పేజీలు

27.12.23

సువార్త కారుడైన యోహాను - ప్రియమైన శిష్యుడు

 యోహాను 20: 2-8 

అంతట ఆమె సీమోను పేతురువద్దకు, యేసు ప్రేమించిన  మరియొక  శిష్యుని  యొద్దకు పరుగెత్తుకొని పోయి,  "వారు ప్రభువును  సమాధినుండి  ఎత్తుకొనిపోయిరి. ఆయనను ఎక్కడ ఉంచిరో మేము ఎరుగము"అని చెప్పెను. అపుడు పేతురు, ఆ శిష్యుడు సమాధివైపునకు సాగిపోయిరి. ఆ ఇద్దరును పరుగెత్తుచుండిరి. కాని, ఆ శిష్యుడు పేతరుకంటే వేగముగా పరుగెత్తి ముందుగ సమాధియొద్దకు చేరెను. అతడు వంగి నారవస్త్రములు అచట పడియుండుటను చూచెను. కాని, లోనికి వెళ్లలేదు. ఆ తరువాత సీమోను పేతురు వచ్చి,  సమాధిలో ప్రవేశించి, అచట పడియున్న నారవస్త్రములను, ఆయన తలకు కట్టిన తుండుగుడ్డను చూచెను. ఆ తుండుగుడ్డ నారవస్త్రములతోపాటు కాక, విడిగచుట్టి ఉంచబడెను. సమాధి యొద్దకు మొదట వచ్చిన శిష్యుడు కూడ లోనికి వెళ్ళి చూచి నమ్మెను

ధ్యానం:  ఈ రోజు సువార్తకారుడు పునీత యోహాను గారి పండుగను కొనియాడుతున్నాము. ఈ పునీతుని గొప్పతనం, యోహాను సువార్తను చదివినప్పుడు మనకు తెలుస్తుంది. సువార్తను నలుగరు సువిశేషకారులు రాసినప్పటికి యోహాను సువిశేషం ఒక ప్రత్యేకత కలిగిఉన్నాది. యోహాను గారు యేసు ప్రభువు శిష్యులలో ఒకరుగా ఉన్నారు. ప్రతి సువిశేషమునకు ఒక గుర్తు ఉన్నది. యోహాను సువిషమునకు ఉన్న గ్రద్ద గుర్తుగా ఉన్నది. ఎందుకు గ్రద్ద గుర్తుగా ఉన్నది అని ఒక సారి మనం పరిశీలించినట్లయితే, ఒక విషయం మనకు తెలుస్తుంది. అది గ్రద్ద ఆకాశంలో ఎక్కడో విహరిస్తున్నప్పటికి భూమిమీద ఉన్న కీటకాన్ని కాని లేక అది ఏమి పట్టుకోవాలనుకున్నదో దానిని ఖచ్ఛితముగా ఎటువంటి పొరపాటు లేకుండా అది దానిని పట్టుకోగలదు. గ్రద్దకు ఖచ్చితమైన గురి ఉన్నది. యోహాను  సువిశేషంలో మొదటి నుండి యేసు ప్రభువు దేవుడు అనే విషయమును వెల్లడి చెస్తున్నారు. మిగిలిన సువిశేష కారులు యేసు ప్రభువు పుట్టుకతోటి, లేక ఆయన జ్ఞానస్నానంతో మొదలు పెడుతున్నారు. కాని యోహాను మాత్రం తన సువిశేషాన్ని యేసు ప్రభువు ఎలా తండ్రితో కలిసి ఉన్నాడని మరియు ఏవిధముగా ఆయన దేవుడు అనే విషయాన్ని సువిశేషం మొదటి నుండి చెబుతున్నారు. 

యోహాను సువిశేషం, ఎందుకు యోహాను ఈ సువిశేషాన్ని రాశారో తెలియజేస్తుంది.   యోహాను మూడు సార్లు తన సువిశేష ఉద్దేశ్యం ఏమిటి అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. సువిశేష మొదటిలో , మధ్యలో మరియు చివరిలో ఎందుకు ఆయన సువిశేషం రాసినది తెలియజేస్తున్నాడు. ఏమిటి ఆ ఉద్దేశ్యం అంటే, యేసు ప్రభువును అందరు విశ్వసించాలి, ఆయనను విశ్వాసించిన వారికి నిత్యజీవం ఇవ్వబడుతుంది అనే విషయాన్ని తెలియజేయడమే ఈ సువిశేష ఉద్దేశ్యం. ఈ సువిశేషం రెండు భాగాలుగా చేసిన మొదటి భాగం 7 అద్భుతాలు యేసు ప్రభువు చేస్తున్నారు. ఈ ఏడు అద్భుతాలు కూడా దేవుడు మాత్రమే చేయగలిగేటువంటి అద్భుతాలు. ఎంతటి గొప్ప వారు అయినప్పటికీ  దేవుడు కాకపోతే ఆయన చేసిన అద్భుతాలు ఎవరు చేయలేరు. యేసు ప్రభువు ఎవరు అనే విషయాన్ని యోహాను సువిశేషకారుడు యేసు ప్రభువు ఇచ్చే అనుగ్రహమును బట్టి తెలియజేస్తున్నాడు.  అవి ఏమిటి అంటే, యేసు ప్రభువు జీవ జలం, యేసు ప్రభువే జగజ్యోతి, యేసు ప్రభువే జీవహారం. యేసు ప్రభువే జీవ వాక్కు.యేసు ప్రభువే తండ్రి వద్దకు మార్గము.  ఈ సువిశేష రెండవ భాగాన్ని మహిమ పుస్తకం అంటారు. ఈ భాగంలో ఎలా యేసు ప్రభువు తండ్రి పవిత్రాత్మలతో కలసి ఉన్నది. మనం ఎలా దేవునితో కలసి ఉండవచ్చు అనే విషయములు కూడా తెలుసుకుంటాము. శిష్యులతో యేసు ప్రభువు ఎటువంటి సాన్నిహిత్యాన్ని కోరుకుంటున్నారు. ఎలా దానిని శిష్యులు పొందవచ్చు అనే విషయం మనం తెలుసుకుంటాము. శిష్యులను ప్రభువు ఎంతలా ప్రేమిస్తున్నారు అనే విషయము కూడా ఈ సువిశేషం ద్వారానే మనం నేర్చుకుంటాము. 

ఎవరు ఈ యోహాను? యేసు ప్రభువు శిష్యులలో ఒకడు. జబదాయి కుమారుడు. ఈయన కడరా భోజన సమయమున యేసు ప్రభువు హృదయమునకు దగ్గరగా ఉన్నాడు. ఆయన  యేసు ప్రభువుకు అంతా దగ్గరగా ఉన్నాడు కనుక దేవుని గురించి ఇతర సువిశేషకారులు తెలుపని విషయాలను వివరిస్తున్నారు. హృదయము దగ్గరగా ఉన్నాడు అంటే ప్రభువు చేత కూడా ఈ శిష్యుడు ప్రేమించబడ్డాడు. అంతేకాదు శిష్యులు అందరు యేసు ప్రభువును బంధించినప్పుడు వెళ్ళి పోయినను ఈ శిష్యుడు మాత్రము ఆయనను ఎవరికి తెలియకుండా అనుసరిస్తున్నాడు. సిలువ క్రింద మరియమాతతో పాటు ఉన్నాడు. అందుకే యేసు ప్రభువు తన తల్లిని తన ప్రియయమైన శిష్యునకు అప్పగించాడు. 

ప్రభువుతో సంభాషణ మరియు ప్రార్దన: ప్రభువా మీరు ప్రేమించిన మీ శిష్యున్ని జ్ఞానంతో నింపారు. కేవలం జ్ఞానంతో నింపటమే కాకుండా దేవుని గురించితెలుకొని నేర్పే వానిగా తీర్చిదిద్దారు. మీ మీరు చేసిన ప్రతి పని మీరు  దేవుడు అని తెలియజేస్తున్నది అని తెలుసుకోలేకపోయాము. మీ శిష్యుడు మిమ్ములను మాత్రమే పరిలించే విధంగా మీరు చేశారు కనుక మిమ్ములను మాత్రమే ధ్యానిస్తూ.మీగురించి నిగూడ సత్యాలను తెలుసకొనుటకు అవకాశం ఇస్తున్నారు. ప్రభువా మీరు చేసిన అధ్భుతాల ద్వారా మీరు దేవుడు అనే విషయాన్ని మాకు తెలియజేస్తున్నారు. అంతె కాక మేము ఏ విధంగా మీతో కలసి ఉండాలో చెబుతున్నారు. మీరు లేకుండా మేము ఏమి చేయలేము అని చెబుతున్నారు. మేము మీతో కలసి ఉండాలి అని కోరుతున్నారు. ప్రభువా! మమ్ములను కూడా మీ ప్రియమైన శిష్యున్ని ప్రేమించినట్లుగానే ప్రేమించండి. మమ్ములను కూడా మీ హృదయమునకు  దగ్గరగా ఉండనివ్వండి. దాని ద్వారా యోహాను వలె మేము కూడా మీ గురించి ఎక్కువగా తెలుసుకొని మీతో ఐక్యం అయ్యేలా మమ్ము దీవించండి. ఆమెన్. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

సమూయేలు చరిత్ర

 సమూయేలు చరిత్ర  సమూవేలు  పవిత్ర గ్రంధంలో ఉన్న న్యాయాధిపతులలో చివరి  న్యాయాధిపతి మరియు న్యాయాధిపతులో ఎక్కువ కాలం జీవించినవాడు. యిస్రాయేలు చర...