పేజీలు

29.12.23

యేసు ప్రభువును దేవాలయంలో ఆర్పించుట

 లూకా 2: 22-35 

మోషే చట్ట ప్రకారము వారు శుద్దిగావించు కొనవలసిన దినములు వచ్చినవి. ప్రతి తొలి చూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలయును అని ప్రభువు ధర్మ శాస్త్రములో వ్రాయబడియున్నట్లు మరియమ్మ యోసేపులు బాలుని యెరుషలేమునకు తీసికొనిపోయిరి. చట్టప్రకారము "ఒక జత గువ్వాలనైనను, రెండు పావురముల పిల్లలనైనను" బలిసమర్పణ చేయుటకు అచటకు వెళ్ళిరి. యొరుషలేములో సిమియోను అను ఒక నీతిమంతుడు, దైవభక్తుడు  ఉండెను. అతడు యిస్రాయేలు ఓదార్పుకై  నిరీక్షించుచుండెను. పవిత్రాత్మ అతని యందుడెను. ప్రభువు వాగ్దానము చేసిన క్రీస్తును చూచువరకు అతడు మరణింపడని అతనికి పవిత్రాత్మ తెలియజేసెను. పవిత్రాత్మ ప్రేరణచే అతడు అపుడు దేవాలయమునకు వచ్చెను. తల్లిదండ్రులు ఆచారవిధులు నిర్వర్తించుటకు బాల యేసును లోనికి తీసుకొనిరాగా, సిమియోను ఆ బాలుని హస్తములలోనికి తీసుకొని దేవుని ఇట్లు స్తుతించెను: "ప్రభూ! నీ మాట ప్రకారము ఈ దాసుని ఇక సమాధనముతో నిష్క్రమింపనిమ్ము. ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరచిన రక్షణను నేను కనులారగాంచితిని. అది అన్యులకు మార్గదర్శకమగు వెలుగు; నీ ప్రజలగు యిస్రాయేలీయులకు మహిమను చేకూర్చు వెలుగు."  బాలుని గురించి పలికిన ఈ మాటలు విని అతని తల్లియు, తండ్రియు ఆశ్చర్యపడిరి. సిమియోను వారిని ఆశీర్వదించి, ఆ బిడ్డ తల్లి మరియమ్మతో  ఇట్లనెను: "ఇదిగో! ఈ బాలుడు యిస్రాయేలీయులలో అనేకుల పతనమునకు, ఉద్దరింపునకు కారకుడు అగును. ఇతడు వివాదాస్పదమైన గురుతుగా నియమింపబడియున్నాడు. అనేకుల మనోగతభావములను బయలుపరచును. ఒక ఖడ్గము నీ హృదయమును దూసికొనిపోనున్నది. 

నిర్గమ ఖాండం 13 వ అధ్యాయంలో తొలిచూలు పుట్టిన కుమారుడు దేవునకి చెందిన వాడు. మొదట పుట్టిన కుమారుడు దేవాలయంలో సేవ చేయాలని నియమం ఉన్నది. కనుక ఆ బిడ్డను దేవునికి అంకితము  చేయడానికి దేవాలయమునకు  తీసుకొని వస్తారు. తరువాత ఆ బిడ్డకు బదులుగా సుమారు 5 తులముల వెండిని చెల్లించి ఆ బిడ్డను తీసుకొని వెల్లవారు సంఖ్యా 3:11-13. కుమారుడు  పుట్టిన తరువాత తల్లిదండ్రులు శుద్దికరణ నిమిత్తమైన లెవీయ ఖాండం 12:3-8  ప్రకారం వారు ఒక గువ్వను కాని దహన బలిగా ఒక గొర్రెను కాని అర్పించవలసినది. పేదవారు, అవి అర్పించలేనివారు రెండు గువ్వలను అర్పించాలి. అందుకే యేసేపు మరియమ్మలు రెండు గువ్వలను అర్పిస్తున్నారు. మరియమ్మ యోసేపులు పేదవారు అయినప్పటికీ దైవ భక్తి యందు వారు గొప్పవారు అందుకే దేవాలయమునకు వచ్చి ఇవి అన్నియు వారు  చేస్తున్నారు. యిస్రాయేలు చట్ట ప్రకారం  40 రోజులకు  శుద్దికరణ జరుగుతుంది.  మరియ మాత  యోసేపులు తమ తొలిచూలు బిడ్డను దేవాలయములో  దేవుని సేవకు అర్పించడానికి తీసుకొని వెళుతున్నారు. వారు దేవలయంలో ఉండగా పవిత్రాత్మ ప్రేరణతో  సిమియోను ప్రవక్త వారిని చూస్తున్నారు. సిమియోనుతో దేవుడు మెస్సీయ్యా గురించి అంతకు ముందుగానే మాటలడాడు. రానున్న మెస్సీయ్యా గురించి సిమియోను ఎదురుచూస్తున్నాడు. యేసు ప్రభువు దేవాలయం లోనికి రాగానే సిమియోను అక్కడకు వస్తున్నాడు.  

సిమియోను జీవితం 

సిమియోను అంటే వినుట అని అర్ధం. సిమియోను దేవుని మాటను విని ఆయన మాట ప్రకారం జీవించే వ్యక్తి. తన జీవితం మొత్తం మెస్సీయ్యా గురించి ఎదురుచూస్తున్న వ్యక్తి.రక్షకుని  చూచి మరణించాలని కోరుకున్న వ్యక్తి. సిమియోను నీతిమంతుడు అనే విషయం దేవుని వాక్కు ద్వారా తెలుస్తుంది. నీతిమంతుడు అంటే దేవుని చట్టమును తప్పక పాటించేవాడు. యోసేపును కూడా పవిత్ర గ్రంధం నీతిమంతుడు అని చెబుతుంది. యేసు ప్రభువును చూచి తండ్రితో తనను ఇక నిష్క్రమింపమనీ చెబుతున్నాడు. తాను చూడాలనుకున్న రక్షకుని చూసి తృప్తి పొందుతున్నాడు. 

దేవాలయములోనికి తీసుకొని వచ్చిన యేసు ప్రభువును  సిమియోను తన   హస్తములలోనికి తీసుకొని దేవుని ఇట్లు స్తుతించెను: "ప్రభూ! నీ మాట ప్రకారము ఈ దాసుని ఇక సమాధనముతో నిష్క్రమింపనిమ్ము. ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరచిన రక్షణను నేను కనులారగాంచితిని. అది అన్యులకు మార్గదర్శకమగు వెలుగు; నీ ప్రజలగు యిస్రాయేలీయులకు మహిమను చేకూర్చు వెలుగు." యేసు ప్రభువు గురించి సిమియోను మాటలాడిన మాటలు ముఖ్యముగా "దేవుడు ఏర్పాటు చేసిన రక్షణ"  అనే ఈ మాట చాలా ముఖ్యమైనది. యేసు ప్రభువు అందరికీ రక్షకుడు. యేసు ప్రభువు చేసిన పనులు చూసి ఈ మాట సిమియోను అనుట లేదు. పవిత్రాత్మ ప్రేరణతో బాల  యేసును తన చేతులలోనికి తీసుకొని అంటున్నాడు.  ప్రభువు అన్యులకు వెలుగుగా ఉన్నాడు. ప్రతి ఒక్కరు యేసు ప్రభువు దగ్గరకు వచ్చినట్లయితే వారు వెలుగును చూస్తారు. వెలుగును చూచుట అంటే వారి జీవితమును తెలుసుకోవడం.  ఎటువంటి జీవితం జీవిస్తున్నది తెలుసుకోవడం. యేసు ప్రభువు వద్దకు వచ్చుట ద్వారా మనం ఎటువంటి స్థితిలో ఉన్నాము అని తెలుసుకుంటాము. యేసు ప్రభువు యిస్రాయేలీయులకు మహిమను చేకూర్చు వెలుగు ఎందుకంటే దేవునికి దూరముగా ఉండి వారి మహిమను కోల్పోయారు, యేసు ప్రభువు ద్వారా యిస్రాయేలు మరల మహిమను పొందుతుంది. 

ఇదిగో! ఈ బాలుడు యిస్రాయేలీయులలో అనేకుల పతనమునకు, ఉద్దరింపునకు కారకుడు అగును. ఇతడు వివాదాస్పదమైన గురుతుగా నియమింపబడియున్నాడు. అనేకుల మనోగతభావములను బయలుపరచును. ఒక ఖడ్గము నీ హృదయమును దూసికొనిపోనున్నది. యేసు ప్రభువు గురించి సిమియోను పలికిన ఈ మాటలు మొత్తం కూడా వేరుతున్నాయి. ఆయన అనేకుల ఉద్దరింపునకు కారణం అయివున్నాడు. ఆయనను అందరు అంగీకరించలేదు. అనేకుల మనోగతలను ఆయన బయలుపరిచాడు. ఎవరు ఎటువంటి వారు అనే విషయాలు ప్రభువు తెలియజేస్తున్నాడు. అంతేకాక అనేక గొప్ప కార్యలు చేసిన ప్రభువును తన తల్లి అందరు విడచివెళ్ళడం చూస్తుంది. సిలువ వేయడం, ఈటెతో పొడవడం, మరణించిడం చూస్తుంది. అందుకే నీ హృదయము నందు ఒక ఖడ్గం దూసుకొనిపోతుంది అని సిమియోను  చెబుతున్నారు. 

ప్రభువుతో సంభాషణ మరియు ప్రార్ధన : ప్రభువా! మిమ్ములను దేవాలయంలో మిమ్ము అంకితం చేసినప్పుడు సిమియోను ప్రవక్త మీ నిజ రూపాన్ని తెలియజేస్తున్నాడు. మీరు ఈ లోక రక్షణ అని మేము తెలుసుకుంటున్నాము. మీఋ అన్యులకు వెలుగు అని తెలుసుకుంటున్నాము. మీరు వెలుగు అని  మాకు మార్గదర్శి అని తెలుసుకొని వెళ్లప్పుడు మీ దగ్గర వుండి మీ వెలుగులో మమ్ములను మేము తెలుసుకొని, ఎప్పుడు ఆ వెలుగులో జీవించేలా చేయండి. ప్రభువా అనేక మంది ప్రజలు  ఉన్నప్పటికీ సిమియోనికి మాత్రమె  మిమ్ములను చూచి మీరే రక్షకుడు అని ప్రకటిస్తున్నారు. ఆయన భక్తి, నీతిమంతమైన జీవితం, పవిత్రాత్మ ప్రేరణ మిమ్ములను మీరు రక్షకుడు అని తెలుసుకొనుటకు ఉపయోగపడుతున్నవి. ప్రభువా ! మేము కూడా భక్తి వంతమైన జీవితం , నీతివంతమైన జీవితం జీవించేలా మీ అనుగ్రహం దయచెయండి. సిమియోను వలె మాకు కూడా మీ పవిత్రాత్మ అనుగ్రహాలు దయచేయండి. ఆమెన్. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

సమూయేలు చరిత్ర

 సమూయేలు చరిత్ర  సమూవేలు  పవిత్ర గ్రంధంలో ఉన్న న్యాయాధిపతులలో చివరి  న్యాయాధిపతి మరియు న్యాయాధిపతులో ఎక్కువ కాలం జీవించినవాడు. యిస్రాయేలు చర...