పేజీలు

19.4.23

అనుదిన ఆత్మీయ ఆహారం , యోహాను 3:31-36

 యోహాను 3: 31-36 

పైనుండి  వచ్చు  వాడు అందరి కంటే అధికుడు.  భూలోకము నుండి వచ్చువాడు, భూలోకమునకు చెందినవాడు. అతడు భూలోక విషయములను  గూర్చి మాట్లాడును. పరలోకము నుండి వచ్చు వాడు అందరి కంటే  అధికుడు. ఆయన తాను చూచిన, వినిన విషయములను గూర్చి మాట్లాడును. పరలోకము నుండి వచ్చు వాడు  అందరి కంటే అధికుడు. ఆయన తాను చూచిన, వినిన విషయములను గూర్చి సాక్ష్యము నిచ్చును. కాని , ఆయన సాక్ష్యమును ఎవరును అంగీకరింపరు. ఆయన సాక్ష్యము అంగీకరించినవాడు దేవుడు సత్యసంధుడని నిరూపించును. దేవునిచే పంపబడిన వాడు దేవుని విషయములను గూర్చి చెప్పును. ఎలన, దేవుడు ఆయనకు తన ఆత్మను సమృద్దిగ ఒసగును. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు. ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు. కుమారుని విశ్వసించు వాడు నిత్య జీవము పొందును. ఆయనకు విధేయించని వాడు జీవమును చూడలేడు. దేవుని కోపము అతనిపై నిలచి ఉండును. 

ధ్యానము: ఈ సువిశేష భాగంలో యేసు ప్రభువు గురించి అనేక గొప్ప విషయాలు మనం చూస్తున్నాము. ఆయన పై నుండి వచ్చిన వాడు అని, అందరికంటే అధికుడు అని , ఆయన తన తండ్రి వద్ద చూచిన , వినిన విషయములను మాత్రమే మాటలాడుతాడు అని , ఆయన తాను చూసిన, వినిన విషయాలకు సాక్ష్యం ఇస్తున్నాడు అని, ఆయన సాక్ష్యం అంగీకరించిన వారు దేవుడు సత్య సంధుడు అని నిరూపిస్తారు అని, ఆయనకు ఆత్మ సమృద్దిగా ఇవ్వబడింది అని, తండ్రి ఆయనను ప్రేమిస్తున్నారు అని, సమస్తము మీద ఆయనకు అధికారం ఇవ్వబడింది అని , ఆయనను విశ్వసించు వారికి నిత్య జీవితం ఇవ్వబడుతుంది అని ఆయనను విశ్వాసించని వాని మీద దేవుని కోపం వుంటుంది అని ఈ సువిశేష భాగం తెలియచేస్తుంది. 

 "పైనుండి  వచ్చు  వాడు అందరి కంటే అధికుడు. భూలోకము నుండి వచ్చువాడు, భూలోకమునకు చెందినవాడు. అతడు భూలోక విషయములను  గూర్చి మాట్లాడును." ఇక్కడ యేసు ప్రభువు తను ఎక్కడ నుండి వచ్చినది మాటలాడుతున్నారు. అందరు ఆయన ఈలోక పుట్టు పూర్వోత్తరాల గురించి మాటలాడుతున్నారు. కాని ఆయన నిజముగా తండ్రి దేవుని నుండి వస్తున్న విషయాన్ని మరచిపోతున్నారు. ఆయన పరలోకము నుండి వస్తున్నారు. ఆయన తండ్రి నుండి వచ్చాడు కనుక ఆయన తన తండ్రి వద్ద ఉన్న విషయములను గురించి మాటలాడుతున్నారు. తన తండ్రి వద్ద అనేక నివాస స్థలాలు ఉన్నవి అని చెబుతున్నారు, మనము ఆ లోకానికి చెందిన వారిమి అని అక్కడ మనకు నివాసం ఏర్పాటు చేస్తాను అని చెబుతున్నాడు.  ఆయన పై నుండి వచ్చాడు, ఆయన అందరికంటే అధికుడు. ఆయన మన వలే కేవలం ఈలోకంలో పుట్టుట ద్వారా తన జీవితం మొదలు కావడం లేదు. ఆయన ఆది నుండి తన తండ్రితో ఉన్నాడు. కాని మనం ఈ లోకానికి చెందిన వారము. యేసు ప్రభువు అలా కాదు. ఆయన ఆది నుండి పరలోకానికి చెందినవాడు. 

యేసు ప్రభువు ఇచ్చే సాక్ష్యం చాలా ముఖ్యం. ఆయన చూసిన వానికి, వినిన వానికి  ఆయన సాక్షం ఇస్తున్నాడు. తాను తన ఇష్ట ప్రకారం లేక సొంతగా ఏమి చెప్పడం లేదు ప్రతిది తండ్రి నుండి చూసింది లేక వినినది మాత్రమే.  ఆయన చెప్పే ప్రతి దానిని మనం విశ్వసించాలి. ఎందుకంటే ఆయన మాత్రమే తండ్రి నుండి వచ్చినది. ఆయన తండ్రి చేత పంపబడిన వాడు కనుక ఆయన తండ్రి యొక్క మాటలను చెబుతున్నాడు. ఆయన మాటలు కూడా జీవం కలిగి ఉన్నాయి.  ఆయన ఈ లోకానికి వచ్చినది,  ఆయన ద్వారా ఈ లోకం రక్షించబడాలి అని. ఆయన మాటల ద్వారా తన పనుల ద్వారా ఆ పనిని చేస్తున్నాడు. ఆయన పవిత్రాత్మ కలిగి వున్నాడు. తండ్రి తన కుమారునికి పవిత్రాత్మను సమృద్దిగా ఇచ్చారు.  ఆయనను విశ్వసించిన వారికి ఆయన ఆ పవిత్రాత్మను ఇస్తాడు, పవిత్రాత్మ వారిని నడిపిస్తుంది.  యేసు ప్రభువును తండ్రి ప్రేమిస్తున్నారు. యేసు ప్రభువుని తండ్రి ఎంతలా ప్రేమిస్తున్నారు అంటే ఈ లోకం మీద, సర్వ అధికారం ఆయనకు ఇచ్చారు. యేసు ప్రభువుని సాక్ష్యంను అంగీకరించిన వారు దేవుడు సత్యసంధుడు అని నిరూపిస్తారు. 

ప్రార్ధన : ప్రభువా!  మీరు ఎవరు అని ఎంత గొప్ప వారు అని ఈ సువిశేష భాగం ద్వారా తెలుసుకుంటున్నాము. మీరు ఆది నుండి తండ్రితో ఉన్నారు. తండ్రి గురించి ఆయన ప్రేమ గురించి మీ ద్వారా మాత్రమే మేము తెలుసుకుంటున్నాము. కాని కొన్ని సార్లు మీరు మాకు చూపించిన తండ్రి ప్రేమను తెలుసుకోలేక పోతున్నాము. ఎంతగా తండ్రి మిమ్ములను ప్రేమిస్తున్నారో మేము వింటున్నాము అంతే కాదు తండ్రి మమ్ములను కూడా అలానే ప్రేమిస్తున్నారు అని మరచిపోతున్నాము, అటువంటి సమయాలలో మమ్ములను క్షమించండి. ప్రభువా ! మీకు సమస్తము మీద అధికారము ఇవ్వబడినది, నా మీద, జీవితం మీద కూడా మీకు పూర్తిగా అధికారం ఇవ్వబడింది, మీ మాటలను విశ్వసించే మంచి విశ్వసిగా నన్ను మార్చండి. నేను మీరు సత్య వాంతులు అని నిరూపించే మీ శిష్యునిగా నన్ను మార్చండి. మీరు ఎలా తండ్రిని ప్రేమిస్తున్నారో, ఆయన చిత్తం నెరవేర్చడానికి ఎంత కష్టపడ్డారో, నేను కూడా మీ చిత్తం నెరవేర్చడానికి కావలసిన అనుగ్రహాలు ఇవ్వండి, తద్వార , మీరు నాకు చూపించిన ప్రేమకు నాకు మీ మీద ఉన్న ప్రేమను వ్యక్త పరిచేలా నాకు సహాయం చేయండి. ప్రభువా ! తండ్రి మీకు సమృద్దిగా పవిత్రాత్మను ఇచ్చిన విధంగా నాకు కూడా ఆత్మను ఇవ్వండి ,  ఆత్మ నన్ను నడిపేలా దీవించండి.  ప్రభువా నేను ఎల్లప్పుడూ  మిమ్ములను విశ్వసిస్తూ, మీరు వాగ్ధానం చేసే నిత్య జీవం నేను పొందేలా నన్ను ఆశీర్వాదించండి. ఆమెన్ 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

సమూయేలు చరిత్ర

 సమూయేలు చరిత్ర  సమూవేలు  పవిత్ర గ్రంధంలో ఉన్న న్యాయాధిపతులలో చివరి  న్యాయాధిపతి మరియు న్యాయాధిపతులో ఎక్కువ కాలం జీవించినవాడు. యిస్రాయేలు చర...