిగా, యువరాజుగా ఆయన అన్ని విద్యలలో నేర్పరి అయ్యాడు.  

మోషే గొప్పతనం గురించి ఎంత చెప్పిన అది తక్కువే అవుతుంది. ఆయన చరిత్రకారుడిగా , నాయకునిగా, రాయబారిగా, శాసనకారుడిగా, దేవునికి మానవునికి మద్యవర్తిగా, సంప్రదాయ దేశభక్తునిగా నిర్వహించిన భాధ్యతలు ఆయన గొప్ప వ్యక్తిత్వాన్ని తెలుపుతాయి. దేవుని యొక్క స్నేహితునిగా ఆయన పిలువబడ్డాడు. ఈయన 120 సంవత్సరాలు జీవించాడు. మొదటి 40 సంవత్సరాలు ఐగుప్తులో గడిపాడు. తరువాత అక్కడ నుండి పారిపోయి మిదియాలో అనామకునిగా జీవించాడు. అక్కడ నుండి 40 సంవత్సరాలు దేవుని రాయబారిగా ప్రజలను నడిపాడు. 

మోషే ఒక లెవీయ కుటుంబంలో జన్మించాడు. అప్పటి సామాజిక పరిస్తితులు ఐగుప్తులో  యిస్రాయేలియుల పట్ల కఠినంగా ఉండేటువంటి రోజులు. మోషే జన్మించిన తరువాత మూడు నెలలు, తన తల్లి అతనిని ఎవరికి కనపడకుండా దాచినది. మోషేను  ఐగుప్తియుల కంటపడకుండా చేయడం కష్టం అవుతుంది. అటువంటి పరిస్తితులలో ఒక బుట్టను కొని దానిలో మోషేను పడుకోబెట్టి నైలునది ఒడ్డున వదలి పెట్టారు. ఆ పెట్టెను మోషే అక్క అక్కడే ఉండి అది ఎక్కడకు వెళుతుందో చూస్తూఉండిపోయింది.  అప్పుడు ఫరో కూతురు స్నానం చేయుటకు అక్కడకు వచ్చి ఆ బుట్టను చూసి తన దాసీలతో ఆ బుట్టను తెప్పించి దానిలో ఉన్న పిల్లాడిని చూచి జాలిపడి తీసుకున్నది.  అది మొత్తం అక్కడ ఉండి  చూస్తున్న మోషే అక్క ఆమె దగ్గరకు వచ్చి ఆ పిల్లవాడి అలనా పాలనా చూసుకోవడానికి హెబ్రీయ స్త్రీ కావాలా? అని అడిగింది. అందుకు ఆమె ఒక స్త్రీని తీసుకురమ్మని  చెప్పింది. అప్పుడు ఆ బాలిక వెళ్ళి మోషే తల్లిని తీసుకొని  వచ్చింది. అప్పుడు ఆమె మోషే తల్లితో, ఆ పిల్లవాడిని తనఇంటికి తీసుకొని వెళ్ళింది. ఆ బాలుడికి కావలసినవన్నీ  ఫరో కూతురు సమకూర్చింది. 

కొన్నాళ్ళ తరువాత ఆ పిల్లవాన్ని ఫరోకూతురు దగ్గరకు తీసుకు వెళ్ళి ఆమెకు అప్పగించింది. అప్పటినుండి ఆమె పెంపుడు కొడుకుగా జీవించాడు. అతనికి ఆమె మోషే అని పేరు పెట్టింది, మోషే అంటే నీటి నుండి తీయబడినవాడు అని అర్ధం. మోషే పెరిగి పెద్దవాడయిన తరువాత హెబ్రీయులు పడుతున్న కష్టాలు స్వయంగా చూశాడు. హెబ్రీయులు అంటే అతనికి సానుభూతి  ఏర్పాడింది. ఒక రోజు ఐగుప్తుకు చెందిన ఒక వ్యక్తి హెబ్రీయున్ని అకారణంగా కొట్టుతుండగా చూచి, కోపంతో వాడిని కొట్టగా వాడు చనిపోయాడు. తరువాత కొన్ని రోజుల తరువాత ఇద్దరు హెబ్రీయులు కొట్టుకొనుచుండగా చూసి, ఒకరి తప్పు తెలుసుకొని వానితో ఎందుకు నీ తోటి వాడిని అకారణంగా కొడుతున్నావని వాడిని వారించాడు. అందుకు వాడు ఐగుప్తియుడిని చంపినట్లు నన్ను చంపచూచుచున్నవా అని అడిగాడు. తాను చేసిన పని అందరికీ తెలిసింది అని గ్రహించాడు. 

అప్పటికే ఈ విషయం ఫరోకు తెలిసింది అని తనను చంపుతారెెమో అని మోషే, మిద్యాను దేశము పారిపోయి అక్కడ బావి వద్ద కూర్చొని ఉన్నాడు. మిద్యాను దేశపు యాజకునికి  ఏడుగురు కుమార్తెలు ఉన్నారు. వారు ఆ బావి వద్దకు నీరు తొడుకొనుటకు వచ్చారు. వారిని కొంత మంది యువకులు వారిని తరిమివేశారు. కాని మోషే వారి తరుపున ఉండి వారి మందలకు నీళ్ళు పెట్టారు. అపుడు వారు తమ తండ్రి రవూవేలు వద్దకు వెళ్ళగా ఆయన వారిని అంత పెందలకడన ఎలా వచ్చారు అని  అడగగా, వారు ఐగుప్తుదేశీయుడు వారిని గొర్రెల కాపరుల  నుండి కాపాడాడని  మరియు అతనే నీళ్ళుతోడి మందలకు పోశాడు అని చెప్పగానే అందుకు వారి తండ్రి ఆయన ఎక్కడ ఉన్నాడు? ఎలా ఆయనను అక్కడే వదలి వచ్చారు మనతో భుజించుటకు తీసుకురమ్మని కుమార్తెలతో చెప్పాడు. అలా మోషే రవూవేలు వద్ద ఉండి ఆయన కుమార్తె సిప్పోరాను పెండ్లి చేసుకున్నాడు. ఆమెకు బిడ్డ పుట్టగా ఆ బిడ్డకు గెర్షొము అని పేరుపెట్టారు. దాని అర్ధం పరదేశి. 

మోషేకు పిలుపు 

ఐగుప్తులో యిస్రాయేలు ప్రజలు బానిసలుగా మ్రగ్గుతు, సహయం కొరకు ఆక్రందన చేయగా అది దేవుని చెవినపడింది. దేవుడు అబ్రహాము, ఈసాకు యాకోబులతో చేసుకొనిన ఒడంబడిక గుర్తుకు తెచ్చుకొని వారిని కరుణించాడు.  మోషేకు తన మామ మిధ్యాను యాజకుడు యిత్రో మందలను మేపేవాడు అప్పుడు ఒకసారి మందను తొలుకొని హోరెబు కొండమీదకు వచ్చాడు. అక్కడ ఒక పొందనుండి వచ్చు నిప్పుమంట రూపములో యావేదూత ఆయనకు సాక్షాత్కరించినది. మోషే కన్నులేత్తి చూడగా అక్కడ ఒక పొద  మండుచున్నది కాని పొదమాత్రము కాలిపోవడం లేదు. అది చూసిన మోషే, నేను దగ్గరకు వెళ్ళి అది ఏమిటో చూడాలి అని అనుకున్నాడు. ఆ పొద దగ్గరకు వెళ్ళగా పొద నుండి ఒక స్వరము మోషే మోషే అని పిలవగా చిత్తము ప్రభూ అని  చెప్పాడు.   అప్పుడు దేవుడు దగ్గరకు రాకుము. చెప్పులు విడవుము. నీవు నిలుచున్న ఈ తావు పవిత్ర భూమి, నేను మీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను, ఈసాకు దేవుడను యాకోబు దేవుడను అని చెప్పాడు.  మోషే దేవున్ని చూచుటకు భయపడి ముఖము కప్పుకున్నాడు. దేవుడు ఐగుప్తులో ఉన్న తన ప్రజలు అనుభవించే బాధలు చూశానని, వారి దాస్యం నుండి వారిని భయటకు తీసుకురావాలని నేను అందుకే క్రిందికి దిగివచ్చను అని చెప్పాడు. ఐగుప్తు నుండి నా ప్రజలను తీసుకొని రావడానికి నిన్ను ఫరో రాజు వద్దకు  పంపుదును అని చెప్పాడు. అందుకు మోషే ఫరో రాజు వద్దకు వెళ్ళుటకు నేను ఎవ్వడను అని అన్నాడు. దేవుడు మోషేతో నేను నీకు తోడై ఉందును అని చెప్పాడు. 

"ఉన్నవాడు"

మోషేకు దేవుడు యిస్రాయేలీయులతో వారి పూర్వీకుల దేవుడనని చెప్పమని చెబుతున్నాడు. యావే వారి పితరుల దేవుడనిఆయన అబ్రహాముఈసాకు మరియు  యాకోబుల దేవుడని  ప్రకటిస్తున్నాడు. అపుడు మోషే దేవునితో ఆ ప్రజలు  నన్ను ఆ దేవుని పేరు ఏమి అని అడిగినచో నేను ఏమి చెప్పవలయును అని అడిగాడు. దానికి దేవుడు సమాధానం ఇస్తూ "నేను ఉన్నవాడను" ఉన్నవాడు నన్ను మీ వద్దకు పంపించాడు అని చెప్పుము అని అన్నాడు. మోషే, దేవుడు వారిని విమోచించి,వాగ్ధత్త భూమికి తీసుకొనిరావడం జరుతుందని ప్రకటించాలి.ఇంకా మోషేతో దేవుడు  వెళ్ళి ఫరోను కలవమని చెప్పాడు. ముందుగా మోషే వెళ్ళి ప్రజలనుకలిసి  దేవుడు చెప్పిన మాటలును  తెలియజేసి వారిని ఐగుప్తు నుండి  దేవున్ని ఆరాధించుటకుబయటకు బయటకు తెచ్చి వారిని విమోచించాలి. మోషేతో  దేవుడు, ఫరో అతని మాటను వినివెంటనే ప్రజలను ఐగుప్తు నుండి పంపివేయాడు అని తెలియజేశాడు. ఐగుప్తులో ఉన్న యిస్రాయేలు ప్రజలను పంపించకపోతే దేవుడు హస్తము చాచి ఐగుప్తుకు  అనేక అరిష్టములతో చేయబోయే నష్టమును తెలియజేయాలి. దాని తరువాతనే యిస్రాయేలు ప్రజలను ఫరో అక్కడ నుండి పంపుతాడు అని తెలియజేశాడు. 

దేవుని నుండి ఇవి మొత్తం విన్న తరువాత కూడా మోషే దేవునీతో  వీటి గురించి మరలా  ప్రశ్నిస్తాడు. ఒక వేళ వారు నా మాటను నమ్మకపోతేలేక నా మాటను వినక దేవుడు నీకు దర్శనము ఇవ్వలేదంటే  అని దేవుడిని ప్రశ్నించాడు. అప్పుడు దేవుడు ఒక అద్భుతంతో మోషేకు  సమాధానం చెప్పాడు. మోషేతో దేవుడు, చేతి కర్రను తీసుకొని నేల మీద కొట్టమని చెప్పగా  అతడు అలానే చేస్తాడు. అప్పుడు  కర్ర పాముగా మారుతుంది. అప్పుడు దేవుడు  పామునుతోకపట్టుకోమని చెబుతున్నాడు. మోషే అలా చేయగానే అది మరలా కర్రలా మారిపోయింది. నీవు ఇక ఇట్లే చేయుము. దానిని చూసిన తరువాత వారు నమ్ముతారు అని చెప్పాడు. తరువాత మోషేను దేవుడు తన వక్షస్థానమునచేయి  పెట్టి వెనుకకు తీసుకోమని  చెప్పగా ఆయన అలానే చేశాడు. అపుడు  చేయి వెంటనే  కుష్టు రోగముతో మంచు వలే తెల్లగా   మారింది. దానిని బయటకు తీయగానే మరలా అది మామూలు చేయిగా మారుతుంది. ఈ విధముగా మోషేకు అధ్బుతాలు చేసే శక్తిని ఇచ్చాడు. ఇవన్నీ చేసిన తరువాత వారు విశ్వసించకపోతే దేవుడు మోషేతో నైలు నది నుండి నీటిని తీసుకొనిపొడినేల మీద పోయుము. అప్పుడు ఆ నీరు రక్తము ఎర్రగా మారుతుంది అని చెబుతున్నారు. 

దేవుడు మోషేతో ఇవన్నీ చెప్పిన తరువాత కూడా మోషే దేవునితో ఇంత గొప్ప పనికి తగిన వ్యక్తిని  కార్యమునకు ఎన్నుకున్నారాఅని అడుగుతు నేను సరిగా మాటలడలేను అనినత్తి వాడిని చెబుతున్నాడు. అప్పుడు దేవుడు ఆయనకు సమాధానం చెబుతూ మానవుని నోరు చేసినదిదానిని మూగగా చేసేదిలేక చెవిటిగా చేసేదిచూపునించేదితీసివేసేది నేనుకదా  అని అడుగుతున్నారు. దేవుడు  మాటను చెప్పిన తరువాత కూడా మోషే దేవా వేరే ఎవరినైన పంపండి నన్నుకాదు అని చెబుతున్నాడు. దేవునికి కోపం వచ్చినప్పటికీ మోషే ఆత్మస్థైర్యం  లేదని అతనికి తోడుగా తన సోదరుడు ఆహారోనును తీసుకొని వెళ్ళమనిఅహరోను మోషే  తరపున మాటలాడుతాడు అని చెప్పాడు.

ఆహారోనుకు మోషే దేవుని సందేశమును తెలియజేయాలి అని చెప్పాడు.  విధంగా దేవుడు వారితో ఉండి వారు ఏమి చేయాలో వారికి నేర్పుతానని వారికి చెప్పడం జరిగినది. ఆహారోను ప్రజలకు ప్రతినిదిగా , ఉండాలి అని చెప్పాడు. దాని తరువాత మోషే తన మామ యిత్రో వద్దకు వచ్చి నేను నా చుట్టూ పక్కాలు ఎలా ఉన్నారో తెలుసుకొనవలయును నాకు సెలవిమ్ము అని అడిగిన వెంటనే యిత్రో వెళ్ళి రమ్మనీ చెప్పాడు. మోషే తన భార్యను పిల్లలను తీసుకొని ఐగుప్తు  బయలుదేరాడు. దేవుడు మోషేతో నీకు ఇచ్చిన శక్తులన్నింటిని ఫరో రాజు ఎదుట చూపమని చెప్పాడు. ఆహారోను మోషేను దేవుని కొండ వద్ద కలుసుకోగా ఇద్దరు కలసిపోయారు. 

 

మోషే ఐగుప్తుకు వెళ్ళుట మరియు పది రకాల అరిష్టములు 

మోషే ఆహారోనులు ఫరో వద్దకు వెళ్ళి యిస్రాయేలు దేవుడైన  యావే తన ప్రజలను అరణ్యములో ఉత్సవము జరుపుకొనుటకు పంపమని చెప్పారు కాని ఫరో ఎవరు ఆ యావే? అతడు నాకు ఎవరో తెలియదు నేను ఎందుకు ఆయన చెప్పినట్లు నేను ఎందుకు చేయాలి అని చెప్పారు. మోషే ఆహారోను వారిని పంపించకపోతే జరిగే అరిష్టముల గురించి చెప్పారు. కాని ఫరో వారి మాటను పెడ చెవిన పెట్టి మోషే ఆహారోను ను పంపివేశాడు. 

మోషే ఐగుప్తు వెళ్ళు సమయంలో ఆయన వయసు 80 సంవత్సరాలు మరియు ఆహారోను వయసు 83 సంవత్సరాలు. మోషే ఆహారోను మొదట వెళ్ళి ఫరోను కలసి తమ ప్రజలను ఏడారిలోనికి వెళ్ళి దేవుని పండుగ చేసుకొనుటకు అనుమతించాలని వారికి చెప్పాలని జరగడం జరిగినది. ఫరో అందుకు ఒప్పుకోలేదు. కనుక దేవుడు ఫరో ఎదుట మొదటి అద్భుతం చేశాడు. ఆహారోను మోషే చేతి కర్రను తీసుకొని నేల మీద వేయగానే అది పాముగా మారినది. ఫరో తన దగ్గర వున్న ఇంద్రజాలీకులు తమ వద్ద వున్న కర్రలను కింద వేయగానే అవి కూడా పాములుగా మారినవి. అపుడు దేవుడు ఎవరి శక్తి గొప్పది అని చూపించుటకు పూనుటకు ఆహారోను వేసిన కర్ర పాముగా మారి వారు చేసిన అన్నీ పాములను మింగివేసినది. దేవుని శక్తిని చూసిన తరువాత ఫరో మనస్సు రాయిలా మారిపోయి ఆయన యిస్రాయేలు ప్రజలను వెళ్లనివ్వలేదు. దీని తరువాత దేవుడు పది తీర్పులను ఐగుప్తు మీద చేయడం జరిగినది. ఏడు సంవత్సరాల వ్యవదిలో ఇది మొత్తము కూడా జరిగినది.

నీరు రక్తముగా మారుట

మోషీ తన వద్ద వున్న కర్రను తీసుకొని నీటిని కొట్టగా ఐగుప్తులోని నీరు మొత్తం రక్తం వలె మారిపోయింది. దానిలో చేపలు మొత్తం చనిపోయాడు. ఐగుప్తుయులు నీటిని తాగలేక పోయారు.  అక్కడి చెరువులు, కుంటలు, నదులు అన్నీ కూడా రక్తం వలె మారిపోయాయి. ఫరో యాజకులు కూడా అలానే చేయగలిగారు. కనుక ఫరో ప్రజలను పంపుటకు ఇష్ట పడలేదు.

కప్పలు

ఫరో ప్రజలను పోనివ్వకపోవడంవలన దేవుడు రెండవ ఉపద్రవాన్ని వారిమీదకు తీసుకురావడం జరిగినది. దేవుడు ప్రదేశాన్ని కప్పలతో నింపి వారికి ఇబ్బందిని కలుగచేశాడు. కప్పలు కుప్పలు కుప్పలుగా నదులలో నుండి బయటకు వచ్చేలా చేసి వారి ఇళ్ళల్లోనికి , పడక గదులలోనికి వెళ్ళి మనుషుల మీద పడేలా చేశాడు. ఇది చూసిన ఫరో, మోషే ఆహారోనులను పిలిచి దీనిని ఆపమని తరువాత వారిని పంపుతాను చెప్పడం  వలన కప్పలు మొత్తం చనిపోయేలా చేశాడు దేవుడు. కప్పలను అన్నింటినీ తీసుకురాగా అవి పెద్ద కుప్ప అయినవి. అది చూసిన ఫరో మరలా తన మనస్సును మార్చుకున్నాడు. కనుక దేవుడు మూడవ ఉపద్రవాన్ని తీసుకురావాలసి వచ్చినది.

దోమాపోటు 

దేవుడు అప్పుడు మోషేతో ఆహారోనును కర్రను చాచి దుమ్మును కొట్టమని కొడితే అది  ప్రదేశం మొత్తం దోమలు ఆవుతాయి అని చెప్పడం జరిగినది.అప్పుడు అవి మనుషులు జంతువుల మీదకు వస్తాయి అని చెప్పడం జరిగినది. అప్పుడు ఫరో ఇంద్రజాలీకులు కూడా అలానే చేయ ప్రయత్నించారు కానీ అలా చేయలేకపోయారు. అప్పుడు వారు ఇది దేవుని వ్రేలుతో చేయబడింది మేము చేయలేకపోయాము అని చెప్పడం జరిగినది. అయినప్పటికీ ఫరో వారు పోవడానికి ఒప్పుకోలేదు.

ఈగలు

ఇప్పుడు దేవుడు మరల వారి మీద ఒక ఉపద్రవం తీసుకు వచ్చేలా ఫరో ప్రవర్తించాడు. ఒక గుంపు ఈగలు ఐగుప్తు ప్రజల మీద మరియు వారి ఇళ్లలోనికి వెళ్ళి వారిని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టినవి. ఈగలు ఫరో అన్నీ ఇళ్లలోనికి అతని సేవకుల ఇళ్ళల్లోనికీ  నేల మొత్తం మీదకు వెళ్ళాయి. ఫరో మరల మోషేతో ఈగలను వెళ్లిపోయేవిధముగా చేయమని చెప్పగా మోషే అలానే చేస్తాడు కానీ ఫరోమాట మీద నిలబడకుండా యిస్రాయేలు ప్రజలను అక్కడ నుండి పోనియలేదు 

ఐగుప్తు పశువులకు రోగాలు

తీర్పులో ఐగుప్తు ప్రజల జంతువుల మీద ముఖ్యముగా ఆవులు గుర్రాలు గాడిదలు ఒంటెలు ఎద్దులు మరియు గొర్రెలు రోగంతో మరణించడం జరిగినది. అయినకాని ఫరో ప్రజలను పోనివ్వలేదు.

బొబ్బలు

తీర్పులో దేవుడు మోషేతో ఆహారోనుతో చెప్పమని ఆరోను తన పిడికిలి నిండా బూడిద తీసుకొని దానిని ఐగుప్తియుల వైపు చిమ్మమని చెప్పాడు. దానిద్వార వారికిబొబ్బలు వాపులు బొబ్బలు పగిలి గాయాలు వారికి వారి జంతువులకు కలుగుతున్నాయి. బొబ్బలు ఫరో ఇంద్రజాలకులకు కూడా వచ్చాయి. అయినప్పటికీ ఫరో వారిని ఐగుప్తు వదలి వెళ్లిపోనివలేదు.

వడగండ్లు

తీర్పులోదేవుడు ఐగుప్తులో భారీ వడగండ్ల వాన కురిసేలా చేశాడు.  బయట ఉన్న మనుషుల మీద మరియు జంతువుల మీద అవి పడ్డాయి. వాటితో పాటు దేవుడు అగ్నిని కూడ వచ్చేలా చేశాడు. దీనితోటి పంటలు, మొక్కలు బయట ఉన్న మనుషులు మరియు జంతువులు కూడా నాశనం అయాయి. ఇది చూసిన ఫరో అరిష్టమును మోషేతో దీన్ని ఆపివేయమని యిస్రాయేలు ప్రజలను పంపిస్తాను అని చెబుతారు. మోషే దేవునితో చెప్పి దానిని ఆపివేయిస్తాడు. కానీ ఫరో మనసు మార్చుకొని యిస్రాయేలు ప్రజలను పోనివ్వడు.

మిడుతలు

అరిష్టములో దేవుడు ఐగుప్తు నేల  మొత్తం మిడుతలు నిండేలా చేశాడు. ప్రజలు నేలను చూడలేనంతగా ప్రదేశం మొత్తం మిడుతలతో  నిండిపోయింది.   అరిష్టమును కూడా దేవుడు ఫరో యిస్రాయేలు ప్రజలను పంపివేస్తాను అనగానే ఆపివేస్తాడు కానీ ఫరో మరలా మనసు మార్చుకొని యిస్రాయేలు ప్రజలను పంపివేయడు.

చీకటి

తరువాత తీర్పులో దేవుడు మోషేతో తన చేతిని పైకెత్తమని చెప్పాడు. మోషే అలా  చేయగానే దేవుడు ఐగుప్తు మొత్తం చీకట్లు కమ్ముకొనునట్లు చేశాడు. చీకటి మూడు రోజులు ఉన్నది. ప్రజలు ఏమి చూడలేక పోయారు. ఎవరు వారి ప్రదేశం నుండి లేవలేకపోయారు.వారు ఉన్న ప్రదేశం నుండి ఒక అంగులము కూడా వారికీ కనపడనంత చీకటి వారు అనుభవించారు.  వారి ముందు ఏముందో ఎవరు తెలుసుకోలేకపోయారు.

తొలి చూలు బిడ్డల మరణం

అరిష్టములో మృత్యు దూత ఐగుప్తులో పుట్టిన ప్రతి తొలిచూలు బిడ్డను చనిపోయేలా చేశాడు. కానీ యిస్రాయేలు ప్రజల మాత్రం దీనినుండి తప్పించుకునేందుకుగాను ఐగుప్తులో ఉన్న యిస్రాయేలియుల తలుపుల మీద గొర్రె పిల్ల రక్తమును పూయమనీ చెప్తాడు. అపుడు అది చూసిన మృత్యు దూత ఇంటిలో ఉన్నవారిని వదలిపెట్టి మిగిలిన ఇళ్ళలో ఉన్నవారు చనిపోయేలా చేసింది. కేవలం మనుషుల మాత్రమే కాక జంతువులు తొలిచూలు పుట్టిన వాటిని కూడా చంపుతుంది. ఇది యిస్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి తీసుకొని పోవుటకు ఐగుప్తులో చేసిన చివరి అరిష్టం. దీని తరువాత ఫరో యిస్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి వెళ్లిపోవుటకు అంగీకరిస్తాడు. యిస్రాయేలు ప్రజలు ఐగుప్తులో 430 సంవత్సరాలు బానిసత్వం తరువాత ఐగుప్తు నుండి విముక్తి పొందారు.

ఎర్ర సముద్రమును చీల్చుట

తరువాత అద్భుతం చాల  నాటకీయంగా ఉంటుంది. యిస్రాయేలు ప్రజలు ఐగుప్తును వదలివెళ్లారు. ఫరో వారు వెళ్ళుటకు ఒప్పుకున్న తరువాత ఆయన మరలా తన మనసు మార్చుకున్నాడు. వారిని వెంటపడి మరలా వెనక్కు తీసుకురావాలి అనుకున్నాడు. అది చూసిన ప్రజలు మోషేతో చెప్పారు. వారు ఎర్ర సముద్రం ముందుకు రాగానే ఆగిపోయారు. అప్పుడు ఎక్కడకు వెళ్లాలో తెలియదు. ముందు చూస్తే సముద్రము ఉన్నది. అంత అగోచరముగా ఉన్నది. ముందుకు వెళితే సముద్రంలో మునిగిపోతారు. అక్కడే ఉంటే ఫరో సైనికులు వచ్చి మరల బానిసలుగా తీసుకుపోతారు. వారిని కాపాడుటకు ఇప్పుడు దేవుడే ఏమైనా చేయాలి. అప్పుడు మోషే వారితో వారికి ధైర్యం చెబుతూ భయపడవద్దు, ధైర్యముగ ఉండండి దేవుడు చూపబోయే రక్షణను చూడండి మీరు ఇప్పుడు చూసే ఐగుప్తుయులును మరలా మీరు చూడరు. దేవుడు మీకోసం యుద్దం చేస్తారు అని వారికి ధైర్యం చెప్పాడు. మోషే దేవునికి మొరపెట్టగా దేవుడు మోషేతో, నీవు నాకు మొరపెట్టుట ఎందుకు  నీ కర్రను తీసుకొని నీ చేతిని సముద్రము మీద చాచి దానిని పాయలుగా చీల్చుము యిస్రాయేలు ప్రజలు ఎండిన నేల మీద నుండి సముద్రం మధ్య గుండా వెళ్లిపోతారు అని చెప్పాడు. దేవుడు చెప్పినట్లు చేయగా సముద్రము రెండుగా చిలిపోయింది.  అప్పుడు  యిశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రము రెండుగా చీలిపోవడం చూసి దానిగుండా  పోవుట మొదలుపెట్టారు. సముద్రపు నీరు రెండు ప్రక్కల కూడా గోడవలే వారిని కాపాడినది. యిశ్రాయేలు ప్రజలు అందరు సురక్షితము చేరిన తరువాత దేవుడు మోషేతో నీ చేతిని సముద్రముపై చాపు రెండు బాగాలుగా ఉన్న సముద్రము కలసిపోతుంది,  ఐగుప్తు సైనికులు  రధములు అన్నీ సముద్రములో కలసిపోయారు.అప్పుడు మోషే మరియు ఇశ్రాయేలీయులు దేవుని పేరిట విజయ గీతము పాడి దేవుని స్తుతించారు. 

ఎడారిలో యిస్రాయేలు ప్రజలు 

రెల్లు సముద్రము దాటి షూరు అరణ్యమునకు వెళ్లారు. అక్కడ వారికి త్రాగుటకు నీరు దొరకలేదు. అక్కడ నుండి మారా వెళ్లారు. అక్కడ నీరు చేదుగా ఉండుట వలన ఆ నీటిని  త్రాగలేక పోయారు. మోషే దేవునికి మొర పెట్టగా దేవుడు అతనికి ఒక చెట్టును చూపించగా మోషే ఆ చెట్టును నీటిలో వెయ్యగా అవి తియ్యగా అయ్యాయి. అక్కడ నుండి ప్రజలు ఏలీము వెళ్లారు అక్కడ పండేడు నీటి బుగ్గలు ఉన్నాయి. ఎలిము సినాయి మద్యనున్న  సీను ప్రాంతము చేరిన తరువాత ప్రజలు మోషే ఆహారోనులను నిందించడం మొదలెట్టారు. మేము ఐగుప్తులో  ఉన్నప్పుడు  మేము మాంసం కడుపార తిన్నామని, ఇక్కడ ఆకలితో మాడి చనిపోతున్నామని ఇక్కడ మమ్ములను చంపుటకు ఇక్కడకు తీసుకొని వచ్చారా? అని అడిగారు. అప్పుడు దేవుడు వారి మాటలను విని యావే తేజస్సు మేఘము నందు కనపడి  మోషేతో వారు ప్రొద్దుగ్రూంకునప్పుడు మాంసమును తెల్లవారు రొట్టెను కడుపార తినుదురు అని వారికి చెప్పాడు. అప్పటి నుండి ఉదయమున ఎడారి నేలమీద నూగు వంటి సన్నని పొడిగా మోషే మీరు తినుటకు దేవుడు ఇచ్చిన ఆహారము అని చెప్పాడు. దానికి మన్నా అని పేరు పెట్టారు. అలానే సాయం కాలము పూరెడు పిట్టలు వచ్చి వారి విడుదలను కప్పి వేసేవి. మన్నాతో   ఒమెరు పట్టు పాత్రను నింపి మోషె  ఆజ్ఞ ప్రకారం భద్రపరిచారు. ఆ పాత్రను నిబంధన మందసము ఎదుట ఉంచారు. యిస్రాయేలు ప్రజలకు నీరు దొరకక మోషేతో మాకు నీరు చూపించమని జగదమాడారు అప్పుడు మోషేతో దేవుడు నీవు కర్రను తీసుకొనినేను హోరెబు కొండల రాతిమీద నిలబడి ఉంటాను నీవు రాతిని కొట్టుము వెంటనే ఆ రాతి నుండి త్రాగుటకు నీరు వస్తాయి అని చెప్పాడు. మోషే దేవుడు చెప్పినట్లుగా చేసెను. 

మోషే  పది ఆజ్ఞలు పొందుట

ఎడారిలో యిస్రాయేలును పరీక్షిస్తున్నప్పుడు దేవుడు మొదటిగా చూడాలను కున్నది దైవ ప్రజలు దేవుని ఆజ్ఞాలు పాటించగలరో లేదో తెలుసుకోవాలనుకున్నారు. కనుక తన ఆజ్ఞలు మొత్తం యిస్రాయేలు ప్రజలు ఎలా పాటిస్తారో పరీక్షించారు.

ఐగుప్తునుండి బయటకు వచ్చిన మూడు నెలలకు దేవుడు మోషేతో నేను నీతో సీనాయి పర్వతం మీద తన ప్రజల సమక్షంలో కలుస్తాను అని చెబుతాడుదేవుడు వచ్చినప్పడు సినాయి పర్వతం మొత్తం పొగతో కప్పబడింది. అప్పుడు మెరుపులు, ఉరుములు దట్టమైన పొగ పర్వతం మొత్తం దగదగ మెరిసింది.

దేవుడు సినాయి పర్వతం మీదకు అగ్నిలో వచ్చాడు. అప్పుడు దట్టమైన పొగ పర్వతం మీద నుండి పైకి వెళుతుంది. దేవుడు మోషేను మాత్రమే పర్వతం మీదకు రమ్మని చెప్పాడు. అప్పుడు దేవుడు మోషేకు పది ఆజ్ఞలు ఇవ్వడం జరిగినది. ఇవి యిస్రాయేలు ప్రజలు పాటించాలని, వాటికి కట్టుబడి ఉండాలని  దేవుడు కోరాడు. దాని తరువాత మోషే వీటిని ప్రజలకు తెలియపరచడానికి కిందకు వచ్చాడు. మరల వెంటనే దేవుడు మోషేను పిలువగా పర్వతం మీద మోషే 40  రోజులు పర్వతం మీదనే ఉన్నాడు. దేవుడు పర్వతం మీద దహించివేసే విధంగా ఉన్నది.

రెండవ సారి దేవున్ని మోషే కలసినప్పుడు దేవుడు మోషేకు ఎలా దివ్య మందసాన్ని ఎలా కట్టాలి అని చెప్పాడు. ఇక్కడ దేవుని సాన్నిధ్యం ఎలా దేవుడు యిస్రాయేలు ప్రజలతో 40 సంవత్సరాలు వీరితో ఉండుటకు సిద్దపడటం జరిగినది. దేవుడు రెండవ సారి మోషేను కలిసినప్పుడు పది ఆజ్ఞలు ఇచ్చాడు.

మోషేకు రెండు రాతి పలకలమీద రెండు ప్రక్కల రాయబడ్డాయి. పలకల మీద దేవుని  చేతితో రాయబడినవి.  మోషే మాత్రమే దేవునితో మాటలాడటానికి, ఉండటానికి 40 రోజులు, పగల్లు ఉన్నారు. ఇంత గొప్ప విషయం ఇక్కడ జరుగుతుంటే పర్వతం క్రింద మాత్రం  ఘోరమైన పని జరుగుతుంది. యిస్రాయేలు ప్రజలు పర్వతం క్రింద అసహనంతో మోషే క్రిందకు రాలేదని గొణుగుకుంటూ ఆయనకు ఏమి అయ్యిందో అసహనంతో ఊగిపోయారు.

వారు ఒక  బంగారపు దూడను చేసి దానిని ఆరాధించడం ప్రారంభించారు. దేవుడు పర్వతంపై నుండి కోపబడ్డాడు. దేవుడు ప్రజలను మొండివారని వారిని సంహరిస్తానని చెప్పాడు. దేవుడు మోషేతో నేను నీ నుండి గొప్ప జాతిని ఏర్పాటు చేస్తాను అని చెప్పాడు. కాని మిగిలిన యిస్రాయేలు ప్రజలను బంగారపు దూడను ఆరాధించిన సంహరించబోతున్నాను అని చెప్పాడు.

సమయంలో మోషే దేవునితో ప్రజలను చంపవద్దని వాదించగ దానికి దేవుడు ఒప్పుకున్నాడు. మోషే క్రిందకు దిగిరాగా అక్కడ ప్రజలు పాటలతో మరియు నృత్యంతో బంగారు దూడ చుట్టు ఉండుట చూచి మోషే కోపోదృగ్తుడయ్యాడు. అప్పుడు తన చేతిలో ఉన్న దేవుని అజ్ఞాలను రాసి ఉన్న రెండుపలకలను విసిరివేయగా అవి ముక్కలుగా పగిలిపోయాయి. మోషే వారు చేసిన దూడను తీసుకొని దానిని కాల్చి పిండి చేసి నీటిలో పోసి యిస్రాయేలు ప్రజలు దానిని తాగేలా చేశాడు. బంగారు దూడను పాడు చేసిన తరువాత మోషే ప్రజల ముందుకు వచ్చి వారిని దేవుని వైపు లేక వారి ప్రక్కనే ఉంటారో నిర్ణయించుకోమన్నాడు. అప్పుడు అందరు ఎవరి వైపు ఉండాలో నిర్ణయించుకున్న తరువాత మోషే దేవుని వైపు కాని వారిని అక్కడే అప్పుడే చంపబడాలని ఆదేశించాడు. ఆరోజు 3000 మంది వారు దేవుని మీద చేసిన తిరుగుబాటుకుగాను మరణించాడు.

అప్పుడు మరల మోషే సినాయి పర్వతం మీదకు వెళ్ళగా దేవుడు మరల రెండు రాతి పలకలను పగిలిపోయిన వాటికి బదులుగా ఇచ్చాడు. మోషే దేవుని సాన్నిధ్యాన్ని చూచుటకు అనుమతించబడ్డాడు. తరువాత దేవుడు తనను చూచుటకు అనుమతి ఇచ్చాడు.  మోషేతో దేవుడు నీవు నా ముఖమును చూడవచ్చు అని చెప్పాడు.

ఇక్కడ ఒక స్థలం మీద రాయి ఉన్నాది దానిమీద నీవు ఉండుము నా మహిమ పోవుచున్నప్పుడు నిన్ను నేను రాతి చివరన ఉంచుతాను అని చెప్పాడు. నేను నిన్ను నా చేతితో కప్పుతాను. నేను నా చేతిని తీసినప్పుడు నీవు నా వెనుక భాగం చూడవచ్చును  కానీ నా ముఖము కనబడదు అని చెప్పాడు. ఇది మోషేకు దేవుని గురించి ఉన్న అనుభవం. దేవుడు మోషేను తన మహిమను చూచుటకు అనుమతించాడు. మానవుడు పాపం చేసిన తరువాత దేవుడు మానవునికి ఇచ్చిన  అతి గొప్ప బహుమానం మోషే పొందాడు. దేవుని చూడగలిగాడుమోషే దేవున్ని ప్రత్యక్షంగా చూసిన తరువాత అతను కొండ దిగి క్రిందకు రాగానే అతని ముఖ శరీరము మెరిసిపోయింది. ప్రజలు ఆయన దగ్గరకు రావడానికి కాంతికి  భయపడ్డారు. మోషే తన ముఖమునకు ఒక గుడ్డను అడ్డుపెట్టుకోవలసివచ్చింది.

దివ్య మందసము

యిస్రాయేలు ప్రజల నాలబై సంవత్సరాల ఎడారి ప్రయాణంలో ఒక గొప్ప కట్టడం ఏమిటి అంటే దివ్యమందసం. దివ్య మందసము దేవుని సాన్నిధ్యమును తెలియజేస్తుంది. దేవుడు మోషేకు దివ్యమందసమును ఎలా కట్టాలో తెలియజేశాడు. దివ్యమందసము కట్టిన తరువాత ఒక మేఘము మందసమును పగలు కమ్మివెయ్యగా, అగ్ని దర్శనము రాత్రి మందసమును కమ్మివేసేది. అలా దేవుడు యిస్రాయేలును  దేవుడు 40 సంవత్సరాలు  పగలు మేఘమువలె రాత్రి ద్వీపస్తంభం వలె నడిపించాడుమేఘము దివ్య మందసము పైనుండి వెళుతుందో అప్పుడు యిస్రాయేలు దానీవెంట ఎక్కడకు వెళుతుందో అక్కడకు వెళ్ళి వుండేవారు. మేఘం మందసము మీద ఉన్నంత వరకు వారు అక్కడే ఉండేవారు.

గూడాచారులు తిరిగి వచ్చుట

40 సంవత్సరంప్రయాణం మొదటిలో దేవుడు ప్రజలను వాగ్ధాత్త భూమికి దగ్గరకు తీసుకురావడం జరిగినది. యిస్రాయెలియులు 12 మందిని భూమిని పరీక్షించడానికి పంపిందిపన్నెండు మంది గూడచరులలో పదిమంది కనానును వశపరచుకోవడం సాధ్యం కాదు అని చెప్పగా  కాలేబ్ వారితో అక్కడకి వెళ్ళి దానిని వశపరుచుకుందాము అని చెప్పాడు. దేవుడు గూడాచారులు ఇచ్చిన సమాచారంతో దేవుడు సంతృప్తి చెందలేదు. వారు దేవుడు చేసిన అనేక గొప్ప కార్యములు చూసిన కానీ వారు దేవున్ని విశ్వాసించలేదు. కనుక దేవుడు వీరు అందరు వాగ్ధాత్త భూమిని చేరరు కానీ కాలేబు మరియు ఆయన సంతతి వారు వాగ్ధాత్త భూమిలో ప్రవేశిస్తారు అని చెప్పాడు.  ఆదేవిధముగా 20 సంవత్సరాల వయసు దాటిన వారు ఎవరు భూమిలోనికి ప్రవేశించారు ఎందుకంటే వారు నన్ను అనుసరించలేదు అని దేవుడు చెప్పాడు.

కనుక యోహొషువా మరియు కాలేబు 20 సంవత్సరాల లోపు యువతరాన్ని నడిపించవలసినవారు. వారు విజయవంతముగా వారి పెద్దవారు చూసిన భారీకాయులను జయించుకుంటూ వచ్చారు. ఇరవైసంవత్సరాలు మరియు పైన కలిగిన వయసుకలవారు అందరు ఎడారిలో దేవుని యందు విశ్వాసం ఉంచక నలబై సంవత్సరాల కాలంలో మరణించారు. పది ఉప ద్రవాల ద్వారా వీరిని ఐగుప్తు నుండి తీసుకువచ్చి  , సముద్రమును రెండుగా చీల్చిన దేవుని మహిమను చూసిన కానీ వారు దేవుడు వారికి భూమిని ఇస్తాడు అని నమ్మలేదువీటన్నింటిలో ఆశ్చర్యమైన విషయం ఏమిటి అంటే ఒక్కరు కూడా 20 సంవత్సరాలు ధాటినవారు పరీక్ష ఉత్తీర్ణులైనవారు లేరు.

మోషే మరణం

మోషే జీవితంలో చాలా విషాదాకారమైన విషయం ఏమిటి అంటే మోషే వాగ్ధాన భూమిలోనికి అడుగు పెట్టలేదు. మోషే 120 సంవత్సరాల వయసులో నేబో కొండ వద్ద మరణించాడు. ఆయన వాగ్ధాన భూమికి వెళ్లకపోవడానికి కారణం మెరిబా కాదేశ్  నీటి వద్ద దేవుని మాటను యిస్రాయేలు ప్రజల   ముందు మీరాడు. ఇక్కడా మోషేతో దేవుడు  రాతితో  ప్రజల సమక్షంలో మాటలాడి దాని  నుండి ప్రజలకు మరియు జంతువులకు నీటిని ఇస్తుంది అని చెప్పాడు. కానీ మోషే రాతిని కోపంతో బాదాడు. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

సమూయేలు చరిత్ర

 సమూయేలు చరిత్ర  సమూవేలు  పవిత్ర గ్రంధంలో ఉన్న న్యాయాధిపతులలో చివరి  న్యాయాధిపతి మరియు న్యాయాధిపతులో ఎక్కువ కాలం జీవించినవాడు. యిస్రాయేలు చర...