పేజీలు

12.11.22

లూకా 21: 5-19

లూకా 21: 5-19 


కొందరు ప్రజలు ఆలయమును గురించి ప్రస్తావించుచు "చక్కని రాళ్ళతోను, దేవునికి అర్పింప బడిన వస్తువులతోను ఎంత అందముగా శోభిల్లుచున్నదో చూడుడు" అని చెప్పుకొనుచుండిరి. అంతట యేసు వారితో "ఈ కట్టడమును మీరు చూచుచున్నారు గదా! ఇచ్చట రాతి పై రాయి నిలువని కాలము వచ్చును. అంతయు నాశనము చేయబడును" అనెను. అప్పుడు వారు "భోదకుడా! ఇవన్నియు ఎప్పుడు సంభవించును? దానికి సూచనయేమి?" అని అడిగిరి. అందుకు, ఆయన "మిమ్ము ఎవ్వరును మోసాగింపకుండునట్లు మెలకువగా ఉండుడు. మోసపోకుడు. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనను  అనియు, కాలము సమీపించినది అనియు  చెప్పెదరు. కాని మీరు వారి వెంట వెళ్ళవలదు. యుద్దములను, విప్లవములను గూర్చి వినినపుడు మీరు భయపడవలదు. మొదట ఇవి అన్నియు జరిగి తీరును. కాని, అంతలోనే అంతము రాదు" అనెను. ఇంకను ఆయన వారితో ఇట్లనెను: "ఒక జాతి మరియొక జాతిపై, ఒక రాజ్యము మరియొక రాజ్యముపై దాడి చేయును. భయంకర భూకంపములు, పలుచోట్ల కరువులు, తెగుళ్లు వ్యాపించును. ఆకాశమున భయంకరమైన దృశ్యములు, గొప్ప సూచనలు కనిపించును. ఇవి అన్నియు సంభవింపక పూర్వము వారు మిమ్ము పట్టి, ప్రార్దనామందిరములకును, చెరసాలలకును అప్పగించి, హింసింతురు. నా నామము నిమిత్తము రాజులయొద్దకు, అధిపతుల యొద్దకు మిమ్ములను తీసుకొనిపోవుదురు. ఇది మీరు సాక్షులుగ ఉండవలసిన సమయము. మీరు అచట చెప్పవలసిన దానిని గూర్చి కలవరపడకుడు. విరోధి మీకు ఎదురాడుటకును, మిమ్ములను ఖండించుటకును వీలుకాని వాక్కును, వివేకమును ప్రసాదింతును. తల్లిదండ్రులు, సోదరులు, బంధువులు, మిత్రులుకూడ మిమ్మును పట్టిఇచ్చేదరు. మీలో కొంత మందిని చంపించెదరు. నా నామము నిమిత్తము మిమ్ములను అందరు ద్వేషింతురు. కాని మీ తలవెంట్రుక కూడ రాలి పోదు. మీ సహనము వలన మీరు మీ ప్రాణములను దక్కించుకొందురు. 

కొందరు ప్రజలు ఆలయమును గురించి ప్రస్తావించుచు "చక్కని రాళ్ళతోను, దేవునికి అర్పింప బడిన వస్తువులతోను ఎంత అందముగా శోభిల్లుచున్నదో చూడుడు" అని చెప్పుకొనుచుండిరి. యెరుషలేము దేవాలయము గురించి యిస్రాయేలు ప్రజలు ఎప్పుడు చాలా గర్విస్తు ఉండేవారు. ఎందుకంటే అది వారి గొప్ప తనానికి సూచనలా వారు భావించేవారు. అంత పెద్ద కట్టడము యెరుషలేములో మరియొకటి  లేదు.   అది వారు దృష్టిలో ఎంత గొప్పదో మనం ఊహించవచ్చు. కేవలం పెద్ద కట్టడము మాత్రమే కాదు అది వారి విశ్వాసానికి, దేవుని మీద వారికి గల ప్రేమకు కూడా గుర్తు.  దావీదు మహారాజు  దేవునికి ఆలయం లేదు, నేను ఇక్కడ రాజప్రసాదంలో ఉంటున్నాను అని భాధ పడి, దేవాలయం కట్టాలని ఎంతో ఆశ పడ్డాడు. కాని దేవుడు మాత్రము ఆయన చేతులు రక్తం చింధించినవి అని, దేవాలయం ఆయన చేత కట్టనివ్వలేదు. తరువాత దేవాలయమును సోలోమోను చెత కట్టించడం జరిగినది. సోలోమోను కట్టించిన దేవాలయము యొక్క గొప్పతనం మనం వింటూ వుంటాం. ఎక్కడెక్కడి నుండో వారు గొప్ప గొప్ప వాటిని తీసుకొని వచ్చి గొప్ప దేవాలయం నిర్మించడం జరిగినది. కాని అది కట్టిన నాలుగు వందల సంవత్సరాల తరువాత, ఆ దేవాలయం బాబిలోనియా రాజు నెబుకద్నేసరు రాజు దండెత్తి వచ్చినప్పుడు దేవాలయం ద్వంసం చేస్తున్నారు. అక్కడి విలువైన వస్తువులను తీసుకొని పోతున్నారు. 

 బాబిలోనియా ప్రవాసం ముగిసిన పిదప యిస్రాయేలు ప్రజలు మరల దేవాలయం కట్టుకున్నారు, ఎజ్రా, నేహామియా ఈ కార్యానికి పూనుకొని వారు గొప్ప దేవాలయం నిర్మించారు. అయితే ఈ దేవాలయం చాలా సంవత్సరాలు కట్టారు, ఇది పూర్తి అయిన  కొద్ది కాలమునకే ఈ దేవాలయం నాశనం చేయ బడింది. ఈ దేవాలయం కట్టిన తరువాత హెరోదు ఆ దేవాలయముకు ఇంకా ఎక్కువ స్థలంలో దానిని పొడిగించాడు, ఆవిధంగా  ఈ దేవాలయం చాలా సుందరముగా చేశారు. 17 ఎకరాలు ఉన్న దేవాలయాన్ని హెరోదు 36 ఎకరాలకు పెంచడం జరిగింది. చాలా ప్రశస్తమైన రాళ్ళతో దేవాలయం కట్టడం చేయడం జరిగింది, దేవాలయం ముఖగోడ  మొత్తం బంగారం పొందుపరచబడింది, బంగారం లేని చోట తెల్లని పాల రాయితో కట్టడం జరిగింది. ఇది యిస్రాయేలు వైభవానికి, ప్రశస్తికి గుర్తుగా ఉండేది. అటువంటి గొప్ప కట్టడం వారి జీవితాలలో ముఖ్యమైన స్థానం కలిగివుంది. వారి జీవితం మొత్తం  ఆ దేవాలయం చుట్టే తిరిగేది. దేవాలయంలో ఉన్న దేవుని సాన్నిధ్యం కంటే వీరి మనసు దేవాలయం అందం మీదే ఎక్కువగా ఉండేది. అందుకే యేసు ప్రభువు వారిని బలి వస్తువులను పవిత్ర పరిచే బలిపీఠం  గొప్పదా ? లేక బలి పీఠం మీద అర్పించబడిన బంగారం గొప్పదా? అని కొన్ని సార్లు మన ఆలోచనలు కూడా అలానే ఉంటాయి. ఏది గొప్పో నిర్ణయించుకోలేక పోతాము.

అంతట యేసు వారితో "ఈ కట్టడమును మీరు చూచుచున్నారు గదా! ఇచ్చట రాతి పై రాయి నిలువని కాలము వచ్చును. అంతయు నాశనము చేయబడును" అనెను. అప్పుడు వారు "భోదకుడా! ఇవన్నియు ఎప్పుడు సంభవించును? దానికి సూచనయేమి?" అని అడిగిరి. ఇంత గొప్ప కట్టడముగా ఉన్న దేవాలయమును యేసు ప్రభువు రాతి మీద రాయి నిలువని రోజు వస్తుంది అని చెబుతున్నారు. ఇది యిస్రాయేలు ప్రజలకు మింగుడు పడని ఒక విషయం ఎందుకు అంటే వారికి కేవలం ఇది ఒక గొప్ప కట్టడం మాత్రమే కాదు, వారి యొక్క సాంఘిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కేంద్రం. కాని దేవుని అలోచనలు  అర్ధం చేసుకోవడంలో విఫలం చెందారు. కారణం ఏమిటి అంటే వీరి ఆలోచనల ప్రకారం వీరు జీవించారు, ఈ ప్రజల్లో ఉన్న ఒక ఆలోచన ఏమిటి అంటే దేవుడు మనలను ఎన్నుకున్నాడు, మనకు ఇక ఎవరు ఎదురు ఉండరు, అని గర్వంతో నివసించేవారు, కాని ఇటువంటి ఆలోచన ఉన్న అన్నీ సమయాలలో దేవుడు వారి నుండి దూరంగా వెళ్ళేవారు, దాని ద్వారా వారు నాశనం చెందేవారు. ఇస్రాయేలు ప్రజలకు వచ్చిన ప్రతి ఆపద, ప్రతి అవమానం, ప్రతి నాశనం కేవలం దేవుడు వారికి దూరం అవ్వడం వలన మాత్రమే జరిగింది. మేము దేవాలయానికి దగ్గర అయ్యాం అనుకుంటున్నాము,  కాని దేవుని నుండి దూరం అయ్యాము ఏమో అని గుర్తించలేక పోతున్నమా? ఇదే ఇస్రాయేలు ప్రజలకు జరిగింది , మనకు కూడా ఇదే జరుగుతుందా ! ఆలోచించాలి. 

అందుకు, ఆయన "మిమ్ము ఎవ్వరును మోసాగింపకుండునట్లు మెలకువగా ఉండుడు. మోసపోకుడు. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనను అనియు, కాలము సమీపించినది అనియు  చెప్పెదరు. కాని మీరు వారి వెంట వెళ్ళవలదు. ఇటువంటివి జరిగినప్పుడు మోసపోవద్దు అని యేసు ప్రభువు చెబుతున్నారు. మోసపోకుండా ఉండుటకు మనం ఏమి చేయాలి? మోసగాడు చెప్పే మాటలను నమ్మకుండా ఉండుటకు ఏమి చేయాలి? మనం చేయవలనసినది ఒక్కటే ఆయన చెప్పిన విధముగా మనం జీవించాలి. ఆయన సాన్నిధ్యాన్ని మన మనసులలో పొందుటకు ప్రయత్నించాలి. ఆయన వాక్కును అనుసరించి జీవించాలి. మరి ముఖ్యముగా ఆయన వలె వారు జీవిస్తున్నారా అని చూడాలి, యేసు ప్రభువు ఎవరిని మోసం చేయలేదు, యేసు ప్రభువు ఎవరిని హత్య చేయలేదు, ఎవరిని క్షమించను అనలేదు, ఎవరిని తృణీకరించలేదు, ఎవరి మీద దౌర్జన్యం చేయలేదు, ఆయన పగ, ప్రతీకారం తీర్చుకోలేదు, శారీరక వాంఛలు తీర్చుకోవడానికి ప్రాకులాడలేదు, ఆయన అహంకారిగా ఉండలేదు,  ముఖ్యంగా మనం అంధకారంలో లేకపోతే ఇది తెలుసుకోవడం సాధ్యం అవుతుంది. 

నా నిమిత్తము మీరు అనేక హింసలకు మీరు గురి అవుతారు , ఇది యేసు ప్రభువును పూర్తిగా మనం అనుసరించడం మొదలుపెట్టినప్పటి నుండి జరుగుతుంది. ఒకసారి మనం క్రైస్తవ చరిత్ర చూసినట్లయితే ఇది మనకు తెలుస్తుంది. స్తేఫాను గారి జీవితం చూసినట్లయితే ఈ విషయం మనకు తెలుస్తుంది. యేసు ప్రభువును అనుసరించడం తప్ప,  అతని జీవితంలో తప్పు ఏమి లేదు కాని ఆయనను అన్ని విధాలుగా పరీక్షకు గురిచేసి, అన్యాయముగా అతనిని హింసించి చంపడం జరిగినది, ఆయన ఏమి మాటలడడో  ఒకసారి గుర్తు చేసుకోండి ఎక్కడ నుండి వచ్చినది ఆ జ్ఞానం కేవలం దేవుని నుండి అందుకే యేసు ప్రభువు చెబుతున్నారు. ఇవి అన్నియు సంభవింపక పూర్వము వారు మిమ్ము పట్టి, ప్రార్దనామందిరములకును, చెరసాలలకును అప్పగించి, హింసింతురు. నా నామము నిమిత్తము రాజులయొద్దకు, అధిపతుల యొద్దకు మిమ్ములను తీసుకొనిపోవుదురు. ఇది మీరు సాక్షులుగ ఉండవలసిన సమయము. మీరు అచట చెప్పవలసిన దానిని గూర్చి కలవరపడకుడు. విరోధి మీకు ఎదురాడుటకును, మిమ్ములను ఖండించుటకును వీలుకాని వాక్కును, వివేకమును ప్రసాదింతును. అలా అని అప్పుడే అంతిమ దీనము వచ్చినది అని కాదు అర్ధం. ఇవి అన్నీ జరిగిన తరువాత కాని ఆ దినము రాదు. నిజానికి మనం ఆ దినము గురించి అంతగా ఆలోచించనవసరం లేదు మనం చేయవలసినది, ఎప్పుడు జాగురుకత కలిగి ఉండటం అప్పుడు ఆ రోజు ఎప్పుడు వచ్చిన మనం సిద్ధంగా ఉంటాము. 

నా నామము నిమిత్తము మిమ్ములను అందరు ద్వేషింతురు. కాని మీ తలవెంట్రుక కూడ రాలి పోదు. మీ సహనము వలన మీరు మీ ప్రాణములను దక్కించుకొందురు. యేసు ప్రభువు చెప్పిన ఈ మాటలు మనం  మీ శరీరమును నాశనము చేసే వారికి భయ పడకుడు అని చెప్పిన మాట వలె మనం ఆలోచించాలి. ఎందుకంటే క్రైస్తవులను ఒక రకముగా శత్రువులు అన్నట్లుగా చూసారు, హింసించారు, కష్ట పెట్టారు కాని ఎవరు వారి విశ్వాసాన్ని ఏమి చేయలేక పోయారు, అన్నీ కష్టాలు పొందుతూ, హింసకు గురి అవుతూ క్రీస్తుకు సాక్షులుగా జీవించారు, ఎందుకంటె వారి ప్రాణమును వారు నిలబెట్టుకున్నారు. 

సహనం క్రైస్తవులకు ఉండవలసిన ఒక గొప్ప గుణం. ఈ సుగుణం మనలను అన్ని భరించే శక్తిని కలిగేలా చేస్తుంది. మనలను దేవునికి ఇష్టమైన వారిగా మారుస్తుంది. ఒక సారి పునీతుల జీవితాలు పరిశీలించినట్లయితే వారు ఎంత సహనము కలిగి ఉన్నారో మనం తెలుసుకోవచ్చు. యేసు ప్రభువు నుండే వారు ఈ సుగుణాన్ని నేర్చుకుంటున్నారు. ఆయనను ఎన్నో అవమానాలుకు గురి చేసిన తన సహనాన్ని కోల్పోకుండా జీవించాడు. హింసలనుకు సహనంతో భరించాడు. సహనం మనలను శక్తి వంతులను చేస్తుంది. కనుక క్రీస్తును అనుసరిస్తూ ఆయన సుగుణాలను అలవరచుకొనుచు , క్రీస్తు సాక్షులుగా జీవించుదాం. ఆమెన్. 
నిజ క్రైస్తవులుగా జీవించుదాం. 



 






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

సమూయేలు చరిత్ర

 సమూయేలు చరిత్ర  సమూవేలు  పవిత్ర గ్రంధంలో ఉన్న న్యాయాధిపతులలో చివరి  న్యాయాధిపతి మరియు న్యాయాధిపతులో ఎక్కువ కాలం జీవించినవాడు. యిస్రాయేలు చర...