అబ్రహాము జీవిత చరిత్ర
అబ్రహాము తేరా చిన్న కుమారుడు. అబ్రహాము అసలు పేరు అబ్రం, ఆ పేరుకు గల అర్ధం ఉన్నతికి తండ్రి. దేవుడు అబ్రహాముకు అబ్రహాము అని పేరు మార్చినది తనకు లెక్కకు మిక్కుటముగా సంతానము కలుగ చేస్తాను అని చెప్పి తన పేరును మార్చి తనను అబ్రహాము అని పిలిచాడు, అనగా అనేక తెగలకు తండ్రి అని అర్ధం.
అబ్రహాము దేవుని స్నేహితుడు
అబ్రహామును దేవుడు ఒక క్రొత్త జీవన విధానానికి పిలుచుకున్నాడు. దేవుని మీద విశ్వాసముంచి జీవించే విధానం అబ్రహముతో మొదలవుతుంది. ఒక ఒడంబడిక విధానం కూడా అబ్రహాముతోనే మొదలవుతుంది. దేవునికి స్నేహితునిగా దేవునితో స్నేహితుని వలె మాటలాడిన మొదటి వ్యక్తిగా కూడా అబ్రహము ప్రసిద్ది చెందడం జరిగింది.
అబ్రహాము తెరా ముగ్గురు కుమారులలో ఒకడు. మిగిలిన ఇద్దరు కుమారులు నహోరు మరియు హారను, హారను ఉరు పట్టణములోనే చనిపోయాడు. లోతు అను వాడు ఈ హారను కుమారుడు. తెరా కల్దియుల దేశమైన ఉరు అనే ప్రాంతమునకు చెందిన వాడు. తరువాత కనాను దేశమునను వెళుతూ హారములో స్థిర పడిపోయారు. అబ్రహాము 73 సంవత్సరాల వయసులో ఉండగా దేవుని స్వరమును విన్నాడు. దేవుడు ఆయనతో తన దేశమును, పుట్టినింటిని, చుట్టపక్కాలను వదలి తాను చూపే దేశమునకు వెళ్ళమని చెప్పాడు. దాని ద్వారా ఆయనను ఒక గొప్ప జాతిగా తీర్చిదిద్దుతాను అని దేవుడు అబ్రహాముకు చెప్పడం జరిగింది. అబ్రహాము ఆ మాటలకు విలువనిచ్చి దేవుడు చెప్పినట్లు చేయడం జరిగింది. తాను హారనులో సంపాదించినది, తన సేవకులతో, భార్య సారా మరియు తన సోదరుని కుమారుడు లోతుతో కలసి అబ్రహాము హారనును వదలినప్పుడు అబ్రహాము వయస్సు 75 సంవత్సరాలు. హారాను నుండి కనాను దేశములోని షెకెము అనే ప్రదేశం చేరి మోరే వద్ద సింధూర వృక్షము వద్ద ప్రభువు కనపడి ఈ దేశమును నీ సంతతికి ఇస్తాను అని చెప్పాడు. అక్కడ అబ్రహాము ఒక బలి పీఠము నిర్మించి బేతేలు , హాయికి మధ్య బలి పీఠము నిర్మించి దేవుని ఆరాధించి, అక్కడనుండి నెగెబు వెళ్ళాడు. అక్కడ కరువు రాగ ఐగుప్తు వెళ్ళి అక్కడ తన భార్య సారాను తన సోదరి అని చెప్పమని అడిగెను ఎందుకంటే ఆమె మిక్కిలి అందగత్తె, మరియు ఆమె నిమిత్తం అబ్రహము చంపుతారు ఏమో అని అతను భయపడెను. ఫరో రాజు వద్దుకు తన సేవకులు తీసుకోపొగా ఆమె వలన అతను అబ్రహాముకు మేలు చేయగా ఆయన గొర్రెలను , పశువులను సంపాదించేను. దేవుడు ఆమెను కాపాడుటకు ఫరో రాజు కుటుంబంలో అనేక రోగముల పాలు చేయగా ఫరో నిజము తెలుసుకొని అబ్రహామును పిలిచి తన భార్యను తీసుకొని పొమ్మని చెప్పగా ఆయన అలాగే తన సంపద మొత్తం తీసుకొని అక్కడ నుండి మరల నెగెబుకు వెళ్ళి అక్కడ నుండి బేతెలు హాయికి మధ్య మొదట గుడారము ఏర్పాటు చేసిన ప్రదేశమునకు వచ్చెను. అక్కడ లోతు మరియు అబ్రహాము సేవకుల మధ్య గొడవలు జరుగగా కనుక అబ్రహాము లోతుతో మనము విడిపోవుట మేలు అని ఇక్కడ నుండి మన ముందు కావలసినంత నేల ఉంది. నీవు కుడి వైపుకు వెళ్ళిన నేను ఎడమ వైపు వెలుతాను, లేక నివు ఎడమ వైపు వెళ్ళిన కుడి వైపు వెలుతాను అని చెప్పగా లోతు యొర్దాను మైదానం వైపు చూచి అక్కడ నీటి వనరు ఉన్నదని గ్రహించి యొర్ధాను కోరుకొని అక్కడకు వెళ్ళడానికి కోరుకున్నారు. అబ్రహాము హెబ్రోనులో మమ్రె వద్ద ఉండెను.
అబ్రహాము యుద్దము చేయుట
సొదొమ రాజు, గోమోర రాజు , అద్మా రాజు, సెబోయీము రాజు, బెలారాజగు సోయారులు ఏకమై వారిని అనేక సంవత్సరాలు సామంతులుగా చేసిన ఎలాము, గోయీము, షీనారు , ఎల్లాసరు రాజుల మీద యుద్దానికి వెళ్ళి మరల ఓడిపోవడం చేత శత్రువులు సొదొమో, గోమోరలో ఉన్న ఆస్తిని తీసుకొని పొతు వారు సొదొమలో ఉన్న లోతుని కూడా బంధించి తీసుకెళ్లారు. అది తెలిసిన అబ్రహాము తన ఇంట ఉన్న వారిని మూడు వందల పద్దెనిమిది మందిని తీసుకొని పోయి రాత్రి వేళ వారిని ఎదురించి వారిని తరిమి కొట్టి లోతును అతని స్త్రీలను, ఆస్తిని విడిపించి తీసుకొని వచ్చారు. యుద్ధం నుండి పారిపోయిన సొదొమ రాజు అబ్రహాము చేసిన పని తెలుసుకొని అతని కలుసుకోవడానికి వచ్చి మనుషులను తనకి అప్పగించి వస్తువులను తీసుకోమని చెప్పినప్పుడు అబ్రహాము తన ప్రజలను మాత్రమే తీసుకొని మిగిలిన వాటిని సొదొమ రాజుకే ఇచ్చి భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు నేను అబ్రహామును ధనవంతున్ని చేసాను అని అనకూడదు అని మొత్తం ఇచ్చి వేశాడు. అబ్రహము షాలేము రాజు మెల్కిసెదేకు రొట్టెను ద్రాక్షసారాయమును కొనివచ్చి అబ్రహాముకు ఆశ్వీరచనములు పలికాడు.
యిష్మాయేలు
అబ్రహాముకు సారాతో పిల్లలు పుట్టక పోవడం వలన ఆమెకు ఉన్న ఒక ఐగుప్తు దాసి కన్య హాగారును స్వీకరించి తనకు బిడ్డలు కలుగ జేయమని కోరింది. ఆమె గర్భం దరించినప్పటి నుండి సారాను చులకనగా చూడటం మొదలు పెట్టేది. సారాయి తరువాత ఆమెను పలు విధాలుగా ఇబ్బంది పెట్టగా ఆమె పారిపోయినది.
ఒడంబడిక - సున్నతి
అబ్రామునకు తొంబది తొమ్మిది సంవత్సరాల వయసులో దేవుడు అబ్రాముతో ఒక ఒడంబడిక ఏర్పాటు చేసుకొని ఆయన పేరును మార్చి అబ్రహాము అని పెట్టెను. ఇక నిన్ను అనేక జాతులకు తండ్రిగా చేసెదను అని చెప్పెను. నేను నీకు కానను భూమిని నీకు నీ సంతతికి ఇస్తాను అని చెప్పాడు. ఈ ఒడంబడిక గుర్తుగా సున్నతి చేసుకొనవలయును అని చెప్పారు. అలానే సారాయి పేరును సారా అని మార్చారు. ఆమె సకల జాతులకు తల్లి అగును అని చెప్పారు.
అబ్రహాము వేడుకోలు
మమ్రే యొద్ద ఉన్న సింధూర వృక్ష వనమున అబ్రహము తన గుడారము దగ్గర వుండగా ముగ్గురు వ్యక్తులు అక్కడ ఆయన ముందు వున్నారు. అబ్రహము గుడారము వెళ్ళి వారిని తన ఇంటిని సందర్శించమని అడిగి వారికి అతిధ్యమిచ్చారు. వారు తరువాత సారా గురించి వాకబు చేసి ఆమె మరుసటి సంవత్సరానికి ఆమె ఒక కుమారుని కనును అని చెప్పిరి. అది తలుపు చాటున నిలచి విన్న సారా తనలో తాను నవ్వుకుంది. అక్కడ నుండి సొదొమ వైపు వారు వెళుతూ అబ్రహాముకు తాము పోవుచున్న పని గురించి చెప్పారు. అక్కడి ప్రజలు పాపపు జీవితము గురించి తన చెవిన పడిన విషయమును అబ్రహముతో చెప్పడం జరిగినది. అబ్రహాము దేవునితో చెడ్డ వారితో పాటు మంచి వారిని కూడా నాశనం చేయుదురా అని ప్రశ్నించెను. ఆ పట్టణములో ఏబది మంది మంచి వారు ఉన్నచో ఆ నగరమును నాశనము చేయక కాపాడవా అని అడుగగా దేవుడు ఆ పట్టణమున ఏబది మంది మంచి వారు ఉన్నట్లయితే వారిని కాపాడుతానని చెప్పెను. ఆ విధంగా అడుగుతూ చివరకు పది మంది మంచి వారు ఉన్న ఆ పట్టణమును పాడు చేయవద్దని చెప్పగా దేవుడు దానికి ఒప్పుకోని అక్కడ నుండి వెళ్ళి పోవడం జరిగింది.
అబ్రహాము - అబీమెలెకు
అబ్రహాము అక్కడ నుండి నేగేబునకు వెళ్ళి కాదేషు , షూరు మధ్య ఉన్న గెరారులో పరదేశివలే నివసిస్తూ ఉన్నాడు. తన భార్యను చెల్లెలిగా చెప్పి అక్కడ జీవించేవాడు. గెరారు రాజు అబీమెలెకు సారాను తన అంతఃపురమునకు చేర్చుకున్నాడు. కాని దేవుడు ఆ రాజుకు కలలో కనపడి ఆమె వివాహిత అని చెప్పి, ఆమె వలన నీవు చనిపోతావు అని చెప్పగా అందుకు ప్రభూ నేను నిర్ధోషిని అని చెప్పి, అబ్రహామే ఆమె తన చెల్లి అని చెప్పిన సంగతి ఆమె కూడా అబ్రహాము తన సోదరుడు అని చెప్పినందుకు దేవుడు అతనిని మన్నించి అబ్రహాముకు సారాను అప్పగించమని చెప్పి అబ్రహాము గొప్పతనను గురించి ఆయన ప్రవక్త అని , ఆయన కొరకు విన్నపములు చేస్తాడు అని చెప్పి, సారాను అబ్రహాముకు అప్పగింపకపోతే తాను మరణిస్తాడు అని చెప్పెను. అబిమేలేకు అబ్రహాముకు సారాను అప్పగించి గొర్రెలను, గోడ్లను, దాసిదాసులను అబ్రహాముకు ఇవ్వడం జరిగింది. అప్పుడు అబిమెలేకు ఇంటిలో ఉన్న వారు గర్భం ధరించారు. అంతకు ముందు దేవుడు వారి గర్భములను మూసివేసేను.
అబ్రహామునకు వాగ్ధాన ఫలం
దేవుడు అబ్రహామునకు మాటఇచ్చినట్లే దేవుడు సారా పట్ల కనికరం చూపి ఆమె గర్భం దాల్చి కుమారున్నీ కనింది, ఆ కుమారుడే ఈసాకు. ఈసాకు పుట్టినప్పుడు అబ్రహాము వయసు 100 సంవత్సరాలు. సారా అబ్రహాముతో హాగారును మరియు యిష్మాయేలును ఇంటి నుండి పంపించి వేయమని అడుగగా ఆయన చాలా బాధ పడ్డాడు. దేవుడు ఆయనకు ఈసాకే తన వారసుడు అని చెప్పగా అలానే చేశాడు. కాని దేవుడు వాగ్ధాన ఫలముగా ఉన్న ఈసాకును బలిగా అర్పించమని అడిగారు. మోరియా ప్రదేశమున అబ్రహాము దేవుడు చూపించిన కొండ దగ్గరకు ఈసాకును బలి ఇవ్వడానికి ఉదయాన్నే , ఒక గాడిద మీద బలికి కావలసిన అన్ని వస్తువులను తీసుకొని ఇద్దరు సేవకులతో బయలుదేరి వెళ్ళాడు. తన సేవకులను క్రిందనే ఉంచి ఈసాకుకు కట్టెల మోపును ఇచ్చి తాను కత్తి మరియు నిప్పు తీసుకొని కొండమీదకు వెళ్ళాడు. మార్గ మధ్యలో ఈసాకు తమకు బలికి కావలసిన బలి వస్తువు కొరకు అడుగగా దేవుడే సమకూరుస్తాడు అని సమాధానం చెబుతాడు. ఆ కొండ మీదకు పోయిన తరువాత అక్కడ బలి ఇవ్వడానికి బలి పీఠం ఏర్పాటు చేసి మొత్తం సమకూర్చిన తరువాత కుమారున్నీ బంధించి బలి ఇవ్వడానికి కత్తిని తీసుకొనగా అప్పుడు యావే దూత అబ్రహామును ఈసాకును ఏమి చేయవద్దని చెప్పి, అబ్రహాము హృదయం తనకు తెలుసు అని, తన కుమారున్నీ కూడా చంపడానికి వెనుకాడ లేదని అక్కడ బలి ఇవ్వడానికి ఒక పొట్టేలు పొదలో ఉన్నదని తెలియ చేస్తుంది. అప్పుడు ఆ పొట్టేలును బలిగా అర్పించడం జరుగుతుంది. అక్కడ నుండి వచ్చే సమయంలో మరల దేవుని దూత ఆయనను దీవిస్తుంది. బెర్షాబా వచ్చి మరణించే వరకు అక్కడే ఉన్నారు.
అబ్రహాము పండు ముసలి వయసుకు వచ్చినప్పుడు తన కుమారుడు పెండ్లి చేయావలేనని సంకల్పించి తాను తన తండ్రి స్వదేశమున ఒక అమ్మాయిని తన కుమారునికి ఇవ్వాలి అని సంకల్పించిన తాను వెళ్లలేని పరిస్తితిలో తన దగ్గర ఉన్న ప్రధాన సేవకుడిని పిలిచి తన తండ్రి ఇంటికి వెళ్ళి తన చుట్టాలలో ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి ఈసాకు పెండ్లి చేయాలి అని కోరడం జరిగింది. అయితే ఒక వేల అక్కడ ఎవరు ఇష్ట పడక పోయిన యెడల నీ కుమారుని అక్కడకు తీసుకువెల్లమందురా అని అడిగినప్పుడు అబ్రహాము దేవుడు అతనికి చేసిన వాగ్ధానం గుర్తు చేసుకొని దేవుడు తనను వదలి పెట్టి రమ్మనిన ప్రదేశమునకు మరల తిరిగి తన కుమారుని పంపించడానికి ఒప్పుకోలేదు.
అబ్రహాము భార్యలు - మరణం
సారా కనానులో హెబ్రోనులో నూట ఇరవై ఏడేండ్లు వయసులో మరణించినది, ఆమెను మక్ఫెలాలో సమాది చేశారు. అబ్రహాము చివరిగా కతూరా అను స్త్రీ ని వివాహమాడగా ఆమె అతనికి ఆరుగురు బిడ్డలను కన్నది. అబ్రహాము తనకు ఉన్నది అంతయు ఇస్సాకునకు ఇచ్చి మిగినలిన వారికి బాహుమనములను ఇచ్చి వారిని తూర్పు వైపుగా తూర్పు దేశము వైపు పంపి వేశాడు. ఆయన చనిపోయే సమయానికి అబ్రహాము వయస్సు నూట డెబ్బై ఐదు సంవత్సరాలు. అబ్రహామును ఈసాకు , యిష్మయేలు మమ్రేకు తూర్పున ఉన్న మక్ఫెలా గుహలో పాతిపెట్టారు. అతని భార్య సారాను కూడా అక్కడే పాతి పెట్టిరి.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి