14.10.25

పునీత ఆవిలాపురి తెరెసమ్మ

పునీత ఆవిలాపురి   తెరెసమ్మ 

తెరెసా 1515వ సంవత్సరం ఆవిలాలో మార్చి 28న తేదీన     జన్మించారు. 1582 లో చనిపోయారు. 1622 సంవత్సరంలో  లో ఆమె చనిపోయిన 40 సంవత్సరాలకు ఆమె పునీతురాలుగా ప్రకటించబడింది. 1970 సెప్టెంబర్ 27 న ఆమె తిరుసభ పండితురాలుగా ప్రకటించబడింది. ఈమె ఒక సాధారణ స్త్రీ వలె కనపడిన అసాధారణమైన పట్టుదల, సాంఘిక అసమానతలను ఎదుర్కొని విజయాలను సాధించుటలో గొప్ప వ్యక్తిత్వాన్ని కనపరిచిన అరుదైన వ్యక్తి. ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆమె జీవితంలో అనేక ఆటంకాలలో కూడా తాను అనుకున్న దానికి సాధించిన ఒక స్త్రీ మూర్తి. మనం ప్రేమించే వారి కోసం మనం ఎంత చేయవచ్చో చూపించిన ఒక గొప్ప స్త్రీ. తిరుసభలో వరకట్నం  లేకుండా సన్యాసినులను మఠంలోనికి తీసుకున్న మొదటి వ్యక్తి. అనేక నూతన సంప్రదాయాలకు అంకురార్పణ చేసిన వ్యక్తి. తీరుసభ మొదటి స్త్రీ పండితురాలు. ఒక వ్యక్తి తనలో ఉన్న లోపాలను ఎలా జయించగలమో నేర్పి, మానవుడు తనను తాను ఎలా జయించవచ్చో నేర్పించిన విజయాశీలి.  మానవునిలో ఉన్న దైవాన్ని ఎలా చేరుకోవాలో అంతరంగిక ప్రయాణం ఎలా చేయాలో నేర్పిన గొప్ప గురువు మరియు గొప్ప పండితురాలు.

ఆమె తండ్రిగారి పేరు అలెన్సో సంచేస్  ఆమె తల్లి పేరు  బియాట్రీస్ ఆహుమాద చిన్నప్పుడు తెరెసా పునీతుల జీవితాలు చదివి ఆ పునీతుల చరిత్రల వలన చాలా ప్రోత్సాహం పొందేది. తెరెసా మరియు ఆమె సోదరుడు రోడ్రిగో బాల్యంలోనే  ఇద్దరు కలిసి మూర్సు అనే ప్రాంతం లో వేద సాక్షిగా మరణించాలి అని ప్రయాణం అయి వెళ్లారుఆవిలా పూరీ గోడల బయటకు వెళ్ళి నాలుగు స్తంభాలు అనే ప్రాంతంలో వారి బాబాయి వారిని చూసి ఇంటికి తీసుకొనివచ్చాడు. తరువాత రోడ్రిగో ఇది మొత్తం చేసినది తెరెసా అని ఆమె మీద నెపం మోపాడు. తరువాత తన సోదరుడితో ఎడారిలోని క్రైస్తవ సన్యాసుల జీవిత విధానాలు ఆటల రూపంలో ఆడుకునేవారు.  

తెరెసా 14 సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పుడు ఆమె తల్లి చనిపోయారుఆ సమయములో ఆమె మరియమాతకు చాలా దగ్గర అయ్యారు. మరియమాతను తన తల్లిగా ఉండమని కోరారు. ఈ ప్రాయములో ఆమె కొన్ని వీర గాధలు చదవడం మొదలు పెట్టారు. అంతేకాకుండా తన అందానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడము ఆరంభించారు. తన కుమార్తెలో వస్తున్న ఈ మార్పును గుర్తించిన ఆమె తండ్రి ఆవిలాలో ఉన్న పునిత  అగుస్టిన్ మఠ కన్యల బోర్డింగ్ స్కూల్ లో చేర్పించారు. ఇక్కడ ఉన్న  కన్య స్త్రీల వలన మరలా తన పాత నిర్మల మనస్సును పొందగలిగింది.   ప్రార్ధన గురించి  తెలుసుకున్నారుకానీ తన అనారోగ్య కారణాలతో అక్కడనుండి 1532 లో ఇంటికి రావడం జరిగినది. 1533 లో తాను కార్మెల్ సభలో సన్యాసిగా అవ్వాలని  తన తండ్రిని  అనుమతి అడగగా అందుకు ఆయన  నిరాకరించారు. తరువాత 1535 ,నవంబర్  2 న  ఆవిలాలో ఉన్న కార్మెల్ మఠంలో ప్రవేశించారు.

1536 లో సభ వస్త్రాన్ని తీసుకుంది.  1537 లో తన  మాట పట్టు తీసుకుంది దాని తరువాత ఆమె ఘోరమైన అనారోగ్యం పాలయ్యింది.  కనుక 1538 లో ఆమెను తన ఆరోగ్య కుదుటపడటానికి  మఠం నుండి బయటకు తీసుకురావడం జరిగినది.  ఈ సమయములోనే ఆమెకు తన బాబాయి  ప్రార్ధన చేయడము గురించి ఒక పుస్తకం ఇవ్వడము జరిగినది.  ఆ పుస్తకము తనకు చాలా  ఉపయోగపడింది,  ఆమె ఆరోగ్యం కుదుటపడకపోగా తాను మరణపుటంచుల వరకు వెళ్ళింది. 1539 లో ఆమెను ఇంటికి తీసుకొచ్చారు. అందరూ ఆమె చనిపోయింది అనుకున్నారుకానీ మూడు రోజులకి కొద్దిగా చలనం కలిగినది. తరువాత ఆమెను మఠానికి తీసుకొచ్చారు పక్షవాతం తో దాదాపు మూడు సంవత్సరాలు బాధపడ్డారు. పునీత యోసేపు గారి ప్రార్ధన సహాయముతో పూర్తిగా కొలుకున్నది . కానీ  ఆరోగ్య పరంగా ఆమెకు  తన మరణం వరకు కొన్ని సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. తన అనారోగ్య కారణాలతో మరియు ఇతర కారణాలతో  ప్రార్ధన జీవితాన్ని అంతగా పట్టించుకోలేదు.

 1557 లో ఒకసారి మఠానికి పండుగ సందర్భంగా యేసు ప్రభువు స్వరూపాన్ని తీసుకురావటము జరిగినది అది యేసు ప్రభువు  శ్రమలు పొందుతున్న స్వరూపము  అది చూసిన తరువాత తెరెసా  యేసు ప్రభువు శ్రమలకు తాను కారణం అని తాను మరల  యేసుప్రభువుకు  ఎటువంటి శ్రమలు ఇవ్వకూడదు అని ఆయన శ్రమలలో ఆయనకు ఓదార్పు  ఇవ్వాలని నిర్ణయించుకుంది. అందుకే ఆమె యేసు ప్రభువుకు చాల మంది స్నేహితులు అవసరము ఉంది మనం ఆయన స్నేహితులము కావాలని తన తోటి సన్యాసినులతో చెప్పేది. ఈ మఠం లో ఆమె చాలా శ్రమలు అనుభవించిందిఆమె తన అనారోగ్యం వలన అనేక బాదలు అనుభవించినది.  ఈ సమయములోనే  తన మొదటి ప్రార్ధన అనుభూతిని పొందింది. తన స్నేహితులు,  ప్రార్ధనలో ఆమె పొందే అనుభవాలు మొత్తం కూడా సాతాను నుండి పొందుతుంది అని చెప్పారు.  1556 సంవత్సరంలో   ఆమె ఆధ్యాత్మిక గురువు ఫ్రాన్సిస్ అనే  యేసు సభ గురువు ఆమె అనుభవాలు  దేవుని నుండి వచ్చే అనుభవాలు అని చెప్పారు. ఆమె అనేక దర్శనాలు పొందేది. కొన్ని సార్లు ప్రార్దనలో ఉన్నప్పుడు వచ్చే అనుభవాలు చాలా గొప్పగా ఉండేవి. ఒక్కోసారి ఆమె ప్రార్ధన చేసే సమయములో గాలిలోకి ఎత్త బడేది. అది చూసిన మిగిలిన వారు  ఆమెను క్రిందకు తీసుకురావడానికి ఆమెను పట్టుకొని లాగేవారు. 1559 లో ఆమెకు ఒక దర్శనము యేసు ప్రభువు ఆమెకి కనపడటము జరిగినది. ఆమె అప్పటినుండి నిజంగా నాకు యేసు ప్రభువు కనపడ్డారు  అలాగున  ఈ దర్శనాలురెండు సంవత్సరాలు పాటు ఆమెకు కలిగాయి.

ఒక దర్శనములో దేవదూత  ఒక  అగ్నిజ్వాలతో  కూడిన ఒక  బంగారు బాణం తో ఆమె హృదయమును గుచ్చినట్లుగా అనిపించినది. తరువాత శారీరకముగా మరియు ఆధ్యాత్మికముగా కూడా ఆమెకు అది  బాధతో కూడిన తీయటి అనుభూతిని మిగిల్చింది. ఆమె చనిపోయిన తరువాత ఆమె సమాధిలో ఆమె హృదయం పాడు కాకుండా ఉన్నది అంతే కాదు ఆమె హృదయం మీద రెండు గీతలు ఉండటం గమనించడం జరిగింది. ఇప్పటికీ ఆ హృదయం అల్భ దె  థోర్మెస్ అనే ఊరిలో దేవాలయంలో మనం చూడవచ్చు.  

ఆమె ఉన్న ఇన్కర్ణేషన్ మఠంలో  150 మంది మఠవాసులు ఉండటము వలన అది ప్రార్ధనకు అనువుగా లేదు.  మఠానికి వచ్చేపోయె  వారితో మఠం ఒక సంత వలె ఉంది అని ఆ జీవిత విధానాన్ని తన ఆధ్యాత్మిక గురువుల సహాయంతో సంస్కరించాలని అనుకున్నది.  పేదరికంలో మఠాన్ని స్థాపించటానికి అందరూ అడ్డుపడిన కాని  ఆమె ఆగస్ట్ 24న 1562వ సంవత్సరంలో నూతన మఠాన్ని స్థాపించారు. 1563 మార్చిలో తెరెసా నూతన మఠానికి వెళ్ళింది.  కఠినమైన నియమాలతో పాత కార్మెల్ జీవితాన్ని పునరుద్ధరించాలని ఆశతో మొదలు పెట్టిన పని మొదలైనది. కొద్ది మంది సన్యాసినులతో ఎప్పుడు ప్రార్ధన ధ్యానం చేస్తూ వారు అందరికీ ఆదర్శముగా జీవించడం మొదలు పెట్టారు. మొదటి ఐదు సంవత్సరాలు ఆమె ఆ మఠంలోనే  గడిపింది.

ఆమె ఎందుకు ఈ మఠాన్ని స్థాపించారు అని ఒక ప్రశ్న అడిగినప్పడు మనకు ఆమె ఉన్న పాత మఠంలో ప్రార్దనకు అనుకూల వాతవరణం లేదు అందుకే ఆమె నూతన విధానాన్ని స్థాపించారు అని మనం చెప్పవచ్చు. దీనికి ఆమె తన తోటి సహోదరీలతో చెప్పిన సమాధానం మరియొకటి ఉన్నది. అది ఏమిటి అంటే ప్రొటెస్టంట్లు కతొలికులకు వ్యతిరేకంగా ఉద్యమిచ్చిన కాలంలో అనేక దేవాలయాలలో దివ్య సత్ప్రసాదనికి అవమానం కలిగించారు. ఏ విధంగా అంటే అనేక దేవాలయాలలో దివ్య మందసంలో ఉన్న యేసు దివ్య సత్ప్రసాదంను బయటకు తీసి క్రింద పడవేసి అవమానం చేశారు. ఆ అవమాననికి తాను అంటే ఆవిలాపురి తెరేసమ్మ పరిహారం చేయాలని అనుకున్నారు. అది ఏవిధంగా అంటే ఈ నూతన కార్మెల్ మఠంలో ప్రతి నిత్యం దివ్య సత్ప్రసాదంలో ఉన్న యేసు ప్రభువు ఆరాధించబడుతాడు అక్కడి సన్యాసినులతోటి ఆవిధంగా అప్పుడు జరిగిన అవమాననికి తాను పరిహారం చేయాలి అని ఈ నూతన మఠం స్థాపించాలి అనుకున్నది.  

దివ్య పూజబలిలో పాల్గొని దివ్య సత్ప్రసాదం స్వీకరించిన తరువాత ఆమె అనేక ప్రార్ధన అనుభవాలు పొందేది. ఆమె పొందిన ప్రార్దన అనుభవాలలో కొన్నింటిలో ఆమె ప్రార్దన చేస్తూ ఉండగా అవకాశంలోనికి ఎత్త బడేది. ఆ సమయాలలో తన తోటి సన్యాసినులు ఆమెను పట్టుకొని క్రిందకు లాగేవారు. 

పునీత ఆవిలాపురి తెరేసమ్మ కార్మెల్ మఠంలో తీసుకున్న పేరు యేసుని తెరెసా. ఈమె జీవితం మొత్తం యేసు ప్రభువును ఏ విధంగా తాను కలవాలి, లేక ఆయనను తాను ఎలా పొందాలి అనే కోణంలో మాత్రమే ఆలోచించింది అన్నట్లుగా తాను జీవించిది. ఎందుకంటె తాను ఎలా యేసు ప్రభువును చేరుకోవాలి, ఆయన కోసం తాను ఏమి చేయగలదు మరియు ఏమి చేసింది మాత్రమే ఆమె జీవితం మొత్తం కూడ. అంతకు మించి మనం ఆమె జీవితంలో ఏమి చూడం. ఆమె పేరు యేసుని తెరెసా అని ఎలా మార్చుకున్నదో అలానే తాను యేసు ప్రభువును తన అనువణువున నింపుకున్నది. 

యేసు ప్రభువును ఆమె ఎలా చూసింది అని ఒక ప్రశ్న అడిగితే నాకు కొన్ని విషయాలు ఆమె గురించి గుర్తుకు వస్తాయి అవి ఏమిటంటే? ఆమెకు  యేసు ప్రభువే  సర్వస్వం. ఆయన మానవ గుణాలను ఎంతో అభిమానంచేది, సమరియా స్త్రీ తో మాటలాడిన విధానం, వ్యభిచారం లో పట్టుబడిన స్త్రీ ని కాపాడిన విధానం ఆమెకు దైవ కరుణ తెలియజేస్తుంది. మరియ మర్తల వలె ఆయన వద్దనే ఉండాలని, తన మాటలు వినాలని ,  తనకు సేవ చేయాలని కోరుకున్నది. యేసు ప్రభువుని ప్రతి గుణాన్ని ఆమె ప్రేమించింది. ఆయనను తన గురువుగా భావించింది. యేసు ప్రభువు తన మార్గంగా, గమ్యంగా  భావించింది. యేసు ప్రభువుకు ఎలా తను సేవ చేయగలను అనే ఆలోచించింది. యేసు ప్రభువును ఆమె ఎంతలా ప్రేమించింది అంటే ఆమె చేసేది ఏది  అయిన అది క్రీస్తును పొందటం కోసమే అనే విధంగా ప్రేమించింది.  ఆయనను పొందటమే తన జీవిత ధ్యేయం అయ్యింది. తనకు  ప్రార్ధన యేసు ప్రభువును కలుసుకునే ద్వారం అయ్యింది. తనలో యేసు ప్రభువు తనలో ఉన్నారని గ్రహించింది. తనలో ఉన్న యేసు ప్రభువును కలుసుకోవడానికి తనలోనికి తాను ఎలా వెళ్ళాలి అని నేర్చుకున్నది. ఒక వ్యక్తి ఆత్మలోనికి ప్రవేశించడం చాలా క్లిష్టమైన ప్రయాణం అని తెలుసుకుంది. అయిన ఈ తనలో ఉన్న యేసు ప్రభువును కలుసుకోవడానికి ప్రార్దన సహయం ద్వార  అంతరంగిక ప్రయాణం మొదలుపెట్టింది. తనలో ఉన్న యేసు ప్రభువును కలుసుకుంది. ఈవిధంగా ఆమెకు ప్రార్దన తనలో ఉన్న యేసు ప్రభువును కనుగోని ఆయనతో ఉండటం, ఆయన అనుభూతిని పొందటం అయ్యింది. 

 1567 లో కార్మెల్ సభ అధిపతి జాన్ బాప్టిస్ట్ రోస్సీ ఆవిల వచ్చారు. ఆయన తెరేసా ను మెచ్చుకొని ఇంకా కొన్ని సన్యాసినుల మఠాలను స్థాపించాలని ప్రోత్సహించారు. అదే విధముగా రెండు పురుష మఠాలను స్థాపించటానికి అనుమతి ఇచ్చారు.   అప్పుడు  మెదిన దేల్ కంపో మళగొన్ వయ్యాడోలిద్ ,తోలేదోపస్ట్రాన సాలమాంక మరియు అల్బ దె  తొర్మెస్  లలో మఠాలు స్థాపించారు.

తెరెసాకు  పురుషుల విభాగానికి సంబంధించి సంస్కరించబడిన  రెండు మఠాలను ఏర్పాటు చేయడానికి అనుమతి లభించినది. పునీత సిలువ యోహను మరియు ఆంథోనీ హెరోడియా ల సహకారంతో  1568నవంబర్లో దురుఏలో వద్ద  మొదటి మఠాన్ని స్థాపించారు. తరువాత 1571 లో సెగోవియ వద్ద ,1574 లో బేయస్ సేగుర వద్ద ,1575 లో సేవియ్యే వద్ద 1576 లో కరవక శిలువ వద్ద స్థాపించారు

1576 లో  సంస్కరణ ఇష్టపడని కార్మెలియులుసంస్కరించబడిన కార్మెలియులను  హింసించటము మొదలు పెట్టారు. పియసెంజ లో జరిగిన జెనెరల్ చాప్టర్లో ఎటువంటి నూతన మఠాలను ఏర్పాటు చేయవద్దని చట్టం చేశారు. తెరెసాను ఆమె ఏర్పాటు చేసిన ఏదో ఒక మఠానికి మాత్రమే పరిమితం కావాలని ఆదేశించారు. అన్నింటికీ అంగీకరిస్తూ ఆమె తోలేదోలో ఉన్న మఠానికి పరిమితం అయ్యారు.  మిగిలిన వారిని అనేక కష్టాలకు గురిచేశారు. పునీత తెరేసమ్మను అనేక మంది తీరుసభ అధికారులు తప్పుగా అర్ధం చేసుకున్నారు. ఈమె మఠ వాసి అని చెబుతూ మఠంలో ఉండకుండా దేశ దిమ్మరి వలె తిరుగుతుంది అని అన్నారు. కాని ఆమె తన సంతోషం కోసం ఎప్పుడు బయటకు వెళ్లలేదు. కేవలం ఏదో ఒక నూతన మఠం స్థాపించడానికి అక్కడ యేసు ప్రభువును సేవించేలా చేయడానికి మాత్రమే వెళ్ళింది. ఆమె ప్రయాణాలు అన్ని కూడా చాలా కష్టంతో కూడినవి ఎందుకంటే ఆనాటి రోజులలో రాహదారులు ఏమి లేవు, మరియు ప్రయాణాలు గుర్రపు లేదా గాడిద బండ్ల మీదనే జరిగేది. అనేక సార్లు క్రింద పడటం కూడా జరిగేది. కాని యేసు ప్రభువు సేవించ బడాలి అనే కోరికతో ఆమె నూతన మఠలకు స్థలం చూడటానికి లేదా స్థాపించడానికి వెళ్ళేది. 

ఆమెజీవితపు చివరి మూడు సంవత్సరాలు అందలుసియా పాలెన్సియ ,సొరియా బుర్గోస్ మరియు గ్రనాద లో మఠాలను స్థాపించారు.  1577 ఆవిలా కు వెళ్ళింది. ఆమెను అనేక విధాలుగా విమర్శించిన కార్డినల్ కూడా ఆమెకు అనుకూలముగా  మాటలాడారు . 1580 లో నూతన మఠాన్ని  స్థాపించారు. 1580  జూన్ 22 న గ్రెగోరి 13 వ పోఫు గారు  నిష్పాదుక కార్మెల్ ప్రొవిన్సు ను ఏర్పాటు చేశారు. 1582సెప్టెంబర్ 19 న మెదిన  దేల్ కాంపొను వదలి  20 న ఆల్బ దె తోర్మేస్ వచ్చారు. అప్పటికే రక్తస్రావంతో  బాధ పడుతున్నారు.   అక్టోబర్ 4 న ఆల్బ దె తోర్మేస్ వద్ద  మరణించారు. మరుసటి రోజు  గ్రెగోరియన్ కాలెండరు మార్పుతోటి  అది అక్టోబర్ 15 అయ్యింది.  ఆమె తన మఠ వాసులకు ప్రార్థన ,  మన ఆత్మలో ఉన్న దేవుని కనుగొనట ఎలా ?, ఆధ్యాత్మిక సంపూర్ణత ఏ విధముగా సాధించాలి అనే అంశాలమీద రాసిన గ్రంధాలు అనేక మందికి దేవుని తెలుసుకొనిచేరుకోవటానికి ఉపయోగపడుతున్నాయి. 

Fr. Amruth OCD

 

4.11.24

సమూయేలు చరిత్ర

 సమూయేలు చరిత్ర 

సమూవేలు  పవిత్ర గ్రంధంలో ఉన్న న్యాయాధిపతులలో చివరి  న్యాయాధిపతి మరియు న్యాయాధిపతులో ఎక్కువ కాలం జీవించినవాడు. యిస్రాయేలు చరిత్రలో సమూవేలు  అనేక ముఖ్యమైన  విధులను  పోషించాడు. సమూవేలు ఒక యాజకునిగా, న్యాయాధిపతిగా, జీవితపు చివరి అంకంలో ఓక జాతికి గొప్ప నాయకునిగా జీవించాడు. ఒక ప్రవక్తగా  యిస్రాయేలు మొదటి ఇద్దరు రాజులను అభిషేకించాడు.  సమూవేలు యిస్రాయేలు ప్రజలకు మరియు  దేవునికి మధ్యవర్తిగా మరియు వారి కోసం దేవుని అనుగ్రహం కోరేవానిగా పవిత్ర గ్రంథం తెలియజేస్తుంది.  సమూవేలు జీవిత కాల సమయంలో ముఖ్యమైన విషయం ఏమిటంటే యిస్రాయేలు ప్రజలు దేవునితో వారి సంబంధమును పునరుద్ధరించుకోవడంజరిగింది. ఈ కాలంలో దేవుని పట్ల వారు చూపిన విశ్వాసంతో ఎంతగా  వారు లాభపడినది, తరువాత    అవిశ్వాసంతో ఏమి   కోల్పయింది సుష్పష్టంగా కనపడుతుంది.  

సమూవేలు అంటే దేవుడు విన్నాడు అని అర్ధం. సమూవేలు తన జీవితాంతం దేవునికి విశ్వాస పాత్రునిగా, విధేయునిగా జీవించాడు. సమూవేలు చిన్నప్పటి నుండి ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి.  ఇతని జీవితం మొత్తం. దేవుని మాటను వినడం, ఆయనకు విధేయించడం గురించి తెలియజేస్తుంది. సమూవేలు పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు దేవునికి విధేయునిగా జీవించాడు. దేవుడు సమువేలును తన అనుచరులలో గొప్పవానిగా చూసాడు. కీర్తన 99:6-7 "మోషే అహరోను ఆయన  యాజకులు , సమువేలు ఆయనకు ప్రార్ధన చేసినవాడు. వారు ఆయనకు మనవి చేయగా ఆయన వారి వేడికోలును ఆలించెను. మేఘ స్థంభం నుండి ఆయన వారితో మాట్లాడెను ఆయన దయచేసిన శాససనములను, కట్టడలను వారు పాటించిరి."  చిన్నప్పటి నుండి దేవుని వాక్కును వినుటను అలవాటు చేసుకున్నవాడు. సమువేలు జీవితం మొత్తం దేవునికే మహిమ ఆరాధన అని తెలియజేస్తుంది. 

హన్నా ప్రార్ధన సమువేలు జననం 

హన్నా సమూవేలు తల్లి. ఆమెకు  పెళ్ళైన   అనేక సంవత్సరాల వరకు పిల్లలు పుట్టలేదు. ఆమె భర్త ఎల్కానా.  ఎల్కానాకు ఇద్దరు భార్యలు ఉన్నారు వారిపేర్లు హన్నా, పెనిన్నా అను వారు. పెనిన్నాకు పిల్లలుపుట్టారు  కాని  హన్నాకు మాత్రము లేరు. ఎల్కానా షిలోలోఉన్న మందసము వద్ద  బలి అర్పించి, వచ్చిన నైవేధ్య  భాగాన్ని  పెనిన్నాకు ఆమె  సంతానానికి ఇచ్చేవాడు.  హన్నాకు మాత్రము ఒక భాగమే ఇచ్చేవాడు.  భర్త హన్నాను ప్రేమించినప్పటికీ  ఆమె గొడ్రాలు అవుటవలన ఇలా చేసేవాడు.పెనిన్నా కూడా ఆమెను ఎగతాళి చేసేది. యావే మందిరమునకు వెళ్ళినప్పుడల్లా   పెనిన్నా ఆమెను దెప్పిపొడిచేది. హన్నా మాత్రము ఎప్పుడు వాటిని ఇతరులకు చెప్పడంకాని, వారికి వ్యతిరేకంగా మాట్లాడటం కాని చేసేదికాదు.  తన బాధలను దేవునితో మాత్రమే చెప్పుకునేది. ఒక సారి బలి అర్పించుటకు షిలో వెళ్లారు. అక్కడ దేవుని ఎదుట తన బాధను   నిట్టూర్పుతో, ఏడుపుతో దేవునితో  మాటలాడుతుంది. వారు షిలోవద్ద బలి అర్పించిన తరువాత హన్నా ఆలయంలో ఏడ్చుచు ప్రార్థిస్తుంది. యాజకుడైన ఏలి ఆమెకు త్రాగుట వలన   కైపెక్కినది అనుకోని ఎంతసేపు ఆ మత్తుతో ఉంటావు.  ద్రాక్షసారాయమును వదిలించుకోమని చెప్పాడు. అందుకు  ఆమె ,  అయ్యా నేను డ్రా  త్రాగలేదు, తీరని వేతతో బాధపడుతున్నాను, ,మిక్కిలి  కోపతాపములతో మనసు, హృదయము బ్రద్దలవుతుంటే  ప్రభువుతో మాటలాడుచున్నాను అని చెప్పింది. అందుకు  ఏలి ఆమెతో  దేవుడు నీ మోర ఆలకిస్తాడు,   ప్రశాంతంగా వెళ్ళమని చెప్పాడు. దాని తరువాత వారు రామాకు తిరిగి వెళ్లారు. 

షిలో నుండి ఇంటికి వచ్చిన తరువాత  ఎల్కానా తన భార్య హన్నాను  కలువగా  ఆమె గర్భము ధరించి   కుమారున్ని కన్నది. ఆ  బిడ్డకు సమూవేలు అని పేరు పెట్టారు. సమూవేలు అనగా దేవుని అడిగితిని అని అర్ధం. తరువాత ఆ కుటుంబం మరియొకసారి   షిలోకు వెళ్లారు కాని హన్నా వారితో వెళ్ళలేదు. ఆమె ఎల్కానా మరియు కుటుంబంతో వెళ్లకుండ, సమూవేలు పాలు మానిన సమూవేలును  యావేకు సమర్పిస్తాను అని ఇంటివద్దనే ఉంది. అందుకు ఏల్కానా ఒప్పుకున్నాడు. సమూవేలు పాలు మానిన తరువాత హాన్నా సమూవేలును   తీసుకొని షిలో వెళ్లి అక్కడ బలిని అర్పించి, బాలుని ఎలి వద్దకు తీసుకువెళ్లి, తనకు జరిగిన అన్ని విషములు చెప్పి, బాలున్ని దేవునికి అర్పించి, ఈ బాలుడు జీవించినంత కాలము ప్రభువుకె ఊడిగము చేయును అని చెప్పింది. అప్పటి నుండి సమూవేలు ప్రభువు మందిరమునే ఉన్నాడు.  హన్నా గొప్ప ప్రార్థన చేసి రామాకు వచ్చింది సమూవేలు మారాము ఎలి పర్యవేక్షణలో యావేకు సేవ చేస్తూ, జీవించాడు.  

ఏలి కుమారులు - యావే సమూవేలును ఏర్పరుచుకొనుట 

ఏలి కుమారులు ప్రభువును  లెక్క చేయక పరమ దుర్మార్గాలు చేశారు. బలి మాంసము వండు సమయములోనే యాజకునికి మాంసము కావాలని తీసుకువెళ్ళేవారు, బలిపశువు క్రొవ్వును పీఠము మీద దహించకముందే యాజకునికి వడ్డించుటకు మాంసం కావాలి, ఉడికినది కాదు అని ముందే  తీసుకెళ్లేవారు. వారివల్ల  యావేకు సమర్పిచు బలికి అగౌరవం కలిగేది. హన్నా ప్రతి సంవత్సరం బలి అర్పించుటకు వచ్చినప్పుడు చిన్న ఏఫోదును తీసుకు వచ్చేది. సమూవేలు దానిని ధరించి యావేకు పరిచర్య చేసేవాడు తరువాత ఆమెకు ముగ్గురు మగ బిడ్డలు ఇద్దరు ఆడ బిడ్డలు పుట్టారు.  

ఏలి ముసలివాడవ్వగా  తన కుమారులు    ప్రభువు గుడారము దగ్గర పనిచేసే  వారితో శయనించారని  తెలిసి, దేవుని పట్ల వారు చేసిన పాపము చెప్పి వారిని మందలించాడు.  కాని వారు ఏలి మాటను పట్టించుకోలేదు. సమూవేలు మాత్రము దేవుని దయకు , ప్రజల మన్ననలకు  పాత్రుడయ్యాడు. దేవుని భక్తుడు ఒకరు ఏలి వద్దకు వచ్చి ఏలి కుమారులు ఇద్దరు ఒక్కరోజే చనిపోతారని చెప్పి, యావే విశ్వసనీయుడైన యాజకునిని ఏర్పరుచు కున్న విషయం చెప్పాడు, ఆ యాజకుడు యావే చిత్తప్రకారం జీవించునని,  అతని సంతతి తరతరములు యావే అభిషిక్తుని ఎదుట మన్నన పొందుతారు అని చెప్పాడు. ఏలి తన కుమారులను మార్చుటకు ఏమి చేయలేదు, కాని హన్నా తన కుమారుని దేవుని సన్నిదిలో అప్పగించింది. ఏలి కుమారులు కూడా దైవ సన్నిధిలోనే ఉన్న వారు మారలేదు. ఏలి కూడా తన కుమారులు ఆడువారిని చెడుచుతున్నారు అని తెలిసిన ఏమి చేయలేదు. ఏలి కుటుంబం  దేవుని సన్నిధిలో ఉండి ఆయన పేరుకు అవమానం కలిగేలా ప్రవర్తించారు. కానీ అక్కడనే ఉన్న సమూవేలు దేవునికి గౌరవం కలిగేలా జీవించాడు. ఎటువంటి వారితో కలిసిఉన్న కాని పాపము చేయకుండా  జీవించడం సమూవేలు ద్వారా తెలుసుకోవచ్చు. 

సమూవేలును  దేవుడు పిలుచుట 

సమూవేలు మందసము దగ్గర నిద్రించుండగా దేవుడు సమూవేలును సమూవేలు, సమూవేలు అని పిలిచాడు. దేవుని వాక్కు వినపడటం ఆ రోజులలో చాల అరుదు. సమూవేలును హన్నా  దేవుని సేవకు సమర్పించినప్పటికీ ఆయనను తన సేవకు  పిలువలసినది దేవుడు. దేవుడు సమూవేలును పిలిచినప్పుడు తన గురువు ఏలి పిలిచినట్లుగా అనుకున్నాడు. ఏలి సమూవేలుకు దేవుని పిలుపును అర్ధం చేసుకొనుటకు సహాయం చేసాడు. ఏలి సమువేలుకు దేవుని పిలుపుకు ఎలా సమాధానము ఇవ్వాలో తెలియజేసాడు. ఏలి సమూవేలుతో మాట్లాడు ప్రభు నీ సేవకుడు వినుచున్నాడు అని సమాధానం ఇవ్వమని చెప్పాడు.   ఏలి కుమారులు  ఘోరమైన పాపములు చేశారు. సమూవేలు ద్వారా  దేవుడు ఏలికి ఒక హెచ్చరిక పంపించాడు.  

దేవుడు  సమూవేలుకు దేవుడు ఇచ్చిన సందేశం అందరికి హెచ్చరిక అయ్యింది. అది ఏమిటంటే  "యిస్రాయేలు జనుల ఎదుట నేనొక  కార్యము చేసెదను దానిని గురించి వినిన వారి రెండు చెవులు గింగురుమనును , ఏలి కుటుంబమునునకు నేను చేసెదననిన కార్యము పూర్తి చేస్తాను ఏలి కుటుంబమును చాల కాలమువరకు శపించితినని తెలియజేయమని, ఎలి కుమారులిద్దరు దేవుణ్ణి నిందించున్నారని ఎరిగియు  మందలింపలేదు, బలులు ,కానుకలు ఏలి కుమారుల పాపలకు ప్రాయశ్చిత్తం చేయలేవు"  అని ప్రభువు సమూవేలుకు చెప్పాడు. ఎలి సమూవేలుతో ఏమి దాచవద్దు దేవుడు నీకు చెప్పినదంత చెప్పమని చెప్పాడు.  సమూవేలు దేవుడు చెప్పిన మాటలు ఏలికి చెప్పిన  తరువాత ఆయన చేయదలుచుకున్న కార్యము చేయునుగాక అని ఏలి  బదులు పలికాడు.

 సమువేలు పెరిగి పెద్దవాడయ్యాడు.  అయన చెప్పిన ప్రతి మాట జరిగింది. ఏలి  అతని కుమారులు చనిపోయారు. దివ్య మందసంపు పెట్టెను ఫిలిస్తీయులు  యుద్ధంలో తీసుకెళ్లారు అని తెలిసి కూర్చున్న చోటనే వెనక్కు వాలి,  మెడ విరిగి చనిపోయాడు. మామ, భర్త చనిపోయారు  అని తెలిసి బిడ్డను ప్రసవించి  ఏలి కోడలు చనిపోయింది. 

మందసమును పిలిస్తియులు ఎబెసెనేరు నుండి అష్డోదునకు తెచ్చారు. అక్కడ దాగోను దేవాలయములో ఉంచారు. ఉదయముకాగానే  దాగోను యావే మందసము ఎదుట నేలపై బోరగిలపడి ఉంది. వారు దాగోనును లేవనెత్తి మరల అక్కడ నిలబెట్టారు.   కాని  తరువాత రోజు మరల దాగోను  యావే మందసము ఎదుట  బోరగిలపడి తల, చేతులు నరకబడి గడప దగ్గర ఉన్నవి. యావే అష్డోదును పరిసరప్రాంత ప్రజలను బొబ్బలతో బాధ పెట్టగ,  అందుకు వారు తట్టుకోలేక మందసమును గాతునకు చేర్చారు. గాతు ప్రజలు కూడా ప్రభువు పెట్టు బాధలు తట్టుకోలేక ఎక్రోనునకు పంపారు. అక్కడ అనేక మంది చనిపోయారు .  మందసము ఏడు మాసములు పిలిస్తుయులతో ఉండగా వారు తట్టుకోలేకపోయారు. ప్రభువు మందసమును వారు అక్కడ నుండి పంపించి వేయుటకు ఎంతో గౌరవంగా బెత్ షెమెషు పొలిమేరల వద్దకు తీసుకు  వచ్చి అక్కడనుండి వెళ్లిపోయారు. బేత్ షేమేషు పౌరులు మందసము వారి కంటపడగానే ఆనందంతో ప్రభువుకు బలి  అర్పించారు.  తరువాత ఆ ప్రజలు పరమ పవిత్రమైన ఆ ప్రభువు ముందట నిలువలేమని కిర్యత్యారీము పంపారు.  అక్కడ  ప్రజలు ప్రభుమందసమును అబీనాదాబు ఇంట చేర్చారు.  అబీనాదాబు కుమారుడు ఎలీయెజెరును ఆ మందసమును శుద్ధి చేసి, కాపాడుటకు నియమించారు. 

అక్కడ మందసము 20 సంవత్సరాలు ఉన్నది.  ప్రజలకు యావేపై  భక్తి కుదిరింది. అప్పుడు సమూవేలు ప్రజలతో  మీరు ప్రభువు వద్దకు రాగోరెదరేని, మీరు కొలుచు అన్యదైవములను వదలివేయండి,  అష్టోరోతును కూడా మీ చెంతనుండి పంపివేయండి,  అపుడు పిలిస్తియుల నుండి యావే మిమ్ము కాపాడుతాడు అని చెప్పాడు. వారు అప్పుడు బాలుదేవతను, అష్టోరోతును వదలి వేశారు. ప్రభువును మాత్రమే  సేవించారు. సమూవేలు ప్రజలను మిస్పా వద్ద  సమావేశ పరచి అక్కడ ప్రజల కొరకు విన్నపం చేస్తాను అని చెప్పడం జరిగింది.  ప్రజలు మిస్పా వద్ద  సమావేశమై నీళ్లు త్రోడి యావే ముందు కుమ్మరించి, ఆరోజు ఉపవాసం ఉండి యావే  ఆజ్ఞ మీరి పాపము చేసాము అని ఒప్పుకున్నారు. అక్కడ వారి కొరకు సమూవేలు దేవుని ప్రార్ధించాడు.

 యిస్రాయేలు మిస్పా వద్ద  సమావేశం అయ్యారు  అని ఫిలిస్తీ యులు  విని వారి మీదకు దండెత్తి వచ్చారు. అప్పుడు  ప్రజలు సమూవేలుకు వారికోసం దేవుణ్ణి వెడమని అడుగగా సమూవేలు ఒక  పాలు తాగు గొర్రె పిల్లను అర్పించాడు. సమూవేలు బలి అర్పించుచుండగానే వారు వచ్చారు యిస్రాయేలు ప్రజలు యుద్దానికి సిద్ధంగా లేరు కనుక దేవుడు  ఉరుము మెరుపుతో వారిలో ఒక గందరగోళం సృష్టించారు, ఆ దెబ్బతో పిలిస్తియులు చెదరిపోయారు. యిస్రాయేలీయులు వారి వెనుకపడి బెత్ కారు వరకు తరిమివేసారు. సమూవేలు మిస్పా మరియు షెను మధ్య ఒక రాతిని యావే వారికి చేసిన మేలుకు గుర్తుగా  నాటారు దానికి ఎబెనెసెరు  అని పేరు పెట్టారు.   యావే ఇంత వరకు మనకు సహాయం చేసెను అని దాని  అర్ధం. సమూవేలు జీవించినంత వరకు ప్రభువు పిలిస్తియులను అణచివేశారు.  సమూవేలు ఉన్నంత వరకు వారికి తీర్పు తీర్చుచూనే ఉన్నాడు. ఆయన్న బేతేలు, గిల్గాలు ,  మిస్ఫా చుట్టి వచ్చి వారికి తీర్పు తీర్చేవాడు. సమూవేలు ప్రాయము దాటిన తరువాత ఆయన కుమారులు యావేలు  మరియు అబీయాలు న్యాయాధిపతులు అయ్యారు కాని వారు లంచగొండులయ్యారు కనుక ప్రజలు రామాకు వచ్చి సమూవేలును  కలుసుకొని అయ్యా నీవు ముసలి ప్రాయంలో ఉన్నావు నీ కుమారులు నీలాంటి వారు కారు కనుక మాకు అన్య జాతుల  వలె ఓక రాజును నియమించండి అని  చెప్పారు.   పెద్దల వేడుకోలు సమువేలుకు నచ్చలేదు. 

అపుడు సమూవేలు ప్రభువుతో మాట్లాడగా, ప్రభువు ఈ ప్రజలను  వినుము, వీరు నిన్ను  కాదు నన్ను నిరాకరించారు, వీరిని  ఐగుప్తునుండి  తీసుకొనివచ్చినప్పటి నుండి నాకు చేసినట్లే నీకును అపచారము చేశారు. వీరు వేరే దేవరలను కొలిచారు, నీవు వారి మాట వినుము కానీ గట్టిగా హెచ్చరించమని చెప్పగా  సమూవేలు ప్రభువు చెప్పిన మాటలను ప్రజలకు చెబుతూ మీరు కోరుకునే  రాజు మీ కుమారులను రథములను తోలుటకు, గుఱ్ఱములను కాపాడుటకు, రథముల ముందు పరుగెత్తుటకు, సైన్యములో కొంతమందికి అధిపతులుగా నియమిస్తాడు,  వారితో పొలము దున్నించి కొత కోయుటకు, యుద్ధ సామాగ్రిని తయారు చేసుకొనుటకు వాడుకుంటాడు. మీ   కుమార్తెలను అత్తరు పూయుటకు, వంటలు వండుటకు, రొట్టెలు  కాల్చుటకు వాడుకుంటారు. మీ పొలములలో సారముగల వాటిని తీసుకుంటారు. మీపొలములను తీసుకొని వారి ఉద్యోగులకు ఇస్తారు, మీ పంటలలో పదియవ వంతు తీసుకొని తమ నౌకరులకు ఇచ్చుకుంటారు. మీ పశువులలో ఇష్టమైన వాటిని తీసుకొని తన పనులు చేయించుకుంటాడు. మీరు అతని బానిసలు అవుతారు, మీరు ఎన్నుకొనిన రాజును తలంచుకొని మీరు పెద్ద ఎత్తున ఏడ్చుదురు అని  చెప్పాడు. ఇన్ని విషయాలు చెప్పినప్పటికీ వారు అతని మాట వినక మాకు రాజును  నియమించాలని పట్టుపట్టారు.  అప్పుడు సమూవేలుతో  ప్రభువు వారికి ఇష్టము వచ్చినట్లు చేయుమని చెప్పాడు. అప్పుడు సమూవేలు ప్రజలకు మీమీ పట్టణములను వెళ్ళమని చెప్పాడు. ఒకరోజు   ప్రభువు సమూవేలుతో రేపు నిర్ణిత సమయమున బెన్యామీను తెగకు చెందిన ఒకనిని నీ వద్దకు పంపెదను అతనిని యిస్రాయేలుకు నాయకునిగా అభిషేకింపమని చెప్పాడు. 

ఈ సమయంలోనే  సౌలు తన  తండ్రి గాడిదలు తప్పి పోగా, తండ్రి వాటిని వెదకిరమ్మని సౌలును పంపాడు. వారు ఎంతగా వెదకినప్పటికీ  అవి కనపడలేదు.  అప్పుడు సౌలు తండ్రి గాడిదలను గురించి కాక కుమారుని కొరకు   బాధపడునేమో అని తన వెంట వచ్చిన సేవకునికి వెనక్కిపోవుదుము అని చెప్పగా ఆతడు ఇక్కడ ఒక   దైవభక్తుడు ఒకడు ఉన్నాడు. ఆయన చెప్పినదంతా జరుగును. అతనిని చూచిన మనకు మార్గము చెప్పవచ్చును అని చెప్పగా  సౌలు అతనికి ఇవ్వుటకు మనవద్ద ఏమిలేదు కదా అని చెప్పాడు.  అప్పుడు ఆ సేవకుడు తన వద్ద పావుతులము వెండి ఉన్నది దానిని అతనికి ఇచ్చెదము అని చెప్పాడు. వారు కొండమీదఉన్న  పట్టణమునకెక్కి నీళ్లు తోడుకొనుటకు దిగివచ్చు బాలికలను దీర్ఘదర్శి ఉన్నడా  అని అడిగారు.  అందుకు వారు ఉన్నాడు, ఈ దినము ఉన్నత స్థలమున బలి అర్పించబోవుతున్నారు అని చెప్పారు. మీరు ఉన్నత స్థలమునకు వెళ్లకమునుపే దర్శించవచ్చును త్వరగా వెళ్ళమని  అని చెప్పారు. సౌలు సేవకునితో కలసి పట్టణములో ప్రవేశింపగానే సమూవేలు అతనికి ఎదురుపడ్డాడు. ఆ ముందు రోజునే ప్రభువు సమూవేలుతో రేపు నిర్ణిత సమయమున బెన్యామీను తెగకు చెందిన ఒకనిని నీ వద్దకు పంపెదను అతనిని యిస్రాయేలుకు నాయకునిగా అభిషేకింపమని చెప్పాడు. సౌలు ఎదురుపడగానే ప్రభువు సమూవేలుతో నా ప్రజలను పాలించునని నేను ముందుగా చెప్పినది ఇతని గురించే అని చెప్పాడు. సౌలు సమువేలుతో అయ్యా! దీర్ఘదర్శి ఇల్లు ఎక్కడ?  అని అడుగగా సౌలు దీర్ఘదర్శిని నేనే, నా కంటే ముందుగా వెళ్లి ఉన్నత స్థలమును చేరుకొనుము, నేను ఈరోజు నీతో భుజింపవలెను, రేపు నిన్ను పంపెదను  నీవు వెళ్లునప్పుడు నీలోని సంధియును తీర్చెదను, తప్పిపోయిన మీ గాడిదలు దొరికినవి కనుక వాటి గురించి చింతించకు  అని చెప్పాడు. యిస్రాయేలు కోరునది నిన్నును నీ కుటుంబమునుకదా అని చెప్పాడు అప్పుడు సౌలు నేను యిస్రాయేలు తెగలలో అల్పమైన బెన్యామీను తెగవాడను, ఆ తెగనందలి అల్పమైనది అటువంటి నా మీద ఇట్టి పలుకులు పలకనేలా అని అన్నాడు. 

సమూవేలు సౌలును అతని దాసుని భోజనశాలకు తీసుకొనివెళ్ళి అతిధుల ముందుటి భాగమున వారిని కూర్చుండబెట్టి వేరుగా వండి ఉంచిన వేట తొడను తీసుకొని వచ్చి  సౌలు ముందుట పెట్టి భుజింపమని చెప్పాడు. అక్కడ నుండి   నగరమునకు వచ్చి, సౌలుకు పడక సిద్దము చేయగా అక్కడ ఆతడు నిద్రించాడు. వేకువనే సమూవేలు సౌలును నిద్రలేపి నగర చివరకు వచ్చిన తరువాత సౌలు సేవకుని  సౌలుతో సాగిపొమ్మని చెప్పించి సౌలును అక్కడే ఆపి , యావే ఆజ్ఞను అతనికి తెలియజేస్తాను అని చెప్పాడు. సమూవేలు తైలపుబుడ్డిని తీసుకొని సౌలు తలపై చమురు కుమ్మరించి అతనిని ముద్దు పట్టుకున్నాడు. యావే నిన్ను తన ప్రజలకు నాయకునిగా చేసాడు నీవు ప్రజలను పాలించి శత్రువుల నుండి వారిని కాపాడవలెను .  నిన్ను నాయకునిగా ప్రభువు చేసాడు అనుటకు గుర్తులు ఏమిటంటే నన్ను నీవు విడిపోగానే బెన్యామీను పొలిమేరలలో సెల్సా వద్దగల రాహేలు సమాధివద్ద ఇద్దరు నిన్ను కలుసుకొని మీ గాడిదలు దొరికినవి అని చెప్పెదరు. మీ తండ్రి నీ గురించి చింతించుచున్నాడు అని  చెప్పుతురు అని తరువాత తాబోరు సింధూరము చేరగానే  బేతేలు పోవు ముగ్గురు నీకు దండము పెట్టి రెండు రొట్టెలు కానుకగా  ఇత్తురు వానిని తీసుకొనుము. తరువాత   గిబియా, తేలోహిము వెళ్లి అక్కడ ఫిలిస్తీయుల శిబిరం ఉంది అక్కడకు చేరగానే ప్రవక్తల సమాజము   ఉన్నత స్థలము దిగి వచ్చుచుండును, వారు ప్రవచనములు పలుకుతారు, వారితోపాటు నీవుకూడా ప్రవచించెదవు , దానితో నీవు పూర్తిగా మారిపోయెదవు, ఇవన్నీ జరిగిన తరువాత తగినవిధంగా పనులు చేయుము అని చెప్పాడు. ఇక నీవు ముందుగా వెళ్లి గిల్గాలు చేరుము నేను అక్కడకు వచ్చెదను. నీవు నాకోసం ఏడురోజులు వేచియుండుము నేను వచ్చి నీవు ఏమి చేయాలో చెప్పదను అని చెప్పాడు.

 సౌలు సమూవేలును వీడివెళ్ళగానే ఆయన చెప్పినవన్నీ జరిగాయి. దేవుడు అతని  హృదయమును పూర్తిగా మార్చివేసాడు. అతడు గిబియా చేరగానే ప్రవక్తల సమూహం ఎదురవగానే దేవుని ఆత్మ అతని మీదికి రాగా, సౌలు ప్రవచనములను పలికాడు.  అది చూచిన ప్రజలు కీషు కుమారునికి ఏ గతి పట్టెనని  పలికారు. తరువాత సౌలు ఇంటికి వెళ్ళాడు. సమూవేలు మిస్పా వద్ద  యావే ఎదుటికి  ప్రజలను రప్పించి వారితో యిస్రాయేలు దేవుడు మిమ్ములను ఐగుప్తు నుండి మరియ శత్రువుల బారి నుండి కాపాడుకుంటూ వచ్చాడు.  మీరు మాకు రాజును నియమించాలని, దేవుణ్ణి పట్టుపట్టారు., మీ తెగల వారిగా యావే ముందు నిలవండి అని చెప్పాడు, సమూవేలు చీట్లు వేయగా బెన్యామీను తెగలోని  మంత్రీ కుటుంబంలోని కీషు కుటుంబంలోని సౌలు వంతు వచ్చినప్పుడు అతను కనపడలేదు. అతడు సామానులు మధ్య దాగుకొని ఉన్నాడు అని  ప్రభువు తెలియచేయగా అతనిని తీసుకొని వచ్చారు. అప్పుడు సమూవేలు ప్రజలతో దేవుడు ఎవరిని ఎన్నుకొన్నారో చూసారో కదా, ఇటువంటి వారు యిస్రాయేలులో ఎవరు లేరు అనెను అపుడు జనులు మా రాజు కలకాలము జీవించు గాక అని కేకలు వేశారు. అపుడు సమూవేలు రాజు ఎలా పాలించునో చెప్పారు, అలానే ఒక గ్రంథమును రాసి యావే ముందుట ఉంచాడు. తరువాత ప్రజలను వారివారి ఇళ్లకు పంపించాడు.  

కొంతమంది యితడు మనలను ఎట్లు రక్షింపగలడు అని సౌలును తక్కువ చేసి మాట్లాడారు. సౌలు అమ్మోనీయులను  ఓడించిన తరువాత ప్రజలు సమూవేలుతో సౌలును తక్కువ చేసి మాట్లాడిన వారిని తీసుకోని రమ్ము మేము వారిని వధిస్తాము అని చెప్పారు. సమూవేలు ప్రజలతో మనము గిల్గాలుకు పోవుదము, అక్కడ రాజనియామమునకు ఒప్పుకుందుము అని మాటయిత్తుము అని చెప్పి గిల్గాలు వెళ్లి అక్కడక సౌలును రాజుగా ప్రకటించాడు. సమూవేలు ప్రజలతో మీ మనవుల ప్రకారం మీకు రాజును నియమించాను, రాజే మిమ్ము ఇకనుండి నడిపిస్తాడు. నేను ముసలివాడిని అయ్యాను, చిన్ననాటి నుండి మీకు నాయకుడిగా నిడిపించాను. నాలో ఏమైనా దోషం ఉన్న యెడల యావే ఎదుట, రాజు ఎదుట నిరూపించమని అడిగాడు. నేను ఎవరిది  ఏదైనా తీసుకున్నానా? లంచము తీసుకొని న్యాయము చెప్పానా? మోసం చేసానా? నేను ఏమైనా చేసినచో రుజువు చేయండి నేను వారికీ అది ఇస్తాను అని చెప్పాడు. దానికి ప్రజలు అటువంటిది ఏమి లేదు అని సమాధానం ఇచ్చారు. 

నాలో ఏ అపరాధము లేదనుటకు యావే సాక్షి, ప్రభువుచే అభిషిక్తుడగు రాజు సాక్షి అని సమూవేలు చెప్పగానే  ప్రజలు అవును ప్రభువే సాక్షి అని బదులిచ్చారు.  తరువాత దేవుడు ఎలా వారిని ఐగుప్తు నుండి తీసుకొని వచ్చినది, ఎలా వారికి భూమి ఇచ్చినది, వారు ఆయన మాట వినక ఇతర దేవతలను కొలిచినందుకు శిక్షించినది  సమూవేలుతో ప్రజలు చెప్పారు. దేవుణ్ణి వారు ఎలా మొరపెట్టుకొన్నది శత్రువుల నుండి విడిపించమని చెప్పినది చెప్పి, దేవుడు న్యాయాధిపతులను పంపి వారి బానిసత్వము నుండి విడిపించగా వారు చీకు చింతలు లేక బ్రతికిన విషయం వెల్లడి చేసాడు. యావే మీ రాజు , అయినను మీరు మాకు యావే కాక మరియొక రాజు కావాలి అని అడిగారు. ఇతడే మీరు ఎన్నుకొనిన రాజు, మీరును మీ రాజును ప్రభువు పట్ల భయ భక్తులు చూపించి , ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించిన మీకు మేలు జరుగును లేదేని మీరు ముప్పు తిప్పలు పడునట్లు చేయును.   ప్రజలను అక్కడే ఉంచి వారి ముందు ఒక గొప్ప కార్యము చేసాడు గోధుమ కాల సమయంలో యావెను ప్రార్ధించగా , సమూవేలు చెప్పినట్లుగా ఉరుములతో వాన కురిసింది. దీని ద్వారా ప్రభువును వారు రాజు కావలెనని అడిగి చేసిన తప్పును తెలుసుకోవాలని వారికి చెప్పాడు. వారు సమూ వేలుతో   మా తరుపున యావేకు విన్నపము చేయుము , రాజును కోరుకొనుట కూడా మేము చేసిన తప్పిదమే అని  పలికారు. అందుకు సమూ వేలు భయపడకుడు మీరు తప్పు చేసిన మాట వాస్తవమే కానీ  ప్రభువును అనుసరించుట మాత్రం మానకుడు, ఆయనను పూర్ణ హృదయముతో సేవింపుడు, విగ్రహములు మాయే, అవి కాపాడలేవు, వాని వలన ప్రయోజనము లేదు. యావే తన ఘనమైన నామమును నిలబెట్టుకొనువాడు  కనుక మిమ్ము పరిత్యజించడు. నేను మీకొరకు మనవి చేసెదను. మీకు ధర్మ మార్గమును చూపెదను  అని వారికి బోధించాడు. 

సాలు ఒక ఏడాది పాలన చేసిన తరువాత   పిలిస్తియుల దండును హతము చేసినందుకు వారు ఇస్రాయేలీయుల   మీద కోపముగా ఉన్నారు. యిస్రాయేలీయులు భయంతో ఉన్నారు. శత్రువులు వారి చుట్టూ చేరారని వారు పారిపోయారు. సౌలు గిల్గాలు వద్ద ఉన్నాడు. సౌలు సమూవేలు చెప్పిన గడువు ప్రకారము ఏడూ రోజులు  ఆగి సామూవేలు రాలేదని, ప్రజలు వీడిపోతున్నారని దహన బలిని, సమాధాన బలిని సిద్ధం చేయించి తానె దహన బలిని అర్పించాడు. అపుడు సమూవేలు వచ్చి ఎంతపని చేసితివి అని అన్నాడు.   నీవు ప్రభువు ఆజ్ఞ పాటించి ఉండినట్లైయితే ఎప్పటికి నీ కుటుంబము వారే రాజుగా ఉండేవారు అని చెప్పాడు. ప్రభువు ఇంకొకరిని నాయకునిగా  ఎన్నుకొనును అని చెప్పి సమూవేలు గిల్గాలు నుండి వెళ్ళిపోయాడు. 

సౌలు తన పాలనను సుస్థిరం చేసుకొని పాలించసాగాడు. కొన్నాళ్లకు సమూవేలు సౌలు వద్దకు వచ్చి నేను యావే పంపగా వచ్చి, నిన్ను యిస్రాయేలీయులకు రాజుగా అభిషేకించాను, ఇప్పుడు ప్రభువు మాటలు వినుము. యిస్రాయేలీయులు ఐగుప్తు నుండి వచ్చునప్పుడు అమాలేకీయులు త్రోవలో వారినెదిరించి బాధించారు, వారిని నేను శిక్షించాలని ప్రభువు అంటున్నాడు. కనుక నీవు వెంటనే పోయి వారిని  వధింపుము, వారిలో ఒక్కరిని కూడా బ్రతుకనీయవద్దు. ఎడ్లను, గొర్రెలను , ఒంటెలను, గాడిదలను, అన్నింటిని మట్టుపెట్టుము ఇది యావే ఆజ్ఞ అనిచెప్పాడు. సౌలు అమాలేకీయులను సంహారించాడు. ఆగాగును చంపలేదు.. క్రొవ్విన ఎడ్లను దూడలను  గొర్రెలను గొర్రె పిల్లలను చంపలేదు. మంచి వాటిని మిగుల్చుకొని పనికిరాని వాటిని శాపము పాలుచేసి వదించారు. సమూవేలుకు ప్రభువు దివ్యవాణి సౌలును రాజును చేసినందుకు నేను విచారించుచున్నాను.  అతను నా ఆజ్ఞలను పాటించక , దిక్కరించాడు అని సమూవేలుతో చెప్పాడు. 

మరునాడు సమూవేలు సౌలును చూడబోయాడు. అప్పటికే సౌలు గిల్గాలుకు వెళ్ళాడు అని  తెలియగ అక్కడకు వెళ్ళాడు. సమూవేలు సౌలును కలవగానే సౌలు సమూవేలుతో ప్రభువు నిన్ను దీవించునుగాక నేను యావే  ఆజ్ఞను పాటించితిని అని చెప్పాడు. అందుకు సమూవేలు అది నిజమైతే గొర్రెల అరుపులు ఎద్దుల రంకెలు నా చెవులలో ఇంకా రింగున  మారుమ్రోగుచున్నవి ఎందుకు అని  అడిగాడు. అపుడు సౌలు వాటిని అమాలేకీయుల నుండి కొన్నాము అని చెప్పాడు.    ప్రజలు శ్రేష్టమైన ఎడ్లను, గొర్రెలను యావేకు బలి ఇచ్చుటకు అంటిపెట్టుకొని మిగిలిన వాటిని శాపము పాలు చేసి సంహరించాము అని చెప్పాడు. అపుడు సౌలుతో సమూవేలు  నీ మాటలు ఆపు, ప్రభువు నాతో చెప్పిన మాటలు వినుము, నీవు అల్పుడవైనను  యావే నిన్ను  యిస్రాయేలుకు నాయకునిగా చేయలేదా ? నిన్ను  రాజుగా చేయలేదా? నీకు యావే ఒక పని అప్పగించి ఉన్నాడు. అది నీవు ఎలా దిక్కరించావు? దోపిడిసొమ్ము దక్కించుకోవడం కోసం యావే ముందు పాపం చేసావు అని అడిగాడు. 

అందుకు సౌలు నేను యావే మాట ఆలకించాను, ఆగాగును తీసుకొచ్చాను, గిల్గాలు వద్ద యావేకు బలి అర్పించుటకు ప్రజలే వాటిని అట్టిపెట్టుకొన్నారని చెప్పాడు. అందుకు సమూవేలు యావే బలుల వలన సంతృప్తి చెందునా? విధేయత వలనగాదా? బలి కంటే విధేయత మేలు నీవు యావే మాట త్రోసివేసావు కనుక యావే నీ రాజరికమును త్రోసివేసెను. అని చెప్పాడు. అందుకు సౌలు ప్రజలకు భయపడి నేను అటుల చేసి పాపము కట్టుకున్నాను. నా తప్పు క్షమించి, యావెను మ్రొక్కుటకు నాతో రమ్మని అడిగాడు. దానికి సమూవేలు నేను నీ వెంట రాను, నీవు యావే పలుకులు  తిరస్కరించితివి కనుక నీ రాజపదవిని యావే తిరస్కరించాడు అని చెప్పి,  మారాలి వెళ్లపోతుండగా సౌలు అతని అంగీ చెంగు పట్టుకోగానే అది చినిగింది. సమూవేలు అతనితో  ఈరోజు ప్రభువు యిస్రాయేలు రాజ్యమును నీ చేతినుండి లాగివేసి నీకంటే యోగ్యుడైన వానికి ఇచ్చివేసెను అని చెప్పాడు. మరల సౌలు సమూవేలుతో యావెను మొక్కుటకు నాతో రమ్ము అని    అడుగగా సమూవేలు సౌలు వెంట వెళ్ళాడు. అతడు యావేకు మ్రొక్కాడు. సమూవేలు  ఆగాగును తీసుకొని రమ్మని చెప్పగా వారు అటులె చేసెను. అప్పుడు సమూవేలు అతనితో నీకత్తి వలన తల్లులు బిడ్డలను కోల్పోయినట్లే నేడు నీ తల్లి తన బిడ్డను కోల్పోవును అని  యావే ఎదుట అతనిని నరికివేసెను. తరువాత సమూవేలు రామాకు వెళ్ళిపోయాడు. సౌలు చనిపోవువరకు సమూవేలు అతనిని  కలుసుకొనలేదు. 

సౌలు గురించి సమూవేలు పరితపించాడు. యావే సమూవేలుతో నేను సౌలును తిరస్కరించినందుకు ఎంతకాలము దుఃఖించెదవు.  కొమ్మును తైలమును నింపుకొని వేళ్ళు, బేత్లెహేము వాసియైన యిషాయి వద్దకు పంపుతున్నాను. అతని కుమారులలో ఒకరిని  నేను రాజుగా   ఎన్నుకొంటిని అని చెప్పాడు. అందుకు సమూవేలు  నేను పోలేను, ఈ మాట వింటే సౌలు నన్ను చంపివేస్తాడు అని అన్నాడు. అందుకు నీవొక  ఆవు పెయ్యను తీసుకెళ్ళుము, ఆ ఊరివారితో యావేకు బలి అర్పించడానికి వచ్చాను అని చెప్పుము. యిషాయిని కూడా బలి అర్పణమునకు పిలువుము. అక్కడ నీవేమి చెయ్యాలో  అక్కడ చెప్పెదను నీవు మాత్రము నేను నిర్ణయించిన వానిని అభిషేకించాలి అని చెప్పాడు. 

సమూవేలు యావే చెప్పినట్లు బేత్లెహేము  వెళ్ళాడు. ఆ ఊరి పెద్దలు అతనిని చూచి భయపడ్డారు.  వారు మీరు మా మేలు ఎంచి వచ్చారా  లేక కీడు ఎంచి వచ్చారా  అని అడుగగా మీ మేలు కోరే  వచ్చాను, ఇక్కడ బలి అర్పించడానికి  వచ్చాను, మీరు శుద్ధి చేసుకొని రావాలి అని చెప్పాడు. యిషాయిని అతని కుమారులను సమూవేలు  శుద్ధి చేసి బలికి ఆహ్వానించాడు. వారు అప్పుడు బలికి వచ్చారు. అపుడు సమూవేలు యిషాయి పెద్ద కుమారుని చూసి ప్రభువు అతనిని ఎన్నుకొనబోతున్నాడు అని అనుకున్నాడు. యావే సమూవేలుతో రూపమును,  ఎత్తును చూసి భ్రమపడకుము, దేవుడు నరుడు చూచిన చూపుతో చూడడు, హ్రదయమును అవలోకించును  అని చెప్పాడు.  అదే విధంగా యిషాయి కుమారులు ఏడుగురు సమూవేలు ఎదుట నిలిచారు కానీ యావే వారిని ఎన్నుకొనలేదు. అప్పుడు సమూవేలు నీ కుమారులు వీరేనా ? అని అడిగారు. అపుడు అతను చిన్నవాడు పొలమున   గొర్రెలు కాయుచున్నాడు అని చెప్పాడు. ఎవరిని అయినా పంపి అతనిని పిలిపింపుము,  అతను వచ్చినంత వరకు నేను భోజనమునకు కూర్చొను అని చెప్పాడు. దావీదు  రాగానే యావే  నేను కోరుకొనినవాడు ఇతనే అని  చెప్పాడు. సమూవేలు తైలపు కొమ్ము  తీసుకొని అన్నలేదుట అతనికి అభిషేకము చేసాడు. అప్పటి నుండి యావే ఆత్మ దావీదును ఆవహించి   అతనిలో ఉండిపోయింది. దాని తరువాత సమూవేలు రామాకు  వెళ్ళిపోయాడు. 

దావీదును చంపుటకు సౌలు ప్రయత్నిస్తుండగా దావీదు రామా  వద్ద ఉన్న సమూవేలు వద్దకు వచ్చి జరిగిన విషయాలు మొత్తము చెప్పాడు. అపుడు  దావీదు, సమూవేలు నావోతు చేరి అక్కడ ఉన్నారు. సౌలు అది తెలుసుకొని సేవకులను దావీదును పట్టుకొనుటకు పంపాడు. వారు వచ్చి సమూవేలు ప్రవక్తల సమూహమునకు నాయకునిగా నిలుచుట చూడగా దేవుని ఆత్మ సౌలు సేవకుల మీదకు రాగ వారుకూడా ప్రవచనములు పలికారు. ఇది విని సౌలు మరల కొంతమంది సేవకులను పంపారు. వారును అలానే చేశారు. అపుడు మూడవసారి కూడా వారు అంతే చేశారు. అపుడు సౌలు  స్వయంగా రామాకు వచ్చి  అక్కడివారిని సమూవేలును దావీదును చూసారా అని అడుగగా వారు నావోతు వద్ద   ఉన్నారు అని చెప్పగా  సౌలు అక్కడకు పోవుటకు బయలుదేరగా దేవుని ఆత్మ అతన్ని ఆవేశించినది.  అపుడు  అతడు ఆవేశముతో బట్టలను తొలగించుకొని సమూవేలు  ఎదుటనే ప్రవచనలు చెప్పాడు. కాని  దావీదు అపుడు యోనాతాను వద్దకు వెళ్ళిపోయాడు. తరువాత కొన్నాళ్ళకు  సమూవేలుమరణించాడు. యిస్రాయేలీయులందరు సమావేశమై అతని కొరకు శోకించారు. రామాలో అతని ఇంటిలో అతనిని పాతిపెట్టారు. 

 సమూవేలు చనిపోయిన తరువాత సౌలు పిలిస్తియుల మీద యుద్ధమునకు పోవుటకు యిస్రాయేలును సిద్ధముచేసాడు కానీ వారిని చూసి భయపడ్డాడు. అతడు యావెను సంప్రదించిన కాని  యావే స్వప్నంలోకాని ఊరీము వలన కానీ ప్రవక్తల ద్వారా కానీ ఏమి సెలవియ్యలేదు. అపుడు చనిపోయిన వారిని ఆవాహకము చేసుకొనే ఒక మాంత్రికురాలను సమీపించి   మృతలోకం నుండి నేను సమూవేలుని రప్పింపుము అని అడిగాడు. ఆమె సమువేలు లేచి వచ్చుట చూసి భయపడి కేకవేసింది. ఆమెతో సౌలు అతడు నీకు ఎవరు కనపడిరి అని అడుగగా భూమిలో నుండి దైవములలో ఒకడు లేచి వచ్చుచున్నాడు అని చెప్పింది. సౌలు అతని ఆకారము గురించి అడుగగా దుప్పటి కప్పుకొనిన ముసలివడెవడో లేచి వస్తున్నాడు అని చెప్పాడు. అపుడు వెంటనే సమూవేలు అని గ్రహించి సౌలు లేచి నేలపై సాగిలపడి దండము పెట్టాడు.   సమూవేలు సౌలుతో నీవు నన్ను కుదురుగా ఉండనియక ఎందుకు రప్పించితివి అని అడిగాడు.  అపుడు సౌలు ఫిలిస్తీయులు నాపై యుద్ధమునకు వచ్చారు, నేనేమి చెయ్యాలో తెలియడం లేదు. ప్రభువు నాతో మాట్లాడలేదు.  దిక్కుతోచక నిన్ను రప్పించితిని అని చెప్పాడు. అపుడు సమూవేలు యావే నిన్ను విడనాడి, నీకు శత్రువు కాగ, నన్ను సంప్రదించి ప్రయోజనమేమి? యావే చెప్పినట్లే చేసాడు. ప్రభువు రాజ్యమును నీ నుండి తొలగించి నీ పొరుగువాడైన దావీదునకు ఇచ్చివేసెను. నీవు ప్రభువు మాట పాటింపవైతివి. కనుకనే యావే నిన్ను వీడెను,   ప్రభువు నిన్నును,  నీ  తనయులును  ఫిలిస్తీయుల చేతికి అప్పగించును రేపు నీవు నీ కుమారులు  నాతో   ఉందురు అని చెప్పాడు. 

20.10.24

29 సామాన్య ఆదివారం

మార్కు 10: 35-45


అంతట జెబదాయి పుత్రులగు యోహాను, యాకోబులు యేసును సమీపించి "బోధకుడా! మాదొక మనవి. అనుగ్రహింపుడు" అని వేడుకొనిరి. అందుకాయన "నేను మీకేమి చేయగోరుచున్నారు?" అని వారినడిగెను. వారు "మీరు మీ రాజ్యములో మహిమాన్విత  సింహాసనము పై ఆసీనులైనప్పుడు మమ్ము మీ కుడి ఎడమల కూర్చుండ అనుగ్రహింపుడు" అని ప్రార్ధించిరి. అందులకు యేసు "మీరు కోరున దేమియో మీరు ఎరుగరు. నేను పానము చేయు పాత్రమునుండి మీరు పానము చేయగలరా?" నేను పొందబోవు బాప్తిస్మమును మీరును పొందగలరా?" అనెను. "అవును" అని వారు పలికిరి. యేసు వారితో "నేను పానము చేయు పాత్రమునుండి మీరు పానము చేసెదరు. నేను పొందబోవు బాప్తిస్మమును మీరును పొందెదరు. కానీ, నా కుడి ఎడమల మిమ్ము కూర్చుండబెట్టునది నేను కాదు. నా తండ్రి ఏర్పరచిన వారికే అది లభించును" అని పలికెను. తక్కిన పదుగురు శిష్యులు దీనిని వినినప్పుడు యోహాను, యాకోబులపై కినుక వహించిరి. యేసు శిష్యులను కూడబిలిచి, వారితో ఇట్లనెను: " అన్యజాతి ప్రజలలో పాలకులు పాలితులను నిరంకుశముగా పరిపాలించుచున్నారు. పెద్దలు వారిపై పెత్తనము చలాయించుచున్నారు. మీకు ఇది తగదు. మీలో ఎవడైన గొప్పవాడు కాదలచిన అతడు మీకు పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడైన ప్రముఖుడుగా ఉండదలచిన అతడు మీకు బానిసయై ఉండవలెను. ఏలయన మనుష్యకుమారుడు  సేవించుటకేగాని సేవింపబడుటకు రాలేదు. అయన అనేకుల రక్షణార్ధము తన ప్రాణమును ధారపోయుటకు వచ్చెను.  

జెబదాయి పుత్రులగు యోహాను, యాకోబులు యేసును సమీపించి "బోధకుడా! మాదొక మనవి. అనుగ్రహింపుడు" అని వేడుకొనిరి. యోహాను యాకోబులు యేసు ప్రభువు దగ్గరకు వచ్చి ఒక కోరిక కోరుకుంటున్నాను. వీరు మాత్రమే ఎందుకు ప్రభువును అడుగుతున్నారు? మిగిలిన వారు ఎందుకు అడుగుట లేదు అని ఆలోచిస్తే ఒక విషయం అర్ధం అవుతుంది. వీరు ఇరువురు మరియు   పేతురు  మిగిలిన శిష్యులకంటే ఎక్కువ సమయం ప్రభువు సాన్నిధ్యంలో ఉండేవారు. ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను అంటే ప్రభువు పేతురు, యాకోబు యోహానులను తీసుకొని ప్రార్ధించుటకు ప్రత్యేకంగా పోవటం మనం సువిశేషంలో గమనించవచ్చు. ఎవరు అయితే ప్రభువుతో ఎక్కువసేపు ఉంటారో, లేక ఆయనతో సాన్నిహిత్యం ఎక్కువ ఉంటుందో వారు ప్రభువును కోరుకునే విషయాలను  గమనించినట్లైతే,, వీరి కోరికలకు, సాధారణంగా ప్రభువును వారి అవసరముల కొరకు వచ్చి కలిసిన వారి కోరికలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. పేతురు గారు ప్రభువుతో కలిసి తాబోరు పర్వతం మీద ఉన్నప్పుడు ప్రభువుతో  మనము ఇక్కడే ఉందాము అని అంటున్నారు.  యేసు ప్రభువుతో ఎక్కువ సాన్నిహిత్యం కలిగిన ఎవరు అయినా కానీ వారి మాటలు, కోరికలు ప్రభువుతోనే ఉండుటకు, ఆయనతో గడుపుటకు ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటాయి. సమరియా స్త్రీ కూడా ప్రభువుతో ఆధ్యాత్మిక విషయాల గురించే ఎక్కువగా మాట్లాడింది.  అందుకు  కారణము  ఏమిటిఅంటే ఆయనను వారు చాలా దగ్గరగా చూసారు. దాని ద్వారా అయన గురించి వారికి ఎక్కువగా తెలుసు. ఆయన వారికి ఇహలోకమైనవి కాకుండా పరలోకమునకు సంబందించిన  వాటిని కూడా ఇవ్వగలడు అని వారు తెలుసుకున్నారు. ప్రభువు నుండి మనము పొందాలనుకునేవాటిని పొందుటకు మనం తగిన విధంగా సిద్దపడినట్లైయితే ప్రభువు మనకు వాటిని ప్రసాదిస్తారు.  పేతురుగారు కూడా అయన గురించి తెలుసుకున్న తరువాత అందరు నిన్ను వదలిపెట్టిన నేను నిన్ను వదలి పెట్టను అని అంటున్నారు , కాని  ప్రభువును వదలి పెట్టకుండ ఉండుటకు తగిన విధంగా పేతురు సిద్దపడలేదు. 
"నేను మీకేమి చేయగోరుచున్నారు?" అని వారినడిగెను. వారు "మీరు మీ రాజ్యములో మహిమాన్విత  సింహాసనము పై ఆసీనులైనప్పుడు మమ్ము మీ కుడి ఎడమల కూర్చుండ అనుగ్రహింపుడు" అని ప్రార్ధించిరి.  నేను మీకేమి చేయగోరుచున్నారని ప్రభువు వారిని అడుగుతున్నారు. వారు వెంటనే ప్రభువు రాజ్యంలో  ఆయన మమహిమాన్విత సింహాసనమున ఆసీనుడైనప్పుడు  ప్రభువు కుడి ఎడమల ప్రక్కన ఆసనములను అడుగుతున్నారు. వారికి ఎక్కడ నుండి ఈ ఆలోచన వచ్చి ఉండవచ్చు? ప్రభువు అనేకసార్లు పరలోక రాజ్యం గురించి చెప్పేవారు. చెప్పడం మాత్రమే కాక, దానిలోనికి రమ్మని ప్రజలను ఆహ్వానిస్తున్నారు. అనేక ఉపమానాలద్వారా కూడా ప్రభువు వారికి చెప్పారు. ప్రభువు మాటలను శ్రద్ధగా వీరు ఆలకించేవారు. ప్రభువు మాటలు విని పరలోక రాజ్యం మీద మక్కువ పెంచుకున్నారు. వీరికి ఐచ్చిక కోరికల కంటే పరలోకం మీద కోరిక కలిగేలా ప్రభువు చేశారు. దానిని పొందటమే కాదు, ప్రభువు ఇరుప్రక్కల ఉన్నత ఆసనములు కావాలని వీరు కోరుకుంటున్నారు. ప్రభువు మాటలు శ్రద్దగా ఆలకించిన ప్రతివారు ప్రభువును పరలోకం పొందడం గురించే అడిగారు. సమరియ స్త్రీ, పేతురు, నీకొదేము మొదలగువారు ఒకరకంగా ప్రభువుతో ఉండుటకు ఎక్కువగా   ఇష్టపడ్డారు లేక   ప్రభువు రాజ్యంలో స్థానము కోసం ఆశ పడ్డారు. యేసు ప్రభువు ప్రక్కన సిలువ వేయబడిన మంచి దొంగవాడు కూడా పరలోక రాజ్యంలో స్థానం అడిగారు. యాకోబు యోహానులు కేవలం పరలోక రాజ్యంలో స్థానం మాత్రమే కాదు  ఆయన కుడి ఎడమల ఆసనములను వారు అడిగారు. 
"మీరు కోరున దేమియో మీరు ఎరుగరు. నేను పానము చేయు పాత్రమునుండి మీరు పానము చేయగలరా?" నేను పొందబోవు బాప్తిస్మమును మీరును పొందగలరా?" అనెను. యేసు ప్రభువు యాకోబు యోహానుల వేడుకోలును మీరు కోరునది ఏమో మీకు తెలియదు అని చెబుతున్నారు. నేను పానము చేయు పాత్రము నుండి మీరు పానము చేయగలరా అని ప్రభువు వారితో అంటున్నారు. ఎందుకంటే ప్రభువు పొందబోయే శ్రమల స్నానము ఎంతో కఠినమైనది. అది భారంతో కూడినది. లోకపాపభారమునంతటిని మోసేటువంటిది. అందుకు వీరు ఎంతగానో సిద్ధపడాలి. కేవలం మేము చేయగలం  అని అన్నంత మాత్రమున వారు దానికి సిద్దమైనటువంటి వారు ఏమి కాదు. పేతురుగారు ప్రభువుతో వీరు అందరూ నిన్ను వీడిన  నేను మాత్రము నిన్ను వీడను  అని అన్నారు. కానీ ప్రభువు కష్టంలో ఆయనకు తోడుగా ఉండలేకపోయారు. మీరు పానము చేయు పాత్రము నుండి మేము పానము చేస్తాము అని వీరు అంటున్నప్పటికీ, వీరు ప్రభువుతో ఉండలేకపోయారు. తరువాత ప్రభువు నిమిత్తమై వారు  శ్రమలు అనుభవించారు. పరలోక రాజ్యంలో ప్రభువు తరువాత స్థానమును అడుగుతున్నారు  దానికి సరైన సిద్ధపాటు ఏ వ్యక్తి ఐన కలిగిఉన్నాడా?.  అది దేవుడు ఇచ్చేదే కానీ దానికి అర్హులు ఎవరు అని తండ్రి గుర్తిస్తారు. దానిని పొందుటకు ప్రభువు మార్గమును తెలియజేస్తున్నారు. ఆమార్గము ఏమిటంటే  ఎవడైన గొప్పవాడు కాదలచిన అతడు మీకు పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడైన ప్రముఖుడుగా ఉండదలచిన అతడు మీకు బానిసయై ఉండవలెనని ప్రభువు తెలియజేస్తున్నాడు. ఇది పరలోక రాజ్యంలో గొప్పవానిగా కావాలనుకొనేవారు చేయవలసినది. ప్రభువు మనలను ఆయన వలె మారమని అడుగుతున్నారు. ఇది ఈనాటి సువిశేష సారాంశము. ప్రభువు రాజ్యంలో చేరాలన్న, ఆయన కుడి ఎడమల ఉండాలన్న మనము ఎంత వరకు ప్రభువు వలె మార్పు చెందాము అనే దానిమీద ఆధారపడి ఉంటుంది. కనుక ఆయన వలె మార్పు చెందుటకు కావలసిన అనుగ్రహం కోసం ప్రార్ధించండి. ఆమెన్ 




6.9.24

లూకా 5: 33-39

 లూకా 5: 33-39

"యోహాను శిష్యులు తరచుగా ఉపవాసములు, ప్రార్ధనలు చేసెదరు. అటులనే పరిసయ్యుల శిష్యులను చేయుదురు. కాని, మీ శిష్యులు మాత్రము తిని త్రాగుచున్నారేల?" అని కొందరు యేసును ప్రశ్నించిరి. అందుకు యేసు "పెండ్లి కుమారుడు ఉన్నంతవరకు విందునకు వెళ్ళినవారు ఉపవాసము చెయుదురా? పెండ్లి కుమారుడు తమ వెంట ఉన్నంత వరకు ఆ ఇంటి వారిచేత ఉపవాసము చేయింపగలరా? పెండ్లి కుమారుడు వారిని ఎడబాయుకాలము వచ్చును. అపుడు వారు ఉపవాసము చేయుదురు" అని వారితో పలికెను. యేసు వారికి ఇంకను ఈ ఉపమానమును చెప్పెను: "ప్రాత గుద్దకు మాసికవేయుటకు క్రొత్త గుడ్డను ఎవరు చింపుదురు? అటుల చేసిన యెడల క్రొత్త గుడ్డ చినిగి పోవుటయేకాక, అది ప్రాత గుద్దకు అతుకుకొనదు. అట్లే కొత్త ద్రాక్షారసమును ప్రాత తిత్తులలో ఎవరును పోయరు. అటుల పోసిన యెడల ఆ ప్రాత తిత్తులు పిగులును, ఆ రసము నేలపాలగును, తిత్తులు నశించిపోవును. కనుక, క్రొత్త రసమును క్రొత్త తిత్తులలోనే ఉంచవలయును. ప్రాత రసమునకు అలవడినవాడు క్రొత్త రసమును  తాగుటకు ఇష్టపడడు. అతడు ప్రాతరసమే మేలు అనును". 

ధ్యానము:  దేవుని అనుగ్రహం కోసం  పవిత్ర గ్రంథంలో అనేక మంది ఉపవాసం చేసేవారు. కేవలం దేవుని అనుగ్రహం పొందడం కోసమే కాక పశ్చాత్తాపమును వ్యక్తము చేయుటకు కూడా ఉపవాసం చేసేవారు. దేవుని పండుగలను కొనియాడేముందుగా ఆ పండుగ కోసం ఆయత్తపడుట లేక సిద్ద పడుట కోసం ఉపవాసం చేస్తారు. కొంతమంది మెస్సియ్యా రాకడను కాంక్షిస్తూ, దానికి సిద్దపడుతూ ఉపవాసం చేసేవారు. ఈ విధంగా పవిత్ర గ్రంథంలో అనేక మంది ఉపవాసం చేయడం మనము చూస్తాము. యోహాను శిష్యులు చేసే ఉపవాసం మెస్సియ్యా రాకడను కాంక్షిస్తూ, అందుకు సిద్ద పడుటకు చేసే ఉపవాసము. ఎందుకంటే యోహాను ఈ మెస్సియ్యా రాకడను గురించి అందరు సమాయత్తపడాలని బోధించాడు.  అంతేకాక యోహాను  కొమరను సంఘం గురించి తెలిసినవాడని వీరు   మెస్సియ్యా రాకడకు సిద్దపడే సంఘం కాబట్టి వారితో కలసి జీవించాడు అనే నమ్మకం కూడ కొంత మందిలో ఉండేది.  వీరు ప్రార్ధన,  ఉపవాసములతో జీవించారు.  యోహాను కూడా అతి స్వల్పమైన ఆహారముతోనే  జీవించాడు.  యోహాను జీవితం  ప్రభువు రాకడకు సిద్ధపాటు జీవితంగా సాగింది. 

యేసు ప్రభువు దగ్గరకు కొందరు వచ్చి యోహాను శిష్యులు, పరిసయ్యుల శిష్యులు తరచుగా ఉపవాసం, ప్రార్థనలు  చేస్తారు కాని మీ శిష్యులు తిని త్రాగుచున్నారేలా? అని ప్రభువును వారు ప్రశ్నించారు. అయితే ప్రభువు ఎందుకు ఆయన శిష్యులు ఉపవాసం చేయడం లేదో వారికి వివరిస్తున్నారు.  యేసు ప్రభువు పెండ్లి కుమారుడు ఉన్నంత వరకు పెండ్లికి వచ్చిన వారు ఉపవాసం చేయుదురా అని అడుగుతున్నారు. ప్రభువు ఎందుకు ఇలా అడుగుతున్నారంటే  యేసు ప్రభువే  మెస్సియా.  యోహాను లేక అతని శిష్యులు ఉపవాసం చేసేది ఈ మెస్సియా కోసమే. అందుకే యోహాను శిష్యులలో కొంతమంది యేసు ప్రభువే మెస్సియా అనే  సత్యం తెలుసుకున్న  తరువాత యేసు ప్రభువు శిష్యులుగా మారిపోతున్నారు. ఒక వ్యక్తి  మెస్సియా రాకడకొరకు, లేక రక్షకుని ఆహ్వానించడానికి ఉపవాసం చేసినట్లయితే ఇప్పుడు ఆ పని చేయనవసరం లేదు. ఆ రక్షకుడు వారి దగ్గరనే ఉన్నారు, ఆయనే యేసు ప్రభువు. శిష్యులు దేవుని అనుగ్రహం కోసం ఉపవాసం చేయవలసి వస్తే అది అవసరం లేదు, దేవుడే వారితో ఉన్నారు. కనుక ప్రభువు రూపంలో  సమస్తము వారి దగ్గరనే ఉన్నవి.   శిష్యులు పాప క్షమాపణ కోసమో లేక పశ్చాతాపము వ్యక్తపరచడానికో ఉపవాసము చేయవలసి వస్తే వారిని ప్రభువు తన సాన్నిధ్యంతో పవిత్రులను చేస్తున్నారు అందుకు కూడా వారు ఉపవాసం చేయనవసరం లేదు.   ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట మరియు దేవునితో సత్సంబంధము నెలకొల్పుకొనుట. ప్రభువే వారితో ఉంటున్నారు కనుక దేవునితో వారికి మంచి సంబంధము ఉంది. ప్రతి రోజు, ప్రతి నిముషం వారు ప్రభువు తోనే ఉంటున్నారు. ప్రభువుతో వారు మాట్లాడుతూనే ఉన్నారు.   

పెండ్లి కుమారుడు వారి నుండి ఎడబాయు కాలము వచ్చును అప్పుడు వారు  ఉపవాసము చేయుదురు అని ప్రభువు చెబుతున్నారు. యేసు ప్రభువు తన శిష్యులతో ఉన్నంత కాలము వారు దేవుని సాన్నిధ్యాన్ని అనుభవిస్తున్నారు. వారు ఉపవాసము చేయనవసరం లేదు. కాని వారి వద్ద నుండి ఆయన వెళ్ళిపోతారు. అప్పుడు వారు తప్పకుండా ఉపవాసం చేయవలసి వస్తుంది. పాత నిబంధనలో దైవ మందసము యిస్రాయేలు నుండి తీసివేయబడింది. అపుడు ఆ ప్రజలు బాధలలో నిండిపోయారు. అందుకే ఏలి కోడలు , ఏలి దేవుని మహిమ యిస్రాయేలును విడిచిపోయినది అని చెబుతున్నారు.   ప్రభువు మనతో లేనప్పుడు మనము ఉపవాసం చేయవలసిన సమయం. అది శిష్యుల జీవితంలో కూడా వస్తుంది.  ఆయన వారి వద్ద నుండి వెళ్ళిపోతారు. ఎప్పుడు ప్రభువు మన వద్ద నుండి వెళ్ళిపోతారు? పవిత్ర గ్రంథంలో దేవుని సాన్నిధ్యం ఎప్పుడు యిస్రాయేలు ప్రజలకు దూరం అవుతుంది అంటే యిస్రాయేలు ప్రజలు వారికి ఇష్టమైన విధంగా జీవిస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో అపవిత్రంగా ఉన్నప్పుడు, దైవ సన్నిధిలో ఉండి అక్కడ సేవ చేసేవారిని బాధించినప్పుడు, దైవ సాన్నిధ్యాన్ని అపవిత్ర పరచినప్పుడు, యిర్మీయా చెబుతున్నట్లు, గర్వంతో ఉంటూ,  మంచి జీవితం జీవించకుండా  నాకు ఏమి కాదు నేను దేవుని సన్నిధిలో ఉన్నాను అనుకునే సమయాల్లో  దేవుడు దూరమవుతారు. అటువంటి  పరిస్థితిలో  ఉన్నప్పుడు మనం ఉపవాసం చేయవలసి ఉంటుంది. ఆ ఉపవాసం మరల ప్రభువుతో కలసి ఉండుటకు. 

సంభాషణ మరియు ప్రార్ధన : ప్రభువా! మీరు శిష్యులతో ఉన్నంత కాలం శిష్యులు ఎంతో ఆనందంగా ఉన్నారు. వారు మీతో కలసి ఉండటం వలన, మిమ్ములను పొందటం వలన, మీ సహచర్యంలో జీవించడం వలన వారి జీవితంలో ఒక మధురానుభూతిని పొందుతున్నారు. అనేక మంది దీర్ఘదర్శులు ఈ ప్రభువు సాన్నిధ్యం అనుభవించాలని కోరుకున్నారు. కాని వారందరికీ దొరకని ఈ గొప్ప అవకాశం మీ శిష్యులకు అనుగ్రహించారు.  ఆ ధన్యతను  మీ శిష్యులు పూర్తిగా తెలుసుకున్న, తెలుసుకోలేక పోయిన అది స్వర్గీయ అనుభూతి.  అందుకే వారిలో కొందరైనా మీ సాన్నిధ్యం విలువ తెలుసుకొనవలెననేమో   మీరు ముగ్గురితో రూపాంతరీకరణ చెందుతున్నారు. ప్రభువా! మీ సహాచర్యము మనిషిని ఎంత ఉన్నతునిగా తీర్చిదిద్దుతుందో సాధారణ జాలరులు, సుంకరులుగా ఉన్న వారు, ఎంతటి ఉన్నత కార్యాలు చేయగలిగారో  తెలుసుకుకోవడం వలన తెలుస్తుంది.  ప్రభువా! మీ సాన్నిధ్యం కోల్పోవడం అంటే మేము పాపంలో కూరుకుపోవడమే. మేము ఎల్లప్పుడు పవిత్రంగా ఉంటూ, చెడు క్రియల జోలికి పోకుండా, గర్వం దరిచేరనివ్వకుండ, మీ మహిమ మమ్ములను ఎప్పటికి విడిపోకుండా మమ్ము  దీవించండి. అంతేకాక మా చెడు జీవితం వలన మిమ్ము దూరం చేసుకొన్న సమయాలలో మీతో కలసి ఉండాలనే కోరికతో మేము చేసే ఉపవాసమును, మీతో సత్సంబంధమును ఏర్పరుచుకొనుటకు మేము చేసే ప్రార్ధనను ఆలకించి మమ్ము అనుగ్రహించండి. ఆమెన్  

4.9.24

లూకా 5: 1-11

 లూకా 5: 1-11

యేసు ఒక పర్యాయము గెన్నేసరెతు సరస్సు తీరమున నిలిచియుండగా జనసమూహము దేవుని వాక్కును ఆలకించుటకు ఆయనయొద్దకు నెట్టుకొనుచు వచ్చిరి. ఆయన అచట రెండు పడవలను చూచెను. జారరులు వాని నుండి దిగి తమ వలలను శుభ్రపరచుకొనుచుండిరి. అందులో ఒకటి సీమోను పడవ. యేసు ఆ పడవనెక్కి దానిని ఒడ్డుననుండి లోనికి త్రోయమని, అందు కూర్చుండి ప్రజలకు ఉపదేశింప ఆరంభించెను. ఉపదేశించుట ముగించిన పిదప యేసు సీమోనుతో "మీరు పడవను ఇంకను లోతునకు తీసికొని వెళ్లి చేపలకై మీ వలలను వేయుడు" అనెను అందుకు సీమోను "బోధకుడా! మేము  రాత్రి అంతయు శ్రమించితిమి. కాని ఫలితము లేదు. అయినను మీ మాట మీద వలలను వేసెదము" అని ప్రత్త్యుత్తరము ఇచ్చెను. వల వేయగనే,  వల చినుగునన్ని చేపలు పడెను. అంతట జాలరులు రెండవ పడవలోనున్న తమ తోటి వారికి, వచ్చి సహాయము చేయుడని ప్రాధేయపడగా, వారు వచ్చి రెండు పడవలను చేపలతో నింపగనే పడవలు మునుగునట్లు ఉండెను. సీమోను పేతురు ఇది  చూచి యేసు పాదములపై పడి "ప్రభూ ! నేను పాపాత్ముడను. నన్ను విడిచిపొండు" అని పలికెను. ఇన్ని చేపలు పడుట చూచి సీమోను, అతని తోటి వారు ఆశ్చర్యపడిరి. సీమోనుతో ఉన్న జెబదాయి కుమారులు యాకోబు, యోహానులును అట్లే ఆశ్చర్యపడిరి. యేసు అపుడు సీమోనుతో "భయపడవలదు. ఇక నుండి నీవు మనుష్యులను పట్టువాడవై ఉందువు"అనెను. ఆజాలరులు పడవలను ఒడ్డునకుచేర్చి తమ సమస్తమును విడిచి పెట్టి యేసును అనుసరించిరి. 

ధ్యానము: దేవుని వాక్కును ఆలకించుటకు ప్రజలు నెట్టుకొనుచు ప్రభువు వద్దకు వస్తున్నారు. ప్రభువు వాక్కు దేవుని వాక్కు. ఆయన వాక్కు అధికారముతోను, సూచక క్రియలతోను, అద్భుతాలతోను, జాలి, దయ మరియు విడుదలతోను కూడి  ఉన్నది. దేవుని వాక్కు ప్రజలకు అనేక సందర్భంలో వస్తుంది. కాని యేసు ప్రభువె దేవుని వాక్కు. ప్రజలకు అనేక సంవత్సరాలుగా దేవుని వాక్కును వినిపించే వారు లేరు. యేసు ప్రభువుతోటి మరల దేవుని వాక్కును వింటున్నారు. దేవుని వాక్కును వినుటకు ప్రజలు ఎంతో ప్రేమతో, ఆశతో వస్తున్నారు. ఏమిటి ఈ దేవుని వాక్కు? ఈ వాక్కు ఏమి చేస్తుంది? దేవుని వాక్కు జీవం అయి ఉన్నది. వాక్కు దేవుడే. ఈ వాక్కు కేవలం జీవం మాత్రమే కాదు మానవునికి భరోసాను ఇస్తుంది. వాక్యం ధైర్యాన్ని ఇస్తుంది. వాక్యం వెలుగునిస్తుంది. ఈ వాక్యం వివేకాన్ని ఇస్తుంది. ఈ వాక్కు మానవుని వక్ర మార్గాలను సరిచేస్తుంది. ఈ వాక్కు మానవుడు చేసిన పాపాలకు ప్రశ్చాత్తాపము పొందేలాగా చేస్తుంది. ఈ వాక్కు మనలను పాపవిముక్తులను చేస్తుంది. ఈ  వాక్యం మనకు మంచినే అనుసరించే శక్తిని ఇస్తుంది. యేసు ప్రభువు దగ్గరకు   ప్రజలు ఈ వాక్కును వినడానికి, పొందడానికి వస్తున్నారు. 

ప్రజలను చూసి  వారికి ప్రభువు  దేవుని వాక్కును వినిపిస్తున్నారు. దేవుని వాక్కును వింటున్న ప్రజలు ప్రభువు దగ్గర నుండి జీవం పొందుతున్నారు. విశ్వాసం పొందుతున్నారు. వారి జీవితాలలో దేవునికి వారికి మధ్య ఉన్న బంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు, మరియు నుత్నికరించుకుంటున్నారు. ప్రభువు మాటలు విన్న వారు దేవుని సాన్నిధ్యాన్ని  పొందుతున్నారు.   ప్రభువు వద్ద నుండి ప్రజలు వాక్కును పొందటం ద్వార మరియు  ఆయన వద్దకు రావడం ద్వారా దేవునితో సఖ్యతను ఏర్పరుచుకుంటున్నారు. ప్రభువు దగ్గర వాక్కు వినుట వలన ప్రజలు నూతన జీవాన్ని పొందుతున్నారు.  ప్రభువు వాక్కును వినడం వలన వారికి కలిగే ప్రయోజనాలు ఆ ప్రజలకు తెలుసు, వారు అనుభవపూర్వకంగాఇది  తెలుసుకున్నారు.  ఎంతో మందిని ఆయన స్వస్థ పరచడం జరిగింది. కనుకనే ఆయన మాటలు వినడానికి ప్రజలు వస్తున్నారు. 

అక్కడ ఉన్న జాలరులు ప్రభువుకు  తన వాక్కును అందించడానికి,  పడవనిచ్చి అక్కడ  కూర్చొనడానికి  సహాయం చేశారు. ప్రభువు వాక్కు ఆ జాలరులు కూడా విన్నారు. ప్రభువు గొప్పవారు అని వారికి తెలుసు. దేవుని వాక్కు వినిన వారికి ఆయన వాక్కు యొక్క శక్తి కూడా తెలుసు. వారు ఆ రాత్రి మొత్తం చేపల కోసం శ్రమించారు అయినప్పటికీ వారికి ఏమి  దొరకలేదు. అందరి అవసరాలను చూసే ప్రభువు, రోగాలను తగ్గించే ప్రభువు, జీవాన్ని ఇచ్చే ప్రభువు, వీరి అవసరాన్ని గురించలేరా? ఆ ప్రభువు    వారి అవసరమును, వారి  నిరాశను గుర్తించి, వారికి చేపలు పడుటకు వలను ఎక్కడ వెయ్యాలో  చెబుతున్నారు. కాని దానికి వారు ప్రభువుతో మేము రాత్రి మొత్తం శ్రమించాము కాని ఫలితము లేదు అని తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. ప్రభువు మీద వున్న విశ్వాసంతో, సముద్రము మీద వారికి ఉన్న అనుభవాన్ని, ఇంతకాలం వారు పనిచేసిన పరిజ్ఞానాన్ని పక్కన పెట్టి, ప్రభువు మాట ప్రకారం, ప్రభువు చెప్పినట్లు తమ వలలను వేస్తున్నారు. వారికీ ఆశ్చర్యకరంగా వారి వల చినుగునన్ని చేపలు పడుతున్నవి. 

ప్రభువు మాట వినుట వలన వచ్చే ప్రయోజము  ఏమిటో మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. ప్రభువు మాట వినుట వలన మనకు ఎప్పుడు సమృద్ధి కలుగుతుంది. అది ఎటువంటి సమృద్ధి అంటే కేవలం వారికి మాత్రమే కాక అనేక మంది ప్రయోజనం పొందే విధంగా కలుగుతుంది. అందుకే తోటి వారు సహాయము చేయుటకు అక్కడకు వస్తున్నారు. పేతురు గారు ఇది చూసి ప్రభువు పాదములపై పడి నేను పాపాత్ముడను నన్ను విడిచిపెట్టి వెళ్ళండి అని అంటున్నారు. ఎందుకు పేతురుగారు నేను పాపాత్ముడను నన్ను విడిచిపెట్టి వెళ్ళండి అని అంటున్నారంటే, పేతురుకి తన అనుభవం మొత్తం గుర్తుకు వస్తుంది. ఆ రోజు వరకు పేతురు గారు చేపలు పట్టే  వృత్తిలోనే ఉన్నాడు. ఎప్పుడు, ఎక్కడ చేపలు ఉంటాయో వారి అనుభవపూర్వకంగా తెలుసు. పేతురుకు తన అనుభవం మీద, తన వృత్తి మీద అపనమ్మకం లేదు. కాని తనకు తెలియని విషయం, తన అనుభవానికి మించిన జ్ఞానము ప్రభువు దగ్గర ఉన్నది అని ఆయనకు తెలుస్తుంది. ప్రభువు కేవలం ఒక ప్రవక్త కాదని, దేవుని రక్షకుడని , ప్రభువు పావనుడని ఆయనకు తెలుస్తుంది. తన పాప జీవితం లేక తన సాధరణ జీవితం, తాను జీవించే జీవితం ఆంధ్ పావనమైనది కాదని.   కనుక  ప్రభువు అంతటి పావనుని  సహచర్యంలో ఉండుటకు నేను అర్హుడను కాను అని తెలుసుకుంటున్నారు. అందుకే ప్రభువా నన్ను వదలి పొమ్ము అని   అంటున్నారు.  కానీ ప్రభువు మాత్రం పేతురుతో భయపడవలదు అని ధైర్యాన్ని ఇస్తున్నాడు. పేతురును ప్రభువు మనుషులను పట్టేవానిగా చేస్తాను అని అభయమిచ్చి పేతురును దీవిస్తున్నాడు. తరువాత పేతురు ప్రభువు శిష్యునిగా అనేక మందిని ప్రభువు అనుచరులుగా మారుస్తున్నారు. 

సంభాషణ : ప్రభువా! మీ వాక్కు ఎంత మధురమైనది. మీ వాక్కు వినుటకు ప్రజలు ఎంతో ఆశతో వస్తున్నారు. మీ వాక్కు వినుట వలన మాకు జరిగే ప్రయోజనము ఏమిటో మేము తెలుసుకుంటున్నాము. అందుకు మీ వాక్కు వినుటకు అందరు వస్తున్నారు. మీ మాట వినుట వలన మా జీవితంలో ఏమి కలుగుతుందో, మీ మాటను ఆలకించి చేపల కోసం వలను వేసిన వారి ద్వారా తెలుసుకుంటున్నాము. ప్రభువా మీరు ఓకే సాధారణ చేపలు పెట్టె వ్యక్తిని మనుషులను పట్టే వానిగా చేస్తున్నారు. 

ప్రార్థన : ప్రభువా! మీ వద్దకు ప్రజలు దేవుని వాక్కును వినడం కొరకు ఎంతో ఆశతో వస్తున్నారు. మీ దగ్గరకు వచ్చిన వారిని ఎంతో ఆనందంగా మీరు పంపుతున్నారు. వారు వారి వారి సమస్యల నుండి వారికి  విముక్తిని ఇస్తున్నారు. తండ్రితో వారి బంధాన్ని నుత్నికరించుకుంటున్నారు. అంతేకాక మీ మాటలు వినుట వలన ఎలా వలల నిండా చేపలు పడ్డాయో  చూసి పేతురు  మరియు జెబదాయి కుమారులు ఆశ్చర్యపోతున్నారు. మీరు పావనమూర్తి అని తెలుసుకుంటున్నారు. మేము మేము కూడా మిమ్ములను తెలుసుకొని, మా సమస్యల నుండి విముక్తి పొందేలా చేయండి. ఆ జాలరుల వలె మిమ్ము అనుసరించే అనుగ్రహం దయచేయండి ఆమెన్. 


3.9.24

1 కొరింతి 3:1-9, లూకా 4: 38-44

 1 కొరింతి 3:1-9, లూకా 4: 38-44

పిదప యేసు ప్రార్ధన మందిరమును వీడి, తిన్నగా సీమోను ఇంటికి పోయెను. అపుడు సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో మంచము పట్టియుండెను. వారు ఆమె విషయము ఆయనకు మనవి చేసికొనిరి. అపుడు ఆయన ఆమె చెంత నిలిచి జ్వరమును గద్దింపగా అది విడిచిపోయెను. ఆమె వెంటనే లేచి వారికి పరిచర్య చేయసాగెను. ప్రొద్దుగ్రుంకుచుండగా నానావిధ రోగపీడితులైన వారినందరిని వారి వారి బంధువులు యేసు వద్దకు తీసికొనివచ్చుచుండిరి. అపుడు ఆయన వారిలో ఒక్కొక్కనిమీద తన హస్తమునుంచి వారినందరిని స్వస్థపరచెను. అనేకులనుండి దయ్యములు "నీవు దేవుని కుమారుడవు" అని ఆర్భటించుచు వదలి పోయెను. అవి ఆయన క్రీస్తు అని ఎరిగియుండుట వలన ఆయన వానిని గద్దించి మాటాడనీయలేదు. వేకువనేలేచి యేసు ఒక నిర్జన ప్రదేశమునకు వెళ్లెను. ప్రజలు ఆయనను వెదకుచు వచ్చి, తమను విడిచిపోవలదని అనగా, ఆయన వారితో "నేను ఇతర పట్టణములలోకూడ దేవుని రాజ్యమును గురించి బోధింపవలసివున్నది. అందులకే నేను పంపబడితిని" అని పలికెను. పిమ్మట యేసు యూదయా ప్రార్ధనా మందిరములలో బోధించుచుండెను. 

ధ్యానము: యేసు ప్రభువు ప్రార్థన మందిరము వీడటం అంటూ జరిగితే అది దేవుని సంకల్పం నెరవేర్చడానికి మాత్రమే ప్రార్థన మందిరమును , లేక ప్రార్థనను వీడుతుంటాడు. ప్రార్ధన అంటే దేవునితో సంభాషించుట, దేవునితో సఖ్యత పడుట, దేవునితో సంభందమును దృఢపరచుకొనుట.యేసు ప్రభువు ప్రార్ధనలో దేవునితో అంటే తన తండ్రితో ఉన్న ఆ బంధమును  దృఢపరచుకొనుట ఎలా అనే విషయం తెలుసుకోవచ్చు. యేసు ప్రభువు వలే ప్రతి రోజు ప్రార్ధన చేసుకోనట్లయితే నాకు దేవునితో ఉన్న ఆ సంభందం దృఢ పడుతుంది. యేసు ప్రభువు ఎల్లప్పుడు దేవుని సంకల్పము నెరవేర్చే పనిలోనే ఉన్నాడు కాబట్టి ఆయనకు తండ్రికి ఉన్న సంభందము ఎప్పుడు సన్నగిల్లలేదు. కాని మానవ జీవితంలో నేను కొలది సమయము మాత్రమే దైవ చింతన గురించి లేక  నా ఆధ్యాత్మిక జీవితం గురించి ఆలోచిస్తున్నాను కనుక నేను ఎక్కువగా దేవునితో సంభందం లేకుండా ఉన్నాను. కాని ప్రతిరోజు ప్రభువు వలె ప్రార్ధిస్తే, తండ్రితో దృఢ బంధం ఏర్పరుచుకుంటే ఎంత బావుండును. అపుడు మన జీతం మొత్తం ప్రభువుతో మిళితం అయ్యివుంటుంది. 

యేసు ప్రభువు ప్రార్ధన మందిరమును వీడి సీమోను ఇంటికి వెళుతున్నాడు. అక్కడ జ్వరముతో బాధపడుతున్న పేతురు గారి అత్తను స్వస్థ పరుస్తున్నారు. యేసు ప్రభువు జీవితం మొత్తం తండ్రి సంకల్పం నెరవేర్చడం మరియు మానవునికి సహాయపడడంతో నిండి ఉన్నది. తండ్రితో సంభాషించిన తరువాత తన జీవితం మొత్తం మానవునికి తోడుపడటమే. అందుకే జ్వరముతో భాదపడుతున్న పేతురు అత్తను గురించి తెలుపగానే ఆయన ఆ జ్వరమును గద్దించాడు. అది వెంటనే తొలగిపోతుంది. యేసు ప్రభువు మనతో ఉంటె మనలో ఉన్న అనారోగ్యాలు, అపవిత్రత అనేవి మననుండి వెళ్లిపోతాయి. యేసు ప్రభువు చెప్పిన వెంటనే అనారోగ్యం వదిలిపోతుంది. మనము కూడ ప్రభువు దగ్గరకు వచ్చి మనకు ఉన్న సమస్యను చెప్పినట్లయితే ప్రభువు ఏమి చేస్తాడో ఈ సువిశేష భాగంలో మనం తెలుసుకుంటున్నాం. 

యేసు ప్రభువు కేవలం పేతురు అత్తగారిని మాత్రమే కాక  అనేక రోగాలతో ఉన్నవారిని ప్రభువు దగ్గరికి తీసుకొనివస్తున్నారు. వారి అందరిని ప్రభువు స్వస్థ పరుస్తున్నారు. ప్రభువు దగ్గరకు వచ్చిన వారిని ఎవరిని స్వస్థత పొందకుండ వెళ్లనివ్వలేదు. ప్రభువు మాట వినిన తరువాత అందరు కడుపు నింపబడిన తరువాతనే ప్రభువు వారిని పంపుతాడు. అదేవిధంగా వారు అస్వస్థతతో ఉన్నట్లయితే వారు   స్వస్థత పొందిన తరువాతనే ప్రభువు దగ్గర నుండి వెళ్లడం గమనించవచ్చు. ప్రభువు వద్దకు రావడం లేక తీసుకోరాబడటం అంటే మన సమస్యాలు, రోగాలు, ఇబ్బందులు, బానిసత్వాలు వంటి వాటి నుండి విముక్తి పొందడం. అందుకే సాతానుచే పీడించబడేవారు, రోగాలతో ఉన్నవారు అందరు విముక్తి పొందుతున్నారు. తిరిగి వారి ప్రదేశాలను సంతోషంగా ఆరోగ్యంగా వెళుతున్నారు.  ప్రభువు దగ్గరకు వచ్చిన వారి నుండి సాతాను వెళ్ళిపోతుంది. ప్రభువు వాటిని మాటాడనియ్యలేదు. లోకములోని అన్ని శక్తులు కూడా ప్రభువుకు లోబడే ఉంటాయి. మనిషే ప్రభువు మాట మీరి తప్పుచేస్తుంటాడు. 

సంభాషణ : ప్రభువా! మీరు తండ్రితోటి సంభాషించుటకు ఎంతగానో ప్రాముఖ్యత ఇచ్చారు. తండ్రితో మాట్లాడటం మీ దైనందిన జీవితంలో భాగం అయ్యింది. అందుకే కాబోలు మీరు ఎల్లప్పుడు ఆ తండ్రి చిత్తమును నెరవేర్చడము మీ ఆహారము చేసుకున్నారు. మీరు తండ్రితో మాటలాడిన తరువాత ఇతరుల బాగుకోసము పాటు పడ్డారు. మీరు ఎలా మీ జీవితాన్ని తండ్రితోటి బాంధవ్యం   కోసం, మానవ శ్రేయస్సు కోసం ఉపయోగించారో, మీలా జీవించడం మాకు ఎలా సాధ్యపడుతుంది. ప్రభువా! మీ దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి వారికి కావలసిన వాటిని మీరు అందిస్తున్నారు. వ్యాధులు, బాధలు అన్ని కూడా మనుషులను వీడిపోయేలా చేస్తున్నారు. మా జీవితాలలో కూడా ప్రభువా ఇటువంటివి వ్యాధులు, బాధలు వస్తున్నవి. మేము అనేక సార్లు మేము మీ వద్దకు రావడానికి  ప్రయత్నిస్తున్నాము కాని కొన్ని సార్లు మీ  దగ్గరకు రావడానికి ప్రయత్నించినా రాలేక పోతున్నాము.  మేము మీ వద్దకు ఎలా రావాలో నేర్పించండి. ప్రభువా లోకములోని అన్ని శక్తులు మీకు సహకరించాయి. మీ మాటకు అన్ని లోబడుతున్నాయి. 

ప్రార్ధన: ప్రభువా! ఈనాటి సువిశేషంలో మీరు ఎలా ఎప్పుడు తండ్రితోటి సంబంధం కలిగి ఉన్నారో మేము తెలుసుకుంటున్నాము. మీరు ఏవిధంగా అయితే తండ్రితోటి సంబంధం కలిగి ఉన్నారో మేము కూడా మీతోటి తండ్రి తోటి సంబంధం కలిగి జీవించేలా చేయండి. మీ దగ్గరకు వచ్చిన ప్రతి వ్యక్తిని మీరు వారి వారి సమస్యల నుండి విముక్తిని చేస్తున్నారు. ప్రభువా! మాకు అనేక బాధలు ఉన్నవి, మేము అనేక అలవాటులకు బానిసలుగా ఉన్నాము. మీరు అనేక మందికి విముక్తిని ప్రసాదించిన విధంగా మా సమస్యల నుండి మాకు చేయమని వేడుకుంటున్నాము. ఆమెన్ 

18.5.24

పెంతికొస్తు మహోత్సవం

పెంతికొస్తు మహోత్సవం

 యోహాను 20:19-23 

అది ఆదివారము సాయంసమయము. యూదుల భయముచే శిష్యులు ఒకచోట తలుపులు మూసికొనియుండిరి. యేసు వచ్చి వారిమధ్య నిలువబడి, "మీకు శాంతి కలుగునుగాక!" అనెను. ఆ మాటలు చెప్పిన పిదప ఆయన వారికి తన చేతులను, ప్రక్కను చూపగా, ప్రభువును చూచి వారు ఆనందించిరి. యేసు మరల వారితో, "మీకు శాంతి కలుగునుగాక! నా తండ్రి నన్ను  పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను" అని పలికెను. అటుల పలికి, ఆయన వారి మీద శ్వాస ఊది "పవిత్రాత్మను పొందుడు. ఎవరి పాపములనైనను మీరు క్షమించినయెడల అవి క్షమింపబడును. మీరు ఎవరి పాపములనైనను క్షమింపనియెడల  అవి క్షమింపబడవు" అని చెప్పెను. 

ప్రియ మిత్రులారా  పెంతికోస్తు  అంటే 50 వ  అని అర్ధం. మనం క్రీస్తు పునరుత్థానము అయిన 7వ ఆదివారం   ఈ పండుగను కొనియాడుతాము. ఇది యేసు ప్రభువు చెప్పిన విధముగా పవిత్రాత్మను తన శిష్యులకు పంపిన రోజు.  యూదులు ఈ పండుగను పాస్క పండుగ అయిన 7 వారములకు అంటే 50 రోజున జరుపుకుంటారు. వారికి ఇది పంట కోయు పండుగ. దీనినే వారాల పండుగ అని కూడా అంటారు. అంతె కాదు ఇది దేవుడు మోషేకు పది ఆజ్ఞలు  ఇచ్చిన రోజును గుర్తు చేసుకొనే రోజు. 

క్రైస్తవులకు ఈ పెంతుకోస్తు  పండుగ చాలా ముఖ్యమైన పండుగ ఎందుకంటే ఈ రోజున యేసు ప్రభువు పవిత్రాత్మను ఆయన శిష్యుల  మీదకు పంపుతున్నారు. ఒక్క సారిగా  అతికొద్దిమందిగా ఉన్న క్రైస్తవులుగా అనేక మంది మారిపోతున్నారు. అపోస్తులుల కార్యాలు 2 వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, ఒక్కసారిగా 3000 మంది విశ్వాసంలోనికి వస్తున్నారు. యేసు ప్రభువు తండ్రి దగ్గరకు వెళ్ళిన తరువాత తన శిష్యులు కోత పండుగ సంధర్భంగా ఒక చోట గుమికుడారు.  వారు కూర్చన్న ఇంటిని పవిత్రాత్మ అవరించింది. అపో 2:2 . వారు అందరు పవిత్రాత్మతో నింపబడి అనేక భాషలలొ మాట్లాడే విధంగా చేసింది. ఈ అద్భుతం అనేక మందిని ఆకర్షించింది. అప్పడు పేతురు  మారు మనస్సు గురించి, క్రీస్తు సువార్తను గురించి వివరించారు. చివరకు  ఒకే రోజు 3000 వేల మంది క్రీస్తు అనుచరులు అయ్యారు. అపో 2:41. ఇది పెంతికొస్తు రోజు జరిగిన సంఘటన. 

 పవిత్రాత్మను మన జీవితాలలోనికి ఆహ్వానిస్తే   ఆయన ఏమి చేస్తారు ? 

యేసు ప్రభువే పవిత్రాత్మ గురించి కూడా మనకు తెలియజేస్తున్నాడు. కేవలం తెలియజేయడమే కాకుండా ఆ ఆత్మను తన శిష్యులతో ఉండుటకు పంపుతున్నాడు. పవిత్రాత్మ మనతో ఉంటూ,  మనలో పని చేసి, మనలను యేసు ప్రభువువలే మార్చుతున్నది. ఆపో. కార్య 1:8. పవిత్రాత్మ మనకు శక్తిని ఇచ్చి మనం యేసు ప్రభువుకు సాక్షులుగా ఉండేలా చేస్తుంది. పవిత్రాత్మ మనలను సత్యము వైపు నడిపిస్తుంది. 

పవిత్రాత్మ శిష్యుల మీదకు దిగిరావడం చాలా గొప్ప ఘటన. అక్కడ ఉన్నవారందరు పవిత్రాత్మ పొందుతున్నారు. దాని తరువాత వారు అనేకమందికి బోధిస్తున్నారు. వారు యేసు ప్రభువు వలె అవుటకు పవిత్రాత్మ ఎంతగానో ఉపయోగ పడుతుంది.  యేసు ప్రభువు పవిత్రాత్మతో నిండిన వాడై తన ప్రేషిత కార్యమును ప్రారంభించాడు. అనేక అద్భుతాలు చేశాడు. అలానే శిష్యులుకూడా  తమ ప్రేషిత  కార్యమును ప్రారంభిస్తున్నారు. విశ్వాసులందరి జీవితాలలో పవిత్రాత్మ     పెద్ద మార్పు తీసుకు వస్తాడు.  (యోహాను 14:16; 15:26) . పరిత్రాత్మను  మన జీవితాలలోకి అనుమతిస్తే,   అతను మన హృదయాలలో నివాసం ఏర్పరుచుకుంటారు. అందుకే పునీత పౌలు గారు మీరు పవిత్రాత్మ ఆలయాలు అని చెబుతున్నారు. అంటే ఆయన మనలో ఉండి  మనం ఆయన  ఉనికిని తెలుసుకునేలా చేస్తాడు, శక్తిని ఇస్తాడు,  మనలను శుద్ధి చేస్తాడు,  శిష్యులను ఐక్య పరుస్తారు.  మార్గనిర్దేశం చేస్తాడు, బోధిస్తాడు, నూతన జీవాన్ని ఇస్తాడు. అతను విశ్వాసుల హృదయాలు,  క్రీస్తును పోలి ఉండేలా చేస్తాడు.   ఆయనను మన జీవితాలలోనికి ఆహ్వానిస్తే  దేవుని గొప్ప ప్రేమకు  నిజమైన సాక్షులుగా ఉండగలము. అందుకే యేసు ప్రభువు ఆయన నాకు సాక్షమిస్తాడు అని చెబుతారు మరియు మీరు కూడా నాకు సాక్షులుగా ఉంటారు అని చెబుతారు. యోహను 15:25. 

మనం పవిత్రాత్మను ఎలా పొందగలం ? 

పేతురు  వాక్యాన్ని బోధిస్తూ మారుమనసు పొందండి, యేసు క్రీస్తు నామములో జ్ఞాన స్నానం పొంది  పాప క్షమాపణకు పొందండి తద్వారా మీరు పవిత్రాత్మ పొందుతారు అని బోధిస్తారు. అపో 2:38-39 . మనం పవిత్రాత్మను పొందడానికి పెద్ద పెద్ద పనులు చేయనవసరం లేదు. దేవుని కృప వలన ఆయనను విశ్వసించి , జ్ఞాన స్నానం పొందితే మనం పవిత్రాత్మను పొందుతాము. మనం స్వీకరించే ప్రతి దివ్య  సంస్కారం ద్వారా మనం పవిత్రాత్మను పొందుతాము. 

పవిత్రాత్మ వచ్చినప్పుడు ఏమి జరుగుతుంది? 

శిష్యులు ఆత్మతో నింపబడ్డారు-  పునీత పౌలు గారు ఆత్మతో నింపబడితే ఏమి అవుతుందో రాస్తున్నారు. ఎఫెసీయులకు  రాసిన లేఖలో  5 వ అధ్యాయం  18-21 వరకు అందులో వివరించబడింది. " ఆత్మ పూరితులుకండు ఒకరితో ఒకారు కీర్తనలతోనూ , స్తోత్రములతోనూ , పవిత్ర గీతములతోను సంభాషింపుడు. హృదయ పూర్వకముగ పొగడ్తలతో ప్రభువునకు  కీర్తనలను స్తోత్రములను పాడుడు . మన ప్రభువగు  యేసు క్రీస్తు ద్వారా ప్రతి విషయమును గూర్చి తండ్రియగు దేవునకు సర్వదా కృతజ్ఞతలను అర్పించుకొనుడు. " 

ఆత్మతో నింపబడిన వారు దేవునికి  స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తుంటారు. తరువాత ఆయనకు సర్వదా కృతజ్ఞతలు తెలియ చేస్తారు. పిలిప్పీయులకు రాసిన లేఖ రెండవ అధ్యాయంలో 4 వ వచనం చెబుతుంది పరస్పరం ఒకరికొకరు ఉపకారులై ఉండవలెను అని. అంటే ఇవన్నీ ఆత్మతో నింపబడిన వారు చేస్తారు. అపో కార్యములు 2 వ అధ్యాయం 4 వ వచనం వారందరు పవిత్రాత్మతో నింపబడిరి. అప్పుడు పవిత్రాత్మ వారికి వాక్చక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలలొ మాట్లాడసాగిరి. అంటే పవిత్రాత్మ వారిని దేవుని వాక్కు బోధించడానికి ప్రేరేపిస్తుంది. పవిత్రాత్మ మనం వాక్య పరిచర్య చేయుటకు సహాయ పడుతుంది. పవిత్రాత్మ వారికి ధైర్యాన్ని ఇస్తుంది. శిష్యులు సహజముగా చాలా పిరికివారిగా ఉన్న శిష్యులు దేవుని యొక్క వాక్యాన్ని ఎంతో ధైర్యంగా ప్రకటిస్తున్నారు. అపో 4:31.

పవిత్రాత్మ  విశ్వాసిని సన్మార్గంలో నడిపిస్తుంది. ఆయన వారికి నూతన జీవాన్ని ఇస్తాడు.  యోహాను 3:5.  మనలను పవిత్రాత్మ  కొత్త సృష్టిగా మారుస్తుంది. 1 కొరి.5:17 . పవిత్రాత్మ క్రీస్తును  మహిమపరుస్తాడు.యోహాను 16:14, పవిత్రాత్మ  మనలను క్రీస్తు కొరకు సాక్షులుగా చేస్తాడు యోహాను15:26; అపొస్తలుల కార్యములు 1:8.  క్రీస్తు బోధనలను మనకు తెలియ పరుస్తాడు. లూకా. 12:11-12. పవిత్రాత్మ   శిష్యులకు    పరిచర్యలో మరియు ఇతర విషయాలలో సహాయకునిగా ఉంటాడు.  అందుకే యేసు ప్రభువు మీకు ఒక ఆదరణ కర్తను పంపుతాను అని చెబుతారు. యోహను.  యోహాను సువార్త 14 నుండి 16 అధ్యాయాలలో పవిత్రాత్మను యేసు ప్రభువు దేవుని సత్యమును తెలిపేవానిగా, యేసు ప్రభువు మాటలను గుర్తుచేసేవానిగా, యేసు ప్రభువు తరుపున మాటలాడే వానిగా, పాపములను క్షమించే వానిగా, భవిష్యవానిని తెలిపేవానిగా తెలియజేస్తున్నాడు. 

 పవిత్రాత్మ ఒక వ్యక్తి పొందాడు అని ఎలా చెప్పగలం ? 

పవిత్రాత్మ ఫలాలు గురించి పౌలుగారు గలతీయులకు రాసిన లేఖలో చెపుతున్నారు. అవి ఏమన ప్రేమ, ఆనందము , శాంతి, సహనము, దయ , మంచితనము, విశ్వసనీయత , సాత్వికత , నిగ్రహము ఇవి మనలో ఉన్నప్పుడు ఖచ్ఛితముగా మనకు పవిత్రాత్మ మనలో ఉంది అని చెప్పగలం.      (గల. 5:22, 23).  క్రైస్తవ ఎదుగుదల, పరిపక్వత అతనిలో ఆత్మ యొక్క ఫలాలు అభివృద్ధి చెందిన తీరును బట్టి తెలుసుకోవచ్చు. 

ప్రేమ :  క్రైస్తవ ప్రేమ అనేది ఈ లోకంలో చూసే ప్రేమకు వ్యత్యాసం ఉంది క్రైస్తవ ప్రేమ పవిత్రాత్మ యొక్క ఫలం.   ఇది మనలను ప్రేమించే వారిని , లేక మనకు ఇష్టం ఉన్న వారిని ప్రేమించే ప్రేమ కాదు. మన శత్రువులను ప్రేమించే ప్రేమ.  

 ఆనందం : . క్రైస్తవ ఆనందం, క్రైస్తవుడు దేవుని  ముఖాముఖీగా చేసేటప్పుడు వుండే ఆనందం. మరియు దేవుని వాక్కును పంచినప్పుడు ఆయన పొందే ఆనందం.  ఇది తాను కష్టలు బాధలు పొందే సమయంలో కూడా తాను  దేవుని చిత్తాన్ని చేస్తున్నాను అని ఉండే ఆనందం.  యేసు ప్రభువు  మోక్ష రోహణం అయిన తరువాత వారు క్రీస్తు కోసం పొందిన కష్టాలలో ఆనందం పొందారు. (రోమా. 5:3).  

 శాంతి:  నిజమైన శాంతి దేవుని నుండి వస్తుంది, “నా శాంతిని మీకు ఇస్తున్నాను” అని యేసు చెప్పాడు. (యోహాను 14:27). కష్టాలు మనకు వచ్చినప్పుడు అతీంద్రియ ప్రశాంతత, దేవుని శాంతి మనల్ని ప్రశాంతంగా ఉంచుతుంది మరియు ఆయనపై నమ్మకం ఉంచుతుంది.  

సహనం: పవిత్రాత్మ మనకు అనుగ్రహించె మరియొక గొప్ప ఫలం ఏమిటి అంటే సహనం. యేసు ప్రభువు వలె సహనం కలిగి జీవించే విధంగా పవిత్రాత్మ చేస్తుంది. అందరు ఆయనను దూషిస్తున్నా ప్రభువు సహనం కోల్పోలేదు. సహనం మనలను ఇతరుల తప్పులను క్షమించకలిగే శక్తివంతులను చేస్తుంది. ఇతరులను అంగీకరించే వారిగా చేస్తుంది.     

దయ : దయ , కనికరం అనేవి క్రైస్తవ సహజ లక్షణాలు. ఇది ప్రేమకు మరియొక రూపం. ఎవరు అయితే వీటిని కలిగి ఉంటారో వారికి అందరు ఆకర్శింపబడుతారు. మదర్ తెరెసా కు అనేక మంది ఆకర్శింప బడ్డారు అంటే కారణం ఆమెకు ఉన్న ఈ దయ హృదయ. ఇది పవిత్రాత్మ ఫలం. ప్రతి క్రైస్తవుడు కలిగిఉండాలి.  

మంచి తనం: ప్రతి వ్యక్తి మంచి వ్యక్తిని ఇష్టపడుతారు, అలా ఉండాలని కోరుకుంటారు. వీరిలో ఎటువంటి చెడు ఉద్దేశ్యాలు , ఆలోచనలు ఉండవు. అందరి మంచిని కోరుకుంటారు. అందరికి సహాయం చేస్తారు. ఇది పవిత్రాత్మ మనకు ఇచ్చే మరియొక ఫలం. 

విశ్వసనీయత:  ఇది విశ్వాసానికి మరియు పవిత్రాత్మకు సంబంధించినది. విశ్వసనీయత మనలను నమ్మదగిన వారిగా చేస్తుంది. మనం దేవునికి మరియు మానవునికి నమ్మదగిన వారినిగా చేస్తుంది. ఎటువంటి అపనమ్మకం లేక అనుమానలకు తావు వుండదు.  

సాత్త్వికత :  ఇది కష్టమైన వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు బాగా అవసరమయ్యే గుణం.  మనలను ఇష్టపడని వ్యక్తుల పట్ల , అదే విధంగా మనలను ద్వేషించే వారి పట్ల కూడా మనం మృదువుగా ఉండగలగటం. 

నిగ్రహణ :  ఈ లోకం యొక్క ఆశలకు , కోరికలకు తలొగ్గక దేవునికి ఇష్ట పూర్వకమైన జీవితం జీవించడం. ఎవరెన్ని శోదనలకు గురిచేసిన యేసు ప్రభువు వలె జీవించగలగడం. ఇది పవిత్రాత్మ ఇచ్చే గొప్ప ఫలం. 

పవిత్రాత్మ దైవ విషయాలను తెలుసుకోవడానికి, దైవ సంబంధవిషయాలలో నిమగ్నం అవ్వడానికి ప్రేరణ ఇస్తుంది. పవిత్రంగా జీవించడానికి ప్రేరణ కలుగజేస్తుంది. పవిత్రాత్మ ఆదిలో సృష్టిని ఏర్పాటుచేసినప్పుడు జలముల మీద తిరుగాడుట మనం చూస్తాము. పవిత్రాత్మ మానవునకి శక్తిని ఇస్తుంది.  దేవుని సంకల్పాన్ని నెరవేర్చుటకు సహాయపడుతుంది. సంసొనును, దావిదును నడిపింది. నిర్గమ కాండంలో పెద్దలకు తోడుగా ఉంటుంది. నూతన నిబంధనలో పవిత్రాత్మను ఎల్లకాకాలం మనకు తోడుగా ఉండుటకు మరియు మనలను నడిపించుటకు మరియు ఆధారణకర్తగా తెలియజేస్తున్నాడు. ఈ ఆత్మ శిష్యులు దేవుని వాక్కును వ్యాపింపజేయుటకు సహాయపడుతుంది. శ్రీ సభ మరియు శ్రీ సభ సభ్యులు  ఈ పవిత్రాత్మ ద్వారా నడిపించబడాలి అనిప్రార్ధించుదాం. 




పునీత ఆవిలాపురి తెరెసమ్మ

పునీత ఆవిలాపురి   తెరెసమ్మ  తెరెసా 1515వ సంవత్సరం ఆవిలాలో మార్చి 28న తేదీన     జన్మించారు. 1582 లో చనిపోయారు.  1622  సంవత్సరంలో  లో ఆమె చనిప...