పేజీలు

11.12.23

మత్తయి 18:12-14

మత్తయి  18:12-14

ఒకడు తనకున్న నూరు గొర్రెలలో ఒకటి తప్పిపోయినచో, తక్కిన తొంబదితొమ్మిదింటిని ఆ పర్వత ప్రాంతముననే విడిచి దానిని వెదకుటకు పోడా? అది దొరికినపుడు తప్పిపోని తక్కిన తొంబది తొమ్మిదింటికంటే దాని విషయమై ఎక్కువగా సంతసించును అని నిశ్చయమముగా చెప్పుచున్నాను. ఆ రీతిగా ఈ పసిబాలురలో ఒకడైనను నాశమగుట పరలోకమదుండు మీ తండ్రి చిత్తము కాదని తెలిసికొనుడు. 

ధ్యానము:  యిస్రాయేలు ప్రజలు దేవున్ని వారి కాపరిగా చూస్తున్నారు. ప్రవక్తలు ముఖ్యంగా ఏహెజ్కెల్, యోషయా మరియు యిర్మీయా ప్రవక్తలు అనేక పర్యాయాలు దేవున్ని కాపరి అని సంబోధిస్తున్నారు. కాపరి తప్పిపోయిన గొర్రెలను వెదకి  మరల తన మందలోనికి  తీసుకొని వస్తాడు. మెస్సయ్యా తప్పిపోయిన వారిని మరల దేవుని దగ్గరకు తీసుకొని వస్తాడు అని వారు నమ్మేవారు. యేసు ప్రభువు కూడా అదే చేస్తున్నాడు. ఇక్కడ యేసు ప్రభువు మాత్రమే కాపరి కాదు, తప్పి పోయిన వారిని తిరిగి యేసు ప్రభువు వద్దకు తీసుకువచ్చే వారు అందరు కాపరిగా ఉంటారు. యేసు ప్రభువు తప్పిపోయిన వారిని వెదకి వారి, సమస్యలను తీర్చి మరల వారిని తండ్రి దగ్గరకు తీసుకురావడానికి, ఒకరి వద్దకు కాదు ప్రతి వ్యక్తి వద్దకు వస్తున్నారు. అందరినీ తండ్రి దగ్గరకు తీసుకురావడానికి చేయవలసినవి అన్ని కూడా చేస్తున్నారు. 

ఎవరు తప్పి పోయారు? నీతిని తప్పిన ప్రతి వ్యక్తి , పరలోక రాజ్యానికి దూరంగానే ఉన్నారు వారు అందరు తప్పి పోయిన వారే.  అటువంటి వారి అందరినీ ప్రభువు తన వద్దకు తీసుకు వస్తున్నారు, పరలోక రాజ్యంలో స్థానం కలిపిస్తున్నారు. వీరు నీతిని తప్పుటకు అనేక కారణాలు ఉన్నాయి. ఎక్కువ సార్లు ఇలా జరుగుటకు యిస్రాయేలు నాయకులే కారణం అయ్యారు. ఎందుకు వారు తప్పి పోయారు అని ప్రశ్నించినప్పుడు అనేక సమాధానాలు మనకు వస్తాయి. వాటిలో ముఖ్యమైనవి అనేక మంది అవకాశం లేని వారు వున్నారు.  వారని దేవునికి సంబంధించిన అన్ని విషయాలలో దూరంగా పెట్టడం జరిగినది. కొంతమంది వారి స్వల్ప ఆనందం కోసం వెళ్ళి తిరిగి రాలేక తప్పి పోయిన వారు ఉన్నారు. ఎటువంటి కారణాలతో వారు దూరంగా ఉన్న,  వారిని యేసు ప్రభువు మరల దేవుని దగ్గరకు తీసుకొని వస్తున్నారు. ఎవరిని కోల్పోవడం ప్రభువుకు ఇష్టం లేదు. అందుకె యేసు ప్రభువే తండ్రితో నీవు నాకు ఇచ్చిన వారిని, ఎవరిని కొల్పోననీ అంటున్నారు. వారి కోసం ప్రార్ధన చేస్తున్నారు. 

యోషయ 40: 11 లో "ఆయన కాపరివలె తన మందను మేపును. గొర్రె పిల్లలను తన బాహువులతో కూర్చి, రొమ్మునయనించుకొని మోసికొనిపోవును."కాపరి వలె ఆయన తన మందను మెపును, ఆయన తన గొర్రె పిల్లనను తన వడిలో ఆడించును. యెహెజ్కెల్ 34:1 "యిస్రాయేలు కాపరులారా మీకు అనర్ధము తప్పదు. మీరు మీ కడుపు నింపుకొనుచున్నారేగాని గొర్రెలమందలను మేపుటలేదు…  తప్పిపోయిన వానిని వెదకి తొలుకొని వచ్చుట లేదు పైగా వారి పట్ల క్రూరముగా , కఠినముగా ప్రవర్తించుచున్నారు." నా గొర్రెల కోసం వెదుకుదును.   ప్రభువే నా కాపరి అనే కీర్తన అందరికీ ఇష్టం ఎందుకంటే ప్రభువు మనలను ఎంత కాపాడుతాడో ఎటువంటి బయళ్ళు దగ్గరకు తీసుకుపోతారో చూస్తాము. ప్రభువు మనకు కాపరి అయితే మనలను ఆయన ఏ బాటలో తీసుకుపోతున్న చింత లేకుండా ఉండవచ్చు. కాని యిస్రాయేలు కాపరులు అలా లేరు అనే విషయం యెహెజ్కెల్ గ్రంధంలో చూస్తాము. తప్పిపోయిన వారి పట్ల ఈ కాపరులు కఠినముగా వ్యవహరించారు. వారిని సమాజంలో తక్కువగా చూడటం మొదలపెట్టారు, అగౌరపరిచారు. వారిని అపవిత్రులుగా చేశారు. ఇటువంటి కారణాలే యేసు ప్రభువు సమయంలో కూడా ఉన్నాయి. 

ఒక వ్యక్తిని కోల్పోవడం  కూడా యేసు ప్రభువుకి  ఇష్టం లేదు. అనేకమంది కాపరులు వారి గౌరవం గురించి ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చేవారు. కాపరిగా ఉండటాన్ని అంత గొప్ప పనిగా చూసేవారు కాదు. కాని యేసు ప్రభువు మంచి కాపరిhttps://amruthavellaturi.blogspot.com/2023/03/blog-post_48.html. ఒక గొర్రె మంద నుండి బయటకు పోతే మంద మొత్తము పోయినట్లుగా ఆయన బాధపడుతారు. అది దొరికినంత వరకు ఆయన దాని కోసం వెదకుతారు. దొరికినంత వరకు వేదకుతానే ఉంటారు. ఎందుకు ప్రభువు అంతగా వెదకుతున్నారు? ఒక వ్యక్తి  తప్పిపోయిన సమాజం మొత్తం దాని బాధను అనుభవిస్తుంది. ఎందుకంటే ఆ వ్యక్తి కూడా దేవుని సృష్టే. దేవుని బిడ్డే. కొన్ని సార్లు ఒక వ్యక్తి తప్పు చేయడం వలన సమాజం మొత్తం పర్యవసానం అనుభవిస్తుంది.  యిస్రాయేలు నాయకులు తప్పు చేసినప్పుడళ్ల అనేక బాధలు ప్రజలు అనుభవించారు. 

  యేసు ప్రభువు చెప్పిన ఈ  ఉపమానం చిన్న పిల్లల మీద, బలహీనులుగా ఉన్న మీద ప్రభువు కరుణ ఎలా ఉన్నదో మనం తెలుసుకోవచ్చు.   అధికారులు, నాయకులు  ఎవరు కూడా ఈ చిన్న బిడ్డలను కోల్పోవడానికి కారణం కాకూడదు అని ప్రభువు కోరుతున్నారు.  ఈ తప్పిపోయిన వారిని ఎలా మరలా సంఘం లోనికి తీసుకొని రావాలి. వారిని మరల తీసుకొనివచ్చినప్పుడు  ఎవరు అడ్డుకోవలదు అని ప్రభువు  చెబుతున్నారు. అందుకే యేసు ప్రభువు తప్పి పోయిన వారి వద్దకే వెళుతున్నారు, పాపులు, సుంకరులు మొదలగువారితో మాటలడుతున్నారు. వారిని అడ్డుకోవాలనుకున్న వారిని ముఖ్యముగా పరిసయ్యులను, ధర్మ శాస్త్ర బోధకులను  వారిస్తున్నారు. 

ప్రభువుతో సంభాషణ మరియు ప్రార్ధన: ప్రభువా ! మీరు మంచి కాపరి. మీరు తప్పి పోయిన మమ్ములను వెదకి మరలా తండ్రి వద్దకు చేర్చుటకు చాలా కృషి చేశారు. ప్రభువా నేను తప్పి పోవుట మీకు ఇష్టం లేదు అని తెలుసుకొని ఎంతో ఆనందంగా ఉన్నాము. ప్రభువా మీరు ఎలా అయితే ఎటువంటి కారణాలతో తప్పిపోయిన మమ్ము చీదరించుకోకుండా మేము మీతో ఉండాలిన కోరుకుంటున్నారు. కొన్ని సార్లు మా స్వార్ధం కోసం, అవసరాల కోసం కూడా మేము దూరంగా వెళ్ళి పోతున్నాము, అటువంటి సమయాలలో మీ ప్రేమను గురించే అనుగ్రహం మాకు దయచేయండి. మీ ప్రేమను గుర్తించి, మీ వద్దకు తిరిగి వచ్చే వారిని మేము ఎప్పుడు అడ్డుతగలకుండా ఉండే మంచి మనసు మాకు దయచేయండి. ఎవరు మీ నుండి తప్పి పోవుటకు మేము కారణం కాకుండా మా జీవితాలను మలచండి. ప్రభువా తప్పి పోయిన వారిని తిరిగి పొందినప్పుడు మీకు ఉండే ఆనందంలో మమ్ములను కూడా భాగస్వాములను చేయండి. ఆమెన్ 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

సమూయేలు చరిత్ర

 సమూయేలు చరిత్ర  సమూవేలు  పవిత్ర గ్రంధంలో ఉన్న న్యాయాధిపతులలో చివరి  న్యాయాధిపతి మరియు న్యాయాధిపతులో ఎక్కువ కాలం జీవించినవాడు. యిస్రాయేలు చర...