క్రీస్తు సాక్షాత్కార మహోత్సవం
ఈ ముగ్గురు రాజులు లేక జ్ఞానులు యేసు ప్రభువు దగ్గరకు రావడం దేవుని యొక్క ప్రణాళికే ఎందుకు అంటే ఆది కాండం 22 వ అధ్యాయం 18 వ వచనం లో అబ్రహాము సంతతి ద్వార జాతులన్నీ దీవించ బడుతాయి అని మనం తెలుసుకుంటాం. అది ఈ రోజు ఈ ముగ్గురు జ్ఞానులు యేసు ప్రభువు దగ్గరకు రావడం ద్వార జరుగుతుంది. యేసు ప్రభువును దేవునిగా మొదట ఆరాధించిన ప్రజలు అన్యులు, యూదులు కాదు. ఈ ముగ్గురు రాజులు దేవుని అర్పించే వాటిని యేసు ప్రభువుకి అర్పించి ఆయనను దేవునిగా గుర్తిస్తున్నారు, తెలుసుకుంటున్నారు మరియు ఆరాధిస్తున్నారు. మత్తయి సువార్త 8:11 లో మనం తూర్పు పడమరల నుండి ప్రజలు అబ్రహాము తో కూర్చుంటారు అనే వింటున్నాం.
ఈ ముగ్గురు రాజులు ఒక నక్షత్రం చూసి వారు ఒక గొప్ప వ్యక్తి యిస్రాయేలులో జన్మించారు, అని తెలుసుకున్నారు. వారు నిజానికి ఆ నక్షత్రం ద్వారా ఎదో ఎదుకుతున్నారు. వారి అన్ని ఆశలకు సమాధానం ఈ నక్షత్రం తెలియచేస్తుంది అని నమ్మారు, లేకపోతే వారు అంత దూరం వచ్చే వారు కాదు. వీరు జ్ఞానులు , గొప్పవారు వీరు తెలివిగలవారు. ఏమి చూసారు వారు అక్కడ? కేవలం చిన్నారి బాల యేసును, సరిగా లేని ఒక పశువుల పాకను, మరి ఎందుకు వారు ఆయనను ఆరాధించారు. అక్కడ వారు దేవుని మహిమను చూసారు , వారు అంత దూరం కేవలం కొన్ని బహుమతులు ఇవ్వడానికి వెళ్ళలేదు. అక్కడ వారు ఎదో చూస్తున్నారు , వారు ఆ చిన్న బిడ్డను ఆరాధిస్తున్నారు. వారి మోకాళ్ల మీద ఉన్నారు. దేవుడు మానవుని రూపంలో వారు చూసారు. వారు ఆనందముగా కృతఙ్ఞతలు చెప్పి వెళుతున్నారు.
అందుకే మనము ఈ పండుగను క్రీస్తు సాక్షాత్కార పండుగగా పిలుస్తాము అంటే దేవుడు తనను తాను తెలియ చేసుకోవడం. ఒక నక్షత్రం ద్వారా దేవుడు ఆయనను వారికి తెలియ పరుచుకున్నాడు. వారు జ్ఞానులు కనుక నక్షత్రం ద్వారా యేసు ప్రభువు దేవుడు అని గుర్తించారు. నీవు ఆయన చేసిన పనులు గురించి వినివున్నావు కనుక ఆయనను తెలుసుకొని ఆయనను వారు ఆరాధించినటులా నీవు కూడా ఆరాధించాలి.
ఈ జ్ఞానులు ఏమి అర్పిస్తున్నారు యేసు ప్రభువుకి ఆయనను ఆరాధించిన తరువాత అని మనము చూసినప్పుడు మనము ఇక్కడ చూసేది బంగారం వారు అర్పిస్తున్నారు. ఎందుకు బంగారం అంటే బంగారాన్ని రాజులకు అర్పిస్తూ ఉంటారు, అంటే వారు ఆయనను రాజుగా వారి అధిపతిగా అంగీకరిస్తున్నారు. పరిమళ ద్రవ్యాలను ఇస్తున్నారు. అవి ఆయన శ్రమలు మరియు మరణాన్ని గుర్తు చేస్తున్నాయి. ఆయన ఏ విధంగా ప్రజలను రక్షించబోతున్నారు అని తెలియ చేస్తున్నాయి. తరువాత వారు సాంబ్రాణిని అర్పిస్తున్నారు. ఇది దేవుని ఆరాధనకు అర్పించేది ఎందుకంటే ఆయన తమ యాజకునిగా, దేవునిగా వారు గుర్తించారు. వారు కూడా యాజకులుగా స్థిరపడినవారే అయినా కానీ నిత్య యాజకునిగా ఆయనను వారు గుర్తిస్తున్నారు.
ప్రియా సహోదరులారా మనము ఇక్కడ రాజులను చూస్తున్నాం వీరు యేసు ప్రభువుని తెలుసుకొని రాజుగా , యాజకునిగా మరి ముఖ్యముగా దేవునిగా తెలుసుకుంటున్నారు. అయన దగ్గరకు వస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఇక్కడ హేరోదు రాజు ఉన్నాడు ఆయన యూదుల రాజు పుట్టాడు మేము ఆయన్ను చూడటానికి వచ్చాము అని చెప్పగానే ఆయన ఆందోళన చెందుతున్నాడు. యేసు ప్రభువును తన ఆధికారముకి అడ్డంగా ఉంటాడు అని ఆయనను చంపాలని అనుకుంటున్నాడు. అనేక మంది చిన్న బిడ్డలను చంపిస్తున్నాడు. హేరోదు రాజు యూదయ పెద్దలను అందరిని పిలుస్తున్నాడు ఎక్కడ యేసు ప్రభువు పుట్టాడో తెలుసు కోవడానికి వారికి ఆయన ఎక్కడ పుట్టాడో తెలుసు వారి శాస్త్రాల ప్రకారం కానీ వారు ఎవరు ఆయన్ను తెలుసుకొని ఆరాధించాలి అని అనుకోలేదు. కానీ ఈ అన్యులే ఈ ముగ్గురు జ్ఞానులే ఆయన్ను తెలుసుకొని ఆరాధిస్తున్నారు మనము వీరిని ఆదర్శముగా తీసుకోవాలి, ఆ విధంగా జీవించాలి.
Rev. Fr . Amruth
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి