ధనవంతుడు- లాజరు (సంపదను దైవ రాజ్యప్రవేశానికి మార్గంగా చేసుకోవచ్చు)
లూకా 16: 19-31
ధనవంతుడొకడు పట్టు వస్త్రములు ధరించి నిత్యము విందులతో, వినోదములతో కాలము గడుపు చుండెను. అతని వాకిట లాజరు అను నిరుపేద పడియుండెను. అతని దేహామంతయు వ్రణములతో నిండియుండెను. వాడు ఆ ధనికుని బల్ల మీద నుండి జారిపడు మెతుకుల కొరకు కాచుకొని ఉండెను. కుక్కలు వాని వ్రణములను నాకు చుండెను. ఆ నిరుపేద మరణింపగా. దేవదూతలు అతనిని కొనిపోయి అబ్రహాము ఒడిలోనికి చేర్చిరి. ధనికుడు కూడ చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడతడు బాధ పడుచు పాతాళము నుండి సుదూరములో అబ్రహాము రొమ్మున ఆనుకొని వున్న లాజరును కన్నెత్తి చూచెను. అతడు అంగలార్చుచు 'తండ్రి అబ్రహామా!నన్ను కనికరింపుము. నేను ఈ మంటలలో మాడి పోవుచున్నాను. తన వ్రేలికొనను నీటిలో ముంచి, నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము ' అనెను. అందుకు అబ్రహాము , కుమారా ! మరువకుము. నీ జీవితములో నీవు సకల సంపదలను అనుభవించు చుండ, లాజరు అష్ట కష్టములను అనుభవించేను. అందుచే నీవు ఇపుడు కష్టపడుచుండ, అతడు సుఖ పడుచున్నాడు. అంతేకాక, మన మధ్య దాటుటకు వీలులేని అగాధము ఉన్నది. అందువలన ఆచాటివారు ఇచ్చటకు రాలేరు. ఇచ్చటివారు అచటకు పోలేరు' అని పలికెను. అందుకు ధనవంతుడు 'అట్లయిన నాదొక మనవి. నాకు ఐదుగురు సహోదరులున్నారు. వారు కూడ ఈ ఘోరనరకమునకు రాకుండ హెచ్చరిక చేయుటకు లాజరును నా తండ్రి యింటికి పంపుము' అనెను. అందుకు అబ్రహాము 'వారిని హెచ్చరించుటకు మోషే, ప్రవక్తలు ఉన్నారు. వారి హెచ్చరికలను ఆలకించిన చాలును' అని సమాధానమిచ్ఛెను. 'అది చాలదు తండ్రీ ! అబ్రహామా!మృతులలో నుండి ఎవరైన వారి వద్దకు వెళ్ళిన యెడల వారికి హృదయ పరివర్తనము కలుగును' అని అతడు మరల పలికెను . అందులకు అబ్రహాము 'మోషే, ప్రవక్తల హెచ్చరికలను పెడచెవిని పెట్టువారు, మృతులలో నుండి ఒకడు సజీవుడై, వారిని హెచ్చరింప వెళ్ళినను నమ్మరు' అని ప్రత్యుత్తరమిచ్ఛెను".
ఈ సువిశేష భాగంలో ధనవంతుడు పేదవాని పట్ల తన నిర్లక్ష్యపు ప్రవర్తనకు కారణంగా శిక్షించబడ్డాడు. లాజరు ధనవంతుని వాకిలి వద్ద కూర్చొని ఉంటున్నాడు. ధనవంతుడు శిక్షించబడటానికి లేక నరకానికి పోవడానికి గల చేసిన తప్పు ఏమిటి అని మనం ఆలోచించినప్పుడు మనకు కొన్ని విషయాలు అర్ధం అవుతాయి. మనం ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఆడగవలసి ఉంది. అవి ఏమిటి అంటే ధనవంతుడు ఎందుకు నరకానికి వెళ్ళవలసి వచ్చినది? ఎందుకు ఆయన అంత అగ్నిలో కాలుతుండాలి? ఒక నీటి బొట్టు కోసం అడుగుకునే పరిస్థితి ఎందుకు వచ్చినది? ఎందుకు ఆయనను అబ్రహాము, లాజరుల నుండి దూరం చేస్తూ అంత పెద్ద అగాధం ఉండాలి? అంత దూరం పెట్టె అంతటి తప్పు ఇతను ఏమి చేశాడు?
ధనవంతుడు- నీతిమంతునిగా జీవించాడా?
లూకా సువిశేషంలో యేసు ప్రభువు అనేక పర్యాయలు ధనవంతులుకు వ్యతిరేకముగా మాటలాడారు. లూకా 6:24, “అయ్యో !ధనికులారా ! మీకనర్ధము. మీరు మీ సుఖములను అనుభవించియున్నారు.” లూకా 12 : 21,తన కొరకు ధనము కూడబెట్టుకొనువారి స్థితి ఇట్లే ఉండును. వారు దేవుని దృష్టిలో భాగ్యవంతులు కారు” అని చెప్పెను. ఇక్కడ సంపదతో కూడిన చెడు గురించి కూడా యేసు ప్రభువు చెప్పటం మనం చూస్తాం. అదే విధంగా పేదవారికి దేవునిమీద నమ్మకం ఉండే విధంగా చేయడం మనం ఇక్కడ చూస్తున్నాము.
ఎందుకు ధనవంతుడు శిక్షించబడ్డాడు ?
మరణించిన తరువాత ధనవంతుని పరిస్థితి
ధనవంతుడు , అబ్రహామును తండ్రి! నా మీద కరుణ చూపించమని అడుగుతున్నప్పుడు ఇతను తన వాకిలి దగ్గర ఉన్న లాజరుకు ఎటువంటి కరుణ చూపించలేదు అని అర్ధం అవుతుంది. కనుక కరుణ పొందే అవకాశం కోల్పోతున్నాడు. యేసు ప్రభువు అనేక సార్లు మీరు ఏ కొలతతో కొలిచెదరో అదే కొలతతో మీకును కొలవబడును అని చెప్పారు, ఇక్కడ జరుగుతుంది కూడా అదే. మరణించిన తరువాత ధనవంతుడు ఇంకా చేయడానికి ఏమిలేదు. ఎందుకంటే అతను బ్రతికి ఉన్నప్పుడే ఇతరులకు సహాయం చేసినట్లయితే, తాను ఇప్పుడు సహాయం పొందడానికి అవకాశం ఉండేది. కాని అతను అన్ని అవకాశలు కోల్పోయాడు.
మనం ఎలా జీవిస్తే దేవుని రాజ్యం పొందుతాము ?
జీవించుచు తమకు కలిగినదానిలో అందరు పాలుపంచుకొనుచుండిరి,” వారు చేసిన పనుల ద్వారా వారి మధ్య అవసరాలలో కొట్టుమిట్టాడేవారు తరిగిపోయారు. అపో. కా 4:34. “వారిలో ఏ ఒక్కనికి కొరతలేదు.” ధనవంతుడు, తినడానికి ఏమి లేక తన భోజన బల్ల కింద పడే ముక్కల కోసం కాచుకొని కూర్చొన్న వాని ఆకలి తీర్చడంలో విఫలం చెందాడు. కాని అపోస్తుల కార్యాలలో మనం అంతియోకియాలో ఉన్న సంఘం రాబోవు కరువును పసిగట్టి దాని కోసం వారు దయగుణంతో స్పందించారు. తరువాత ధనవంతుడు పేదలను, కుంటి వారిని తన నిత్యం చేసుకునే విందులకు పిలవడంలో విఫలం చెందాడు. కాని అపోస్తుల కార్యాలలో క్రీస్తు సంఘం ఎలా వారు అభాగ్యులకు ఎలా అతిధ్యయం ఇచ్చారో మనం తెలుసుకోవచ్చు. ఇంకా ధనవంతుడు తన వాకిలి వద్ద యాచిస్తున్న లాజరుకు కరుణ చూపించడంలో విఫలం అయ్యాడు. కాని అపోస్తుల కార్యాలలో మనకు అపోస్తులు కొంతమందిని కేవలం ఇతరులకు సహాయం చేయడం కోసమే నియమించడం జరిగింది. కొర్నెలియసు మొదలగువారు.
లూకా సువిశేషంలో మనం పేదవారికి దేవుని రాజ్యంలో ప్రవేశం త్వరగా దొరుకుతుంది అన్నట్లుగా చూస్తాం , అదే విధంగా ధనికులు పేదవారికి సహాయం చేస్తే వారికి కూడా అలానే దొరుకుతుంది ,జక్కయ్య దానికి ఉదాహరణ.ధనికుడు లాజరు ఉపమానం మనం మరణించిన తరువాత ఏమి పొందుతాము అనేది మనకు దేవుడు ఇచ్చిన అవకాశలు మరియు అనుగ్రహాల ద్వార ఇక్కడే మనం నిర్ణయించాలి అని తెలియజేస్తుంది.
సంపద విలువ
క్రైస్తవులకు ఈ ఉపమానం ఒక మేలుకొలుపు లాంటిది. ఈ ఉపమానంలో యేసు ప్రభువు, లోభితనముతో , అత్యాశతో ఉన్న పరిసయ్యులతో, సంపదలను సరిగా వాడుకోకపోతే వచ్చే అనర్ధలు గురించి, శిష్యులు ఎలా ఉండకూడదో చెప్పిన ఒక ఉపమానం. ఈ ఉపమానంలో మనం చూసేటువంటివి ప్రధానంగా సంపద , పేదరికం , జీవితాలు తారుమారవడం మరియు మోషే ధర్మ శాస్త్రం మరియు ప్రవక్తల ప్రభోదల విలువ. పేదలకు , ఆకలితో ఉన్నవారికి , శోకంలో ఉన్నవారికి యేసు ప్రభువు ఓదార్పు ఇవ్వడం మరియు వారికి దేవుని రాజ్యంలో స్థానం కల్పించడం గురించి మనం వింటువుంటాము. యేసు ప్రభువు లూకా 12:1 వ వచనం మరియు 13:21 వ వచనాలలో మానవ జీవితం సిరి సంపదల సమృద్దిలో లేదు అని చెబుతున్నారు. జక్కయ్య ధనవంతుడే తన ఆస్తిలో సగ భాగంను పేదలకు పంచుతున్నాడు. యేసు ప్రభువు ఈ రోజు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అని అంటున్నారు.కనుక అలా జీవించడానికి ప్రయత్నిద్దాం.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి